1 ENS Live Breaking News

నాణ్యతలో రాజీలేకుండా నిర్మాణాలు జరగాలి

నాణ్యతలో రాజీలేని విధంగా రోడ్ల నిర్మాణాలు ఉండాలని, నాణ్యత పై ఎన్ఫోర్స్మెంట్ తనిఖీకిలు ఉంటాయని జిల్లా కలెక్టర్పి ప్రశాంతి ఆర్ ఆర్ అండ్ బి అధికారులకు హెచ్చరించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ జిల్లాలో ఆర్ అండ్ బి చేపట్టే రోడ్లపై సంబంధిత  అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు చేసిన రోడ్ల మరమ్మతులు యధాస్థితికి రావడం పై అసహనం వ్యక్తం చేశారు. నిత్యం ప్రయాణించే రోడ్లే ప్రమాదానికి కారణం అయితే పరోక్షంగా మీరే బాధ్యులు అన్నారు.  ఉండి బైపాస్ రోడ్డు పరిస్థితి చూస్తుంటే  జిల్లా యంత్రాంగం పనితీరుకు మచ్చలాగా ఉందన్నారు.  గుంతలోని తేమ మీద ప్యాచ్ వర్క్ చేయడం వల్ల ఉపయోగం లేకుండా పోతుందన్నారు.  

ప్రాంతాలవారీగా పరిస్థితులను అంచనావేసి అందుకు అనుగుణంగా రోడ్లు చేపడితే ఎక్కువ మన్నిక  ఉంటాయని ఆ విధంగా ఆర్ అండ్ బి అధికారులు ఆలోచన చేయాలన్నారు.  లో లైన్ ఏరియాలో అవసరమైనచోట్ల కల్వర్టులు ఏర్పాటుచేసి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. మొత్తం పాడై పోయేవరకు కాకుండా రవాణాకు అనుగుణంగా చిన్న, చిన్న మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర రిప్లై నిమిత్తం 32 పనులకు మంజూరు కోరగా స్టేట్ హైవే రోడ్స్ 15 మంజురు అయ్యాయని, అలాగే విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ 20 మంజూరైనట్లు ఆర్ అండ్ బి అధికారులు జిల్లా కలెక్టర్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు లేకపోతే అక్టోబర్ 28 నుండి రోడ్ల పనులు ప్రారంభించనున్నట్లు వారు జిల్లా కలెక్టర్ కు తెలిపారు.  

ఒక ఇంజనీరుగా రోడ్డు ఎలా వేస్తే ఎక్కువ కాలం మన్నిక వస్తుందో మీ అందరికీ తెలిసిందేనని, రోడ్లు నిర్మాణాలలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారి ఎస్. లోకేశ్వరరావు, డి ఈ లు రామరాజు, ఎస్వి రమణ, జి వి ఎస్ కిరణ్ కుమార్,  ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 11:20:26

నేటి తరానికి కలామ్ చక్కటి మార్గదర్శి

నేటి తరానికి భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న  ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ మార్గదర్శులని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం, ఆల్ కట్ తోటలోని అబ్దుల్ కలాం ఐఏఎస్ అండ్ నీట్ అకాడమీ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం జయంతి వేడుకల సందర్భంగా విగ్రహా ఆవిష్కరణ చేసి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా కలెక్టరు డా.కే.మాధవీలత మాట్లాడుతూ  హార్డ్ వర్కు,హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ అని నిరంతరం
అబ్దుల్ కలామ్ పేర్కొనే వారన్నారు. అటువంటి వ్యక్తులు దేశానికే గర్వకారణమని, నేటి తరం  విద్యార్థులు , యువత వారి ఆదర్శయాలను  స్పూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. రాష్ట్రపతి పదవికి ముందే దేశం కోసం ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని తెలిపారు. ఆర్మీ, పృద్వి వంటి మిస్సైల్స్ తో పాటు మొత్తం మిస్సైల్స్ రంగంలోనే దేశానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. 

ఆయనకు పిల్లలన్న, విద్యార్థులన్న మక్కువని, తరచుగా తన హోదాను మరిచి కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉండేవారని అన్నారు. కలామ్ రచించిన ఇగ్నిటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 రచనలు పాత, కొత్త తరానికి కూడా చైతన్యం వస్తుందని తెలిపారు. అబ్దుల్ కలామ్ గొప్ప రాష్ట్రపతిగానే కాకుండా శాస్త్రవేత్తగా,  సామాజిక కర్తగా సేవలు అందించారన్నారు.   అటువంటి మహనీయుని జయంతిని నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. ఎంత పెద్ద లక్ష్యమైనా దానిని అధిరోహించే వరకు ప్రణాళికా బద్దంగా సాధన చేయాలని విద్యార్థులకు ఎల్లప్పుడు అబ్దుల్ కలామ్ చేప్పేవారన్నారు. 18 గంటలు చదివి ఒకరు విజయం సాధిస్తే మరొకరు విజయం సాధించ లేదంటే దాని అర్థం సరైన శిక్షణ పొందకపోవడమేనని అన్నారు. ఆయన చూపిన బాట అందరికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనలో పాలుపంచుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. 

అబ్దుల్ కలాం ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా భోధన చేస్తామని అకాడమీ  డైరెక్టర్ సూరి కుమారి అన్నారు. 5 వేల మంది ఐ.ఏ.ఎస్ లను, 5 వేల మంది ఇంజనీర్లు ను తయారు చేయడమే అకాడమీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అకాడమీ ఫౌండర్, మెంటర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ 2013 అకాడమీ స్థాపించామని తెలిపారు. ఈ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించి క్యాష్ ప్రైజ్ లు ఇస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 30న రాష్ట్ర స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో  గెలుపొందిన విద్యార్థులకు రూ 50 వేల రూపాయలు క్యాష్ ప్రైస్ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రామ్ గోపాల్, అకాడమీ డైరెక్టర్ సూరి కుమారి, నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టేకి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్ ఫర్సన్ బి. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 11:16:44

చేతుల పరిశుభ్రతతో.. వ్యాధులను పారద్రోలుదాం

 చేతులను తరచూ శుభ్రం చేసి వ్యాధులను పారద్రోలుదామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు పిలుపునిచ్చారు. చేతులు శుభ్రం చేసుకునే ప్రపంచ దినోత్సవాన్ని జిల్లా ఆసుపత్రిలో శని వారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ చేతులు శుభ్రం చేసుకోవడం ఆవస్యం అన్నారు. క్రిములు, కీటకాలు చేతులకు అంటుకుంటాయని, చేతులు శుభ్రం చేయకుండా ఆహారం తీసుకోవడం వలన క్రిములు, కీటకాలు కడుపులోకి వెళ్ళి రోగాలకు కారణం అవుతుందని అన్నారు. కరోనా సమయంలో చేతుల శుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగిందని, దానిని కొనసాగించాలని కోరారు. చేతులు శుభ్రం చేయకపోవడం వలన కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా బి.వాగ్దేవి, తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 11:07:54

రైతులను దళారుల నుండి కాపాడాలి

శ్రీకాకుళంజిల్లాలో ధాన్యం సేకరణలో దళారుల నుండి రైతులను కాపాడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ స్పష్టం చేశారు. నూతన విధానం ద్వారే ధాన్యం సేకరించాలని ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం సేకరణ పై ఆయన  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శత శాతం ఈ క్రాప్ చేసుకున్న రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొన్ని మండలాల్లో చేయని ఈ క్రాప్, ఈకెవైసిలను త్వరితగతిన చేయించేందుకు ఆర్డీఓలు వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏ మండలాల్లో అయితే ఈ క్రాప్ ఈకెవైసి పూర్తి చేయకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులదే బాధ్యతన్నారు. సచివాలయం, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

బస్తాలు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా గోనెసంచులు ఏర్పాటు చేసుకుంటే వారికి నగదు ఇస్తామని తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని రవాణాకు అంతరాయం లేకుండా చూడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఏ సమస్య లేకుండా చూడాలన్నారు. వే బ్రిడ్జి నుండి ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం తీయించేటప్పుడు ఒక్క గ్రాము కూడా తేడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవో లు ధాన్యం సేకరణ ఏర్పాట్లు పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు, విఆర్ఓలు, మిల్లర్లుకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు ఆర్డీఓ శాంతి వివరించారు. ఏ ఏ ప్రాంతాల నుండి ధాన్యం వస్తాయని పలాస ఆర్డీఓ ను జెసి అడుగుగా డివిజన్ కు ఒరిస్సా బోర్డర్ ఉందని ఒరిస్సా నుంచి ధాన్యం తరలి రాకుండా తగు చర్యలు చేపట్టి చెప్పారు.

 ఏ ఏ మండలాల నుండి వచ్చినదీ ఆర్డీవో సీతారామమూర్తి వివరించారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో పబ్లిసిటీ చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ ను ఆదేశించారు. ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు.   371 కేంద్రాలు ఇచ్చినట్లు జడ్పీ సీఈవో వెంకటరామన్ చెప్పారు. వాలంటీర్లకు వర్చ్యువల్ గా శిక్షణ ఇవ్వడమైనదని, ఫిజికల్ గా శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు. భారత ఆహార సంస్థ అధికారి ధాన్యం నిల్వ కేంద్రాలపై జెసికి వివరించారు. ఆర్టీవో గంగాధర్ రవాణా వాహనాలు పై తెలియజేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూం కలెక్టరేట్ లో ఉంటుందన్నారు. ధాన్యం సేకరణలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతి ధ్యానం సేకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు బి. శాంతి, సీతారామమూర్తి, జడ్పీ సీఈవో వెంకటరామన్, డిపిఓ రవి కుమార్, డిఎం జయంతి, డిఎస్ఓ వెంకటరమణ, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, డిఎంలు, లీగల్ మెట్రాలజి అధికారులు, కోపరేటివ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 09:32:50

నీటి వసతులను పరిరక్షించుకోవాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో నీటి వసతుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శనివారం  పార్వతీపురం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణం, దాని చుట్టు ప్రక్కల ఉన్న నీటి వసతుల ప్రాదాన్యత మరింత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. పెద్ద నగరాలు, పట్టణాలు  వరదల సమయంలో ముంపుకు గురి కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే గత రెండు వారాలుగా ప్రత్యేక బృందాలు సర్వే చేపట్టి పలు చెరువులు, బందలు గుర్తించడం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో పార్వతీపురం పట్టణం వరదలకు గురి కాకుండా ఉండుటకు వీటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వం  చెరువుల పరిరక్షణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. 

బాల గొడబలో లెంకల చెరువు, పార్వతీపురంలో నెల్లి చెరువు, దేవుని బంద, సుందర నారాయణ పురంలో కోడువానిబంద, కొత్తవలసలో రాయిబంద లను గుర్తించామని అన్నారు. వీటిపై కొంత మేర నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని, తదుపరి నిర్మాణాలు చేపట్టకుండా రెవిన్యూ, పోలీస్ యంత్రాంగాలు నిఘా పెట్టాయని చెప్పారు. ఆక్రమణలకు ఎవరూ పాల్పడవద్దని, పట్టణ, భావితరాల భవిష్యత్తు దృష్ట్యా విశాల దృక్పథంతో ఆలోచించాలని ఆయన సూచించారు. ఆక్రమణదారులను గుర్తించామని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.  నీటి వసతులు భూగర్భ జలాల పెంపుకు, వరదల సమయంలో పట్టణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా నీటిని నింపుకునే గొప్ప వనరుగా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. జిల్లా హెడ్ క్వార్టర్ మరింత అభివృద్ది చెందుతుందని అదే సమయంలో దాని రక్షణకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపనిచ్చారు. 

2022-10-15 09:08:00

మన్యం జిల్లా కేంద్రంలో గంట స్తంభం

పార్వతీపురం మన్యంలో గంట స్తంభం నిర్మించేందుకు యోచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. పార్వతీపురం పట్టణంలో స్థల గుర్తింపుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గంట స్తంభం నిర్మాణానికి పట్టణ, జిల్లా ప్రజలు మంచి సూచనలు, సలహాలు అందించాలని దానితోపాటు మంచి నమూనాలు (డిజైన్) 10 రోజుల్లో ఇవ్వాలని కోరారు. త్వరలో స్థలం నిర్ణయించి మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. జిల్లా ఏర్పడి ఏడాది పూర్తి అయ్యే నాటికి సిద్ధం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.  అంతేకాకుండా ఆహ్లాదంగా నీటి వసతులు ఉండేలా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని విధాలా రక్షణ కవచంగా ఉపయోగపడే చెరువులను ఆహ్లాదంగా తయారు చేయుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. చెరువు గట్లపై వాకింగ్ ట్రాక్, విశ్రాంతి తీసుకొనుటకు బెంచీలు వంటివి ఏర్పాటు యోచన ఉందని ఆయన తెలిపారు.

2022-10-15 09:06:29

నేటి తరానికి అబ్దుల్ కలామ్ ఒక మార్గదర్శి

భారత మాజీ రాష్ట్రపతి  ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ నేటి తరానికి ఒక మార్గదర్శి అని జిల్లా కలెక్టర్ శ్రీ లాఠకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పొన్నాడ వంతెన వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో దివంగత మాజీ రాష్ట్రపతి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని అబ్దుల్ కలామ్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ దేశానికే గర్వకారణమని, నేటి తరానికి ఒక మార్గదర్శి అని కొనియాడారు. రాష్ట్రపతి పదవికి ముందే దేశం కోసం ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని తెలిపారు. ఆర్మీ, పృద్వి వంటి మిస్సైల్స్ తో పాటు మొత్తం మిస్సైల్స్ రంగంలోనే దేశానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఆయనకు పిల్లలన్న, విద్యార్థులన్న మక్కువ అని, వారితో పాటు కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉండేవారని అన్నారు. 

కలామ్ రచించిన ఇగ్నిటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 రచనలు పాత, కొత్త తరానికి కూడా చైతన్యం వస్తుందని తెలిపారు. అబ్దుల్ కలామ్ గొప్ప రాష్ట్రపతి , శాస్త్రవేత్త, సామాజిక కర్త అని అటువంటి మహనీయుని జయంతిని నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. ఆయన చూపిన బాట అందరికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనలో పాలుపంచుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు అధ్యక్షతన జరిగింది.

 ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు కంఠ వేణు, శ్రీకాకుళం తాహాసిల్దార్ ఎన్ వెంకట్రావు  జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బుడుమూరు రాజేష్, విగ్రహ దాత నక్క శంకర్రావు , గుత్తు చిన్నారావు పిట్ట భాగ్యచందర్రావు వంజరాపు రాజులు, కర్రీ రంగాజీ దేవ్, దేశల్ల  మల్లిబాబు ఎల్ అనంతరావు, లండ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 08:12:26

ప్రపంచానికే మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ స్పూర్తి

ప్రపంచానికే స్పూర్తినందించిన మహనీయులు భారతరత్న అబ్దుల్ కలామ్ అని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బరాటం శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలోని గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో  అబ్దుల్ కలాం 91వ జయంతి వేడుకలు జరిగాయి.  కలామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంతో ఉన్నత స్థితికి వెళ్లినా నిరాడంబరంగా జీవించడంతో పాటు మిసైల్ మ్యాన్గా కలాం పేరుగాంచారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచం ముందు నిలబెట్టి మిసైల్ మేన్ గా కీర్తిపొందారని కొనియాడారు. విగ్రహదాత బరాటం లక్ష్మణరావు, గాంధీ మందిరం నిర్వాహకులు జామి భీమశంకర్, నటుకుల మోహన్ తదితరులు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారతదేశాన్ని నిలబెట్టాలనే ఆకాంక్షతో దేశ ప్రజల్లో చైతన్యాన్ని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని కలాం నింపారన్నారు. 

జీవితాంతం యువతకు దేశభక్తిని బోధిస్తూనే ముందుకుసాగిన కలాం వ్యక్తిత్వం స్పూర్తిదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా వ్యవస్థాపకులు మందపల్లి రామకృష్ణారావు రచించిన మహా మనీషి అబ్దుల్ కలామ్ పుస్తకాన్ని అతిధులు ఆవిష్కరించారు. అనంతరం ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్శిటీలో బిబిఏ విభాగంలో యూనివర్శిటీ టాపర్ ఎన్ని నాగమణి, బీకాం విభాగంలో ఆర్ట్స్ కళాశాల టాపర్ పైడి ఉషారాణిలను శాలువతా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ నిర్వాహక బృందం మెట్ట అనంతంభట్లు, పొన్నాడ రవికుమార్, పందిరి అప్పారావు, నక్క శంకరరావు, తర్లాడ అప్పలనాయుడు, బరాటం చైతన్య తదితరులు పాల్గొన్నారు. 

2022-10-15 07:25:28

నవంబరు1 నుంచి ప్లాస్టిక్ నిషేదం అమలు

పర్యావరణ శాఖ సూచనలు రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని..అందుకు అనుగుణంగా ఫ్లెక్సీ తయారుదారులు జిల్లాలో ఫ్లెక్సీ బ్యానర్ లు వినియోగం లేకుండా సహకరించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత కోరారు. శుక్రవారం రాత్రి  రాజమండ్రి కలెక్ట రేట్ లో జిల్లాలోని ఫ్లెక్సీ నిర్వాహకులతో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా ఒక ప్రత్యేకత ను సంతరించుకున్న ప్రాంతం అన్నారు. ఇక్కడ నుంచే ఎన్నో సంస్కరణలు జరిగాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీ బ్యానర్ ల వినియోగం పై బ్యాన్ నవంబర్ ఒకటి నుంచి నిషేదం అమలు నిర్ణయానికి కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు మీ సహకారం అందించాలన్నారు. అందుకోసం జిల్లా స్థాయి లో జిల్లా పంచాయతీ అధికారులు, పర్యావరణ శాఖ, ఎల్ డి ఎం, ఫ్లెక్సీ సభ్యులతో ద్వారా కమిటీ వేసి మీ సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ బ్యానర్ లకు ప్రత్యాన్మయ మార్గాలు చూపాలని, మానవ జీవితంలో మార్పు సహజం అని, ఆ మార్పు మనతోనే ప్రారంభిద్దామన్నారు. 

ఫ్లెక్సీ బోర్డులపై నిషేధం అమలు..

తమ గెజిట్‌లోని ఆంధ్రప్రదేశ్ గెజిట్ పబ్లికేషన్ నం. 1320 ప్రకారం, G.O.Ms.No.65, 1986 సెంట్రల్ యాక్ట్ 29 ఆఫ్ 1986 భారత ప్రభుత్వం, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ మేరకు ఫ్లెక్సీ బ్యానర్ వినియోగం పై నిషేదం అమలుకు నవంబర్ 
ఒకటి నుంచి అమలు చేయాల్సి ఉందన్నారు. అన్ని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచలు, విస్తరణ అధికారి,  డివిజనల్ పంచాయతీ అధికారులకు గ్రామ పంచాయతీలలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బోర్డులను ప్రదర్శించవద్దని,  ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు.  "రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీ మెటీరియల్‌ని తయారు చేయకూడదు మరియు దిగుమతి చేయకూడదు, రాష్ట్రంలో ఏ రకమైన ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లను ముద్రించకూడదని, ఉపయోగించకూడదని, రవాణా చేయకూడదు మరియు ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫ్లెక్స్ ప్రింటర్‌లకు మరింత సమాచారం అందించే క్రమంలో సమావేశం ఏర్పాటు చేశామని కలెక్టర్ మాధవీలత అన్నారు. 

 ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లు  నిషేధం, వాటి స్థానం లో కాటన్ బ్యానర్ మెటీరియల్ లభ్యతను నిర్ధారించడం ద్వారా పరిశ్రమలు,  వాణిజ్య శాఖ , బ్యాంకు అధికారుల ముందు విషయాన్ని ఉంచాలని ఉద్దేశ్యం, ఫ్లెక్సీ వ్యాపారుల ప్రత్యామ్నాయ మెటీరియల్ కోసం మార్గాలు కోసం  ఆదేశాలు జారీ చేసే విధానం లో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీ బ్యానర్ ప్రతినిధులు బి. రాధాకృష్ణ, పి. భద్రరావు, తదితరులు తమ వద్ద స్టాక్ నిలవ ఉందని, బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నందున, వాయిదాలు చెల్లించాల్సి ఉంటుందని,  పేర్కొన్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని, బ్యాంకర్ల నుంచి వాయిదా కోసం వత్తిడి లేకుండా తదుపరి ప్రతిపాదన అమలు చేసే వరకు మినహాయింపు కి చేయూత నిచ్చి అదుకోవాలని కోరారు.

2022-10-14 15:28:41

ఆశావాహ జిల్లాగా అనకాపల్లికి గుర్తింపు

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఆశావహ జిల్లాగా అనకాపల్లి జిల్లాను గుర్తించిందని కేంద్ర విదేశాంగ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.మురళీధరన్ తెలిపారు.  శుక్రవారం పెంటకోట కన్వెన్షన్స్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారుల స్పందనపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. "సబ్ కే సాత్ సబ్ కా కళ్యాణ్" అందరితో కలిసి అందరి అభివృద్ధికి కృషి చేయడం అనే భావనతో వెనకబడిన ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వాటిని మరింత ప్రభావవంతంగా అందించేందుకే కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదవ స్థానంలో మన దేశం ఉందని చెప్పారు. రూ.లక్షా 70 వేల తలసరి ఆదాయం తో ఉన్నామని అయితే అమెరికా వంటి దేశాల్లో దీని కంటే పది రెట్లు తలసరి ఆదాయం నమోదైందన్నారు.  దేశ తలసరి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య సంగ్రామం చేసిన మన పూర్వుల ఆశలు ఆకాంక్షలను చేరుకునే క్రమంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు వెళ్లేందుకు మనం కృషి చేయాలన్నారు. దేశ గౌరవం, ఆత్మాభిమానం నిలబెట్టుకోవాలి అన్నారు. దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఐదు అంశాలలో ముందుకు పోవాలని చెప్పారు. రవాణా మార్గాలు,  పరిశ్రమలు, గ్రామాల్లో సైతం పట్టణ సౌకర్యాలు, ఎగుమతుల దిశగా వ్యవసాయ రంగం, శత శాతం అక్షరాస్యత, వైద్యం ఉండాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 

అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి. వి. సత్యవతి మాట్లాడుతూ మాతృ యోజన పథకం దేశంలో తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 వైద్య కళాశాలలో 1 అనకాపల్లికి దక్కిందని తెలిపారు. చారిత్రక ప్రదేశం అయిన బొజ్జన్నకొండ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని, అనకాపల్లికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మాట్లాడుతూ జిల్లా భౌగోళిక సామాజిక ఆర్థిక రంగాలను గూర్చి తెలియజేశారు.  జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రాంతమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు గూర్చి వివరించారు.

అంతకుముందు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందిన లబ్ధిదారులు తమకు సదరు పథకాల మూలంగా ఏ విధమైన లబ్ధి జరిగింది, ఆర్థికంగా సమృద్ధి సాధించిన విధానాన్ని గూర్చి తెలియజేశారు. అనంతరం మంత్రి మురళీధర్ ను కలెక్టర్ సత్కరించి నూకాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని  బహూకరించారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు పి.వీ. మాధవ్, చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ డైరెక్టర్ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా రెవిన్యూ అధికారి పి.వెంకట రమణ వివిధ శాఖల జిల్లా అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

2022-10-14 14:12:53

టిటిడికి ఇన్నోవా క్రిస్టా వాహనం విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు నంద కుమార్ శుక్రవారం సాయంత్రం సుమారు రూ. 27 లక్షలు విలువైన ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని విరాళంగా అందించారు.  తిరుమలలోని   శ్రీవారి ఆలయం ముందు పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఈవో  ఎవి. ధర్మారెడ్డికి తాళాలు అందజేశారు.   టీటీడీ రవాణా విభాగం తిరుమల డీఐ   జానకిరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2022-10-14 14:08:35

క్వారీలకు పర్యావరణ అనుమతులివ్వండి

విజయనగరం జిల్లాలో మైనింగ్ క్వారీలకు త్వరితంగా అనుమతులు మంజూరు చేస్తే తమకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వీటి ద్వారా సమకూరుతుందని జిల్లాకు చెందిన పలువురు క్వారీ యాజమానులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మైనింగ్ క్వారీలకు అనుమతుల మంజూరుకు సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరులో జాప్యం వల్ల కొన్నేళ్లుగా తాము ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు. జిల్లాలో 110 క్వారీలు వున్నాయని, వీటిలో ప్రభుత్వం పర్యావరణ అనుమతుల మంజూరులో నిబంధనలు సడలిస్తే వంద క్వారీలు మళ్లీ ప్రారంభం అవుతాయనీ వారు పేర్కొన్నారు. మైనింగ్ క్వారీ యాజమానులు నివేదించిన అంశాలను, వారి సమస్యలను సావధానంగా ఆలకించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి మాట్లాడుతూ ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అనుమతుల మంజూరులో నిబంధనలు మరింత సరళతరం చేసే దిశగా ప్రయత్నిస్తామని చెప్పారు. జిల్లాలో 96 రోడ్ మెటల్, 9 క్వార్ట జైట్, 5 గ్రానైట్ క్వారీలు నాన్ ఆపరేటింగ్ గా వున్నాయని గనుల శాఖ అధికారులు వివరించారు. సమావేశంలో గనుల శాఖ డి.డి. బాలాజీ నాయక్, ఏ.డి. ఎస్.పి.కె. మల్లేశ్వర రావు, పర్యావరణ ఇంజినీర్ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 13:59:29

ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

యువ‌త‌కు ఉద్యోగాల‌ను క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌ని డిప్యుటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. దీనిలో భాగంగానే ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో  జాబ్ మేళాను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ‌, డిఆర్‌డిఏ-సీడాప్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన‌ తొలి మెగా జాబ్ మేళాను విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని క‌స్పా ఉన్న‌త పాఠ‌శాల‌లో శుక్ర‌వారం ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో కోల‌గ‌ట్ల మాట్లాడుతూ, ఎటువంటి సిఫార్సుల‌కు తావులేకుండా, అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, ప్ర‌తిభ ఉన్న‌వారికే ఉద్యోగాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి, సుమారు ల‌క్షా, 16వేల మందికి శాశ్వ‌త ఉద్యోగాల‌ను క‌ల్పించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌న్నారు. అలాగే వివిధ ప్రయివేటు సంస్థ‌ల్లో ఉద్యోగాల‌ను క‌ల్పించేందుకు, ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో జాబ్ మేళాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఏ ప్రాంతంలో ఉద్యోగం వ‌చ్చినా వెళ్లి చేరాల‌ని, ఉత్సాహం, ధైర్యం, న‌మ్మ‌కంతో యువ‌త‌ ముంద‌డుగు వేయాల‌ని కోల‌గ‌ట్ల కోరారు.

             జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, నిరుద్యోగ స‌మ‌స్య నిర్మూళ‌న కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి జాబ్ మేళాల‌తో మ‌రో గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టార‌ని అన్నారు. దీనికోసం ప్ర‌త్యేకంగా నైపుణ్య శిక్ష‌ణా సంస్థ‌ను ఏర్పాటు చేసి, యువ‌త‌కు విరివిగా ఉద్యోగాల‌ను క‌ల్పిస్తున్నార‌ని చెప్పారు. యువ‌త ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని, వ‌చ్చిన ఉద్యోగంలో చేరాల‌ని సూచించారు. ద‌గ్గ‌ర‌లోనే ఉద్యోగం రావాల‌ని ఎదురుచూడ‌కుండా, ఎక్క‌డ ఉద్యోగం వ‌చ్చినా వెళ్లాల‌ని, ఆ అనుభ‌వం త‌రువాత మ‌రింత‌ మంచి ఉద్యోగాన్ని పొందేందుకు స‌హాయ ప‌డుతుంద‌ని సూచించారు. వివిధ ప్ర‌యివేటు కంపెనీల్లో మ‌హిళ‌ల‌కు కూడా ఉద్యోగవ‌క‌శాల‌ను క‌ల్పించాల‌ని, కంపెనీల‌ను ఛైర్మ‌న్ కోరారు.

            ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే కాకుండా, స్థానికుల‌కే 70శాతం ఉద్యోగాలు క‌ల్పించాల‌న్న నిర్ణ‌యానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి క‌ట్టుబ‌డి ఉన్నార‌ని చెప్పారు. ఎటువంటి సిఫార్సు లేకుండానే, అర్హ‌త‌ను బ‌ట్టి ఉద్యోగాలు ల‌భిస్తున్నాయ‌ని చెప్పారు. యువ‌త త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకొని, అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవాల‌ని సూచించారు.

           కార్య‌క్ర‌మంలో ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్‌బాబు, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల‌నాయుడు, డిఆర్‌డిఏ పిడి ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి డాక్ట‌ర్ ఎన్‌.గోవింద‌రావు, జిల్లా ఉపాధిక‌ల్ప‌నాధికారి అరుణ, వివిధ కంపెనీల ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

542 మందికి ఉద్యోగాలు

క‌స్పా ఉన్న‌త పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాల‌ను 542 మందికి ఉద్యోగాలు ల‌భించాయి. మొత్తం 23 కంపెనీలు ఈ జాబ్ మేళాకు వ‌చ్చి, అభ్య‌ర్థుల అర్హ‌త‌ల‌ను ప‌రిశీలించారు. మొత్తం 2590 మంది యువ‌తీయువ‌కులు జాబ్ మేళాకు హాజ‌రయ్యారు. వీరిలో 573 మందిని షార్ట్ లిస్టు చేయ‌గా, వీరిలో 542 మందిని ఉద్యోగాల‌కు ఎంపిక చేసిన‌ట్లు, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్‌.గోవింద‌రావు తెలిపారు.

2022-10-14 13:56:57

ప్రతీ ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యం..

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద ప్ర‌తి ఇంటికీ అందించే మంచినీటి విష‌యంలో నాణ్య‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మివ్వాల‌ని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. శుక్ర‌వారం కాకినాడ క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌పై క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధ్య‌క్ష‌త‌న జిల్లా జ‌ల‌, పారిశుద్ధ్య మిష‌న్ (డీడ‌బ్ల్యూఎస్ఎం) స‌మావేశం జ‌రిగింది. జిల్లాలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద చేప‌ట్టిన ప‌నులు, వాటిలో పురోగ‌తి త‌దిత‌ర అంశాల‌పై గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, డ్వామా, వ్య‌వ‌సాయం, విద్య‌, విద్యుత్ త‌దిత‌ర సంస్థ‌ల అధికారులతో స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్ర‌తి గ్రామంలో ప్ర‌తి ఇంటికీ మంచినీటి కుళాయిని అందుబాటులోకి తెచ్చే ల‌క్ష్యంతో అమ‌ల‌వుతున్న జ‌ల్ జీవ‌న్ మిష‌న్-హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు గ్రామ‌స్థాయి నీరు, పారిశుద్ధ్య క‌మిటీలు కీల‌క‌పాత్ర పోషించాల‌ని పేర్కొన్నారు. గ్రామ స‌భ‌లు నిర్వ‌హించి గ్రామస్థాయి ప్ర‌ణాళిక‌లు, నీటి నాణ్య‌త ప‌రీక్ష‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప్రజా భాగ‌స్వామ్యం త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. స్థానిక ప్రజా ప్ర‌తినిధుల స‌హ‌కారం, స‌మ‌న్వ‌యంతో మిష‌న్‌లో పురోగ‌తికి కృషిచేయాల‌న్నారు. ప్ర‌తి ఇంటికీ సుర‌క్షిత తాగునీటిని అందించి.. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర‌చ‌డం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ల‌క్ష్య‌మ‌ని ఎంపీ పేర్కొన్నారు.

ప‌నుల వేగ‌వంతానికి చ‌ర్య‌లు: క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా
క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద రూ. 245 కోట్ల అంచ‌నాల‌తో 565 ప‌నులు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే 148 ప‌నులు పూర్తికాగా మిగిలిన ప‌నులు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌న్నారు. వారం వారీగా ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని ప‌నుల పురోగ‌తిని ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. కొత్త‌గా 104 ఆవాసాల‌కు సంబంధించిన ప‌నుల‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే జిల్లాలో 30 గ్రామాల‌ను హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ గ్రామాలుగా ప్ర‌క‌టించిన‌ట్లు వివ‌రించారు. కుళాయి క‌నెక్ష‌న్ ఇవ్వ‌డం ఎంత ముఖ్య‌మో ఆ క‌నెక్ష‌న్ ద్వారా అత్యంత నాణ్య‌మైన మంచినీటిని అందించ‌డం అంత‌కంటే ముఖ్య‌మని.. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొని మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా సోర్స్‌, ట్యాప్ శాంపిళ్ల‌ను తీసుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ్రామ పంచాయ‌తీల‌కు అందించిన ఫీల్డ్ టెస్ట్ కిట్లు (ఎఫ్‌టీకే) ద్వారా పీహెచ్‌, కాఠిన్య‌త‌, ఆల్క‌లినిటీ, క్లోరైడ్ త‌దిత‌ర ప‌రామితుల‌ను ప‌రీక్షిస్తున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌జారోగ్యంతో ముడిప‌డిన నీటి ప‌రీక్ష‌ల విష‌యంలో అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ కృతికాశుక్లా అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ ఎం.శ్రీనివాస్‌; డ్వామా పీడీ,  డీపీవో ఎ.వెంక‌ట‌ల‌క్ష్మి, డీఈవో డి.సుభ‌ద్ర‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, ఐసీడీఎస్ పీడీ కె.ప్ర‌వీణ‌, డీఎంహెచ్‌వో డా. ఎం.శాంతిప్ర‌భ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

2022-10-14 13:41:44

విశాఖ జిల్లాలో ప్లాస్టిక్ ను నిషేదించాల్సిందే..

విశాఖజిల్లాలో ప్లాస్టిక్ ను అధికారికంగా నిషేదించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రభుత్వం ఇచ్చిన (జి.ఓ.ఎమ్ఎస్.నెం.65, తేది:22.09.2022) ఆదేశాల ప్రకారం విశాఖపట్నం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా చేయాలన్నారు. దానికోసం  వచ్చే నెల 1వ తేదీ లక్ష్యంగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దానికోసం పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరికి సూచించారు. ఈ సమావేశంలో కమీషనర్, జి.వి.ఎమ్,సి, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతి అధికారి, పర్యావరణ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ మండలి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, డివిజన్ స్థాయి అభివృద్ధి  అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్, చేనేత, మండల పరిషత్ అభివృధి అధికారి, ఆనందపురం, భీమినిపట్నం, పెందుర్తి మరియు పద్మనాభం, చీఫ్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్,జి.వి.ఎమ్.సి మరియు ఫ్లెక్షి  అసోసియేషన్ కార్యదర్శి,  త్రినాధ్ రావు, మరియు అధ్యక్షుడు, లక్ష్మణ రావు, తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 13:35:25