1 ENS Live Breaking News

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు అహ‌ర్నిశ‌లూ కృషిచేస్తున్న పోలీసుల సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌ మ‌ని.. విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర‌వీరుల త్యాగాలు మ‌రువ‌లేనివ‌ని రాష్ట్ర ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. శుక్ర‌వారం పోలీసు అమ‌రవీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సందర్భంగా కాకినాడ‌, పాత జిల్లా పోలీసు కార్యాల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పోలీసు అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీత‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు, ఎమ్మెల్సీ చిక్కాల రామ‌చంద్ర‌రావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, అడిష‌న‌ల్ ఎస్‌పీ పి.శ్రీనివాస్ త‌దిత‌రులు స్తూపం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛాలు ఉంచి అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళులు అర్పించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ 2021, సెప్టెంబ‌ర్ 1 నుంచి 2022, ఆగ‌స్టు 31 వ‌ర‌కు దేశంలో 264 మంది, రాష్ట్రంలో ఎనిమిది మంది విధి నిర్వ‌హ‌ణ‌లో అసువులు బాసారని.. వారి త్యాగాలు మ‌రువ‌లేనివ‌ని పేర్కొన్నారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి రాష్ట్ర పోలీసు శాఖ‌లో విప్లవాత్మ‌క మార్పులకు శ్రీకారంచుట్టార‌ని.. స‌చివాల‌య స్థాయిలో మ‌హిళా పోలీసుల‌ను నియ‌మించిన‌ట్లు తెలిపారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం దిశ యాప్‌ను తీసుకురావ‌డం జ‌రిగింద‌ని.. ఈ యాప్ డౌన్‌లోడ్‌లో కాకినాడ జిల్లా రాష్ట్రంలోనే మొద‌టి స్థానం పొంద‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. దీపావ‌ళి కానుక‌గా ముఖ్య‌మంత్రివ‌ర్యులు 6,511 పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం తెలిపార‌ని.. ఇది చాలా సంతోష‌క‌ర విష‌య‌మ‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో పోలీసు యంత్రాంగం కృషిచేస్తోంద‌ని.. గంజాయి వంటి వాటిని అదుపులో పెట్ట‌డంలో జిల్లా పోలీసు యంత్రాంగం మంచి ప‌నితీరు క‌న‌బ‌ర‌చిన‌ట్లు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కోవిడ్ స‌మ‌యంలో అసువులు బాసిన పోలీసుల కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ 1959, అక్టోబరు 21న ఇండో-టిబెట‌న్ స‌రిహ‌ద్దులో దేశ రక్షణ విధులు నిర్వహిస్తూ చైనా సైనికుల దాడిని వీరోచితంగా ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన  సీఆర్‌పీఎఫ్ పోలీస్ వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ దేశంలో ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వ‌హించుకుంటున్న‌ట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమానికి
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రాధాన్య‌మిస్తోంద‌ని.. చాలా ఏళ్లుగా పోలీసు అమ‌ర‌వీరుల కుటుంబాల ఇళ్ల స్థ‌లాల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని.. నేడు జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్‌పీల కృషితో ఆ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించి ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను పంపిణీ చేయ‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. 

జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ పోలీసు అమ‌ర‌వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను నేడు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని.. ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎన్నో సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ పోలీసులు  శాంతి భద్రతలను కాపాడటం వల్లే దేశ ప్రజలు నిశ్చింతగా, నిర్భయంతో జీవిస్తున్నార‌ని.. స‌మాజం ప్రగతి బాటలో పయనిస్తోంద‌ని పేర్కొన్నారు.  పోలీస్ శాఖ రేయింబవళ్లు చేస్తున్న ఈ కృషికి  ప్రజలందరూ తప్పని సరిగా సహకారం అందించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు మాట్లాడుతూ అసాంఘిక శక్తులను అరికట్టేందుకు పోలీసులు  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నార‌ని, వారి సేవ‌లు చాలా గొప్ప‌వ‌ని పేర్కొన్నారు. పట్టుదల, ఓర్పు, సహనం, సాహసం, త్యాగాలకు మారుపేరుగా పోలీస్ దళాలు నిలుస్తున్నాయ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హ‌కారంతో పాటు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలను మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత‌, క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, డీఎస్‌పీ భీమారావు, పోలీసు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ పోలీసు అమ‌ర‌వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను నేడు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని.. ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎన్నో సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ పోలీసులు  శాంతి భద్రతలను కాపాడటం వల్లే దేశ ప్రజలు నిశ్చింతగా, నిర్భయంతో జీవిస్తున్నార‌ని.. స‌మాజం ప్రగతి బాటలో పయనిస్తోంద‌ని పేర్కొన్నారు.  పోలీస్ శాఖ రేయింబవళ్లు చేస్తున్న ఈ కృషికి  ప్రజలందరూ తప్పని సరిగా సహకారం అందించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు మాట్లాడుతూ అసాంఘిక శక్తులను అరికట్టేందుకు పోలీసులు  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నార‌ని, వారి సేవ‌లు చాలా గొప్ప‌వ‌ని పేర్కొన్నారు. పట్టుదల, ఓర్పు, సహనం, సాహసం, త్యాగాలకు మారుపేరుగా పోలీస్ దళాలు నిలుస్తున్నాయ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హ‌కారంతో పాటు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలను మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత‌, క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, డీఎస్‌పీ భీమారావు, పోలీసు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-10-21 07:52:26

శ్రీవారిని దర్శించుకున్న శ్రీమతి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో ‌ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా  నిర్మలా సీతారామన్ కు  శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీటేబుల్ బుక్ అంద‌జేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపి డాక్టర్ గురుమూర్తి, టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు భానుప్ర‌కాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-10-20 04:43:30

మంచినీటి పథకాలను పునరుద్దరించండి

పెండ్యాల వాటర్ స్కీం కోసం ఏర్పాటు చేసిన  నాలుగు పంపులని పునరుద్ధరించి, ప్రస్తుత సీజన్లో ఆయకట్టు రైతులకు  సాగు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆదేశించారు.  బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఇరిగేషన్ అధికారులు పెండ్యాల ఇరిగేషన్ పథకం పంపుల స్థితి గతులపై వాస్తవ పరిస్థితిని  ఇరిగేషన్ అధికారులు కలెక్టరుకు వివరించారు.   విజేశ్వరం పవర్ ప్లాంట్ ప్రస్తుతం నిలుపుదల చేయడంతో పెండ్యాల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు సరఫరా కావడంలేదని అధికారులు తెలిపారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పెండ్యాల  ఆయ కట్ట రైతులకు సాగునీటి సమస్య లేకుండా విజేశ్వరం పవర్ ప్లాంట్ కార్యకలాపాలు యధా స్థితి కి వచ్చేంత  వరకు పెండ్యాల పంపింగ్ స్కీము యొక్క పంపుల ద్వారా  కాలువలకు సాగునీరు అందించాలన్నారు. అందుకు అనుగుణంగా వాటికి చేపట్టవలసిన మరమ్మత్తులు, నిర్వహణ పనులను పూర్తి చేసి, సాగు నీరు అందచేసెలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో ఇరిగేషన్  ఈ ఈ ఎన్. దక్షిణా మూర్తి,డి ఈ ఈ వి. సత్య దేవ పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-10-19 15:29:44

విద్యార్ధుల భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్14417

విద్యార్థి, విద్యార్థుల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా "14417" టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం  తీసుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.  బుధవారం రాజమండ్రి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో  జిల్లా పాఠశాల భద్రతా సలహా కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్  అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కే మాధవి లత మాట్లాడుతూ, విద్యాబోధన సమయంలో విద్యార్థులకు  సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో సమగ్ర భద్రతా చర్యలు చేపట్టెందుకు ప్రతి పాఠశాలలో ఉండే పేరెంట్ కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేయాలని పేర్కొన్నారు.  విద్యార్థుల భద్రతే లక్ష్యంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ తో సహా అన్ని ప్రతి పాఠశాలలో  14417 టోల్ ఫ్రీ సేవల  ను ఏర్పాటు చేశామన్నారు. ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఫిర్యాదు చేస్తే, తగిన విధంగా స్పందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా   ఖచ్చితంగా స్కూల్స్ లో ఫిర్యాదుల పెట్టే (కంప్లైంట్ బాక్స్)  ఏర్పాటు చేయడం, ప్రతి,15 రోజులకు ఒకసారి వాటిపై చర్చిచించాలన్నారు.  ప్రతి 15 రోజులకు ఒకసారి పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో కంప్లైంట్ బాక్స్ లో ఉన్న ఫిర్యాదులను   పరిశీలించి పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం, నివేదిక అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. 
పిల్లలకు సురక్షితమైన భోధన సౌకర్యాలను, అన్ని పాఠశాలల్లో (స్ట్రక్చరల్ మరియు నాన్ స్ట్రక్చరల్) ప్రమాదాలు నివారణ (డిజాస్టర్ రిస్క్)  తగ్గింపు చర్యలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని కలెక్టర్ మాధవీలత అన్నారు. ఇంటి నుండి పాఠశాలకు, పాఠశాల  నుంచి  పిల్లలు ఇంటికి వెళ్లెవరకూ భద్రతను కల్పించడం చాలా కీలకం అన్నారు.  అన్ని మండల విద్యాశాఖాధికారులతో త్రైమాసిక సమీక్ష సమావేశాలు నిర్వహించడం, మండల, గ్రామ స్థాయి భద్రతా సలహా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలు స్కూల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పై విద్యార్థులకు అవగాహన   కల్పించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న టోల్ ఫ్రీ నెంబర్, ఫిర్యాదుల పెట్టే పై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు.

   విద్యార్థుల ఆరోగ్య భద్రతకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాఠశాలల్లో పర్యవేక్షించాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం సాగే విషయం కావున, తరచుగా సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదనలపై చర్చించాలన్నారు. రవాణా శాఖ అధికారులు  ప్రైవేటు పాఠశాలలో, కళాశాలల్లో నడిపే బస్సుల క్రమ అంతరాలలో ,(రెగ్యులర్ గా)  ఫిట్నెస్  తప్పనిసరిగా తనిఖీ చేసి పర్యవేక్షించాలన్నారు.  దిశా యాప్, అగ్ని ప్రమాద నివారణ తదితర అంశాలపై పోలీస్, అగ్నిమాపక అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి శాఖాపరంగా నిర్వహిస్తున్న   కార్యక్రమాలను విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్కూల్ లో దిశ పోస్టర్లను ఉంచి దిశ చట్టంపై పిల్లల్లో  అవగాహన కల్పించాలని  తెలిపారు. స్కూల్స్ లో త్రాగునీటి వసతి, పరిశుభ్రత పరిరక్షణ వంటి వాటిపై సంబందించిన ఆయా శాఖా ల ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

Rajamahendravaram

2022-10-19 14:57:57

శ్రీ పద్మావతిదేవీని దర్శించుకున్న కేంద్ర మంత్రి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మల సీతారామన్ బుధవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జేఈవో  సదా భార్గవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు నిర్మల సీతారామన్ కు తీర్థప్రసాదాలు అందించారు.  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి, తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, జాయింట్ కలెక్టర్ బాలాజి ,ఆలయ డిప్యూటి ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Tiruchanur

2022-10-19 14:44:26

కాకినాడ నగరంలో వేగంగా అనుసంధాన ప్రక్రియ

ప్రతి ఓటర్ ను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కే.రమేష్ కోరారు. బుధవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో ఏ ఈ ఆర్ వో లు, సూపర్వైజరీ అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనుసంధాన ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగడం లేదన్నారు. ఆధార్ను అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని, ప్రయోజనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఎన్నికల కమిషన్ ఈ ప్రతిపాదన చేసిందన్నారు. అనుసంధాన  ప్రక్రియను మరింత వేగవంతంచేసి పురోగతి సాధించేలా కృషి చేయాల న్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా  ఆధార్ అనుసంధాన పురోగతిని ఆయన సమీక్షించారు. సమావేశంలో ఏ ఈ ఆర్ వో లు, సూపర్వైజరీ అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2022-10-19 14:37:56

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటానికి వీల్లేదు

ప్రభుత్వం నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించవద్దని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కే.రమేష్ వ్యాపారులకు,ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన రమణయ్యపేట మార్కెట్ ను  సందర్శించారు. అక్కడక్కడ తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు వినియోగాన్ని గుర్తించారు. వీటిని నిషేధించినా ఎందుకు వినియోగిస్తున్నారంటూ ప్రశ్నించారు. మరోసారి వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రజారోగ్యానికి భంగకరమని వీటిని  పూర్తిగా మానివేయాలని సూచించారు.

 నాలుగురోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలలో చాలావరకు సాధారణ పరిస్థితి నెలకొంద న్నారు. వర్షపు నీటిని, అక్కడక్కడా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించామన్నారు. అనేకమంది చెత్తను డ్రైన్ లలో వేయడం వల్ల నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత వర్షాల సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంద న్నారు.  ప్రజలు కూడా సహకరించి చెత్తను డ్రైన్లో వేయకుండా పారిశుద్ధ్య  సిబ్బందికి మాత్రమే అందజేయాలని కమిషనర్ కోరారు. ఆయన వెంట కార్పొరేషన్ ఆరోగ్యాధికారి డాక్టర్ పృద్వి చరణ్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు.

Kakinada

2022-10-19 14:34:24

క్రమేపీ పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

కాకినాడ జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి 19వ తేదీ వరకూ మొత్తం 1145 కోవిడ్ నిర్వహించగా, 59 పాజిటీవ్ కేసులు గుర్తించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.యం.శాంతిప్రభ తెలియజేసారు.  వీటిలో ఎక్కువ కేసులు మైల్డ్ సింప్టమ్స్ తో ఆసుపత్రి సేవలు అవసరం లేకుండా యాంటి బయోటిక్స్, యాంటి పైరటిక్స్ మందులతో నయమైయ్యాయని, ప్రస్తుతం జిల్లాలో కేవలం 18 యాక్టివ్ పాజిటీవ్ కేసులు మాత్రమే ఉన్నాయని, అన్నీ వైద్య  పర్యవేక్షణలో ఉన్నాయని ఆమె తెలియజేశారు.  జిల్లా అంతటా ఆశా వర్కర్లు, ఎఎన్ఎం ల ఇంటింటి సందర్శన ద్వారా జ్వర లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.  అన్ని పి.హెచ్.సిలు, యు.పి.హెచ్.సిలు, సి.హెచ్.సి.లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రిలలో కోవిడ్ పాజిటీవ్ వ్యక్తులకు ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయించవలసిన అవసరం లేకుండా వైద్య సహాయం ఉచితంగా అందిస్తున్నామని డియంహెచ్ఓ తెలిపారు. 

అలాగే కాకినాడ నగరంలో ఇటీవల భారీవర్షాల వల్ల సాంబమూర్తినగర్, గోడారిగుంట, సినిమారోడ్డు తదితర ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా 100 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లను నియోగించి, డ్రెయిన్ల క్లియరింగ్, పంపింగ్ ద్వారా మొత్తం నీరంతటినీ యుద్దప్రాతిపదికన ఒక్క రోజులో తొలగించామని కాకినాడ మున్సిపల్ కమీషనర్ కె.రమేష్ తెలియజేశారు. నగరంలో ముంపుతాకిడికి లోనైన అన్ని ఆవాసాల్లో దోమల నివారణకు యాంటీలార్వా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరిగిందన్నారు.  కాకినాడ నగర పరిధిలో అక్టోబరు నెలలో ఇప్పటి వరకూ కోవిడ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని, 2 డెంగ్యూ కేసులు మాత్రమే జిజిహెచ్ లో రిపోర్ట్ అయ్యాయని తెలియజేశారు.   తరచుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కాకినాడ నగరంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు ప్రభల కుండా పారిశుద్య, ఆరోగ్య రక్షణ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని కమీషనర్ తెలిపారు.  

Kakinada

2022-10-19 14:20:42

అధీకృత సంస్థ ద్వారానే ధాన్యం రవాణా

అధీకృత సంస్థ ద్వారానే ఖరీఫ్ ధాన్యం రవాణా జరుగుతుందని ఇన్ ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం రవాణాపై పౌర సరఫరాల సంస్థ, రవాణా సంఘం సభ్యులతో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో అధీకృత సంస్థ లారీలను ధాన్యం రవానాకు సరఫరా చేయాలన్నారు. మిల్లర్లతో ప్రమేయం లేకుండా రవాణా జరగాలనేది ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. అధీకృత సంస్థ రైతు వద్ద నుండి రవాణా చేస్తుందని ఆయన అన్నారు. అధీకృత సంస్థ ఈ మేరకు అవసరమైన లారీలను సిద్దంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. 

జిల్లాలో గల లారీల వివరాలు సమర్పించాలని జిల్లా రవాణా శాఖను ఆయన ఆదేశించారు. జిల్లాలో లారీల కొరత లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా, సాఫీగా సాగుటకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇందుకు అన్ని వర్గాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆనంద్ అన్నారు. ధాన్యం నిలువలకు అవసరమగు గిడ్డంగులను సిద్ధం చేయాలని భారత ఆహార సంస్థ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులకు సూచించారు. 

రవాణా విధానంలో చేర్పులు మార్పులు చేయాలని రవాణా సంఘం సభ్యులు సూచించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రీజనల్ మేనేజర్ ఎస్. రవి కుమార్, భారత ఆహార సంస్థ జిల్లా మేనేజర్ ప్రఫుల్ల కుమార్ సాహు, మేనేజర్ ఏ.వి.రమణ, ట్రాన్స్ పోర్ట్ సంఘం అధ్యక్షులు జి.వి.రమణ, రైస్ మిల్లర్ల ప్రతినిధి కె.రమేష్,  తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-10-19 13:39:48

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు రావాలి

మంచి వ్యవసాయ సాగు  పద్దతులు పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాదించాలని జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ తెలిపారు.  బుధవారం  పార్వతీపురం మన్యం ఐటిడిఎ గిరిజనమిత్ర  భవనం లో నిర్వహించిన  వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులకు  ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయo తో పనిచేసి రైతులకు ఉత్తమ సేవలు అందించాలని తెలిపారు.   జిల్లాలో సుమారు లక్షా ఇరవై వేల మంది రైతులకు చెందిన  మూడు లక్షల నలబైఒక్క వేల ఎకరాలలో పంటలను  ఇ-క్రాప్ నమోదు చేయడం జరిగిందని, దీనివలన ప్రభుత్య పధకాలు అమలుకు, భవిష్యత్తు ప్రణాళికలకు సులభతరం అవుతుందని తెలిపారు. 

 ప్రభుత్యం అమలు చేస్తున్న పధకాలను,  శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు  రైతుల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. రైతులు  రసాయన ఎరువులు పరిమితికి మించి వాడకూడదని, మంచి వ్యవసాయ సాగు  పద్దతులు పాటించాలని తెలిపారు. భుసార పరిక్షలు చేయుట ద్వారా  పంటకు అవసరమైన ఎరువులు మోతాదు  గుర్తించి వినియోగించాలని సూచించారు.  వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ  శిక్షణ లోని అంశాలను క్షేత్ర స్థాయి లో రైతుల వద్దకు తీసుకు వెళ్ళుటకు  తదుపరి  డివిజన్ స్థాయి, గ్రామ స్థాయి లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమం లో  పొలంబడి,  మంచి వ్యవసాయ పద్దతులు, ఉద్యాన పంటలు,  వరి,పత్తి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటల్లో ఆచరించ వలసిన ఉత్తమ వ్యవసాయ పద్దతులపై  అధికారులు, శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు.  ఈ కార్యక్రమం లో  జిల్లా ఉద్యాన అధికారి సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డి. భారతి, శాస్త్రవేత్తలు జి. నారాయణస్వామి , తేజేశ్వరరావు, ఉద్యాన అధికారి క్రాంతికుమార్, క్వాలిటీ మేనేజర్ జి. యుగంధర్, రాస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. శ్రీనివాసరాజు  తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-10-19 13:36:47

పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ధాన్యం సేక‌ర‌ణ‌కు సిద్ధం కావాలి

ఆరుగాలం శ్ర‌మించి రైతు పండించిన పంటకు మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పీ) అందించే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేక‌ర‌ణ విధానాన్ని అమ‌లుచేస్తోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ వైస్ ఛైర్మ‌న్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ జి.వీర‌పాండియ‌న్ పేర్కొన్నారు. న‌వంబ‌ర్ రెండో వారం నుంచి ఖ‌రీఫ్ (2022-23) సీజ‌న్‌కు సంబంధించి ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభంకానున్న నేప‌థ్యంలో వీర‌పాండియ‌న్‌.. బుధ‌వారం కాకినాడ క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్.ఇల‌క్కియ‌తో క‌లిసి పౌర స‌ర‌ఫ‌రాలు, లీగ‌ల్ మెట్రాల‌జీ, లేబ‌ర్‌, మార్కెటింగ్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వీర‌పాండియ‌న్ మాట్లాడుతూ ఈ-క్రాప్ జ‌రిగిన విస్తీర్ణం 2,24,871 ఎక‌రాలు కాగా.. 5,05,959 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం ఉత్ప‌త్తి కానుంద‌ని తెలిపారు.

 ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌లో ప్ర‌తి ద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా 1,113 మంది సిబ్బంది పాల్గొన‌నున్నార‌ని.. వీరికి శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైతు తాము పండించిన పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర పొందేలా క్షేత్ర‌స్థాయి సిబ్బంది అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని, ఈ విష‌యంలో వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. ప్ర‌తి ఆర్‌బీకేలోనూ ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి ప్ర‌భుత్వం రూపొందించిన పోస్ట‌ర్‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని.. దీంతో మ‌ద్ద‌తు ధ‌ర, నాణ్య‌తా ప్ర‌మాణాలు, అందుబాటులో ఉన్న అవ‌కాశాలు త‌దిత‌రాల స‌మాచారం రైతుల‌కు తెలుస్తుంద‌న్నారు. తేమ‌ను కొలిచే మీట‌ర్లు వంటి వాటిని ఆర్‌బీకేల‌లో అందుబాటులో ఉండేలా చూడాల‌ని అధికారుల‌కు సూచించారు. 

పూర్తిస్థాయి స‌న్న‌ద్ధ‌త‌తో ధాన్యం సేక‌ర‌ణ కేంద్రాల కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌డం ద్వారా ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయొచ్చ‌ని వీర‌పాండియ‌న్ పేర్కొన్నారు. స‌మీక్షా స‌మావేశానంత‌రం వీర‌పాండియ‌న్‌.. క‌లెక్ట‌రేట్ విధాన‌గౌత‌మి స‌మావేశ‌మందిరంలో ధాన్యం సేక‌ర‌ణ సిబ్బందికి జ‌రుగుతున్నశిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, సివిల్ స‌ప్ల‌య్స్ డీఎం డి.పుష్ప‌మ‌ణి, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీఎస్‌వో డి.చాముండేశ్వ‌రి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-10-19 13:04:29

MDUఆపరేటర్లకు అదనపు ఆదాయం కల్పించాలి..

ఎండియు ఆపరేటర్ల, రేషన్ షాప్ డీలర్ల కు అదనపు ఆదాయం కల్పించే దిశగా ఆయిల్ ఫెడ్ జిసిసి లు వారి ఉత్పత్తులను ఎండియుల ద్వారా సామాన్య ప్రజలకు బహిరంగ మార్కెట్ లోని ధరల కన్నా తక్కువగా సరసమైన ధరలలో అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని జెసి చాంబర్లో ఆయిల్ ఫెడ్, జిసిసి, పౌరసరఫరాల అధికారులు, ఎండియు ఆపరేటర్లు, రేషన్ షాపు డీలర్లు తదితరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా వైజాగ్ తిరుపతి రెండు జిల్లాలలో జిసిసి ఆయిల్ ఫెడ్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచి వీరికి మార్కెటింగ్ తో పాటు, ఎండియు ఆపరేటర్లకు మరియు డీలర్ల కు అదనపు ఆదాయం కల్పించే దిశగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ప్రణాళిక బద్ధంగా చేపడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. 

దీనికిగాను ఎండియు ఆపరేటర్లు మరియు రేషన్ షాప్ డీలర్లు, జిసిసి, ఆయిల్ ఫెడ్ లు ఒక అవగాహనకు వచ్చి వారు సరఫరా చేసే ఉత్పత్తుల వివరాలు, రేట్లు, వారి గోడౌన్లు తదితరాలు బేరిజు వేసుకొని మంచి ఫలితాలు వచ్చే విధంగా చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లలో వారికి సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించి ఎండియు ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వాటికి ప్లాన్ తయారు చేయాలని తెలిపారు. ఎండియు ఆపరేటర్లు ఇంటింటికి నిత్యావసర సరుకులు అందించేటప్పుడు వారు కొనాలకున్న ఉత్పత్తులకు సంబంధించిన డిమాండ్ అంచనా వేసుకొని కొని ఉత్పత్తులను సరిపడా అందుబాటులో ఉంచుకోగలిగితే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచించారు. 

జిల్లా యంత్రాంగం బాధ్యత ఎండియు ఆపరేటర్లకు అవగాహన కల్పించుటకు వేదిక ఏర్పాటు చేయడం వరకే అని, ఉత్పత్తులు కొనాలా వద్దా అనేది ఎండియు ఆపరేటర్లు మరియు రేషన్ షాప్ డీలర్లు నిర్ణయానికి వారు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ అధికారి విజయ బ్రాండ్ వంట నూనె ఎంతో నాణ్యమైనదని, జిసిసి వారు మంచి తేనె, కాఫీ పొడి, సబ్బులు, షాంపూలు  తదితర ఉత్పత్తులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి యం.వి. ప్రసాద్ జి సి సి మేనేజర్ రమణారెడ్డి ఆయిల్ ఫెడ్ ఏరియా ఆఫీసర్ చింతా వెంకట శివయ్య ఏ ఎస్ ఓ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2022-10-19 09:58:56

గర్భీణిలు,బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలి

వైద్యం కోసం ఆసుపత్రకి వచ్చే గర్భీణి మరియు బాలింతలకు కార్పరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించాలని జిల్లా కలక్టరు డా.ఎ.మల్లిఖార్జున అన్నారు. బుధవారం ఉదయం  ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం లో జిల్లా కలక్టరు పాల్గోన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలక్టరు మాట్లాడుతూ ఆసుపత్రికి నూతనంగా మెటర్నీటి ఓటి, సిసి కెమెరాల ఏర్పాటు, ఆసుపత్రి భవన మరమత్తులకు, కార్ పార్కింగ్ షెడ్డుల నిర్మాణం, ఇంటర్నల్ రోడ్సు నిర్మాణం, అధనపు మరుగుదోడ్లు నిర్మాణం,  జనరేటరు నిర్వహణ షెడ్డు నిర్మాణం తదితర అంశాలపై ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో ఇటీవల  పేషంట్ల కోసం  ఏర్పాటు చేసిన వసతి రూములను కలెక్టర్  తనిఖీ చేసి అక్కడ ఉన్న పేషెంట్లతో మాట్లాడి వారికి మరేమైనా అదనంగా సౌకర్యాలు  కావాలా అని   అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి డ్యూటిలో ఉన్న నర్సులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక  కలెక్టర్ మరో విభాగంలో నూతనంగా నిర్మిస్తున్న 20 పడకల ఎసి షెడ్డును కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రెండు వారాలలో వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్యం అందుకుంటున్న రోగుల నిమిత్తం ఆసుపత్రిలో కిటికిలకు  దోమతెరలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యం కోసం వచ్చేవారిని  పరామర్శించి వారికి వైద్యం మెరుగుగా అందుతుందా లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్యాధికారిణి  కె. విజయలక్ష్మి , ఆంధ్ర మెడికల్ కాలేజీ  ప్రిన్సిపాల్ డా.జి బుచ్చి రాజు,    ఎన్జీవో అండ్ సోషల్ వర్కర్ ప్రెసిడెంట్ ఆర్. రవికుమార్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-10-19 09:51:02

డిపిఓ ఇందిరా ర‌మ‌ణ‌ లోటు తీర‌నిది

ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావం గ‌ల జిల్లా పంచాయితీ అధికారి ఇందిరా ర‌మ‌ణ ఆక‌స్మిక మ‌ర‌ణం తీవ్ర బాధాక‌ర‌మ‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ అన్నారు. ఆమె లేని లోటు తీర్చ‌లేనిద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇందిరా ర‌మ‌ణ‌కు జిల్లా యంత్రాంగం బుధ‌వారం ఘ‌నంగా నివాళుల‌ర్పించింది. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఆమె చిత్ర‌ప‌టానికి వివిధ శాఖ‌ల అధికారులు పూల‌మాల‌లు వేసి, శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో జెసి మయూర్ అశోక్ మాట్లాడుతూ, జిల్లా పంచాయితీ అధికారి ఆక‌స్మిక‌ మ‌ర‌ణం న‌మ్మ‌శ‌క్యం కానిద‌ని అన్నారు. ఆమె అంకిత‌భావం గ‌ల అధికారిణి అని, కొద్ది కాలంలోనే డిపిఓగా ఆశాఖ‌పై త‌న‌దైన ముద్ర వేశార‌ని పేర్కొన్నారు. అధికారులు ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నార‌ని, త‌మ ఆరోగ్యంపై కూడా శ్ర‌ద్ద పెట్టాల‌ని సూచించారు.

          జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు మాట్లాడుతూ, ఇందిరా ర‌మ‌ణ  ఆక‌స్మిక మ‌ర‌ణం తీవ్ర ద్రిగ్భాంతిని  క‌ల్గించింద‌ని అన్నారు. ఇలాంటి సంఘ‌ట‌న ఎంతో దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఇప్ప‌టికీ న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని పేర్కొన్నారు. అధికారులు త‌మ ఆరోగ్యంపైనా శ్ర‌ద్ద‌పెట్టాల‌ని, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.  జిల్లా ప‌రిష‌త్ సిఇఓ డాక్ట‌ర్ ఎం.అశోక్‌కుమార్‌, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల‌నాయుడు మాట్లాడారు. ఇందిరా ర‌మ‌ణ‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని, విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల‌ ఆమె అంకిత భావాన్ని వివ‌రించారు.  కార్య‌క్ర‌మంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారితోపాటు వివిధ శాఖ‌ల అధికారులు, పంచాయితీ శాఖ‌ సిబ్బంది పాల్గొని నివాళుల‌ర్పించారు.

Vizianagaram

2022-10-19 06:53:53

MLC ఎన్నికల ప్రక్రియలో అపుడే సిత్ర ఇసిత్రాలు..

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు ప్రక్రియలో అపుడే సిత్ర, ఇసిత్రాలు మొదలైపోయాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత దాఖలవుతున్నా దరఖాస్తులన్నింటికీ ఓటు వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి నెలకొంది. అభ్యర్ధులు ఫారం-18 తో పాటు కమిషన్ సూచించిన విధంగా ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నా ఆన్ లైన్ నమోదులో అవాంతరాలు ఎదరువుతున్నాయి. కొన్ని చోట్ల నేరుగా తహశీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి దరఖాస్తు ఇచ్చినా  ఓటు నమోదువుతోందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో అభ్యర్ధులు దరఖాస్తుతోపాటు..తమ దరఖాస్తు ముట్టినట్టుగా ఎక్నాలడ్జ్ మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొందరు సీనియర్ ఎమ్మెల్సీ ఓటర్లు మందు జాగ్రత్త చర్యగా ఈ విధంగా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు తమ ఓట్లు నమోదు అవుతున్నాయో లేదో అనే అనుమానాన్ని, ప్రభుత్వ అధికారులు తిరస్కరిస్తున్న దరఖాస్తులపై వామపక్షపార్టీలు అన్ని జిల్లాల కలెక్టర్లకూ ఫిర్యాదులు కూడాచేశారు.

 ఎక్కడా ఇబ్బంది లేకుండా పక్కాగా ఓటు నమోదు అయ్యేవిధంగా చూసుకోవడంలో ఓటర్లు ఒక అడుగు ముందుకి వేస్తున్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు 2022 నోటిఫికేషన్ తరువాత జరిగే ఎన్నికలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. గతంలో ఓటు నమోదు చేసుకుంటే పక్కగా నమోదు అయ్యి ఓటరులిస్టులో కూడా పేర్లు ఉండేవి. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదనే భయం ప్రతీ ఓటరులోనూ పట్టుకుంది. దీనితో తమ ఓటు పోకుండా.. ఎక్కడ నమోదు కాకుండా ఉండిపోతుందోననే భయంగో దరఖాస్తు దారులు కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని ఓటురుగా నమోదు అయ్యే ప్రక్రియలో సహచర పట్టభద్రలకు సహాయం అందిస్తున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే అభ్యర్దులు కూడా వారి స్నేహితులు, టీమ్ ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. గతంలో అయితే ప్రభుత్వం నుంచి ఓటరు నమోదు విషయంలో గట్టిగా ప్రచారం జరిగేది. కానీ ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత 15 రోజులకి ఎన్ని దరఖాస్తువు వచ్చేయనే విషయమై జిల్లా అధికారులు వివరాలు తెలియజేస్తున్నారు తప్పితే ఓటరును చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీనితో పోటీలో నిలబడే అభ్యర్ధులు మాత్రమే తమ ఓటర్లను కాపాడుకుంటూ, నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓట్లు గల్లంతవుతాయనే భయంతో ఓటర్లు ఎక్నాలడ్జ్ మెంట్లు తీసుకోవడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. దరకాస్తును తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఎక్కడా పడేయకుండా ఓటర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో ఉన్న భయాన్ని, ఓటు నమోదు అవుతుందా, లేదా అనే విషయంలో నెలకొన్న అనుమానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నివ్రుత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం చాలా మంది దరఖాస్తు చేసుకున్న ఓటర్లలో తమ ఓటు నమోదు అవుతుందా లేదా అనుమానం అధికంగా ఉంటం కూడా ఈప్రాంతంలో హాట్ టాపిక్ అయ్యింది. ఓట్లు తక్కువగా నమోదు అయితే గెలుపు గుర్రాలకు పని సులవవుతుందనే కోణంలో ఈ విదంగా చేస్తున్నారా అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఓటర్లు, అభ్యర్ధుల అనుమానాలను, ప్రస్తుతం జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, మండల తహశీల్దార్లు ఓటర్లకు భరోసా ఇవ్వాల్సి వుంది. చూడాలి ఈ విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!

Visakhapatnam

2022-10-19 02:33:28