1 ENS Live Breaking News

వివాదాలకు తావు లేకుండా పక్కాగా భూముల రీసర్వే

వివాదాలకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అదేశించారు. మంగళవారం కలెక్టర్ పాడేరు కార్యాలయం సమావేశమందిరంలో రీసర్వే పై మండల సర్వేర్లు, గ్రామ సర్వేయర్లుతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వెక్టరైజేషన్ సక్రమంగా జరగాలని స్పష్టం చేశారు. మండల సర్వేయర్లు, తాసిల్దార్లు భూమి మీదకు వెళ్లి 
అభ్యంతరాలను పరిశీలించాలని అన్నారు. సర్వేయర్లు ఎఫ్ఎంబిని దగ్గర ఉంచుకుని రీ సర్వే చేయాలన్నారు. ఎఫ్ఎంబి పై సర్వేయర్లకు, రెవెన్యూ అధికారులకు అవగాహన ఉండాలన్నారు. ముసాయిదా ల్యాండ్ రిజిస్టర్ లో చెందిన వారి పేర్లు, జాయింట్ పట్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, కలెక్టరేట్ ల్యాబ్ లో వెక్ట్రైజేషన్ చేయాలని చెప్పారు. రీసర్వే డేటాను నాణ్యతలు పరిశీలించి తహసిల్దార్ లాగిన్ నుండి ఆర్డీవో లాగిన్ కి పంపించాలని అన్నారు. రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ వేగవంతం చేయాలని చెప్పారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఆర్డీవో బి. దయానిధి, సర్వే సహాయ సంచాలకులు వై .మోహన్ రావు , మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-11-15 10:53:51

మహాదీపోత్సవం వేదికను పరిశీలించిన టిటిడి జెఈఓ

విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ వద్ద కార్తీక మహాదీపోత్సవం వేదికను టిటిడి జెఈఓ సదా భార్గవి సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ టిటిడిలోని ఇంజినీరింగ్, ఎస్వీబీసీ, ప్రజా సంబంధాలు, శ్రీవారి సేవ, నిఘా, భద్రత, ఉద్యానవన, ఆరోగ్య, అన్నమాచార్య ప్రాజెక్టు, ఆలయం తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసే శోభాయమానంగా వేదికను ఏర్పాటు చేశారని చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు యతివందనంతో కార్యక్రమం మొదలవుతుందని, 
రాత్రి 8.30 గంటలకు ముగుస్తుందని తెలియజేశారు. ఇందులో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి సుబ్బారెడ్డి సందేశం, విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపారు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి  శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 

టిటిడి సివిఎస్వో  నరసింహ కిషోర్ మాట్లాడుతూ స్థానిక పోలీసుల సహకారంతో దీపోత్సవానికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తులకు సేవలందించేందుకు 1000 మంది శ్రీవారి సేవకులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా సౌండ్ సిస్టం, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రత్యేక ఆకర్షణగా సైకత  శ్రీవారి శంఖుచక్రాలు వేదిక వద్ద  జగదీష్ ఆధ్వర్యంలోని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఇసుకతో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి శంకు చక్ర నామాలు ప్రత్యేక 
ఆకర్షణగా నిలుస్తున్నాయి.

 జెఈఓ వెంట ఎస్వీబీసీ సీఈవో  షణ్ముఖ్ కుమార్, దాతలు రాజేష్,  హిమాంశుప్రసాద్,  కృష్ణప్రసాద్, టిటిడి 
ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, పిఆర్ఓ డా.టి.రవి, డిఇ  రవిశంకర్ రెడ్డి, డిఎఫ్ఓ  శ్రీనివాస్, విజివో  మనోహర్ తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2022-11-14 14:10:30

కుమ్మరి శాలివాహనుల సమస్యల పరిష్కారానికి కృషి

అనకాపల్లిజిల్లాలో కుమ్మరి శాలివాహనుల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంఘ చైర్మన్ ఎమ్.పురుషోత్తం తెలిపారు. సోమవారం డైరెక్టర్ డి.ఏ. వెంకటరావు ఇతర సభ్యులతో కలసి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి కి విజ్ఞాపన పత్రం అందజేశారు.  దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని  తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా నియమింప బడిన సంఘ సభ్యులు కొత్తూరు జయమ్మ (తీడ గ్రామము), శ్రీకాకులపు జగదీశ్వరరావు (నరసయ్యపేట)కొత్తూరు త్రిమూర్తులు (దేవరాపల్లి), మునగపాక గోవింద (యలమంచిలి) బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బీసీ సంక్షేమ అధికారి కే.రాజేశ్వరి సంఘ సమావేశం నిర్వహించారు.  చైర్మన్, డైరెక్టర్ సభ్యులు  జిల్లాలో కుమ్మరి శాలివాహనలకు  సమస్యలపై చర్చించారు.

Anakapalle

2022-11-14 11:37:17

మంచి పుస్తకం మనిషి జీవితంలో మార్పు తెస్తుంది

మంచి పుస్తకాలు మనిషి జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని రాష్ట్ర పరిశ్రమల,పెట్టుబడులు – ప్రాధమిక వసతులు, వాణిజ్యం,ఐటీ శాఖా మంత్రి  గుడివాడ అమర్ నాధ్ పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని కోరారు. సోమవారం ఉదయం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక విఎమ్ఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జునతో కలిసి ఆయన పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగాఏర్పాటు చేసిన సభలో  మంత్రి మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు సమాజం పట్ల అవగాహన అవసరమని అన్నారు. గొప్పగొప్ప రచయితల రచనల ద్వారా సమాజం పట్ల, వివిధ అంశాల పట్ల అవగాహన పెంచుకోవచ్చునని అన్నారు. పుస్తకాలు సమాజంలో ఎన్నో మార్పులకు దోహదం చేశాయని పేర్కొన్నారు. పుస్తక పఠనం ప్రతీఒక్కరికీ అవసరమని, మంచి పుస్తకాలను అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. జిల్లా  గ్రంథాలయంలో ఎన్నో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రంథాలయాల్లో మరిన్ని మౌలిక వసతులను కల్పించి మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.  

జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ దేశమంతా పిల్లలు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. గ్రంధాలయల యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు .  బాలల కోసం గ్రంధాలయ వారోత్సవాలు జరపడం మంచి శుభ పరిణామన్నారు.   మన దగ్గర ఉన్న పుస్తకాలే కాకుండా  గ్రంధాలయంలో ఉండే పుస్తకాలను కూడా పఠనం చేయాలన్నారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కొండా రమాదేవి మాట్లాడుతూ సమాజ వికాశంలో గ్రంథాలయాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పిల్లలు టీవీలు, ఫోన్ లకు పరిమితం కాకుండా పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పెద్దవారు కూడా పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవడమే కాకుండా పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని కోరారు.
  
ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి,  డిఇఓ చంద్రకళ, వివిధ కార్పొరేషన్ చెర్మన్ లు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు  గ్రంథాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-14 11:08:21

మెర్జెడ్ అంగన్వాడీ కేంద్రాలకు తాత్కాలిక సూపర్వైసజర్లు

ఇటీవల ప్రభుత్వ నిబంధనల మేరకు మెర్జ్ చేసిన అంగన్వాడీ కేంద్రాలలో సూపర్వైజర్ పోస్ట్ లను సర్దుబాటు ద్వారా  తాత్కాలికంగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, విజయనగరం జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తాత్కాలిక సూపర్వైజర్ గ్రేడ్ 2 నియామకాలు నవంబర్ 1వ తేదిన వెలువడినప్రభుత్వ ఉత్తర్వులు మేరకు నియమ,నిబంధనలను అనుసరిoచి ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల విధులకు ఆటంకం లేకుండా మెర్జెడ్ అంగన్వాడి సెంటర్ లో 
పనిచేయుచున్న అంగన్వాడి కార్యకర్తలలో ఉన్నత విద్యఅర్హత ప్రాతిపదికన  ఎంపిక చేపట్టడం జరిగిందని తెలిపారు.  మెర్జెడ్ అంగన్వాడి సెంటర్ నందుకార్యకర్తలను తీసుకోవటం వల్ల అంగన్వాడి కేంద్రం విధులకు ఒకరు సెక్టార్ ఇన్ ఛార్జ్ యాక్టింగ్  సూపర్వైజర్ ,  ప్రస్తుత నియామకం తాత్కాలిక నియామకం మాత్రమేనని తెలిపారు. సదరు తాత్కాలిక బాధ్యతలు సూపర్వైజర్ గా నివర్తిస్తున్న వారికి 5000 రూపాయలు ఎలెవన్స రూపంలో చెల్లిస్తారన్నారు.

Vizianagaram

2022-11-14 10:59:16

విజయనగరం జిల్లాలో స్పందనకు 155 వినతులు

విజయనగరం జిల్లాలో సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 155  వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 32,  డి.ఆర్.డి.ఏ కు 17,  డి.పి.ఓ కు 5, హౌసింగ్ కు 7, మున్సిపల్ శాఖ కు 13 అందగా అత్యధికంగా  రెవిన్యూ కు సంబంధించి 74 వినతులు, మాన్యువల్ గా 7 అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జె.సి మయూర్ అశోక్,   ఉప కలెక్టర్లు సుదర్శన  దొర, సూర్యనారాయణ, పద్మావతి  స్వీకరించారు. రీ ఓపెన్  వినతుల  అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అర్ధవంతమైన సమాధానాలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. 

Tirumala

2022-11-14 10:43:17

మంచి పుస్తకం కావాలంటే 'విశాలాంధ్ర'కు వెళ్లాలి..

విశాలాంధ్ర బుక్ హౌస్ అనేక సంవత్సరాల నుంచి జ్ఞాన కేంద్రంగా వెలుగుతోందని, మంచి పుస్తకం కావాలంటే విశాలాంధ్రకు వెళ్లాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ఏర్పాటుచేసిన ఒకటవ పుస్తక మహోత్సవాన్ని మంత్రి అమర్నాథ్ ఆదివారం ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల చరిత్రలను తెలుగులోకి అనువదించిన ఏకైక సంస్థ విశాలాంధ్ర అని అన్నారు. ఆకలి గురజాడ అప్పారావును వెలుగులోకి తెచ్చింది విశాలాంధ్ర సంస్థయే అని అమర్నాథ్ పేర్కొన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్యం, తెలుగు భాష, సంస్కృతి విస్తరణలో విశాలాంధ్ర చేసిన కృషి అమోఘమని అని రాష్ట్ర భారీ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి అన్నారు.  విశాలాంధ్ర ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అన్ని రకాల పుస్తకాలను ఓకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని, ఇలాంటి ప్రదర్శనలు మనిషి విజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని అన్నారు. తాను మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించక ముందు ఈ విశాలాంధ్ర బుక్ హౌస్ కి వచ్చేవాడినని ఇక్కడ అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేసే వాడినని అమర్నాథ్ గుర్తుచేసుకున్నారు.

 తెలుగు సాహిత్యంతో పాటు ఆంగ్ల పుస్తకాలు కూడా ప్రదర్శనలో లభ్యమౌవడం అభినందనీయమని అన్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రాంగణాన్ని ద్వారకనగర్ పరిసర ప్రాంతానికి తరలిస్తే పాఠకులకు మరింత చేరువయ్యే ఆవకాశం ఉందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అమర్నాథ్ హామీ ఇచ్చారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమరనాధ్ విశాలాంధ్ర విస్తరణకు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో విశాలాంధ్ర అంత మొత్తంలో వనరులు సమకూర్చే పరిస్థితి లేదని చెప్పుతూ ప్రభుత్వమే చొరవ తీసుకొని వి ఎం ఆర్ డి ఎ కాంప్లెక్స్ లో తక్కువ మొత్తంలో దుకాణం కేటాయిస్తే ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అమర్నాథ్ సానుకూలంగా స్పందించారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. సాహిత్య విస్తరణ ప్రస్థానంలో విశాలాంధ్ర చేసిన కృషికి ఫలితంగా వైస్సార్ జీవిత సాఫల్య పురష్కారం రాష్ట్ర ప్రభుత్వంచే అందుకుందని గుర్తు చేశారు. ఉత్తరాంద్ర కవుల రచనలను వెలుగులోకి తీసుకురావాడానికి విశాలాంధ్ర ప్రముఖ పాత్ర పోసించిందని అన్నారు. 

కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ పి.మైధిలి మాట్లాడుతూ విశాలాంధ్ర తో చాలాకాలం నుంచి అనుబంధం ఉందని, సాహిత్య ప్రస్థానంలో విశాలాంధ్ర చేసిన కృషిని ప్రత్యేకంగా కొనియాడారు.  హిందూ దినపత్రిక బ్యూరో చీఫ్ సుమిత్ భట్టాచార్జీ మాట్లాడుతూ పాతనగరంలో విశాలాంధ్ర కేరాఫ్ అడ్రస్ గా ఉండేదని, భాష, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్య విలువలు పెంపొందించేందుకు, పాఠకులకు సాహిత్యాన్ని చేరవేయడంలో విశాలాంధ్ర చేసిన కృషి అద్వితీయమన్నారు.
   కార్యక్రమంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ టి. మనోహర్ నాయుడు,సీపీఐ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎ జె స్టాలిన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు,కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సత్యనారాయణ, స్థానిక వార్డు కార్పొరేటర్ కోడూరి అప్పలరత్నం, అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు,విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడపా రామకృష్ణ, బుక్ హౌస్ మేనేజర్ పి ఎ రాజు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-13 15:20:47

విశాఖలో కార్తీక మహా దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్,  విశాఖపట్నం కార్తీక మహా దీపోత్సవం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో  సోమవారం జరుగనున్న కార్తీక మహాదీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్ తెలిపారు. విశాఖ  నగరంలోని ఎంవిపి కాలనీలోని టిటిడి కళ్యాణ మండపంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా సిఈవో  మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రామకృష్ణ బీచ్ కాళీ మాత అమ్మవారి గుడి ఎదురుగా సాగర తీరాన అంగరంగ వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదా  పీఠాధిపతి  స్వరూపానంద సరస్వతి స్వామి మంగళాశాసనాలు అందిస్తారని వెల్లడించారు. టిటిడి చైర్మన్  వైవి.సుబ్బారెడ్డి, ఈవో  ఏవి ధర్మారెడ్డి పాల్గొంటారని తెలిపారు. విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేస్తారని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా  ఏబి.బాలకొండల రావు బృందంతో నృత్యం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తనల ఆలాపన జరుగుతాయన్నారు.

అంతకుముందు టిటిడి ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం రామకృష్ణ బీచ్ వద్ద గల 
దీపోత్సవం వేదిక పనులను పరిశీలించారు. ఆర్డీవో  హుస్సేన్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో దాతలు  రాజేష్,  హిమాంశుప్రసాద్, టిటిడి ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, పిఆర్ఓ డా.టి.రవి, డిఇ  రవిశంకర్ రెడ్డి, డిఎఫ్ఓ  శ్రీనివాస్, విజివో  మనోహర్ పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-13 12:57:03

శాస్త్ర విజ్ఞాన ఫలాలను హక్కుగా అందివ్వాలి..

సామాన్య ప్రజానీకానికి శాస్త్ర విజ్ఞాన ఫలాలను హక్కుగా అందివ్వాలని, దీనికి ఎదురవుతున్న అశాస్త్రీయ భావజాల ఆధి పత్య ధోరణులను ప్రజాసైన్సు కార్యకర్తలు ఎదుర్కోవాలని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్లీనరీ రెండవ రోజు సభలో మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్లీనరీ సభల 2వ రోజైన ఆదివారం జే ఎన్ టి యు హాలులో జరిగిన సభకు రాష్ట్ర జి.వి.వే. అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్ అధ్యక్షత వహించారు.  కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కోవటంతో సైన్సు మాత్రమే పరిష్కారం చూపగలిగిందని, వేక్సిన్  ఉత్పత్తిలో సైన్సు కీలక పాత్రవహించిందని  శర్మ అన్నారు. భావజాల రంగంలో ప్రశ్నించే తత్వాన్ని, ప్రజాస్వామ్య కాంక్షని  విద్యార్థి దశ నుంచే అభివృద్ధి చేయాలన్నారు. కొందరు కుహనా మేధావులు మాఢ నమ్మ కాలను పనిగట్టుకొని ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజల కోసం సైన్సు, ప్రగతికోసం సైన్సు, ప్రపంచశాంతి కోసం సైన్సు అనే నినాదాలతో జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు ప్రజా సైన్సు ఉద్యమానికి పునరంకితం కావాలని శర్మ అన్నారు. ఈ సభలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ వెంకటేశ్వర రావు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాద్యక్షులు డాక్టర్ సి.స్టాలిన్ రాష్ట్రపూర్వ అధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి  రాధారాణి, కాకినాడ జిల్లా జ.వి.వే. అధ్యక్షులు కె.ఎం.ఎం.ఆర్.ప్రసాద్  
కార్యదర్శి  రామారావు తదితరులు పాల్గొన్నారు. 

ఆకట్టుకొన్న కర్రసాము విన్యాసం :-
 నీలపల్లి జెడ్.పి. హైస్కూల్ విద్యార్థులు ఎం.భార్గవి, ఐ.జాహ్నవి, పి. సుశాంత్ లు చేసిన కర్రసాము విన్యాస ప్రేక్షకులను అలరించింది. జ.వి.వేదిక సమతా విభాగం జిల్లా కన్వీనర్ శ్రీమతి మంగతాయురు దర్శకత్వంలో రూపొందించిన సావిత్రీ భాయి ఫూలే కళారూపం అందరినీ  ఆకట్టుకొంది.

Kakinada

2022-11-13 11:10:07

స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కలియుగ  ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ  ఆలయ మర్యాదలతో ప్రధాన కార్యదర్శి దంపతులకు మంగళ వాయిద్యాలు,పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులకు తీర్ధ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. తదుపరి ఆలయ అనివేటి మండపంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ స్వామి వారి చిత్రపటాన్ని ప్రధాన కార్యదర్శికి అందజేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్య ప్రకాష్ స్వామి వారి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.ఆర్.రాధిక, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి టి.సీతారామమూర్తి, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ డి.వి.వి.ప్రసాదరావు, కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్య ప్రకాష్,  తహసీల్దార్ కె.వెంకటరావు, ఆలయ పాలకమండలి సభ్యులు అంధవరపు రఘురామ్, మండవిల్లి రవి, ఆలయ అర్చకులు, సిబ్బంది, వడ్డి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-11-13 11:06:57

మాతృ మరణాల పట్ల పక్కా విశ్లేషణ జరగాలి

మాతృ మరణాలు జరిగితే పక్కా విశ్లేషణ ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మాతృ మరణాల పట్ల జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. మాతృ మరణాలు జరుగుటకు సౌకర్యాల లోపమా, వైద్య సేవలలో లోపమా, సామాజిక పరమైన అంశాలు ఉన్నాయా అనే కారణాలను విశ్లేషించాలని ఆయన స్పష్టం చేశారు. ఉప కమిటీ పక్కాగా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలు ప్రసవ సమయంలో మృతి చెందితే అందుకుగల నిర్దిష్టమైన కారణం కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. వైద్య సౌకర్యాలు అందుబాటు, క్లినికల్ సౌకర్యాల లభ్యత, సామాజిక విధానంలో జరిగిన తప్పులు విశ్లేషించాలని ఆయన సూచించారు. హై రిస్క్ కేసులకు స్థానిక ఆర్.ఎం.పి వైద్యులు చికిత్స అందించడం పట్ల తీవ్రంగా పరిగణించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొన్ని మండలాల్లో హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిలు ఐ.వి. ఫ్లూయిడ్స్ ఇవ్వడంతో గర్భిణీల ఆరోగ్య పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి మరణాలు సంభవిస్తున్నట్లు ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్తలు వివరించడం పట్ల జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ప్రసవాలకు వచ్చే వారి రక్తపు గ్రూప్ ముందుగా పి.హెచ్.సి స్థాయిలో  గుర్తించి జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారికి తెలియజేయాలని ఆయన అన్నారు. అవసరం మేరకు రక్తపు యూనిట్లు సిద్ధం చేయాలని ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకూ చికిత్స అందించిన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. అటువంటి కుటుంబ సభ్యులను రక్త దానానికి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించారు. 

*రక్త దానానికి ముందుకు రావాలి* : 

ప్రసవ సమయంలో అవసరమగు రక్తపు యూనిట్లు, ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్, అందుబాటులో ఉండక పోవడంపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందిస్తూ యువత రక్త దానానికి ముందుకు రావాలని కోరారు. రక్త దానం ప్రాణ దానమని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. రక్త దాతలు నిజమైన హీరోలు అని అన్నారు. రక్త దాతలు తమ పేర్లను జిల్లా ఆసుపత్రిలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ఆసుపత్రిలో ఇందుకు ప్రత్యేక కౌంటర్ ను శని వారం ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన వివరించారు. ప్రత్యేక కౌంటర్ వద్ద పేరు, ఫోన్ నంబరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ముందుకు వచ్చి సహకరించాలని, ప్రాణాలు కాపాడాలని కోరారు.  

*క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి* 

పి.హెచ్.సి వైద్యులు, క్షేత్ర స్థాయి వైద్య సిబ్బంది గ్రామాల్లో గర్భిణీల ఆరోగ్యం పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిలు చికిత్స చేయరాదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి చికిత్స అందించేవారిపై కేసులు నమోదు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రసవ సమయంలో ఉన్న గర్భిణీల ఆరోగ్యం పట్ల అత్యంత జాగరూకత ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రాణాలతో చెలగాటం వద్దని ఆయన సూచించారు. 

*ప్రాంతాలను గుర్తించండి - అవగాహన కల్పించండి* 

మూడు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. గుమ్మలక్ష్మీ పురం మండలంలో ఒక గ్రామంలో 30 సంవత్సరాల వయస్సులో 8వ కాన్పులో మృతి చెందినట్లు గుర్తించారు. దీనిపై స్పందిస్తూ ఇటువంటి అభ్యర్థులను మండలాల వారీగా గుర్తించాలని సూచించారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, దానిని నివారించాలని ఆయన ఆదేశించారు. ఇటువంటి ప్రాంతాలను గుర్తించి, కుటుంబ నియంత్రణ చికిత్సలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు మాట్లాడుతూ జిల్లాలో 11 మాతృ మరణాలు సంభవించాయని తెలిపారు. 

ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.వాగ్దేవి, వైద్య శాఖ అధికారులు ధవళ భాస్కరరావు, అనిల్, టి. జగన్మోహన రావు, సి.హెచ్.విజయ కుమార్, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి గొల్ల వరహాలు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-11-11 09:17:15

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

మౌలానా అబుల్ కలాం జయంతి ఘనంగా జరిగింది. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ దేశ మొదటి విద్యా శాఖ మంత్రి గా పనిచేసి, గొప్ప విద్యా విధానానికి మంచి పునాది వేశారని కొనియాడారు. నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా దీర్ఘకాలిక వ్యూహంతో విద్యా విధానాలు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. విద్యా వ్యాప్తికి పెద్ద ఎత్తున కృషి చేసారని ఆయన అన్నారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం స్థాపించారని చెప్పారు. మక్కాలో గౌరప్రదమైన కుటుంబంలో జన్మించి భారత దేశం విచ్చేసి సేవలు అందించారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. వార పత్రిక ప్రారంభించి ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి నింపి, స్పందన రప్పించారని దానితో ఇంగ్లీష్ ప్రభుత్వం పత్రికను నిషేధించిందని చెప్పారు. మరో పత్రిక స్థాపించి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారని తెలిపారు. యుక్త వయస్సులోనే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. దేశ విభజన, ఇతర సందర్భాల్లో మతపరమైన దాడులు జరుగుతున్నప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉదారంగా పనిచేస్తూ, ఉద్రిక్తతలు తగ్గించుటకు ఎంతగానో కృషి చేశారని ఆయన వివరించారు. ఆజాద్ జయంతి రోజున అల్ప సంఖ్యాక వర్గాల దినోత్సవంగా ప్రకటించడం శుభసూచకమని చెప్పారు. 

ఈ సందర్భంగా అల్ప సంఖ్యాక వర్గాల ప్రతినిధులు షేక్ షఫీ, మహ్మద్ జలాల్, సందీర్ చంద్ర తదితరులు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాథ రావు,  జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజుల వీణ, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జి.వరహాలు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, రాష్ట్రీయ బాల స్వాస్త్యా కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా. ధవళ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

manyam

2022-11-11 09:03:48

రాజమండ్రిలో పడిపోయిన రైలు భోగీ..రెండు రైళ్లు రద్దు

Annavaram

రాజమండ్రిలో  రైలు బోగీ పడిపోవడంతో నిర్ణీత సమయానికి వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ 2గంటలు ఆలస్యంగా నడుస్తుందని అన్నవరంలోని రైల్వే సిబ్బంది తెలియజేశారు. వాస్తవానికి అన్నవరం ఈ రైలు ఉదయం 8.5గంటలకు రావాల్సి ఉంది. అదే విధంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుని రద్దుచేసినట్టు కూడా రైల్వే అధికారులు ప్రకటించారు.ఈ రైలు సమాచారాన్ని గమనించాలని సూచిస్తున్నారు. కాగా ఈ సమాచారం ఈరోజువరకూ మాత్రమేనని ప్రకటించారు.

Annavaram

2022-11-09 03:23:31

గోకుల్ పార్కును ప్రారంభించిన విశాఖ మేయర్

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజల సందర్శనార్ధం గోకుల్ పార్కును ఆధునీకరించామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె ఆర్కే బీచ్ లోని గోకుల్ పార్కు ను సుమారు రూ.30.50 లక్షలతో ఆధునీకరించిన పనులకు జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు, ఎం ఎల్ సి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఎంతో మంది భక్తులు బీచ్ లో గోకుల్ పార్కులోని శ్రీ కృష్ణ మందిరాన్ని సందర్శిస్తారని వారికి సౌకర్యాల కల్పనకు గోకుల్ పార్కును సుమారు రూ.30.50 లక్షలతో శ్రీ కృష్ణ ని  పిల్లని గ్రోవితో ఆర్చ్, బనియన్ ట్రీతో రాధా కృష్ణులకు నీడ, సందర్శకులకు కూర్చునేందుకు సిమెంటు బెంచీలు, బీచ్ వైపు ఉన్న పిల్లర్సు మరమ్మత్తులు, పెయింటింగ్, ఫ్లోరింగ్, విద్యుత్ మొదలైన పనులను ఆధునీకరించాలని తెలిపారు.

అనంతరం జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున బీచ్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, మరుగుదొడ్లు మొదలైనవి ఏర్పటుచేసారన్నారు. సందర్శనానికి వచ్చే భక్తులు వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్ధాలు, పూజా సామాగ్రిల యొక్క వ్యర్ధాలను, అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలో వేయాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే నగర పరిశుభ్రతకు బీచ్ లో నిషేధిత ప్లాస్టిక్ ను వాడరాదని, ప్రత్యామ్నాయ వస్తువులనే వాడాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు పిన్నింటి వరలక్ష్మి, పల్లా శ్రీను, కార్పొరేటర్ ఊరుకూటి నారాయణ రావు, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఒమ్మి సన్యాసి రావు, మాజీ అధ్యక్షులు  భరణికానా రామారావు, ప్రధాన కార్యదర్శి మొల్లి అప్పారావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గోలగాని శ్రీనివాస్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, పర్యవేక్షక ఇంజినీరు వేణు గోపాల్, కార్యనిర్వాహక ఇంజినీరు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, జిల్లా యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-07 16:05:17

రాజమండ్రిలో వైభవంగా గోదావరి హారతి

రాజమండ్రిలో కార్తీకమాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని గోదావరి హారతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ గోదావరి హారతులు కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పాల్గొని తిలకించారు. సోమవారం రాత్రి పుష్కర్ ఘాట్ వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గోదావరి హరతుల కార్యక్రమంలో  రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, అనపర్తి  శాసన సభ్యులు సత్తి సూర్య నారాయరెడ్డి దంపతులు, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ దంపతులు, స్థానిక ప్రజా ప్రతినిదులు, 
వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు, చైర్ పర్సన్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-11-07 15:31:29