1 ENS Live Breaking News

నేటి తరానికి అబ్దుల్ కలామ్ ఒక మార్గదర్శి

భారత మాజీ రాష్ట్రపతి  ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ నేటి తరానికి ఒక మార్గదర్శి అని జిల్లా కలెక్టర్ శ్రీ లాఠకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పొన్నాడ వంతెన వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో దివంగత మాజీ రాష్ట్రపతి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని అబ్దుల్ కలామ్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ దేశానికే గర్వకారణమని, నేటి తరానికి ఒక మార్గదర్శి అని కొనియాడారు. రాష్ట్రపతి పదవికి ముందే దేశం కోసం ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని తెలిపారు. ఆర్మీ, పృద్వి వంటి మిస్సైల్స్ తో పాటు మొత్తం మిస్సైల్స్ రంగంలోనే దేశానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఆయనకు పిల్లలన్న, విద్యార్థులన్న మక్కువ అని, వారితో పాటు కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉండేవారని అన్నారు. 

కలామ్ రచించిన ఇగ్నిటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 రచనలు పాత, కొత్త తరానికి కూడా చైతన్యం వస్తుందని తెలిపారు. అబ్దుల్ కలామ్ గొప్ప రాష్ట్రపతి , శాస్త్రవేత్త, సామాజిక కర్త అని అటువంటి మహనీయుని జయంతిని నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. ఆయన చూపిన బాట అందరికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనలో పాలుపంచుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు అధ్యక్షతన జరిగింది.

 ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు కంఠ వేణు, శ్రీకాకుళం తాహాసిల్దార్ ఎన్ వెంకట్రావు  జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బుడుమూరు రాజేష్, విగ్రహ దాత నక్క శంకర్రావు , గుత్తు చిన్నారావు పిట్ట భాగ్యచందర్రావు వంజరాపు రాజులు, కర్రీ రంగాజీ దేవ్, దేశల్ల  మల్లిబాబు ఎల్ అనంతరావు, లండ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 08:12:26

ప్రపంచానికే మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ స్పూర్తి

ప్రపంచానికే స్పూర్తినందించిన మహనీయులు భారతరత్న అబ్దుల్ కలామ్ అని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బరాటం శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలోని గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో  అబ్దుల్ కలాం 91వ జయంతి వేడుకలు జరిగాయి.  కలామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంతో ఉన్నత స్థితికి వెళ్లినా నిరాడంబరంగా జీవించడంతో పాటు మిసైల్ మ్యాన్గా కలాం పేరుగాంచారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచం ముందు నిలబెట్టి మిసైల్ మేన్ గా కీర్తిపొందారని కొనియాడారు. విగ్రహదాత బరాటం లక్ష్మణరావు, గాంధీ మందిరం నిర్వాహకులు జామి భీమశంకర్, నటుకుల మోహన్ తదితరులు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారతదేశాన్ని నిలబెట్టాలనే ఆకాంక్షతో దేశ ప్రజల్లో చైతన్యాన్ని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని కలాం నింపారన్నారు. 

జీవితాంతం యువతకు దేశభక్తిని బోధిస్తూనే ముందుకుసాగిన కలాం వ్యక్తిత్వం స్పూర్తిదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా వ్యవస్థాపకులు మందపల్లి రామకృష్ణారావు రచించిన మహా మనీషి అబ్దుల్ కలామ్ పుస్తకాన్ని అతిధులు ఆవిష్కరించారు. అనంతరం ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్శిటీలో బిబిఏ విభాగంలో యూనివర్శిటీ టాపర్ ఎన్ని నాగమణి, బీకాం విభాగంలో ఆర్ట్స్ కళాశాల టాపర్ పైడి ఉషారాణిలను శాలువతా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ నిర్వాహక బృందం మెట్ట అనంతంభట్లు, పొన్నాడ రవికుమార్, పందిరి అప్పారావు, నక్క శంకరరావు, తర్లాడ అప్పలనాయుడు, బరాటం చైతన్య తదితరులు పాల్గొన్నారు. 

2022-10-15 07:25:28

నవంబరు1 నుంచి ప్లాస్టిక్ నిషేదం అమలు

పర్యావరణ శాఖ సూచనలు రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని..అందుకు అనుగుణంగా ఫ్లెక్సీ తయారుదారులు జిల్లాలో ఫ్లెక్సీ బ్యానర్ లు వినియోగం లేకుండా సహకరించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత కోరారు. శుక్రవారం రాత్రి  రాజమండ్రి కలెక్ట రేట్ లో జిల్లాలోని ఫ్లెక్సీ నిర్వాహకులతో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా ఒక ప్రత్యేకత ను సంతరించుకున్న ప్రాంతం అన్నారు. ఇక్కడ నుంచే ఎన్నో సంస్కరణలు జరిగాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీ బ్యానర్ ల వినియోగం పై బ్యాన్ నవంబర్ ఒకటి నుంచి నిషేదం అమలు నిర్ణయానికి కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు మీ సహకారం అందించాలన్నారు. అందుకోసం జిల్లా స్థాయి లో జిల్లా పంచాయతీ అధికారులు, పర్యావరణ శాఖ, ఎల్ డి ఎం, ఫ్లెక్సీ సభ్యులతో ద్వారా కమిటీ వేసి మీ సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ బ్యానర్ లకు ప్రత్యాన్మయ మార్గాలు చూపాలని, మానవ జీవితంలో మార్పు సహజం అని, ఆ మార్పు మనతోనే ప్రారంభిద్దామన్నారు. 

ఫ్లెక్సీ బోర్డులపై నిషేధం అమలు..

తమ గెజిట్‌లోని ఆంధ్రప్రదేశ్ గెజిట్ పబ్లికేషన్ నం. 1320 ప్రకారం, G.O.Ms.No.65, 1986 సెంట్రల్ యాక్ట్ 29 ఆఫ్ 1986 భారత ప్రభుత్వం, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ మేరకు ఫ్లెక్సీ బ్యానర్ వినియోగం పై నిషేదం అమలుకు నవంబర్ 
ఒకటి నుంచి అమలు చేయాల్సి ఉందన్నారు. అన్ని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచలు, విస్తరణ అధికారి,  డివిజనల్ పంచాయతీ అధికారులకు గ్రామ పంచాయతీలలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బోర్డులను ప్రదర్శించవద్దని,  ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు.  "రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీ మెటీరియల్‌ని తయారు చేయకూడదు మరియు దిగుమతి చేయకూడదు, రాష్ట్రంలో ఏ రకమైన ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లను ముద్రించకూడదని, ఉపయోగించకూడదని, రవాణా చేయకూడదు మరియు ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫ్లెక్స్ ప్రింటర్‌లకు మరింత సమాచారం అందించే క్రమంలో సమావేశం ఏర్పాటు చేశామని కలెక్టర్ మాధవీలత అన్నారు. 

 ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లు  నిషేధం, వాటి స్థానం లో కాటన్ బ్యానర్ మెటీరియల్ లభ్యతను నిర్ధారించడం ద్వారా పరిశ్రమలు,  వాణిజ్య శాఖ , బ్యాంకు అధికారుల ముందు విషయాన్ని ఉంచాలని ఉద్దేశ్యం, ఫ్లెక్సీ వ్యాపారుల ప్రత్యామ్నాయ మెటీరియల్ కోసం మార్గాలు కోసం  ఆదేశాలు జారీ చేసే విధానం లో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీ బ్యానర్ ప్రతినిధులు బి. రాధాకృష్ణ, పి. భద్రరావు, తదితరులు తమ వద్ద స్టాక్ నిలవ ఉందని, బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నందున, వాయిదాలు చెల్లించాల్సి ఉంటుందని,  పేర్కొన్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని, బ్యాంకర్ల నుంచి వాయిదా కోసం వత్తిడి లేకుండా తదుపరి ప్రతిపాదన అమలు చేసే వరకు మినహాయింపు కి చేయూత నిచ్చి అదుకోవాలని కోరారు.

2022-10-14 15:28:41

ఆశావాహ జిల్లాగా అనకాపల్లికి గుర్తింపు

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఆశావహ జిల్లాగా అనకాపల్లి జిల్లాను గుర్తించిందని కేంద్ర విదేశాంగ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.మురళీధరన్ తెలిపారు.  శుక్రవారం పెంటకోట కన్వెన్షన్స్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారుల స్పందనపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. "సబ్ కే సాత్ సబ్ కా కళ్యాణ్" అందరితో కలిసి అందరి అభివృద్ధికి కృషి చేయడం అనే భావనతో వెనకబడిన ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వాటిని మరింత ప్రభావవంతంగా అందించేందుకే కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదవ స్థానంలో మన దేశం ఉందని చెప్పారు. రూ.లక్షా 70 వేల తలసరి ఆదాయం తో ఉన్నామని అయితే అమెరికా వంటి దేశాల్లో దీని కంటే పది రెట్లు తలసరి ఆదాయం నమోదైందన్నారు.  దేశ తలసరి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య సంగ్రామం చేసిన మన పూర్వుల ఆశలు ఆకాంక్షలను చేరుకునే క్రమంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు వెళ్లేందుకు మనం కృషి చేయాలన్నారు. దేశ గౌరవం, ఆత్మాభిమానం నిలబెట్టుకోవాలి అన్నారు. దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఐదు అంశాలలో ముందుకు పోవాలని చెప్పారు. రవాణా మార్గాలు,  పరిశ్రమలు, గ్రామాల్లో సైతం పట్టణ సౌకర్యాలు, ఎగుమతుల దిశగా వ్యవసాయ రంగం, శత శాతం అక్షరాస్యత, వైద్యం ఉండాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 

అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి. వి. సత్యవతి మాట్లాడుతూ మాతృ యోజన పథకం దేశంలో తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 వైద్య కళాశాలలో 1 అనకాపల్లికి దక్కిందని తెలిపారు. చారిత్రక ప్రదేశం అయిన బొజ్జన్నకొండ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని, అనకాపల్లికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మాట్లాడుతూ జిల్లా భౌగోళిక సామాజిక ఆర్థిక రంగాలను గూర్చి తెలియజేశారు.  జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రాంతమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు గూర్చి వివరించారు.

అంతకుముందు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందిన లబ్ధిదారులు తమకు సదరు పథకాల మూలంగా ఏ విధమైన లబ్ధి జరిగింది, ఆర్థికంగా సమృద్ధి సాధించిన విధానాన్ని గూర్చి తెలియజేశారు. అనంతరం మంత్రి మురళీధర్ ను కలెక్టర్ సత్కరించి నూకాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని  బహూకరించారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు పి.వీ. మాధవ్, చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ డైరెక్టర్ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా రెవిన్యూ అధికారి పి.వెంకట రమణ వివిధ శాఖల జిల్లా అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

2022-10-14 14:12:53

టిటిడికి ఇన్నోవా క్రిస్టా వాహనం విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు నంద కుమార్ శుక్రవారం సాయంత్రం సుమారు రూ. 27 లక్షలు విలువైన ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని విరాళంగా అందించారు.  తిరుమలలోని   శ్రీవారి ఆలయం ముందు పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఈవో  ఎవి. ధర్మారెడ్డికి తాళాలు అందజేశారు.   టీటీడీ రవాణా విభాగం తిరుమల డీఐ   జానకిరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2022-10-14 14:08:35

క్వారీలకు పర్యావరణ అనుమతులివ్వండి

విజయనగరం జిల్లాలో మైనింగ్ క్వారీలకు త్వరితంగా అనుమతులు మంజూరు చేస్తే తమకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వీటి ద్వారా సమకూరుతుందని జిల్లాకు చెందిన పలువురు క్వారీ యాజమానులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మైనింగ్ క్వారీలకు అనుమతుల మంజూరుకు సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరులో జాప్యం వల్ల కొన్నేళ్లుగా తాము ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు. జిల్లాలో 110 క్వారీలు వున్నాయని, వీటిలో ప్రభుత్వం పర్యావరణ అనుమతుల మంజూరులో నిబంధనలు సడలిస్తే వంద క్వారీలు మళ్లీ ప్రారంభం అవుతాయనీ వారు పేర్కొన్నారు. మైనింగ్ క్వారీ యాజమానులు నివేదించిన అంశాలను, వారి సమస్యలను సావధానంగా ఆలకించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి మాట్లాడుతూ ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అనుమతుల మంజూరులో నిబంధనలు మరింత సరళతరం చేసే దిశగా ప్రయత్నిస్తామని చెప్పారు. జిల్లాలో 96 రోడ్ మెటల్, 9 క్వార్ట జైట్, 5 గ్రానైట్ క్వారీలు నాన్ ఆపరేటింగ్ గా వున్నాయని గనుల శాఖ అధికారులు వివరించారు. సమావేశంలో గనుల శాఖ డి.డి. బాలాజీ నాయక్, ఏ.డి. ఎస్.పి.కె. మల్లేశ్వర రావు, పర్యావరణ ఇంజినీర్ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 13:59:29

ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

యువ‌త‌కు ఉద్యోగాల‌ను క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌ని డిప్యుటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. దీనిలో భాగంగానే ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో  జాబ్ మేళాను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ‌, డిఆర్‌డిఏ-సీడాప్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన‌ తొలి మెగా జాబ్ మేళాను విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని క‌స్పా ఉన్న‌త పాఠ‌శాల‌లో శుక్ర‌వారం ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో కోల‌గ‌ట్ల మాట్లాడుతూ, ఎటువంటి సిఫార్సుల‌కు తావులేకుండా, అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, ప్ర‌తిభ ఉన్న‌వారికే ఉద్యోగాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి, సుమారు ల‌క్షా, 16వేల మందికి శాశ్వ‌త ఉద్యోగాల‌ను క‌ల్పించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌న్నారు. అలాగే వివిధ ప్రయివేటు సంస్థ‌ల్లో ఉద్యోగాల‌ను క‌ల్పించేందుకు, ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో జాబ్ మేళాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఏ ప్రాంతంలో ఉద్యోగం వ‌చ్చినా వెళ్లి చేరాల‌ని, ఉత్సాహం, ధైర్యం, న‌మ్మ‌కంతో యువ‌త‌ ముంద‌డుగు వేయాల‌ని కోల‌గ‌ట్ల కోరారు.

             జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, నిరుద్యోగ స‌మ‌స్య నిర్మూళ‌న కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి జాబ్ మేళాల‌తో మ‌రో గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టార‌ని అన్నారు. దీనికోసం ప్ర‌త్యేకంగా నైపుణ్య శిక్ష‌ణా సంస్థ‌ను ఏర్పాటు చేసి, యువ‌త‌కు విరివిగా ఉద్యోగాల‌ను క‌ల్పిస్తున్నార‌ని చెప్పారు. యువ‌త ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని, వ‌చ్చిన ఉద్యోగంలో చేరాల‌ని సూచించారు. ద‌గ్గ‌ర‌లోనే ఉద్యోగం రావాల‌ని ఎదురుచూడ‌కుండా, ఎక్క‌డ ఉద్యోగం వ‌చ్చినా వెళ్లాల‌ని, ఆ అనుభ‌వం త‌రువాత మ‌రింత‌ మంచి ఉద్యోగాన్ని పొందేందుకు స‌హాయ ప‌డుతుంద‌ని సూచించారు. వివిధ ప్ర‌యివేటు కంపెనీల్లో మ‌హిళ‌ల‌కు కూడా ఉద్యోగవ‌క‌శాల‌ను క‌ల్పించాల‌ని, కంపెనీల‌ను ఛైర్మ‌న్ కోరారు.

            ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే కాకుండా, స్థానికుల‌కే 70శాతం ఉద్యోగాలు క‌ల్పించాల‌న్న నిర్ణ‌యానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి క‌ట్టుబ‌డి ఉన్నార‌ని చెప్పారు. ఎటువంటి సిఫార్సు లేకుండానే, అర్హ‌త‌ను బ‌ట్టి ఉద్యోగాలు ల‌భిస్తున్నాయ‌ని చెప్పారు. యువ‌త త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకొని, అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవాల‌ని సూచించారు.

           కార్య‌క్ర‌మంలో ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్‌బాబు, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల‌నాయుడు, డిఆర్‌డిఏ పిడి ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి డాక్ట‌ర్ ఎన్‌.గోవింద‌రావు, జిల్లా ఉపాధిక‌ల్ప‌నాధికారి అరుణ, వివిధ కంపెనీల ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

542 మందికి ఉద్యోగాలు

క‌స్పా ఉన్న‌త పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాల‌ను 542 మందికి ఉద్యోగాలు ల‌భించాయి. మొత్తం 23 కంపెనీలు ఈ జాబ్ మేళాకు వ‌చ్చి, అభ్య‌ర్థుల అర్హ‌త‌ల‌ను ప‌రిశీలించారు. మొత్తం 2590 మంది యువ‌తీయువ‌కులు జాబ్ మేళాకు హాజ‌రయ్యారు. వీరిలో 573 మందిని షార్ట్ లిస్టు చేయ‌గా, వీరిలో 542 మందిని ఉద్యోగాల‌కు ఎంపిక చేసిన‌ట్లు, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్‌.గోవింద‌రావు తెలిపారు.

2022-10-14 13:56:57

ప్రతీ ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యం..

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద ప్ర‌తి ఇంటికీ అందించే మంచినీటి విష‌యంలో నాణ్య‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మివ్వాల‌ని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. శుక్ర‌వారం కాకినాడ క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌పై క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధ్య‌క్ష‌త‌న జిల్లా జ‌ల‌, పారిశుద్ధ్య మిష‌న్ (డీడ‌బ్ల్యూఎస్ఎం) స‌మావేశం జ‌రిగింది. జిల్లాలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద చేప‌ట్టిన ప‌నులు, వాటిలో పురోగ‌తి త‌దిత‌ర అంశాల‌పై గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, డ్వామా, వ్య‌వ‌సాయం, విద్య‌, విద్యుత్ త‌దిత‌ర సంస్థ‌ల అధికారులతో స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్ర‌తి గ్రామంలో ప్ర‌తి ఇంటికీ మంచినీటి కుళాయిని అందుబాటులోకి తెచ్చే ల‌క్ష్యంతో అమ‌ల‌వుతున్న జ‌ల్ జీవ‌న్ మిష‌న్-హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు గ్రామ‌స్థాయి నీరు, పారిశుద్ధ్య క‌మిటీలు కీల‌క‌పాత్ర పోషించాల‌ని పేర్కొన్నారు. గ్రామ స‌భ‌లు నిర్వ‌హించి గ్రామస్థాయి ప్ర‌ణాళిక‌లు, నీటి నాణ్య‌త ప‌రీక్ష‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప్రజా భాగ‌స్వామ్యం త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. స్థానిక ప్రజా ప్ర‌తినిధుల స‌హ‌కారం, స‌మ‌న్వ‌యంతో మిష‌న్‌లో పురోగ‌తికి కృషిచేయాల‌న్నారు. ప్ర‌తి ఇంటికీ సుర‌క్షిత తాగునీటిని అందించి.. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర‌చ‌డం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ల‌క్ష్య‌మ‌ని ఎంపీ పేర్కొన్నారు.

ప‌నుల వేగ‌వంతానికి చ‌ర్య‌లు: క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా
క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద రూ. 245 కోట్ల అంచ‌నాల‌తో 565 ప‌నులు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే 148 ప‌నులు పూర్తికాగా మిగిలిన ప‌నులు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌న్నారు. వారం వారీగా ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని ప‌నుల పురోగ‌తిని ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. కొత్త‌గా 104 ఆవాసాల‌కు సంబంధించిన ప‌నుల‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే జిల్లాలో 30 గ్రామాల‌ను హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ గ్రామాలుగా ప్ర‌క‌టించిన‌ట్లు వివ‌రించారు. కుళాయి క‌నెక్ష‌న్ ఇవ్వ‌డం ఎంత ముఖ్య‌మో ఆ క‌నెక్ష‌న్ ద్వారా అత్యంత నాణ్య‌మైన మంచినీటిని అందించ‌డం అంత‌కంటే ముఖ్య‌మని.. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొని మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా సోర్స్‌, ట్యాప్ శాంపిళ్ల‌ను తీసుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ్రామ పంచాయ‌తీల‌కు అందించిన ఫీల్డ్ టెస్ట్ కిట్లు (ఎఫ్‌టీకే) ద్వారా పీహెచ్‌, కాఠిన్య‌త‌, ఆల్క‌లినిటీ, క్లోరైడ్ త‌దిత‌ర ప‌రామితుల‌ను ప‌రీక్షిస్తున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌జారోగ్యంతో ముడిప‌డిన నీటి ప‌రీక్ష‌ల విష‌యంలో అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ కృతికాశుక్లా అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ ఎం.శ్రీనివాస్‌; డ్వామా పీడీ,  డీపీవో ఎ.వెంక‌ట‌ల‌క్ష్మి, డీఈవో డి.సుభ‌ద్ర‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, ఐసీడీఎస్ పీడీ కె.ప్ర‌వీణ‌, డీఎంహెచ్‌వో డా. ఎం.శాంతిప్ర‌భ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

2022-10-14 13:41:44

విశాఖ జిల్లాలో ప్లాస్టిక్ ను నిషేదించాల్సిందే..

విశాఖజిల్లాలో ప్లాస్టిక్ ను అధికారికంగా నిషేదించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రభుత్వం ఇచ్చిన (జి.ఓ.ఎమ్ఎస్.నెం.65, తేది:22.09.2022) ఆదేశాల ప్రకారం విశాఖపట్నం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా చేయాలన్నారు. దానికోసం  వచ్చే నెల 1వ తేదీ లక్ష్యంగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దానికోసం పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరికి సూచించారు. ఈ సమావేశంలో కమీషనర్, జి.వి.ఎమ్,సి, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతి అధికారి, పర్యావరణ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ మండలి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, డివిజన్ స్థాయి అభివృద్ధి  అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్, చేనేత, మండల పరిషత్ అభివృధి అధికారి, ఆనందపురం, భీమినిపట్నం, పెందుర్తి మరియు పద్మనాభం, చీఫ్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్,జి.వి.ఎమ్.సి మరియు ఫ్లెక్షి  అసోసియేషన్ కార్యదర్శి,  త్రినాధ్ రావు, మరియు అధ్యక్షుడు, లక్ష్మణ రావు, తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 13:35:25

వచ్చే ఏడది నుంచి రాష్ట్రమంతా ఫోర్టిపైడ్ బియ్యం

పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఐసిడిఎస్, పౌర సరఫరాలు, విద్య, గిరిజన సంక్షేమ శాఖాదికారులను ఆదేశించారు.  శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షించిన చైర్మన్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది మే నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిపైడ్ బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేసారు.  గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటించిన కమిషన్ చైర్మన్ అనంతగిరి, అరకు, దుంబ్రిగుడ, పాడేరు మండలాలలోని 30 కేంద్రాలు (ఎం.ఎల్.ఎస్ పాయింట్లు, చౌక దుకాణాలు, అంగన్వాడి కేంద్రాలు, సంచార పంపిణీ వాహనాలు, పాటశాలలు, వసతి గృహాలు) సందర్శించి లోటుపాట్లను గుర్తించి తగు సూచనలు జారీ చేసామని తెలిపారు. ఇంతవరకు రాష్ట్రవ్యాప్తంగా 366 కేంద్రాలు సందర్శించి కొన్ని కేంద్రాలపై చర్యలు కుడా తీసుకున్నామని స్పష్టం చేసారు. 

జిల్లాలో శాఖ తరుపున చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని, సమస్యలు పరిష్కరించుకుంటూ నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని, కమీషన్ లక్ష్యంగా పెట్టుకుందని,  ఆ దిశలో అందరూ పనిచేయాలని స్పష్టం చేసిన కమిషనర్ అలసత్వాన్ని, నాణ్యతా లేమిని సహించేది లేదని, అటువంటి వారిపై చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.  సమస్యలను. అర్ధం చేసుకోవటమే కాకుండా సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. అంగన్వాడి వర్కర్ల నిరక్షరాస్యత వల్ల కొన్ని కేంద్రాలలో తగు న్యాయం జరగటం లేనట్లు గుర్తించామని, అటువంటి కేంద్రాలపై మరింత ద్రుష్టి సారించాలని సూచించారు.  హాజరు నమోదులో, నాణ్యతలో రాజీ లేకుండా ఖచ్చితమైన కొలతలతో ఆహారాన్ని పెట్టాలని ఆదేశించారు.  ఆహార వస్తువులు, గుడ్లు, పప్పులు, నూనేలపై గడువు తేదీ పరిశీలించాలని కోరారు.  సిడిపిఓలు క్రమం తప్పకుండ కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని, ఫోర్టిపైడ్ బియ్యం గూర్చి అవగాహన కల్పించాలని చైర్మన్ ఆదేశించారు.  పిల్లలకు బలమైన ఆహరం అందించటానికి విటమిన్లు, ఐరన్ కలిపి తయారు చేసిన ఫోర్టిపైడ్ బియ్యం ప్రతి కిలోకు 50 గ్రాములు అందిస్తున్నామని వివరించారు.  రాష్ట్రంలో అన్ని అంగన్వాడి,  విధ్యాసంస్థలతో పాటు ఏడు జిల్లాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిపైడ్ బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.  పిల్లలే కదా ఎదో ఒకటి పెడదామని ఆలోచించకుండా వారికి పౌష్టికాహారం అందించాలని, వాళ్ళ హక్కులను కాలరాసే ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.  ఇటీవల పాడేరు కెజిబివి విద్యార్ధులు ఆహరం సరిగా అందించటం లేనందున ధర్నా చేసినట్లు, ఒక్క చికెన్ ముక్క మాత్రమె వేస్తున్నారని మెసేజ్లు వచ్చాయని తెలిపారు.  

ఆహార పంపిణీలో నాణ్యత, పరిమాణం లో తేడాలు ఉంటే 94905 51117 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎపి ఫుడ్ కమిషన్ మూడవ స్థానంలో ఉందని,  దానిని మొదటి స్తానంకు తీసుకు రావటానికి చేస్తున్న కృషిలో అందరూ సహకరించాలని కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి చేసారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ,  ఫుడ్ కమిషన్ చైర్మన్ జిల్లాకు రావటం సంతోసకరమని,  వారి సందర్శనలో గుర్తించిన లోపాలను సరి చేస్తామన్నారు.  జిల్లాలొ భౌగోళికంగా ప్రత్యెక పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ నాణ్యమైన సేవలు అందించటానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని చైర్మన్ కు తెలిపారు. కమిషన్ సూచనలను, సలహాలను అమలు చేస్తామన్నారు. 

జేసి శివ శ్రీనివాసు మాట్లాడుతూ పౌర సరఫరాలు, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం అమలు పై ప్రత్యెక దృష్టి సారిస్తామని, పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని తెలిపారు.  సంచార పంపిణీ వాహనాలు ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్ళటం ఇబ్బందిగా ఉందని, సిగ్నల్ సమస్య కూడా ఉందని చైర్మన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్, ఐటిడిఎ ఇంచార్జ్ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్, పౌర సరఫరాల ఉప సంచాలకులు సురేష్, జిల్లా పౌర సరఫరా అధికారి శివ ప్రసాద్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గణేష్ కుమార్, ఐసిడిఎస్ పధక సంచాలకులు సూర్య లక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి డా. పి. రమేష్, డిఎంహెచ్ ఓ డా. బి. సుజాత, ఎటిడబ్ల్యుఓ ఎల్. రజని, సిడిపిఓలు, ఎంఇఓలు, తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 12:27:27

రైతులు తప్పకుండా ఈకేవైసీ చేయించాలి

మామిడి పంట వేసిన  రైతులు కూడా ఈ.కే.వై.సి చేయించాలని, లేని యెడల పంటల నష్ట పరిహారం, ఇన్సురెన్సు వర్తించవని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి స్పష్టం చేసారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్.బి.కే ల ద్వారా రైతులకు ఈకేవైసీపై అవగాహన కలిగించాలని  జిల్లా వ్యవసాయాధికారి తారక రామారావు కు సూచించారు. పశువులకు వాక్సినేషన్  లక్ష్యాలను పూర్తి చేయాలనీ జే.డి డా. రమణ కు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలో శత శాతం టాయిలెట్లు ఉండాలని , విద్యార్ధి, ఉపాధ్యాయుల నిష్పత్తి ఖచ్చితంగా ఉండేలా చూడాలని డి.ఈ.ఓ వెంకటేశ్వర రావుకు తెలిపారు. 

పి.ఎం.జి.ఎస్.వై క్రింద చేపడుతున్న రహదారుల పురోగతి పై సమీక్షించారు. 34 రహదారులకు గాను 15 పూర్తి అయ్యాయని, మిగిలినవి పలు దశల్లో ఉన్నాయని ఆర్ అండ్ బి  ఈ ఈ వెంకటేశ్వర రావు తెలుపగా మార్చ్ నెల లోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు.  మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి వనరులు ఉన్న ప్రతి రైతు 90 శాతం సబ్సిడీ పై ప్రభుత్వం అందిస్తున్న  డ్రిప్, స్ప్రింక్లర్ కొనుగోలు చేయాలనీ , అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలనీ ఏ.పి.ఎం.ఐ.పి ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కు సూచించారు.   జలజీవన్ మిషన్ క్రింద మంజూరైన ప్రాజెక్ట్ లకు వెంటనే టెండర్స్ పిలవాలని గ్రామీణ నేటి సరఫరా ఎస్.ఈ ఉమా శంకర్ కు సూచించారు. 

నీతి అయోగ్ సూచీలన్నీ శత శాతం సాధించాలని, ఏ ఒక్క శాఖ వెనుకబడినా జిల్లా వెనుకబడిపోతుందని స్పష్టం చేసారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. డా. నాగభూషణ రావు, ఐ.సి.డి.ఎస్. పి.డి. శాంత కుమారి, సి.డి.పి.ఓ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

2022-10-14 11:52:29

అంగన్వాడీల్లోనే గర్భిణీలకు భోజనం పెట్టాలి

గర్భిణీల  గుర్తింపు,  వారి పర్యవేక్షణ  శతశాతం  జరగాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఐసీడిఎస్, వైద్యఆరోగ్యశాఖ అధికారులను  ఆదేశించారు. బయట జిల్లాల, రాష్ట్రాల  నుండి వచ్చిన వారిని కూడా నమోదు చేసి వారికీ అవసరమగు అలహాలను అందించాలని సూచించారు. ఎలిజిబుల్  కపుల్స్  ను గుర్తించి వారితో ఎప్పటికప్పుడు ఏ.ఎన్.ఎం,ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు  మాట్లాడుతూ ఉండాలని అన్నారు. శుక్రవారం  కలెక్టర్ తన ఛాంబర్ లో ఆకాంక్షల జిల్లా సుచీలైన  వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో  గర్భిణీల నమోదు, సామ్. మాం  , బాల్య వివాహాలు, సఖి బృందాలు,  వ్యవసాయం ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ శాఖలు, పంచాయతి రాజ్, విద్యా శాఖల సూచీల పై  సమీక్షించారు. 3వ సారి గర్భం ధరించిన వారిపై ప్రత్యెక దృష్టి పెట్టాలని, అందుకు గల కారణాల పై ఆరా తీసి వారికీ కౌన్సిలింగ్ చేయాలనీ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల పై , సిజారియన్లు  పై సమీక్ష చేయాలనీ సూచించారు. హై రిస్క్ గర్భినీలను ముందే గుర్తించి వారి పై ప్రత్యెక దృష్టి పెట్టాలని అన్నారు. గర్భిణీల నమోదు పై  లక్ష్యాలు వారీగా సమీక్షించి తక్కువ సాధించిన  వైద్యారులను, సి.డి.పి.ఓ లను అందుకు గల కారణాల పై ఆరా తీసారు. అపార్ట్ మెంట్ ల లో ఉన్న వారు సర్వే కు రానివ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాలంటీర్ల ద్వారా  వెళ్ళాలని, ఒక సారి పరిచయం అయితే ఇక పై సర్వే కు సహకరిస్తారని కలెక్టర్ తెలిపారు. 

అంగన్వాడీ కేంద్రం పరిధి లో ప్రతి వారం లో ఒకసారైన సఖి బృందాల సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశాలకు వైద్యాధికారులు కూడా హాజరు కావాలని , బాలికల ఆరోగ్య సమస్యల పై చర్చించాలని అన్నారు. ఎర్లీ ప్రేగ్నన్సి వలన శరీరానికి కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలని తెలిపారు.   సామ్, మాం పిల్లలు ఎక్కువగా ఉన్న కేంద్రాలను ఎక్కువ సార్లు సి.డి.పి.ఓ లు సందర్శించి వారికీ ప్రత్యెక ఆహారాన్ని ఎలా అందించాలో వారి తల్లులకు అవగాహన కలిగించాలన్నారు.  6 నెలలకే అన్నప్రాసన జరగాలని, గుడ్డు, పాలు, బాలామ్రుతం  పిల్లలకు అందజేయాలని తెలిపారు. ఈ విషం పై తల్లులకు అవగాహన కలిగించాలని తెలిపారు.  బాల్య వివాహాల నిరోధానికి పోలీస్ ల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. డా. నాగభూషణ రావు, ఐ.సి.డి.ఎస్. పి.డి. శాంత కుమారి, సి.డి.పి.ఓ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

2022-10-14 11:48:01

ప్రభుత్వ నిర్మాణాలు వేగవంతం చేయాలి

నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న గృహాలు, ప్రభుత్వ శాశ్వత భవనాల పనులపై ప్రత్యేక దృష్టిసారించి వినియోగంలో తీసుకు వచ్చే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు డా కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ, పెద్దాపురం డివిజన్ పరిధిలోని హౌసింగ్, పీఆర్ బిల్డింగ్స్, హౌసింగ్ లేఔట్లు, అప్రోచ్ రోడ్లు, ఎస్ డబ్ల్యూ పిసి, ఎస్.హెచ్. జీ రుణాలు మంజూరు, తదితర అంశాలపై జిల్లా కలెక్టరు కృతికా శుక్లా.. హౌసింగ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్ ఇతర జిల్లా అధికారులతో పాటు కాకినాడ, పెద్దాపురం డివిజన్లు వారిగా అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవో హౌసింగ్, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

 ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణాలతో పాటు ప్రభుత్వ శాశ్వత భవనాలైన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న వాటిని నెల రోజులలో మిగిలిన పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చూడాలన్నారు. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ కార్యదర్శులు హౌసింగ్ కు సంబంధించిన స్టేజ్ కన్వర్షన్ వివరాలు యాప్ లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో ఎస్.డబ్ల్యూ.పిసి కేంద్రాల ద్వారా వర్మి కంపోస్ట్ తయారీకి చర్యలు చేపట్టాలన్నారు.

 ముఖ్యంగా  రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుసరించి నవంబర్ 1 నుంచి అమలు చేయనున్న  ప్లేక్సీల నిషేధంపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని, ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రభుత్వ కార్యాలయలలో ఉన్న ప్లేక్సీల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ బి సుధాకర్ పట్నాయక్, డ్వామా పీడీ ఇంచార్జ్ డీపీఓ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ పెద్దాపురం డీఎల్డీవోలు పి.నారాయణ మూర్తి, కె.ఎన్.వి ప్రసాదు రావు హౌసింగ్, పీఆర్  డీఈ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 11:14:23

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

పట్టభద్రుల  నియోజకవర్గ  ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని సత్వరమే పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం ఉదయం అన్ని జిల్లాల ఈఆర్ఓ లు మరియ ఏఈఆర్ఓ లతో నమోదు ప్రక్రియ పై వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన పట్టభద్రులు అందరు నవంబర్ 7వ తేదీ లోగా కొత్తగా ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. శాసనసభ నియోజక వర్గాల పరిధిలో ఉండవలసిన ఓటర్ల శాతం 75 కంటే అధికంగా ఉంటే ఓటర్ల వివరాలను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించి తప్పులను సరిచేయాలని, అలాగే తక్కువ ఓటర్లు నమోదైన చోట మరోసారి ఓటర్ల వివరాలు సేకరించాలని ఆదేశించారు. 

  ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఓటర్ల మార్పు చేర్పులు చేసుకోవడానికి గరుడ్ యాప్ ను ఇవ్వడం జరిగిందని, ఈ యాప్ వినియోగంపై  బూతు లెవెల్ అధికారులకు (బి.యల్.ఓ) పూర్తి అవగాహన ఉండాలన్నారు. కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.యల్.ఓ ల ద్వారా పరిశీలించి, ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు.  వాలంటీర్లు ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొనరాదని, వారు పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందితే విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సు లో జిల్లా నుండి  డిఆర్వో శ్రీనివాసమూర్తి, వియంఆర్డీఏ ఎస్టేట్ అధికారి లక్ష్మా రెడ్డి , స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎన్ హెచ్ -16 వెంకటేశ్వర రావు, ఎన్నికల డిప్యూటి తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

2022-10-14 11:06:56

బాణ‌సంచా త‌యారీ, విక్ర‌యాల్లో నిబంధ‌న‌లు పాటించాలి

దీపావ‌ళి సంద‌ర్భంగా బాణ‌సంచా త‌యారీ, విక్ర‌యాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని.. ఎవ‌రైనా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని, కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్లు కాకినాడ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ స్ప‌ష్టం చేశారు. దీపావ‌ళి పండ‌గ నేప‌థ్యంలో బాణ‌సంచా త‌యారీ, విక్ర‌యాల‌కు ఇచ్చే తాత్కాలిక లైసెన్సులు, విక్ర‌యాల సంద‌ర్భంగా దుకాణ య‌జ‌మానులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, వివిధ స‌మ‌న్వ‌య శాఖ‌ల త‌నిఖీలు త‌దిత‌ర అంశాల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్‌గా రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాప‌క‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ‌, కార్మిక‌, మున్సిప‌ల్‌, పంచాయ‌తీరాజ్‌, ఆరోగ్య త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ నెల 23, 24వ తేదీల్లో రెండు రోజుల పాటు మాత్ర‌మే బాణ‌సంచా విక్ర‌యాల‌కు అనుమ‌తి ఉంటుంద‌ని.. విక్ర‌యాల కోసం వ‌చ్చే ప్ర‌తి ద‌ర‌ఖాస్తును క్షుణ్నంగా ప‌రిశీలించి ఆర్‌డీవోలు అనుమ‌తులు మంజూరు చేయాల‌ని సూచించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు విక్ర‌యాలు జ‌ర‌పొచ్చ‌న్నారు. దుకాణాలు ఏర్పాటుచేసేందుకు అనువైన స్థ‌లాల‌ను గుర్తించి.. విక్ర‌యాలు స‌జావుగా సాగేలా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. దుకాణానికి దుకాణానికి మ‌ధ్య క‌చ్చితంగా మూడు మీట‌ర్ల దూరం ఉండాల‌ని.. ఒక క్ల‌స్ట‌ర్‌లో గ‌రిష్టంగా 50 దుకాణాలు మాత్ర‌మే ఏర్పాటు చేసేందుకు అవ‌కాశ‌ముంద‌న్నారు. అధికారులు మార్కు చేసి ఇచ్చిన చోట మాత్ర‌మే దుకాణాలు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. అగ్నిమాప‌క వాహ‌నాలు, అంబులెన్సులు వంటివి వ‌చ్చి వెళ్లేందుకు అనువుగా ర‌హ‌దారులు ఉండేలా చూడాల‌న్నారు. 

విక్ర‌యాలు జ‌రిపే చోట అగ్ని ప్ర‌మాదాలు చోటుచేసుకోకుండా ప‌టిష్ట జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. ప్ర‌తి షాపు వ‌ద్ద ఇసుక బ‌కెట్లు, డ్ర‌మ్ముల‌తో నీరు వంటివి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ప్ర‌తి దుకాణం వ‌ద్ద నో స్మోక్ బోర్డులు ఏర్పాటుచేయాల‌న్నారు. డివిజ‌న్‌, మండ‌ల‌స్థాయిలో ప్ర‌త్యేక త‌నిఖీ బృందాలు ఏర్పాటుచేయాల‌ని.. రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాప‌క త‌దిత‌ర శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. బాణ‌సంచా త‌యారీ, విక్ర‌య కేంద్రాల్లో చిన్న‌పిల్ల‌ల‌ను ప‌నిలో పెట్ట‌కూడ‌ద‌ని.. ఎవ‌రైనా నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు తప్ప‌వ‌న్నారు. రాత్రి ప‌ది గంట‌ల త‌ర్వాత ప్ర‌జ‌లు ఎవ‌రూ శ‌బ్దం వ‌చ్చే బాణ‌సంచా ఉప‌యోగించ‌కూడ‌ద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ వెల్ల‌డించారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం నిర్దేశించిన ఈ నిబంధ‌ల‌ను పాటిస్తూ ప్ర‌జ‌లు ఆనందోత్సాహాల‌తో పండ‌గ జ‌రుపుకోవాల‌ని సూచించారు. స‌మావేశంలో కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, పెద్దాపురం ఆర్‌డీవో జె.సీతారామారావు, ఇన్‌ఛార్జ్ డీపీవో ఎ.వెంక‌ట‌ల‌క్ష్మి, జిల్లా అగ్నిమాప‌క అధికారి ఎన్‌.సురేంద్ర, వివిధ మున్సిపాలిటీల క‌మిష‌న‌ర్లు, మండ‌లాల త‌హ‌సీల్దార్లు, పోలీస్‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

2022-10-14 10:38:24