1 ENS Live Breaking News

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు రావాలి

మంచి వ్యవసాయ సాగు  పద్దతులు పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాదించాలని జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ తెలిపారు.  బుధవారం  పార్వతీపురం మన్యం ఐటిడిఎ గిరిజనమిత్ర  భవనం లో నిర్వహించిన  వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులకు  ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయo తో పనిచేసి రైతులకు ఉత్తమ సేవలు అందించాలని తెలిపారు.   జిల్లాలో సుమారు లక్షా ఇరవై వేల మంది రైతులకు చెందిన  మూడు లక్షల నలబైఒక్క వేల ఎకరాలలో పంటలను  ఇ-క్రాప్ నమోదు చేయడం జరిగిందని, దీనివలన ప్రభుత్య పధకాలు అమలుకు, భవిష్యత్తు ప్రణాళికలకు సులభతరం అవుతుందని తెలిపారు. 

 ప్రభుత్యం అమలు చేస్తున్న పధకాలను,  శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు  రైతుల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. రైతులు  రసాయన ఎరువులు పరిమితికి మించి వాడకూడదని, మంచి వ్యవసాయ సాగు  పద్దతులు పాటించాలని తెలిపారు. భుసార పరిక్షలు చేయుట ద్వారా  పంటకు అవసరమైన ఎరువులు మోతాదు  గుర్తించి వినియోగించాలని సూచించారు.  వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ  శిక్షణ లోని అంశాలను క్షేత్ర స్థాయి లో రైతుల వద్దకు తీసుకు వెళ్ళుటకు  తదుపరి  డివిజన్ స్థాయి, గ్రామ స్థాయి లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమం లో  పొలంబడి,  మంచి వ్యవసాయ పద్దతులు, ఉద్యాన పంటలు,  వరి,పత్తి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటల్లో ఆచరించ వలసిన ఉత్తమ వ్యవసాయ పద్దతులపై  అధికారులు, శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు.  ఈ కార్యక్రమం లో  జిల్లా ఉద్యాన అధికారి సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డి. భారతి, శాస్త్రవేత్తలు జి. నారాయణస్వామి , తేజేశ్వరరావు, ఉద్యాన అధికారి క్రాంతికుమార్, క్వాలిటీ మేనేజర్ జి. యుగంధర్, రాస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. శ్రీనివాసరాజు  తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-10-19 13:36:47

పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ధాన్యం సేక‌ర‌ణ‌కు సిద్ధం కావాలి

ఆరుగాలం శ్ర‌మించి రైతు పండించిన పంటకు మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పీ) అందించే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేక‌ర‌ణ విధానాన్ని అమ‌లుచేస్తోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ వైస్ ఛైర్మ‌న్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ జి.వీర‌పాండియ‌న్ పేర్కొన్నారు. న‌వంబ‌ర్ రెండో వారం నుంచి ఖ‌రీఫ్ (2022-23) సీజ‌న్‌కు సంబంధించి ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభంకానున్న నేప‌థ్యంలో వీర‌పాండియ‌న్‌.. బుధ‌వారం కాకినాడ క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్.ఇల‌క్కియ‌తో క‌లిసి పౌర స‌ర‌ఫ‌రాలు, లీగ‌ల్ మెట్రాల‌జీ, లేబ‌ర్‌, మార్కెటింగ్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వీర‌పాండియ‌న్ మాట్లాడుతూ ఈ-క్రాప్ జ‌రిగిన విస్తీర్ణం 2,24,871 ఎక‌రాలు కాగా.. 5,05,959 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం ఉత్ప‌త్తి కానుంద‌ని తెలిపారు.

 ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌లో ప్ర‌తి ద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా 1,113 మంది సిబ్బంది పాల్గొన‌నున్నార‌ని.. వీరికి శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైతు తాము పండించిన పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర పొందేలా క్షేత్ర‌స్థాయి సిబ్బంది అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని, ఈ విష‌యంలో వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. ప్ర‌తి ఆర్‌బీకేలోనూ ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి ప్ర‌భుత్వం రూపొందించిన పోస్ట‌ర్‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని.. దీంతో మ‌ద్ద‌తు ధ‌ర, నాణ్య‌తా ప్ర‌మాణాలు, అందుబాటులో ఉన్న అవ‌కాశాలు త‌దిత‌రాల స‌మాచారం రైతుల‌కు తెలుస్తుంద‌న్నారు. తేమ‌ను కొలిచే మీట‌ర్లు వంటి వాటిని ఆర్‌బీకేల‌లో అందుబాటులో ఉండేలా చూడాల‌ని అధికారుల‌కు సూచించారు. 

పూర్తిస్థాయి స‌న్న‌ద్ధ‌త‌తో ధాన్యం సేక‌ర‌ణ కేంద్రాల కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌డం ద్వారా ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయొచ్చ‌ని వీర‌పాండియ‌న్ పేర్కొన్నారు. స‌మీక్షా స‌మావేశానంత‌రం వీర‌పాండియ‌న్‌.. క‌లెక్ట‌రేట్ విధాన‌గౌత‌మి స‌మావేశ‌మందిరంలో ధాన్యం సేక‌ర‌ణ సిబ్బందికి జ‌రుగుతున్నశిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, సివిల్ స‌ప్ల‌య్స్ డీఎం డి.పుష్ప‌మ‌ణి, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీఎస్‌వో డి.చాముండేశ్వ‌రి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-10-19 13:04:29

MDUఆపరేటర్లకు అదనపు ఆదాయం కల్పించాలి..

ఎండియు ఆపరేటర్ల, రేషన్ షాప్ డీలర్ల కు అదనపు ఆదాయం కల్పించే దిశగా ఆయిల్ ఫెడ్ జిసిసి లు వారి ఉత్పత్తులను ఎండియుల ద్వారా సామాన్య ప్రజలకు బహిరంగ మార్కెట్ లోని ధరల కన్నా తక్కువగా సరసమైన ధరలలో అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని జెసి చాంబర్లో ఆయిల్ ఫెడ్, జిసిసి, పౌరసరఫరాల అధికారులు, ఎండియు ఆపరేటర్లు, రేషన్ షాపు డీలర్లు తదితరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా వైజాగ్ తిరుపతి రెండు జిల్లాలలో జిసిసి ఆయిల్ ఫెడ్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచి వీరికి మార్కెటింగ్ తో పాటు, ఎండియు ఆపరేటర్లకు మరియు డీలర్ల కు అదనపు ఆదాయం కల్పించే దిశగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ప్రణాళిక బద్ధంగా చేపడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. 

దీనికిగాను ఎండియు ఆపరేటర్లు మరియు రేషన్ షాప్ డీలర్లు, జిసిసి, ఆయిల్ ఫెడ్ లు ఒక అవగాహనకు వచ్చి వారు సరఫరా చేసే ఉత్పత్తుల వివరాలు, రేట్లు, వారి గోడౌన్లు తదితరాలు బేరిజు వేసుకొని మంచి ఫలితాలు వచ్చే విధంగా చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లలో వారికి సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించి ఎండియు ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వాటికి ప్లాన్ తయారు చేయాలని తెలిపారు. ఎండియు ఆపరేటర్లు ఇంటింటికి నిత్యావసర సరుకులు అందించేటప్పుడు వారు కొనాలకున్న ఉత్పత్తులకు సంబంధించిన డిమాండ్ అంచనా వేసుకొని కొని ఉత్పత్తులను సరిపడా అందుబాటులో ఉంచుకోగలిగితే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచించారు. 

జిల్లా యంత్రాంగం బాధ్యత ఎండియు ఆపరేటర్లకు అవగాహన కల్పించుటకు వేదిక ఏర్పాటు చేయడం వరకే అని, ఉత్పత్తులు కొనాలా వద్దా అనేది ఎండియు ఆపరేటర్లు మరియు రేషన్ షాప్ డీలర్లు నిర్ణయానికి వారు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ అధికారి విజయ బ్రాండ్ వంట నూనె ఎంతో నాణ్యమైనదని, జిసిసి వారు మంచి తేనె, కాఫీ పొడి, సబ్బులు, షాంపూలు  తదితర ఉత్పత్తులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి యం.వి. ప్రసాద్ జి సి సి మేనేజర్ రమణారెడ్డి ఆయిల్ ఫెడ్ ఏరియా ఆఫీసర్ చింతా వెంకట శివయ్య ఏ ఎస్ ఓ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2022-10-19 09:58:56

గర్భీణిలు,బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలి

వైద్యం కోసం ఆసుపత్రకి వచ్చే గర్భీణి మరియు బాలింతలకు కార్పరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించాలని జిల్లా కలక్టరు డా.ఎ.మల్లిఖార్జున అన్నారు. బుధవారం ఉదయం  ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం లో జిల్లా కలక్టరు పాల్గోన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలక్టరు మాట్లాడుతూ ఆసుపత్రికి నూతనంగా మెటర్నీటి ఓటి, సిసి కెమెరాల ఏర్పాటు, ఆసుపత్రి భవన మరమత్తులకు, కార్ పార్కింగ్ షెడ్డుల నిర్మాణం, ఇంటర్నల్ రోడ్సు నిర్మాణం, అధనపు మరుగుదోడ్లు నిర్మాణం,  జనరేటరు నిర్వహణ షెడ్డు నిర్మాణం తదితర అంశాలపై ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో ఇటీవల  పేషంట్ల కోసం  ఏర్పాటు చేసిన వసతి రూములను కలెక్టర్  తనిఖీ చేసి అక్కడ ఉన్న పేషెంట్లతో మాట్లాడి వారికి మరేమైనా అదనంగా సౌకర్యాలు  కావాలా అని   అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి డ్యూటిలో ఉన్న నర్సులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక  కలెక్టర్ మరో విభాగంలో నూతనంగా నిర్మిస్తున్న 20 పడకల ఎసి షెడ్డును కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రెండు వారాలలో వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్యం అందుకుంటున్న రోగుల నిమిత్తం ఆసుపత్రిలో కిటికిలకు  దోమతెరలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యం కోసం వచ్చేవారిని  పరామర్శించి వారికి వైద్యం మెరుగుగా అందుతుందా లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్యాధికారిణి  కె. విజయలక్ష్మి , ఆంధ్ర మెడికల్ కాలేజీ  ప్రిన్సిపాల్ డా.జి బుచ్చి రాజు,    ఎన్జీవో అండ్ సోషల్ వర్కర్ ప్రెసిడెంట్ ఆర్. రవికుమార్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-10-19 09:51:02

డిపిఓ ఇందిరా ర‌మ‌ణ‌ లోటు తీర‌నిది

ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావం గ‌ల జిల్లా పంచాయితీ అధికారి ఇందిరా ర‌మ‌ణ ఆక‌స్మిక మ‌ర‌ణం తీవ్ర బాధాక‌ర‌మ‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ అన్నారు. ఆమె లేని లోటు తీర్చ‌లేనిద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇందిరా ర‌మ‌ణ‌కు జిల్లా యంత్రాంగం బుధ‌వారం ఘ‌నంగా నివాళుల‌ర్పించింది. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఆమె చిత్ర‌ప‌టానికి వివిధ శాఖ‌ల అధికారులు పూల‌మాల‌లు వేసి, శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో జెసి మయూర్ అశోక్ మాట్లాడుతూ, జిల్లా పంచాయితీ అధికారి ఆక‌స్మిక‌ మ‌ర‌ణం న‌మ్మ‌శ‌క్యం కానిద‌ని అన్నారు. ఆమె అంకిత‌భావం గ‌ల అధికారిణి అని, కొద్ది కాలంలోనే డిపిఓగా ఆశాఖ‌పై త‌న‌దైన ముద్ర వేశార‌ని పేర్కొన్నారు. అధికారులు ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నార‌ని, త‌మ ఆరోగ్యంపై కూడా శ్ర‌ద్ద పెట్టాల‌ని సూచించారు.

          జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు మాట్లాడుతూ, ఇందిరా ర‌మ‌ణ  ఆక‌స్మిక మ‌ర‌ణం తీవ్ర ద్రిగ్భాంతిని  క‌ల్గించింద‌ని అన్నారు. ఇలాంటి సంఘ‌ట‌న ఎంతో దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఇప్ప‌టికీ న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని పేర్కొన్నారు. అధికారులు త‌మ ఆరోగ్యంపైనా శ్ర‌ద్ద‌పెట్టాల‌ని, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.  జిల్లా ప‌రిష‌త్ సిఇఓ డాక్ట‌ర్ ఎం.అశోక్‌కుమార్‌, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల‌నాయుడు మాట్లాడారు. ఇందిరా ర‌మ‌ణ‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని, విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల‌ ఆమె అంకిత భావాన్ని వివ‌రించారు.  కార్య‌క్ర‌మంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారితోపాటు వివిధ శాఖ‌ల అధికారులు, పంచాయితీ శాఖ‌ సిబ్బంది పాల్గొని నివాళుల‌ర్పించారు.

Vizianagaram

2022-10-19 06:53:53

MLC ఎన్నికల ప్రక్రియలో అపుడే సిత్ర ఇసిత్రాలు..

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు ప్రక్రియలో అపుడే సిత్ర, ఇసిత్రాలు మొదలైపోయాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత దాఖలవుతున్నా దరఖాస్తులన్నింటికీ ఓటు వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి నెలకొంది. అభ్యర్ధులు ఫారం-18 తో పాటు కమిషన్ సూచించిన విధంగా ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నా ఆన్ లైన్ నమోదులో అవాంతరాలు ఎదరువుతున్నాయి. కొన్ని చోట్ల నేరుగా తహశీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి దరఖాస్తు ఇచ్చినా  ఓటు నమోదువుతోందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో అభ్యర్ధులు దరఖాస్తుతోపాటు..తమ దరఖాస్తు ముట్టినట్టుగా ఎక్నాలడ్జ్ మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొందరు సీనియర్ ఎమ్మెల్సీ ఓటర్లు మందు జాగ్రత్త చర్యగా ఈ విధంగా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు తమ ఓట్లు నమోదు అవుతున్నాయో లేదో అనే అనుమానాన్ని, ప్రభుత్వ అధికారులు తిరస్కరిస్తున్న దరఖాస్తులపై వామపక్షపార్టీలు అన్ని జిల్లాల కలెక్టర్లకూ ఫిర్యాదులు కూడాచేశారు.

 ఎక్కడా ఇబ్బంది లేకుండా పక్కాగా ఓటు నమోదు అయ్యేవిధంగా చూసుకోవడంలో ఓటర్లు ఒక అడుగు ముందుకి వేస్తున్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు 2022 నోటిఫికేషన్ తరువాత జరిగే ఎన్నికలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. గతంలో ఓటు నమోదు చేసుకుంటే పక్కగా నమోదు అయ్యి ఓటరులిస్టులో కూడా పేర్లు ఉండేవి. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదనే భయం ప్రతీ ఓటరులోనూ పట్టుకుంది. దీనితో తమ ఓటు పోకుండా.. ఎక్కడ నమోదు కాకుండా ఉండిపోతుందోననే భయంగో దరఖాస్తు దారులు కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని ఓటురుగా నమోదు అయ్యే ప్రక్రియలో సహచర పట్టభద్రలకు సహాయం అందిస్తున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే అభ్యర్దులు కూడా వారి స్నేహితులు, టీమ్ ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. గతంలో అయితే ప్రభుత్వం నుంచి ఓటరు నమోదు విషయంలో గట్టిగా ప్రచారం జరిగేది. కానీ ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత 15 రోజులకి ఎన్ని దరఖాస్తువు వచ్చేయనే విషయమై జిల్లా అధికారులు వివరాలు తెలియజేస్తున్నారు తప్పితే ఓటరును చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీనితో పోటీలో నిలబడే అభ్యర్ధులు మాత్రమే తమ ఓటర్లను కాపాడుకుంటూ, నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓట్లు గల్లంతవుతాయనే భయంతో ఓటర్లు ఎక్నాలడ్జ్ మెంట్లు తీసుకోవడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. దరకాస్తును తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఎక్కడా పడేయకుండా ఓటర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో ఉన్న భయాన్ని, ఓటు నమోదు అవుతుందా, లేదా అనే విషయంలో నెలకొన్న అనుమానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నివ్రుత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం చాలా మంది దరఖాస్తు చేసుకున్న ఓటర్లలో తమ ఓటు నమోదు అవుతుందా లేదా అనుమానం అధికంగా ఉంటం కూడా ఈప్రాంతంలో హాట్ టాపిక్ అయ్యింది. ఓట్లు తక్కువగా నమోదు అయితే గెలుపు గుర్రాలకు పని సులవవుతుందనే కోణంలో ఈ విదంగా చేస్తున్నారా అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఓటర్లు, అభ్యర్ధుల అనుమానాలను, ప్రస్తుతం జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, మండల తహశీల్దార్లు ఓటర్లకు భరోసా ఇవ్వాల్సి వుంది. చూడాలి ఈ విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!

Visakhapatnam

2022-10-19 02:33:28

రైతుల చేను వద్దనుంచే పంట కొనుగోలు

రైతులు పండించే ఖరీఫ్ పంటను పొలంవద్దనే కొనుగోలు చేయుటకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఎం .దేవుళ్లనాయక్ తెలిపారు.  మంగళవారం ఆయన కార్యాలయ చాంబరు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజను సంబంధించిన వరిపంట కొనుగోలుకు అక్టోబరు మాసాంతానికిని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు.  వ్యవసాయ శాఖ వారు అందజేసిన నివేదకల ఆధారంగా జిల్లాలో మూడులక్షల పదహారువేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నామని, నవంబరు నెలనుండి ధాన్యం సేకరణ మొదలు పెడతామన్నారు.  ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (ఎ)రకానికి క్వింటాకు  రెండువేల అరవై రూపాయలు, సాధారణ రకానికి రెండువేల నలబై రూపాయలు రైతులకు చెల్లించనున్నట్లు తెలిపారు.  

రైతులు తప్పని సరిగా ఇ-పంట నమోదు చేసుకోవాలని, ఇ-పంట నమోదు చేయకపోతే ధాన్యం కొనుగోలు జరుగదన్నారు. మిల్లర్లకు రైతుకు సంబంధం లేకుండా  ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పారదర్శకంగా ప్రక్రియ రూపొందించినదని,  దానికి ఇ-పంట నమోదు తప్పనిసరని తెలిపారు. జిల్లాలో మూడు వందల ఆరు రైతుభరోసా కేంద్రాల వద్ద ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు గోనుసంచులు పౌర సరఫరాలశాఖ, మిల్లర్లు సమకూర్చుతారని, రైతులు గోనెసంచులు సమకూర్చుకుంటే దానికి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. ధాన్యం కోత పూర్తిచేసిన రైతులు సంబంధిత రైతుభరోసా కేంద్రంలో నమోదుచేసుకొని, ధాన్యం శాంపిల్స్, వేయింగుపూర్తయిన తరువాత రశీదు అందజేస్తారని, ఆ తరువాత రైతుకు సంబంధం ఉండదని తెలిపారు.

 మిలర్లుగాని, మద్యవర్తులు గాని తూకం, నాణ్యత విషయంలో రైతులతో మాట్లాడే అవకాశం ఉండదని తెలిపారు.  ధాన్యం అమ్ముకొనుటలో యిబ్బందులు ఎదురైనా, మిల్లర్లు సంప్రదించుటకు ప్రయత్నంచినా టోల్ నెంబరు 1902 గాని 15525 గాని 18004251903 గాని ఫోన్ చెయ్యాలని  లేదా జిల్లా కంట్రోల్ రూం నెంబరు 08963-293037 లేదా 7702003582 కు పిర్యాదు చేయవచ్చునని తెలిపారు.  జిల్లా లో తొంబదిఒక్క బియ్యం విల్లులు ఉన్నాయని వాటిలో ప్రస్తుతం ఇరవైఏడు మిల్లులు సార్టెక్స్, ఫ్లోరిఫైడ్ మిషనరీ కలిగిఉన్నాయని,త్వరలోనే ముప్పదిఎనిమిది మిల్లులకు సార్టెక్స్, ఫ్లోరిఫైడ్ మిషనరీ ఏర్పాటు చేస్తున్నట్లు  ఆయన తెలిపారు. రైతులు దళారులనుగాని, మిల్లర్లను గాని వారి ధాన్యం అమ్ముకొనుటకు సంప్రదించవద్దని, రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని ఈ సంధర్బంగా రైతులకు కోరారు.

Parvathipuram

2022-10-18 14:07:57

ఘన, వ్యర్ధ పదార్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు  ఘన వ్యర్ధ పదార్థాలు, లిక్విడ్ వేస్ట్( వ్యర్థ జలాలు )లను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ చేపట్టేందుకు  చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ కమిషనర్ కే.రమేష్ చెప్పారు. మంగళవారం ఆయన ఎస్ఈ సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఈ మాధవి, ఇతర అధికారులతో కలిసి సేంద్రీయ ఎరువు తయారీ కేంద్రాన్ని, డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. అంతకుముందు మిషన్ క్లీన్ ఫర్ గోదావరి కృష్ణ కెనాల్స్ లో భాగంగా ఇంద్రపాలెం నుంచి మాధవపట్నం వరకు చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జడ్పీ సెంటర్ వద్ద జరుగుతున్న పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ విలేకరులతో మాట్లాడుతూ రోజూ ప్రజల నుంచి సేకరించిన తడి చెత్తను సేంద్రీయ ఎరువు తయారికి వినియోగిస్తున్నామన్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్ కోసం  ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నామన్నారు. బయో మెథనైజేషన్ ప్లాంట్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు.

  నాన్ రీసైక్లబుల్ కంబస్టబుల్ డ్రై వేస్ట్ ను విశాఖ లోని బిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు పంపిస్తున్నామన్నారు. రోజు విడిచి రోజు  10 టన్నుల కంబస్టబుల్  డ్రై వేస్ట్ తరలిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ప్రజలు కూడా  తడి, పొడి చెత్తను వేరువేరుగా సిబ్బందికి అందజేయాలని కోరారు. అలాగే వ్యర్థ జలాలు, భవన  నిర్మాణ వ్యర్ధాలను కూడా శాస్త్రీయ పద్ధతిలో నూ రు శాతం ప్రాసెసింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆయన సూచించారు. మిషన్ క్లీన్ ఫర్ గోదావరి కెనాల్ కార్యక్రమంలో భాగంగా కెనాల్ ప్రాంగణాన్ని  సుందరీకరణ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై  ఆయన సంబంధిత అధికారులతో చర్చించి సూచనలు ఇచ్చారు. ఇంద్ర పాలెం వంతెన వద్ద  పొరుగున ఉన్న పంచాయతీ  ప్రాంత ప్రజలు చెత్తను తీసుకువచ్చి వేయడం పై అసహనం వ్యక్తం చేశారు. చెత్తను  కెనాల్ ఆవరణలో వేయకుండా ఉండేలా  సంబంధిత పంచాయతీ అధికారులతో మాట్లాడాలని ఆయన అధికారులకు సూచించారు.

Kakinada

2022-10-18 12:51:06

వికలాంగ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానం

జాతీయ దివ్యాంగుల ఆర్ధిక, అభివృద్ధి సంస్థ (NHFDC) న్యూఢిల్లీ ద్వారా దివ్యాంగులకు రుణము కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.  అనకాపల్లి జిల్లాకు చెందిన అర్హులైన దివ్యాంగులు 40% అంగవైకల్యము 18 నుండి 60 సం.లవయస్సు కలవారు (మానసిక వికలాంగులు 14 సం.) రుణము పొందుటకు అర్హులని చెప్పారు. రుణము మొత్తం తిరిగి పూర్తిగా వడ్డీతో సహా చెల్లించ వలసి ఉంటుందన్నారు. రూ.10 వేల నుండి 50 వేల వరకు 5%, ఆపై రూ. లక్ష వరకు వడ్డీ 6% వడ్డీ ఉంటుందన్నారు దరఖాస్తు కొరకు ఏడి సంక్షేమ శాఖ వారి కార్యాలయంలో   సంప్రందించాలన్నారు.  సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, విద్య, శిక్షణ దృవీకరణ పత్రాలు, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకము కాపీ,  2 పాస్ పోర్టు సైజు ఫోటోలు, రూ. లక్ష  దాటినట్లెతే   సంబందిత పరిశ్రమల శాఖ వారి  నుంచి పొజెక్టు రిపోర్టు సమర్పించాలన్నారు. 

ఈ రుణాలు చిన్న వ్యాపారములకు వ్యాపార అభివృద్ధి చేసుకొనుటకు మంజూరు చేస్తారని వివరించారు.  రూ.లక్ష వరుకు షూరిటీగా 5సం.ల సర్వీసుగల ప్రభుత్వ ఉద్యోగి,  రూ.లక్షకు  దాటినట్లయితే  10 సం. సర్వీసు గల ప్రభుత్వ ఉద్యోగిషూరిటీ ఉండాలన్నారు. లేనట్లయితే బ్యాంకు గ్యారంటీ లేదా ఆస్తి తాలుకా ఒరిజనల్ దస్తావేజులు కూడా షూరిటీగా పెట్ట వచ్చని చెప్పారు.  SC/ ST/ BC మరియు మహిళా అభ్యర్ధులకు పాదాన్యత ఇవ్వబడుతుందని, మహిళా దివ్యాంగులకు వడ్డీలో ఒక శాతం రిబేట్ ఇస్తారని చెప్పారు.  రూ. లక్ష  వరకు లోను తీర్చుటకు 3 సం.లు, రూ. 5 లక్ష ల వరకు లోనుకు 5 సం.లుగా కాల పరిమితి ఉంటుందన్నారు. దరఖాసులు పరిశీలన, ఎంపిక మరియు లోను మంజూరు కార్యక్రమములు  జిల్లా స్క్రీనింగ్ కమిటీ (DLSC) ద్వారా జరుగుతుందన్నారు. అసలైన వికలాంగ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు.  ఇతర వివరముల కొరకు పోన్ నెం. 9493291018 ద్వారా తెలుసుకోవచ్చని  , విభిన్న ప్రతిభావంతులు, సహాయ సంచాలకులు జి‌.వి.పి.జగదీష్ తెలిపారు.

Anakapalle

2022-10-18 12:21:13

నాడు నేడు పనులలో ప్రగతి కనిపించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు నేడు పనులలో గణనీయ ప్రగతి కనిపించాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ అన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ సహాయ ప్రాజెక్టు మేనేజర్ల (ఏపిఎం)కు నాడు నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గిరి మిత్ర సమావేశ మందిరంలో మంగళ వారం ఏపిఎంలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్టు అధికారి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నాడు నేడు పనులలో జిల్లా వెనుకబడి ఉందని అన్నారు. ప్రభుత్వం ఏపిఎంలకు నాడు నేడు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. నాడు నేడు పనులను ప్రభుత్వం ప్రాధాన్యతతో చేపడుతుందని ఆయన చెప్పారు. పాఠశాలలు ఆహ్లాదంగా మారుతున్నాయని, విద్యార్థులలో ఆనందం వెల్లివిరుస్తోందని పేర్కొంటూ ప్రస్తుతం జరుగుతున్న పనులు వేగవంతం చేయడానికి శ్రద్ద వహించాలని ఆయన స్పష్టం చేశారు.

 నాడు నేడు పనుల విధివిధానాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నిబంధనలు తు.చ తప్పకుండా అమలు చేస్తూ నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని ఆయన ఆదేశించారు. నాడు నేడు పనులతోపాటు జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం తదితర కార్యక్రమాలను కూడా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.డి.వి రమణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, పేదరిక నిర్మూలన సంస్థ ఎపిడి వై. సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-10-18 12:10:37

భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలి

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పక అమలు జరిగేలా సంబంధిత శాఖలు చూడాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అద్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రమాదాలతో పోల్చుకుంటే 3 శాతం అధికంగా జరిగాయని జీరో ప్రమాదాలు లక్ష్యంగా సంబందిత శాఖలు పని చేయాలని అన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్య సహాయం అందించేలా జిల్లా వైద్య శాఖ, పోలీసు, ట్రాన్స్పోర్ట్, శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 ప్రమాదం జరిగిన వివరాలను ఐ.ఆర్.ఎ.డి. వెబ్ సైట్ నందు పోలీసు, వైద్య శాఖలు నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ వివరాలను కేంద్రంలో దేశంలోని ప్రమాదాలు  ఒకే చోట చూసి, అధ్యయనం చేసి మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు.  ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే కాపాడిన వారికి గుడ్ సమరటిన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని ఇందుకు సంబందించిన పోస్టర్లను సచివాలయాలలో, ఆసుపత్రులలో, పోలీసు స్టేషన్ లలో ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బారీ వాహనాల  డ్రైవర్ లకు విశ్రాంతి కొరకు వడమాలపేట వద్ద మల్టి కాంప్లెక్స్ నిర్మించనున్నామని అలాగే చిత్తూరు – నాయుడుపేట మద్యలో మరొకటి ఏర్పాటుకు సంబందిత ఆర్.డి.ఓ లు స్థల పరిశీలన చేయాలని సూచించారు. బాకరాపేట ఘాట్ నందు చేపట్టవలసిన భద్రతా పనులను పూర్తి చేసినందుకు సంతోషమని అన్నారు.

 సి.మల్లవరం – గాజులమండ్యం రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కూడళ్ళలో సిగ్నల్స్ ఏర్పాటు, బ్లిన్కర్స్ ఏర్పాటు కావాలని ప్రస్తుతం మరమ్మత్తులు ప్రారంభించారని డిసెంబర్ నాటికి పూర్తి కావాలని సూచించారు. ప్రధానంగా ప్రస్తుతం గాజులమండ్యం – నాయుడుపేట జాతీయ రహదారి  నిర్మాణం  సాగుతున్నదని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసు, ట్రాన్స్పోర్ట్, రెవిన్యూ సంయుక్త పరిశీలనతో అవసరమైన వేగనిరోదకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్.ఐ.సి. రోడ్డు భద్రతపై రహదారి దగ్గరలో ఉన్న సచివాలయాల వాలింటర్లకు శిక్షణ ఇచ్చి ప్రమాదాల బారిన పడిన వారి ప్రాణాలు కాపాడేలా చూడాలని డివిజనల్ డెవలప్ మెంట్ అధికారి వెంటనే దృష్టి పెట్టాలని అన్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ, హై వే లపై టూ వీలర్ ప్రయాణికులు హెల్మెట్ తప్పనిసరి చేయాలని సూచించారు. తిరుపతి నగరానికి సంబంధించి ఉప్పరపల్లి, వైకుంటపురం, బాలాజీ కాలనీ, టౌన్ కల్బ్, టి.ఎం.ఆర్. జంక్షన్, శ్రీనివాస కళ్యాణ మండపాల జంక్షన్ లలో ఫ్రీ లెఫ్ట్ రహదారుల నిర్మాణాలు నగరపాలక కమీషనర్ చర్యలు చేపట్టాలని సూచించారు. 

ఈ సమీక్షలో రోడ్డు భద్రతా కమిటీ కన్వీనర్ డి.టి.ఓ సీతారామి రెడ్డి,  ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ఆర్.ఎం.- టి.చంగల్ రెడ్డి,  వే ఫౌండేషన్- డా.పైడి. అంకయ్య, 108 అంబులెన్స్ సర్వీసెస్ – బి.మోహన్ బాబు, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ – డా,రామ్, డా.కోటి రెడ్డి,  ఎన్.హెచ్.ఎ..ఐ అధికారులు టి.దుర్గా ప్రసాద్ రెడ్డి, ఓ.నాగరాజ, డి.ఈ.ఈ., జి.వెంకటేశ్వరులు, మేనేజర్,  ఆర్ అండ్ బి  అధికారి సి.సుధాకర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా.ఎన్.ఆర్.రిచా శర్మ,  పశుసంవర్థక శాఖ ఎ.డి. డా.అప్సర్ సైయద్, మొహమ్మద్ అలీ ఖాన్, తిరుపతి ఎన్.హెచ్. 71 అధికారులు  కే.దాశరధ రామయ్య,  ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.మల్లికార్జున రావు,  మేనేజర్ సేఫ్టీ సెక్షన్ విజయ్ రాథోడ్,  సీనియర్ మేనేజర్ సర్వే   ఎం.రామ కృష్ణ,  కే.హనుమంత నాయక్, ట్రాన్స్పోర్ట్ అధికారులు శ్రీనివాస రావు, కుసుమ, స్వర్ణలత, సుబ్రహ్మణ్యం, మోహన్ కుమార్, శ్వేత బిందు, ఎ.ఓ. శ్రీనివాస రావు, కిషోర్,  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-10-18 11:38:18

ఈవీఎం, వీవీప్యాట్ భద్రతకు పటిష్ట చర్యలు..

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్  డా. కృతికా శుక్లా ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర‌ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా..రెవెన్యూ, ఎన్నికల శాఖ‌ల అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. వ‌ర్షాలు తరుచుగా కురుస్తున్నందున ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఈ సంద‌ర్భంగా సూచించారు.  కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బీవి.రమణ, పట్టణ త‌హ‌సీల్దార్ వైహెచ్ఎస్ సతీష్‌, కాకినాడ పట్టణ, కలెక్టరేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్లు సీహెచ్ లక్ష్మి ప్రసన్న, ఎం.జగన్నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-10-18 11:20:56

జగనన్నతోనే నగర అభివృద్ధి సాధ్యం

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే నగరం అభివృద్ధి చెందినట్లు జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని రెండవ జోన్ 13వ వార్డు  పరిధిలోని పైనాపిల్ కాలనీలలో సుమారు 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో రోడ్లు కాలువలకు ఆమె తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాన్ని విజయనిర్మల, వార్డ్ కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని నమ్మి  జగనన్న విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. 

నేడు ప్రతి వార్డు లో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పరిపాలన రాజధాని ఇక్కడ ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన వార్డు కార్పొరేటర్ సునీత సత్యనారాయణ విన్నపం మేరకు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు వార్డులో చేపట్టామని నూతనంగా రోడ్లు కాలువలు నిర్మాణానికి 56 లక్షల రూపాయలు కేటాయించి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కార్యదర్శులు వైయస్సార్ సిపి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-10-18 11:13:21

ఆర్.బి.కేలలో రైతులకు సదస్సులు

పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాలలో 19వ తేదీ నుండి రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, విధి విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించుటకు రైతు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వ నిబంధనలు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వాటిని సద్వినియోగం చేసుకొను విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుండి అన్ని రైతు భరోసా కేంద్రాలలో రైతు సదస్సు ఉంటుందని రైతులు సదస్సుకు హాజరై అవగాహన చెంది ప్రయోజనం పొందాలని ఆయన కోరారు.


Parvathipuram

2022-10-18 07:35:54

ప్రైవేటు ఆసుపత్రి తలదన్నేలా సేవలందాలి

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తమకు అత్యుత్తమ వైద్య సేవలు అందాయనే సంతృప్తితో ఆసుపత్రి నుంచి తిరిగి వెళ్ళాలన్నదే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఆ మేరకు వైద్యసేవలు మెరుగుపరిచే దిశగా వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ప్రభుత్వ వైద్యులకు సూచించారు. ఆసుపత్రుల్లో నాడు – నేడు పేరుతో వసతులు మెరుగు పరచడంలో ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని చెప్పారు.   ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తమకు మంచి వైద్య సేవలు అందుతాయనే అభిప్రాయాన్ని కలుగజేసే దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు పని చేయాలన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తో కలసి జిల్లా ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి రోగుఅలకు అందుతున్న సేవలపై ఆరా తీసారు. ముందుగా జిల్లా ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు చేపట్టిన అదనపు నిర్మాణాలు, కల్పిస్తున్న అదనపు వసతులపై వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు సత్యప్రభాకర్, ఎస్.ఇ. శివకుమార్ తదితరులు చిత్రపటాల ద్వారా వివరించారు. 
ఓ.పి. నమోదు విభాగాన్ని తనిఖీ చేసి రోజుకు ఎంతమంది ఓ.పి. నమోదు అవుతోందని ముఖ్య కార్యదర్శి తెలుసుకున్నారు. రోజుకు 600 మంది వరకు రోగులు నమోదు అవుతున్నట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. ఓ.పి. నమోదు ఎంతమంది సిబ్బందితో నిర్వహిస్తున్నదీ తెలుసుకున్నారు. కొత్తగా ఓ.పి.బ్లాక్ నిర్మిస్తున్నామని అక్కడ 11 కౌంటర్ లు ఏర్పాటు చేయనున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. 

అనంతరం ఆరోగ్యశ్రీ విభాగాన్ని పరిశీలించి ఇక్కడికి వచ్చే రోగులకు ఆరోగ్యమిత్రాల ద్వారా అందిస్తున్న సేవలపై తెలుసుకున్నారు. రోగులకు సంబంధించిన డయాగ్నొస్టిక్ సమాచారాన్ని, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ లను, కేసు రికార్డులను, వారికి ఇస్తున్న మెడిసిన్ ను ఒక కోడ్ నెంబర్ ఇచ్చి ఆన్ లైన్ లో వుంచినట్లయితే వాటిని ఇతర వైద్యులు ఎక్కడ వారికి చికిత్స అందించినా వారికి కేస్ హిస్టరీ అందుబాటులో వుంటూ చికిత్స సులభతరం అవుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్యులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారితో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో సమావేశమయ్యారు.  ఈసందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీ ప్రక్రియపై సమీక్షించారు. ఖాళీల భర్తీలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.పద్మలీల వివరించారు. ముఖ్యంగా వికలాంగులకు కేటాయించిన ఖాళీల భర్తీ సమస్యగా ఉంటుందని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వెంటనే రాష్ట్ర స్థాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ముఖ్య కార్యదర్శి ఫోన్ లో మాట్లాడి పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చారు. 

ఆసుపత్రిలో డయాగ్నొస్టిక్ పరికరాల అవసరం లభ్యత పై ముఖ్య కార్యదర్శి ఆరా తీసారు. శస్త్ర చికిత్సలకు అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో తగినంతగా అందుబాటులో ఉన్నదీ లేనిదీ ఆరా తీసారు. మందుల లభ్యతపై కుడా తెలుసు కున్నారు.  ఇక్కడి సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో 575 రకాల మందులు అందుబాటులో వున్నట్టు డ్రగ్ స్టోర్ అధికారులు వివరించారు. మందులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ఇండెంట్ ఇచ్చిన వెంటనే మందులు సరఫరా చేస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇస్తున్న నిధుల్లో ౩౦శాతం రోగుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ మొత్తాన్ని సిబ్బంది జీతాల కోసం ఖర్చు చేయడం సరికాదన్నారు. రోగులకు అవసరమైన ప్రత్యెక మందులు, చికిత్స పరికరాలు ఈ నిధులతోనే కొనుగోలు చేయవచ్చన్నారు.

నగరంలో తల్లిబిడ్డలకు వైద్య సేవలందించే ఘోషా ఆసుపత్రిని కొత్తగా ఏర్పాటు చేసే వైద్య కళాశాలలో కలపకుండా దీనిని ప్రత్యెక తల్లీపిల్లల ఆసుపత్రిగా కొనసాగించినట్లయితే ప్రజలకు మంచి సేవలు అందుతాయని ఆసుపత్రి వైద్యులతో పాటు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ముఖ్య కార్యదర్శికి వివరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వ స్థాయిలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని భోగాపురం వద్ద రోడ్డు ప్రమాద బాధితుల అత్యవసర చికిత్స కోసం ట్రామా కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్య కార్యదర్శి చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామ రాజు, డి.సి.హెచ్.ఎస్. డా.నాగభూషణ రావు, డి.ఎం.హెచ్.ఓ. డా.రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు. 

2022-10-15 11:30:16