1 ENS Live Breaking News

పాఠశాల భవనాలు సత్వరం పూర్తిచేయాలి..

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పార్వతీపురం ఐటిడిఏ పీఓ కూర్మనాధ్ అధికారులను ఆదేశించారు. సోమవారం  మక్కువ మండలం అనసభద్ర లో 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి ముందుగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల నుండి ఆరా తీశారు, అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ   రానున్న జనవరి2021 నాటికి బేస్మెంట్ లెవెల్ కి పనులు పూర్తి కావాలని, అలాగే భవన నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయ డానికి  ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.  అలాగే పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.      ఈ పర్యటనలో.  ట్రైబల్ వెల్ఫేర్  ఇఇ శాంతిస్వరరావు,  నాయుడు, ఎ.ఇ ఆర్.నరసింహమూర్తి,   ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Makkuva

2020-12-21 22:24:11

గ్రామసచివాలయ వ్యవస్థ మరింత బలోపేతం..

సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాల‌ను ల‌బ్ధిదారుల గ‌డ‌ప వ‌ద్ద‌కు చేర్చే ప్ర‌తిష్టాత్మ‌క గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ప్ర‌జా స‌హ‌కారంతో  మ‌రింత బ‌లోపేత‌మ‌వుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం యు.కొత్త‌ప‌ల్లి మండ‌లంలో రూ.40 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన యండ‌ప‌ల్లి గ్రామ స‌చివాల‌యం-1 నూత‌న భ‌వ‌నాన్ని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబుతో క‌లిసి క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ 2021, మార్చి 31 నాటికి జిల్లాలో అన్ని స‌చివాల‌యాల‌కు శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. భ‌వ‌న నిర్మాణాల‌పై ఇటీవ‌ల నియోజ‌క వ‌ర్గాల వారీగా స‌మీక్షా స‌మావేశాలు కూడా నిర్వ‌హించామ‌న్నారు. గ‌తంలో గ్రామ స్థాయిలో ఏదైనా కార్య‌క్ర‌మం లేదా స‌మావేశం నిర్వ‌హించాలంటే మౌలిక వ‌స‌తులు ఉండేవి కావ‌ని, ఇప్పుడు అన్ని సౌక‌ర్యాల‌తో స‌చివాల‌యాల నిర్మాణం జ‌రుగుతోంద‌ని తెలిపారు. త‌హ‌సీల్దారు, ఎంపీడీవో కార్యాల‌యాల‌కు మించి స‌చివాల‌యాలు రూపుదిద్దుకుంటున్నాయ‌న్నారు. స‌చివాల‌య ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుడు ఆధ్వ‌ర్యంలోనే నాణ్య‌త‌తో నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఎలాగూ రావ‌నే ఉద్దేశంతో గ‌తంలో రైస్‌కార్డు, పెన్ష‌న్‌, ఇంటిప‌ట్టాలు వంటి వాటికి ద‌ర‌ఖాస్తు కూడా చేసుకునేవారు కార‌ని, ప్ర‌స్తుతం స‌చివాల‌య‌, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా ప‌రిస్థితిలో పూర్తిగా మార్పు వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. పెన్ష‌న్ కోసం అవ్వాతాత‌లు ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చేద‌ని, ఇప్పుడు ఒక‌టో తేదీనే తెల‌వార‌క‌ముందే వ‌లంటీర్లు పెన్ష‌న్ మొత్తాన్ని అందిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న సంక్షేమ ప‌థ‌కాలు, వాటిని పొందేందుకు అర్హ‌త‌ల వివ‌రాల‌ను వ‌లంటీర్లు వారి ప‌రిధిలోని ఇళ్ల‌కు వెళ్లి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నార‌న్నారు. ఎవ‌రూ అడగాల్సిన అవ‌స‌రం లేకుండానే సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ‌చేస్తున్న వ్య‌వ‌స్థ‌లుగా స‌చివాల‌యాలు, వ‌లంటీర్లు గుర్తింపు సాధించార‌ని పేర్కొన్నారు. న‌వ‌ర‌త్నాలు, పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 25న గౌరవ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తూర్పుగోదావ‌రి జిల్లా నుంచే ప్రారంభించ‌డం ఎంతో సంతోష‌క‌రమ‌ని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 3.80 ల‌క్ష‌ల ఇంటి ప‌ట్టాల పంపిణీ జ‌ర‌గ‌నుంద‌న్నారు. గ్రామాల్లో రైతుభ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల‌కు కూడా శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాలు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమూల్ ప్రాజెక్టు ద్వారా పాడి రైతుల‌కు ఎంతో మేలు జ‌ర‌గ‌నుంద‌ని, ప్రైవేటు సంస్థ‌ల కంటే ఎక్కువ మొత్తాలు నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ‌వుతాయ‌ని వివ‌రించారు. యండ‌ప‌ల్లిలో గ్రామ స‌చివాల‌యం అద్భుతంగా ఉంద‌ని, ఇదే స్ఫూర్తితో మిగిలిన స‌చివాల‌యాల నిర్మాణాలు జ‌ర‌గాల‌ని క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఏ గ్రామంలోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని అదే గ్రామంలో ప‌రిష్క‌రించే అద్భుత వ్య‌వ‌స్థ స‌చివాల‌య వ్య‌వ‌స్థ అని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు పేర్కొన్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో సామాన్యుల‌కు సైతం కార్పొరేట్ వైద్యం అందింద‌ని, ఆయ‌న ఆశ‌యాల స్ఫూర్తిగా గౌర‌వ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పేద‌ల అభ్యున్న‌తి కోసం ప‌నిచేస్తున్నార‌న్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామ స‌చివాల‌యాన్ని అద్భుతంగా నిర్మించిన కాంట్రాక్ట‌ర్‌ను క‌లెక్ట‌ర్‌, ఎమ్మెల్యేలు స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ, ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Kothapalli

2020-12-21 21:02:31

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు..

రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు శుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం మంత్రి ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి లో వేంచేసి యున్న శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందించని సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్ మాత్రమే అందిస్తున్నారని అన్నారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతోను,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా మహ్మమ్మారి కూడా పూర్తిగా అంతం చేయాలని స్వామిని కోరుకున్నట్టు మంత్రి చెప్పారు. 

ఉప్పలగుప్తం

2020-12-20 18:30:24

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు..

రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు శుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం మంత్రి ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి లో వేంచేసి యున్న శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందించని సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్ మాత్రమే అందిస్తున్నారని అన్నారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతోను,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా మహ్మమ్మారి కూడా పూర్తిగా అంతం చేయాలని స్వామిని కోరుకున్నట్టు మంత్రి చెప్పారు. 

ఉప్పలగుప్తం

2020-12-20 18:30:11

ఆ మేన్ హోల్ కనిపించలేదా సారూ..

అక్కడ ఎలాంటి పైకప్పులేని మేన్ హోల్స్ పాదచారులను, వాహనచోదకులను భయపెడుతున్నాయి...సచివాలయ సిబ్బందికి ఈ విషయం తెలిసినా తమకేంటిలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంతో మంది ఈ మ్యాన్ హోల్స్ భారిన పడి గాయాల పాలవుతున్నారు. విశాఖ జిల్లా, ఎస్.రాయవరం మండలకేంద్రంలోని బజారు సెంటర్ మెయిన్ రోడ్డు నుంచి వెంకన్నపేట గౌరీపరమేశ్వర దేవాలయంకు పోవు రోడ్డులో గురజాడ కాంప్లెక్స్, ఆంజనేయస్వామి గుడికి మధ్య  ఉన్న డ్రైనేజీ పై ఉన్న రెండు మ్యాన్ హోల్స్ పై ఏర్పాటు చేసిన ఇనుప కవర్లు పాడైపోయాయి. ఒకటి తుప్పపట్టి పోయింది. మరొకటి పూర్తిగా లేకుండా పోయింది. దీనితో ఈ ప్రాంతానికి వచ్చినవారు ఒక్కోసారి మ్యాన్ హోల్స్ వద్ద  గాయాల పాలవుతున్నారు. చాలా మందికి ఈ పాడైన మేన్ హోల్స్ వలన గాయాలయ్యాయని మండలానికి చెందిన సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు చెబుతున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మండల కేంద్రానికి మెయిన్ సెంటర్ లో  ఈ ప్రాంతంలో మేన్ హోల్స్ పాడైపోతే వాటిని బాగుచేయించాల్సిన సచివాలయ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పద్దతిగా లేదన్నారు. ముఖ్యంగా తుప్పుపట్టిన మేన్ హోల్ రేకుల కారణంగా ఎంతో మంది రైతులు, మార్కెట్ కి వచ్చేవారు గాయాల పాలవుతున్నారని అన్నారు.  అదే విధంగా ప్రాధమిక పాఠశాల-5 ఎదురుగా ఉన్న రోడ్డును ఆనుకొని ఉన్న డ్రైనేజికి ఉన్న ఇటువంటి సమస్యే ఉందని రాజు చెబుతున్నారు. దీనిపై కూడా పిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత సచివాలయ స్పందించి మేన్ హోల్స్ ను సరిచేసి ప్రజలు గాయాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

s.rayavaram

2020-12-20 16:07:25

ఆ ఆదాయం ప్రభుత్వానికి కట్టాల్సిందే..

విశాఖ జిల్లా, మండల కంద్రమైన ఎస్.రాయవరం గ్రామ పరిధిలోని అనంతసాగరం చెరువుపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వానికి వివిధ శాఖలకు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీచేసింది. అనంతసాగరం చెరుులో సర్ప్లస్ వియర్ ను తమ స్వార్థం కోసం ధ్వంశం చేసారని, నిబంధనలకు విరుద్ధంగా రెవిన్యూ అధికారులు చెరువు గర్భంను పట్టాలు ఇచ్చారని, చెరువులో చేపల పెంపకానికి ఇస్తూ ఆ సొమ్మును గ్రామపంచాయతీకి గాని, నీటిసంఘంకు గాని చెల్లించకుండా స్వాహా చేస్తున్నట్లు సమాచార హక్కు చట్ట కార్యకర్త సోమిరెడ్డి రాజు రాష్ట్ర జస్టిస్ లోకాయుక్త కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు ఈ చెరువుపై  విచారణ చేశారు. దీంతో వాస్తవాలు వెలుగుచూశాయి. అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన  నివేదిక, ఆపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. అధికారులు ఇచ్చిన తీర్మానం ప్రకారం అనంతసాగరం  చెరువును గ్రామ పంచాయతీకి గుత్త హక్కులు ఇస్తూ, చేపల పెంపకంకు మత్యశాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట ద్వారా కేటాయించాలి. అలా కేటాయింపు ద్వారా  వచ్చిన ఆదాయంలో 30 శాతం గ్రామసచివాలయానికి, 50 శాతం నీటిసంఘానికి, 20 శాతం మత్యశాఖకు చెందుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి ఆ చెరువుపై వచ్చిన ఆదాయాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్లు తమ సొంతానికి వాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా చెరువుపై వచ్చిన ఆదాయం నిర్ధేశించిన ప్రభుత్వశాలకు అందించాలి. అలా అందించకుండా స్వార్ధానికి వినియోగిస్తే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ప్రభుత్వం అనంతసారం చెరువుపై ఈ విధమైన ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా గుత్తదారులు, మధ్యవర్తులు ఆదాయాన్ని దోచేయకుండా సమాచారహక్కుచట్టం కార్యకర్త రాజు లోకాయుక్తాకి ఫిర్యాదు చేయడం ద్వారా నియంత్రించగలిగారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇప్పటి వరకూ అప్పనంగా చెరువువై ఆదాయాన్ని తమ సొంత అవసరాలు వినియోగించుకున్న వారి గొంతులో పచ్చి వెలక్కాయ్ పడినట్టు అయ్యింది..

s.rayavaram

2020-12-20 15:59:25

వైఎస్ జగనన్న తోడుకి సహకరించండి..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు పథకం అమలు కు బ్యాంకులు ముందుకు రావాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.  శనివారం తన పర్యటనలో భాగంగా జీయ్యమ్మవలస ఆంధ్రా బ్యాంక్, గ్రామీణ విశాఖ బ్యాంక్ ,  కురుపాం లో గ్రామీణ విశాఖ బ్యాంక్ లను సందర్శించారు. ఈ సంద్భంగా ప్రాజెక్ట్ అధికారి జగన్ తోడు ఋణాల మంజూరుకు సంబంధిత వివరాల పై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ పార్వతీపురం ఐ.టి.డి.ఎ పరిధిలో గల 8 సబ్ ప్లాన్ మండలాల్లోని 4 వేల మంది లబ్ధిదారులకు ఎంపిక చేసి ఋణాలు మంజూరు చేయాలన్నారు, ఆర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి బ్యాంక్ ఋణాలు త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. మంజూరులో ఆలసత్వం  వద్దని సూచించారు. ఈ పర్యటనలో ఎ.పి.డి, ఎ.పి. ఓ, ఎం.పి.డి.ఓ, రెవెన్యూ,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kurupam

2020-12-19 22:00:48

ఈ-సేవలపై తక్షణమే స్పందించాలి..

 సచివాలయాల సిబ్బంది ఈ-సేవలపై దృష్టిపెట్టి తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడాలని సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు  ఆదేశించారు.  శనివారం పూసపాటిరేగ మండలం కొప్పెర్ల,  విజయనగరం మండలం నారాయణపురం గ్రామ సచివాలయాన్ని,  బాబామెట్ట చిక్కాలవీధిలో ఉన్న  వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసారు. రికార్డులన్నింటిని పరిశీలించి పెండింగు వున్నఈ-సేవలపై ఆరా తీసారు.  ప్రభుత్వ పధకాలకు లబ్దిదారుల ఎంపికలో సచివాలయ సిబ్బంది కీలకపాత్ర వహించాలన్నారు. ప్రభుత్వ పధాల వివరాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు సచివాలయానికి దగ్గరలోనే నివాసం వుంటూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో వుండాలన్నారు.  సచివాలయ పరిసరాలను పరిశుభ్రగా వుంచుకోవాలని, ఆవరణలో ఖాళీ స్థలంలో మొక్కులు నాటాలని తెలిపారు.  కోవిడ్  2వ దశ విస్తరించకుండా వుండేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.  మాస్కు తప్పనిసరిగా వాడడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తదితర అంశాలపై అవగాహన కలిగించాలన్నారు. 

Pusapatirega

2020-12-19 21:56:33

మా జీతాలు ఇప్పించండి మహాప్రభో..

తమకు రావాల్సిన 23 నెలల జీతాలు ఇప్పించి తమను ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం మండలం, సైతారుపేట గ్రామ సచివాలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్న చింతాడ పెంటయ్య, చిన్న పెంటయ్యలు అధికారులను వేడుకుంటున్నారు.  శనివారం ఈమేరకు తమకు జరిగిన అన్యాయంపై వారు స్థానిక మీడియాతో మాట్లాడారు. గ్రామసచివాలయ అధికారులు తమకు  రావలసిన జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు. కోవిడ్ కాలంలో కూడా గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యం పణంగా పెట్టి పనిచేసినా జీతాలు సక్రమంగా రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. గత 23 నెలలకు తనకు కేవలం రూ15,000 మాత్రమే ముట్టిందని పెంటయ్య, తనకురూ16,000 ముట్టిందని చిన పెంటయ్య మీడియాకి వివరించారు. రోజుకు ఒక్కొక్కరికి 200 చొప్పున నెలకు 6,000 ఇస్తామని అధికారులు తెలిపారన్నారు. సచివాలయ సెక్రెటరీని ఎప్పుడు అడిగినా నా చేతి సొమ్ము ఇస్తున్నానని, బిల్లులు రాలేదని తెలుపు తున్నారని చెబుతున్నారు. సుమారు రెండేళ్లుగా పనిచేయించుకొని తమకు రావాల్సిన జీతాలు ఇవ్వకపోతే తాము ఎలా బతుకుతామని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై గ్రామ సయవాలయ ప్రత్యేక అధికారి ఎం.పి.డి.ఓ చంద్రశేఖర్ ను అడుగగా పరిశీలించి సమస్యను పరిష్కస్తామని హమీ ఇచ్చారని వారు తెలియజేశారు. 

s.rayavaram

2020-12-19 21:31:08

అరకు ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి..

అరకు పర్యాటక ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడి రహదారులు,స్థానిక అభివృద్ధికే వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, అరకు పార్లమెంట్ డిస్టిక్ ఇన్చార్జి  పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శనివారం ఆమె ఘాట్ రోడ్డులో మీడియాతో మాట్లాడుతూ, అరకు వేలి మండలం సుంకర మెట్టు పంచాయతీ గిరిజన ప్రాంతాల్లోని మన్యం అందాలను  తిలకించడానికి  వచ్చిన పర్యాటకులు చాల ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే  అరచేతిలో ప్రాణం పెట్టుకొని వెళ్లాల్సివస్తోందన్నారు. రోడ్డు మార్గం ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద గోతులుతో, రోడ్డు వెడల్పు సరిగా  లేక పోవడం వల్ల రాకపోకలు నిలిచి ప్రయాణికులకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో  వాహనాలు విపరీతంగా రావడం వల్ల చాలా ట్రాఫిక్ ఏర్పడుతోందన్నారు. ఎక్కువగా యాక్సిడెంట్లు కూడా జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేసారు. నిత్యం అనేకమంది ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ రహదారిపై  ప్రయాణిస్తున్న రహదారి బాగుకోసం  దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు. టురిజం వల్ల వచ్చే కోన్ని వేల కోట్లు  ఆదాయంతో  అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అందరికీ ఉపయోగ పడుతుందన్నారు.  టూరిజం నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఏమిచేస్తోందని ఘాటుగా ప్రశ్నించారు. అరకు మన్యంలోని ఏజెన్సీ గిరిజన 11 మండలాల ప్రాంతం  పల్లె గ్రామాల రోడ్డు మార్గాలు పరిస్థితులు కుడా అద్వాన్నంగా ఉన్నాయని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి  ఏజెన్సీ 11 మండలాల ఆదివాసిలకు,టురిస్టులకు,ప్రయాణికులకు రహదారుల నిర్మాణాలు చేపట్టి  రక్షణ కల్పించాలని శాంతకుమారి డిమాండ్ చేసారు.

Araku Valley

2020-12-19 19:21:44

అర్హులమైనా మాకు కాపు నేస్తం అమలు కాలేదు..

విశాఖపట్నం జిల్లా,  ఎస్.రాయవరం మండలం, సైతారుపేట కు చెందిన మహిళలు కాపు నేస్తం తమకు వర్తింపజేయాలని కోరుతూ ఎంపీడీఓకి స్పందనలో ఫిర్యాదు చేశారు. ఆ పథకానికి  అన్నివిధాలా తాము అర్హులమైనా ఈ పథకం తమకు మంజూరు కాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కాపునేస్తం పథకానికి మోటూరు గోవిందమ్మ, నాగమణి, గొన్నాబత్తుల పద్మ, వరలక్ష్మి, కామేశ్వరి,మంగతల్లి సమ్మంగి పద్మ, రావి నాగమణిలు దరఖాస్తు చేసినా ఆ పథకం తమకు వర్తించేయలేదున్నారు.  గ్రామంలో 7 ఎకరాలు భూమి ఉన్న మహిళకు మంజూరు చేసిన అధికారులు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించారు. 29.07.2020 ఈ విషయం పై ఎం.పి.డి.ఓ కు పిర్యాదు చేసినా ఇప్పటి వరకూ తమకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో అందరికీ పథకం వర్తింపజేశారని తమను మాత్రం వదిలేశారని చెప్పారు. అంతేకాకుండా గ్రామ సచివాలయ కార్యదర్శిని ఎన్నిసార్లు అడిగినా మీకూ పథకం వస్తుందని చెబుతున్నారని కానీ అందరికీ వచ్చిన పథకం తమకు మాత్రం రాలేదని మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు అధికారులు, సచివాలయ సిబ్బంది చేసిన అన్యాయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి అర్హులమైన తమకు కూడా పథకం వర్తింపచేయాలని బాధితులు కోరుతున్నారు. 

s.rayavaram

2020-12-18 21:28:53

"విక్టరీ వెంకటేష్ " పుట్టినరోజు నేడు

దగ్గుబాటి రామానాయుడు, శ్రీమతి రాజేశ్వరి దంపతులకు రెండో సంతానంగా దగ్గుబాటి వెంకటేష్ తే 13-12-1960 దీ నాడు కారంచేడు లో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తండ్రి రామానాయుడు తో, అన్న సురేష్ బాబుతో సినిమాలలో నటించే అభిరుచి ఉన్నట్టు తన మనసులో మాట తెలియజేశారు వెంకటేష్ . ఆమోద ముద్రవేసి అంగీకారం వెంటనే తెలియజేశారు వీరిద్దరు. వీరి సొంత బేనర్ అయినటువంటి సురేష్ మూవీస్ బ్యానర్పై" కలియుగ పాండవులు " చిత్రాన్ని నిర్మించారు . ఈ చిత్రానికి తండ్రి రామానాయుడు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేష్ హీరోగా నటించిన మొదటి చిత్రమే విజయవంతం కావటం విశేషం. " బొబ్బిలిరాజా " "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" " సూర్యవంశం" "ప్రేమించుకుందాం రా" "కలిసుందాం రా !" " రాజా" "జయం మనదేరా " "లక్ష్మి" "సంక్రాంతి " "సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు" " F2 "వంటి చిత్రాలెన్నో విజయం సాధించాయి. ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి కుటుంబ కధా చిత్రాల కధానాయకుడిగా తెలుగు ప్రేక్షకులతో అభినందించ బడుతున్న హీరో వెంకటేష్. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి "విక్టరీ"ని ఇంటి పేరుగా చేసుకున్న "విక్టరీ వెంకటేష్" పుట్టినరోజు నేడు. అంతేకాకుండా పెళ్లి రోజు కూడా ఈ రోజే కావడం గమనించ దగ్గ విషయం . ఇటువంటి పుట్టినరోజులు, పెళ్లిరోజులు విక్టరీ వెంకటేష్ గారు ఎన్నో ...ఎన్నెన్నో... ఆనందకరంగా,జరుపుకోవాలని ENS సినిమా పేజీ టీమ్ కోరుకుంటుంది .

2020-12-13 02:41:15

అక్కడ ఏవైనా సగం సగం పనులే..

ప్రభుత్వం గ్రామసచివాలయాల ద్వారానే అన్ని సేవలూ ప్రజలకు చేరాలని ప్రభుత్వం నెత్తీ నోరూ కొట్టుకుంటే..దానికి భిన్నంగా ఎస్.రాయవరం సచివాలయ అధికారులు వ్యవహరింస్తున్నారు. కాలువ కోసం తవ్విన మట్టిని వదిలేయకుండా తొలగించాలని అర్జీచేస్తే సగం సగం తవ్వేసి వదిలిపెట్టేశారు. మండల కేంద్రం ఎస్.రాయవరం నుంచి సర్వసిద్ది గ్రామం వెళ్లే తారురోడ్డును అనుకొని ఉన్న సర్వసిద్ది పంటకాలువ పూడిక  తీయగా వచ్చిన మట్టిని గ్రామ పంచాయతీ సిబ్బంది తారురోడ్డుపై వేసి వదిలేశారు. దీంతో ఈవిషయమై మండలానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త విషయాన్ని పంచాయతీ సిబ్బందికి ద్రుష్టికి తీసుకెళ్లడంతో అక్కడ పోసిన మట్టిని పూర్తిగా తొలగించకుండా సగం సగం తీసి వదిలేశారు. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. పంచాయతీ సిబ్బంది ఏంచేసినా ఇలా సగం సగం పనులే చేస్తూ ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని సోమిరెడ్డిరాజు మీడియాకి వివరించారు. సగం సగం తీసిన మట్టి కూడా రోడ్డుపైకి రావడంతో చినుకులు పడిన సమయంలో బురదమయంగా మారుతోంది. మళ్లీ ఈవిషయాన్ని గ్రామసభ ద్రుష్టికి కూడా తీసుకెళ్లినట్టు రాజు చెప్పారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని కాలువ దగ్గర మట్టిని పూర్తిస్థాయిలో తొలగించాలని రాజు పంచాయతీ అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వం అన్నిశాఖలకు సిబ్బందిని నియమించినా ఎస్.రాయవరంలో మాత్రం సచివాలయ సేవలు ప్రజలు పూర్తిస్థాయిలో అందడటం లేదని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువమట్టిని తొలగించకపోతే ఈసారి ఆ ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కి అందజేస్తానని రాజు చెప్పారు.  పూర్తిస్థాయిలో మట్టిని పూర్తిగా తొలగించాలని, అంతే తప్ప తూతూ మంత్రంగా పనులు చేయవద్దని మరొకసారి పంచాయతీ అధికారులను రాజు కోరారు.

s.rayavaram

2020-12-12 22:10:05

మరుగుదొడ్ల అవినీతిపై అధికారిక విచారణ..

విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలంలో మరుగుదొడ్లలో జరిగిన అవినీతిపై ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. మండలంలో 28 గ్రామ పంచాయతీలకు మంజూరు అయిన 6539 వ్యక్తిగత మరుగుదొడ్ల పధకం కు మంజూరైన రూ 9.22 కోట్లు రూపాయలు ప్రోత్సాహకం చెల్లింపుల్లోను, నిర్మాణాల్లోను జరిగిన భారీ అవకతవకలపై సమాచార హక్కు కార్యకర్త సోమిరెడ్డి రాజు రాష్ట్ర జస్టిస్ లోకాయుక్త కు చేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రూరల్ వాటర్ సప్లై  యస్.ఇ, వి. రవికుమార్ వారం రోజుల క్రితం పేటసూదిపురం గ్రామం లో విచారణ చేపట్టారు. ఇందులో ఎంతమంది లబ్దిదారులున్నారు, ఏ స్థాయిలో అవినీతి జరిగింది, ఎంతమందికి ప్రోత్సాహకాలు అందాయి తదితర అంశాలను స్వయంగా లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విచారణ కార్యక్రమంలో ఎ.ఇ యస్.కె.సాహెబ్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎం.ఆర్.సీ లు, తమ సిబ్బందితో స్వయంగా పరిశీలించి లబ్దిదారులను విచారిస్తున్నారు. ఈ రెండు రోజులలో వమ్మవరం, పెనుగొల్లు, గెడ్డపాలెం, పి.దర్మ వరం గ్రామాల్లో విచారణ చేశామని తెలిపారు.

ఎస్.రాయవరం

2020-12-08 20:00:32

శ్రీశ్రీశ్రీ పడమటమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు..

అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం బయ్యవరం గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీశ్రీశ్రీ పడమటమ్మ తల్లికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎప్పటినుంచో రావాలనుకుంటున్న అమ్మవారికి ఆలయానికి వచ్చి పూజలు చేయడం ఆనందంగా వుందన్నారు కరోనా పూర్తిగా తగ్గి ప్రజలు సాధారణ జీవితం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలూ సందర్శించాలనే లక్ష్యంతో తన పర్యటన కొనసాగుతోందన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, మండల పార్టీ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీనివాసరావు, దంతులూరి శ్రీధర్ రాజు, గొర్లి సూరిబాబు, మలసాల కిషోర్, శ్రీకాంత్ రాజు, కరక శేషు, గొల్లవిల్లి బాబురావు, సత్యనారాయణ, నానాజీ, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Kasimkota

2020-12-08 12:04:41