1 ENS Live Breaking News

ప్రజావ్యతిరేక కర్మాగారాలకు అనుమతించేదిలేదు

 ప్రభుత్వం గాని, తాను గాని ఎల్లప్పుడూ రైతు పక్షమేనని, ప్రజలకు ఇబ్బంది, నష్టం కల్గించే పరిశ్రమలను తాను కూడా ప్రోత్సహించబోనని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్పష్టం చేశారు. బుధవారం రాజయ్యపేట వద్ద విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యే బాబూరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను అధికారంలో లేనప్పుడూ, వున్నప్పుడూ ఒకే మాట, సిద్దాంతానికి కట్టుబడి వుంటానని చెప్పారు. హెటెరో పరిశ్రమ వల్ల కొన్ని నష్టాలు కలుగుతున్నాయన్న విషయాన్ని తాను కూడా గుర్తించానని చెప్పారు. కారిడార్ భూములకు సంబంధించి 2013 భూసేకరణ ప్రకారం పరిహారం, జిరాయితీ భూములకు సమానంగా డి.పట్టా భూములకు పరిహారం, ఫలసాయం, గృహాలకు ముందుగా చెప్పిన మాట ప్రకారం పరిహారం ఇవ్వలేదన్న విషయాన్ని రైతులు ఇటీవలే తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ భూసేకరణ, పరిహారం పంపిణీ తదితర అంశాల్లో కొన్ని అక్రమాలు జరిగినట్టు తెలిసిందని, పది రోజుల్లో ఎస్డీసీలతో గ్రామాల వారీగా సమగ్ర పరిశీలన జరిపిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులు, రైతులు, చేతివృ త్తుల వారికి అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంచినీరు, విద్యవైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

రాజయ్యపేట

2020-11-25 21:18:33

జగనన్నతోడుతో ఆర్ధికాభివ్రుద్ధి..

చిరువ్యాపారులకు జగనన్నతోడు పథకంతో ఆర్ధికాభివ్రుద్ధి సిద్ధిస్తుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన జగనన్నతోడు పథకాన్ని నియోజకవర్గ పరిధిలో నక్కపల్లి లో ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్ సి వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా దళారులు, వడ్డీ వ్యాపారుల నుంచి ఇబ్బందుతు తొలగుతాయని చెప్పారు.  కాగా అనేక మంది చిరు వ్యాపారులు 36–60 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని అష్టకష్టాలు పడుతున్నారని అలాంటి వారికి ఎంతో చేయూతనిచ్చే పథకంగా మారుతుందని అన్నారు.  రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులని చెప్పారు. . ఈ పథకంను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే లబ్దిదారులకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, చిరువ్యాపారులు పాల్గొన్నారు.

Nakkapalli

2020-11-25 16:48:26

తెలుగు వారికి ఇష్టమైన గుండమ్మత్త సూర్యకాంతం

తెలుగు చిత్ర సీమలో ఎన్నో జనరంజకమైన చిత్రాలు ఉన్నాయి .వాటిల్లో గుండమ్మ కథ చిత్రం మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఈ చిత్రంలో నందమూరి ,అక్కినేని, ఎస్వీ రంగారావు ,సావిత్రి, సూర్యకాంతం , రమణారెడ్డి వంటి హేమాహేమీలు అయినటువంటి ఎందరో నటీనటులు ఉన్నారు ఈ చిత్రాన్ని నిర్మించాలనే ప్రయత్నాన్ని ఎందరో నిర్మాతలు చేసి విరమించుకున్నారు. ANR పాత్రను నాగార్జున ,NTR పాత్రను బాలకృష్ణ వేస్తారని ఒక్కసారి , ఏఎన్నార్ పాత్రను నాగ చైతన్య ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేస్తారని మరోసారి కొందరు నిర్మాతలు అనుకోవడం జరిగింది. కానీ ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్ర గుండమ్మ . ఈ పాత్రకు ఒకసారి శ్రీదేవిని , మరొకసారి రమ్యకృష్ణను అనుకోవడం జరిగింది. గానీ ఆ సాహసం ఎవ్వరూ చేయలేకపో యారు. గుండమ్మగా సూర్యాకాంతం అభినయించిన విధంగా ఎవరూ అభినయించలేరని ఈ ప్రయత్నాన్ని చివరకు సదరు నిర్మాతలు విరమించుకున్నారు . తెలుగువారికి ఎంతో ఇష్టమైన "గుండమ్మ కథ"నిర్మాణం చివరకి అయోమయంలో పడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు .

2020-11-25 01:22:49

నాడు-నేడులో భారీ అవినీతి..

గొలుగొండ మండలంలో  నాడు- నేడు పాఠశాలలో అభివ్రుద్ధి పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆర్. టి. ఐ  ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్. యం. సి. కమిటీ , ప్రధాన ఉపాధ్యాయులు కలిసి నిర్ణయించి నాణ్యమైన గ్రానైట్ కొనుగోలు చేయవలసి ఉండగా ప్రధానోపాధ్యాయులు ఏకపక్షంగా గ్రానైట్ సరఫరా దారునితో లాలూచీపడి  మండలంలో గల పాఠశాలలో అన్నిటి కి సరఫరా చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలపాలని అన్నారు. ఎస్ ఎం సి  కమిటీ చైర్మన్లు గ్రానైట్ కొనుగోలు లో మమ్ములను సంప్రదించకుండా వారు ఇష్టారాజ్యంగా చేసి ప్రభుత్వమే సరఫరా చేసిందని దాని యొక్క సొమ్ము చెల్లించాలని ఖాళీ చెక్కులు పై ప్రధాన ఉపాధ్యాయులు  సంతకాలు తీసుకోవడం లో అవినీతికి నిదర్శనం అన్నారు . జిల్లాలో చాలా మండలాల్లో నచ్చిన చోట ఎస్. ఎం.సి.  నిర్ణయం మేరకు పలు షాపుల్లో కొనుగోలు చేశారని కానీ గొలుగొండ మండలానికి నర్సీపట్నం నుంచి సరఫరా చేయడంలో జిల్లా అధికారుల పాత్ర ఉందా ? లేక మండల అధికారుల పాత్ర ఉందా ? లేక ప్రధానోపాధ్యాయులా ఉందా ? దీనిపై విచారణ జరిపితే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్రుష్టికి కూడా తీసుకెళ్లనున్నామని ఆయన మీడియాకి వివరించారు.

Golugonda

2020-11-23 20:45:27

అనకాపల్లిలో నాగచైతన్య పుట్టినరోజు వేడుకలు..

 అనకాపల్లి పట్టణం లో అక్కినేని అభిమానుల సమక్షంలో ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షులు మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో అక్కినేని నాగచైతన్య జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లవ్ స్టోరీ" మూవీ విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. మరిన్ని మంచి చిత్రాలు రాబోయే కాలంలో వస్తున్నాయంటూ  అక్కినేని నాగ చైతన్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమ అభిమాన నటుడు సినిమాల కోసం ఎంతో కాలంగా మా ప్రేక్షులమంతా వేచి చూస్తున్నామన్నారు. కరోనా వైరస్ ను ద్రుష్టిలో ఉంచుకొని చైతన్య వేడుకలు నిర్వహించినట్టు చెప్పారు.  ఈ కార్యక్రమంలో CH. అవతారం, ఆడారి కాశి రావు, గోల్డ్ వాసు, రాము యాదవ్, బెల్లాన శివాజీ, భాను చంద్ర అఖి, మోనో శ్రీను, బండి నాగరాజు, విశ్వనాథం, చందు, రెడ్డి సాయి కుమార్, చేపల చందు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

2020-11-23 15:03:59

రైతుల ఎరువులకు కెఎన్ఆర్ ఆర్ధిక సహాయం..

రైతు శుభిక్షంగా ఉంటే దేశం సౌభాగ్యంగా వుంటుందని గాజువాక బీజేపి నియోజకవర్గ కన్వీనర్ కె.నరసింగరావు అన్నారు. ఆదివారం  కే.కోటపాడు మండలం, సూదివలస గ్రామంలో గల 20మంది సన్నకారు రైతుల ఎరువులను పంపిణీకి ఆర్దికసాయం చేసారు. ఈ సందర్భంగా కే.ఎన్.ఆర్ మాట్లాడుతూ సన్నకారు రైతులు అప్పులు చేసి వ్యవసాయంలో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరైతు కుటుంబం ఆనందంగా వుండాలని మన దేశ ప్రదాని  నరేంద్ర మోదీ ఓకే దేశం - ఓకే పంట ద్వారా దేశంలో రైతులు తాము పండించిన పంట దేశంలో ఎక్కడైనే అమ్ముకొనే అవకాశం కల్పించి రైతుల ఆదాయం రెండింతలు వచ్చేవిదంగా చేశారన్నారు. అమ్మచారిటబుల్ ట్రస్టు సభ్యులు సన్నకారు రైతులను గుర్తించి వారికి ఎరువులు , పనిముట్లు,విత్తనాలు ఇవ్వడంతో పాటు , వారితో కలసి ఒకరోజు శ్రమదానం కూడా చేస్తున్నందుకు వారిని అభినందించారు.  ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ స్వచ్చంద సంస్ధ చైర్మన్ బాటా శ్రీను, ట్రస్టీలు బాస్కర్, అయ్యల నాయుడు,ఉషారాణి, లక్కీ షాపింగ్ మాల్ అధినేత స్వామి , ప్రముఖ వ్యాపారవేత్త రాజు గారు, మాజీసైనికులు కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

కె.కోటపాడు

2020-11-22 11:27:08

ఎస్.రాయవరం సచివాలయంలో ఆథార్ జూలకటక..

కహానీలు నమ్మే అధికారులుంటే కట్టుకధలు ఫోటోలు చూపించి మరీ చెప్పొచ్చునని ఎస్.రాయవరం గ్రామసచివాలయ సిబ్బంది నిరూపిస్తున్నారనే ప్రచారం జోరుగగా సాగుతోంది..లేని ఆధార్ కేంద్రం ఉన్నట్టుగా..ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వ గ్రామసచివాలయంలో ఫోటోలు తీయించుకొని, వాటిని సామాజిక మాద్యమాల్లోకి పంపుతూ మరీ హడావిడీ చేస్తున్నారు. విషయం బయటకు తెలియడంతో అదేం లేదు కానీ.. అంటూ నాలుక కరుచుకుంటున్నారు..ఇదంతా జిల్లా అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడమే దీనికి కారణంగా కనిపిస్తుంది విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండల కేంద్రమైన ఎస్.రాయవరం లో ఆధార్ నమోదు కేంద్రం ఒక చోట ఇస్తే నిర్వహణ మరోచోట జరుగుతుంది. దీనికి సాక్షాత్తు సచివాలయ అధికారులే అవకాశం కల్పించడం గామాన్హారం. గ్రామ సచివాలయ కార్యాలయ భవనంలో ఆధార్ సెంటర్ కోడ్ 205231654 ప్రకారం నిర్వహిస్తున్నట్లు రికార్డుల లో పంచాయతీ కార్యదర్శి ఏ వి ఎస్ ఎస్ ప్రసాద్ తో కలిసి ఉన్నతాధికారులకు చూపిస్తూ కర్రి జోగారావు అనే వ్యక్తి  గురజాడ షాపింగ్ కాంప్లెక్ ఎదురుగా నిర్వహిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఆధార్ కేంద్రం నిర్వహించకుండా వారంలో ఒక రోజు తూతూ మంత్రంగా ఆధార్ సేవలు నిర్వహించి ఫోటోలకు పోజులు ఇచ్చి ఇటు స్థానిక అధికారులను,అటు యూ.ఐ. డి ఆధార్ అధికారులను మభ్యపెడుతున్నారని మండలానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త ఆరోపిస్తున్నారు. ఇదేవిషయమై సచివాలయ అధికారులతో మాట్లాడితే పొంతన లేని సమాధానం చెబుతున్నారని రాజు మీడియాకి వివరించారు. కాగా ఈ విషయం ఒక్క పంచాయతీ కార్యదర్శి కి మాత్రమే తెలుసా ? లేక మండల స్థాయి అధికారులకు తెలుసా అనే సంగతి ఆ పెరుమాళ్లకే తెలియాలి అంటున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు ఉండటం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లా అధికారులు కొన్ని చోట్ల ఆధార్ కేంద్రాలు గ్రామసచివాలయాలకు పైలెట్ ప్రాజెక్టుగా మంజూరు చేశాయి. అయితే వాటిని ప్రభుత్వ సిబ్బందే నిర్వహిస్తున్నారు. కానీ ఎస్.రాయవరంలో మాత్రం ప్రభుత్వ భవనంలోప్రైవేటు వ్యక్తులు నిర్వహించడంపైనా రాజు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విదషయాన్ని జిల్లా అధికారులు, ఆథార్ నిర్వాహకులు, అటు మీసేవాల అధికారులకు ద్రుష్టికి తీసుకెళుతున్నట్టు ఆయన మీడియాకి వివరించారు. తక్షణమే అధికారులు ప్రభుత్వ భవనంలో ప్రైవేటు నిర్వాహకులతో చేపడుతున్న ఆథార్ కేంద్రంపై వివరణ ఇవ్వకపోతే ఎవరు ఏ  కార్యాలయంలో ఏ పని చేస్తున్నారో అర్ధం కాని పరిస్థి నెలకొంటుందని చెబతున్నారు..

s.rayavaram

2020-11-21 20:56:57

గిరిజనుల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం..

వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజనుల అభివ్రుద్ధి కోసం చేపట్టిన మహత్తర కార్యక్రమం అటవీ భూ హక్కు పత్రాల పంపిణీ అని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గున అన్నారు. శనివారం అరకువేలి మండలంలో గిరిజనులకు మంజూర పట్టాలను ఆయన ఐటిడిఏ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ కలలు గన్న కార్యక్రమాన్ని ఆయన కొడుకే నేడు సీఎం గా గిరిజనుల అభివ్రుద్ధికోసం అటవీ భూమి హక్కు పత్రాల పంపిణీ చేపట్టారన్నారు. తద్వారా అర్హులైన గిరిజన రైతులందరికీ భూమి ఏర్పడి వారి అభివ్రుద్ధికి మార్గం సుగమం అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో  రెవిన్యూ డివిజనల్ అధికారిణి కె.లక్ష్మీ శివ జ్యోతి . ఈ కార్యక్రమంలో  అరకు తహశీల్దార్, ఎమ్.పి.డి.ఒ, మరియు రెవెన్యూ సిబ్బంది, అధిక సంఖ్యలో గిరిజన రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Araku Valley

2020-11-21 18:03:53

అటవీ హక్కును సద్వినియోగం చేసుకోవాలి..

గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న అటవీ హక్కుపత్రాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. అటవీ హక్కుపత్రాలను విక్రయించకూడదని సూచించారు. శుక్రవారం స్దానిక క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన అటవీ హక్కుపత్రాల పంపిణీకి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గిరిజన పక్షపాతి అన్నారు. అర్హత కలిగిన గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసి రైతు భరోసాను అందిస్తున్నారని చెప్పారు. ముంచింగ్‌పుట్టు మండలంలో రూ.35 కోట్లతో 12 రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. అడవులను పరిరక్షించుకోవలసిన బాద్యత అందరిపైనా ఉందన్నారు. గిరిజన రైతులకు సిల్వర్ ఓక్,కాఫీ, మిరియాల నర్సరీలు పెంచుకునేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామాల మాట్లాడుతూ 2005కు ముందు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు అటవీ హక్కుపత్రాలు మంజూరు చేస్తామన్నారు. పది ఎకరాల వరకు సాగుచేస్తున్న పోడు భూమలు పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు. అటవీ హక్కుపత్రాలు పొందిన ప్రతీ రైతుకు రైతు భరోసా అందిస్తామన్నారు. ఏజెన్సీలో ప్రతీ గిరిజన కుటుంబానికి భూమి కలిగి ఉండేలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు పోడుభూములు లేని గిరిజన రైతులకు డి పారం పట్టాలను మంజూరు చేస్తామన్నారు. పోడు భూముల్లో సాగు చేయడానికి సిల్వర్,కాఫీ,మిరియాల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న రాగులకు ప్రభుత్వమే కిలోకు రూ.33 లు ధాన్యానికి 18.90లు చెల్లిస్తుందన్నారు . రాగులు, ధాన్యం రైతు భరోసా కేంద్రాలకు విక్రయించాలని చెప్పారు. వారపు సంతల్లో దళాలను నమ్మి మోసపోవద్దన్నారు. ముంచింగ్ పుట్టు మండలంలో859 మంది రైతులకు 1178 ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం అతిధులు చేతుల మీదగా లబ్దిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసారు. ఈ సమావేశంలో తాహశీల్దార్ ఎం.శ్యాంబాబు, ఎంపిడి ఓ ఎ వివి కుమార్, స్దానిక నేతలు ,గిరిజన రైతులు పాల్గొన్నారు.

ముంచింగుపుట్టు

2020-11-20 20:23:16

అందరికి అందుబాటులో వైద్యం..

మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సైతం మెరుగైన వైద్యాన్ని అందుబాటులో ఉంచి, నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నదే ముఖ్య మంత్రి వై. యస్.జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. దానిలో భాగంగానే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.  రూ. 300 లక్షల  నాబార్డ్   నిధులతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల నుండి 50 పడకల స్థాయి పెంపునకు, ఆధునీకరణకు, అలాగే భద్రగిరిలో రూ.895 లక్షల నాబార్డ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఉప ముఖ్య మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి శ్రీవాణి మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత నిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందుబాటులో కి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు ఆడుగులు వేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతము అయిన పాడేరులో రూ.500 కోట్లలతో  మెడికల్ కాలేజీ మంజూరు చేశారంటే, ఆ ప్రాంత ప్రజలు అభివృధి కోసం ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని పార్వతీపురంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ వైద్యం అందే అవకాశం వుందని తెలిపారు. గతంలో ఎవరూ చేయనటువంటి  ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనకు మన  ముఖ్య మంత్రి అందిస్తున్నారని కొనియాడారు. కురుపాంలో  రూ.300 లక్షలు,  భద్రగిరిలో రూ.895 లక్షల నాబార్డ్ నిధులతో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని స్థాయి పెంచడం జరిగింది అన్నారు. భద్ర గిరిలో నేటికి ఒక్క డాక్టర్ తోనే సి.హెచ్.సి కొనసాగుతుందని, డాక్టర్లు అవసరమున్నా,  మంజూరు లేక వైద్యులను నియమించుకోలేని పరిస్థితి మొన్నటివరకు ఉంది అన్నారు. ఈ విషయమై గతంలో శాసన సభలో మార్లు ప్రస్తావించడం జరిగింది అన్నారు. కాని ప్రతి పక్షంలో ఉండడం చేత సాధించలేక పోయామన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిందని, ప్రజా సంక్షేమ ప్రభుత్వం వచ్చిందని పేర్కొన్నారు.  మన  ముఖ్య మంత్రి  దయవల్ల రూ.8.95 కోట్ల రూపాయలతో భవిషత్తులో అన్ని వైద్య  సౌకర్యాలు కలిగిన ఆసుపత్రిగా మారనున్నదని సంతోషం వ్యక్తం చేశారు. గిరిషిఖర ప్రాంతాలనుండి వైద్యం నిమిత్తం వచ్చిన వారికి వైద్యులు,సిబ్బంది లేక గత ప్రభుత్వ హయాంలో వైద్యం అందేది కాదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో వైద్యులను, సిబ్బందిని భర్తీ చేసే ఘనత మన ముఖ్య  మంత్రి దేనని కొనియాడారు. కురుపాం నియేజక వర్గం అభివృధి నిమిత్తం నాడు - నేడు లో భాగంగా   నివేదికలు పంపడం జరిగింది అన్నారు. ఆరోగ్య శాఖా మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయించి కురుపాం ఆసుపత్రి అభివృధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్య మంత్రి ఆశయ ఆచరణలో 108 సిబ్బంది ..మనిషి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదని గుర్తించిన ముఖ్య మంత్రి జగన్మోహన రెడ్డి, ప్రతీ మండలానికి  ఒక 108 వాహనాన్ని పూర్తి వైద్య  సౌకర్యాలతో అందించారన్నారని శ్రీవాణి చెప్పారు. సమయానికి ఆసుపత్రికి తీసుకు వెళ్ళడానికే ఈ 108 వాహనమన్న ముఖ్య మంత్రి ఆలోచనని 108 సిబ్బంది ఆచరణలో పెట్టారని అభినందించారు. కొమరాడలో నాగావళి నదిని దాటించి, వారికి మెరుగైన వైద్యం అందించి వారికి సురక్షితంగా ఇంటికి చేర్చారని, ముఖ్య మంత్రి ఆలోచనలకి అనుగుణగా  108 సిబ్బంది పని చేస్తున్నారని చెప్పారు.  ప్రతి ఒక్కరు మరింత అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరారు.   ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, డి.సి.హెచ్.  జి.నాగభూషణ రావు, ఎస్. ఇ, ఇ. ఇ ఎ.పి. ఎం. ఐ.డి.సి, కురుపాం, భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

2020-11-19 16:14:58

అక్రమార్కులను హైరింగ్ సెంటర్లకు ఎంపిక చేస్తున్నారు..

అర్హులైన రైతులను కాదని అక్రమార్కులను అవినీతి పరులను  క్లస్టర్ హైరింగ్ సెంటర్లు బాధ్యత అప్పగించాలని అధికారులు చూస్తున్నారని ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సోమిరెడ్డి రాజు ఆరోపించారు. ఇదే విషయమై విశాఖజిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ జెడిలకు  లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడారు.  యస్.రాయవరం మండల కేంద్రానికి  రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రైతులకు మేలు చేయడానికి క్లస్టర్ హైరింగ్ సెంటర్లు 2 మంజూరు చేసిందన్నారు. ఈ సెంటర్లు ద్వారా గ్రామంలోని రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా 5 గురు రైతులు గ్రూప్ గా ఏర్పడి,  గ్రూపు  సంఘాల ద్వారా నిర్వహించడానికి ప్రతిపాదనలు కోరారని చెప్పారు. అయితే అర్హులైన రైతులకు వీటి నిర్వహణ ఇవ్వకుండా  సంబంధిత అధికారులు ప్రభుత్వ నిబంధనలకు  తూట్లు పొడిచి వాటిని అర్హులయిన వారికి కట్టబెట్టరారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు వివరించారు.  అనేక మంది రైతులు ఉండగా గ్రామంలో నాయకులు, రాజకీయ ఏజెంట్లు గా కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ, ప్రభుత్వ పథకాలు పొందడమే లక్యంతో వుండే వ్యక్తులకు హైరింగ్ సెంటర్లను అప్పగించడానికి ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. వారు స్థానికులు కాదని ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలకు వచ్చిన వ్యక్తులకు సభ్యులుగా చేసి 2 గ్రూపులుగా ప్రతిపాదనలు చేశారన్నారు.  ఒక్కొక్క గ్రూపుకు 5 గురు సభ్యులుగా గ్రూపులుగా ఏర్పడి ఇందులో ఒక వ్యక్తి కన్వీనర్, రెండవ వ్యక్తి కో కన్వీనర్ గా ఉండి మిగిలిన ముగ్గురు సభ్యులుగా వుంటారు. వీరిలో కన్వీనర్ కో కన్వీనర్ జాయింటుగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవలిసి ఉంటుంది. ఒకొక్క గ్రూపుకు గరిష్టంగా 12 లక్షల రూపాయలు పథకం మంజూరు చేస్తారన్నారు. గ్రూప్ సభ్యులు 10 శాతం స్వంత సొమ్ము, బ్యాంకు లోన్ ద్వారా 50 శాతం, 40 శాతం ప్రభుత్వ సబ్సిడీ మంజూరు చేస్తారని వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చే 40 శాతం అనగా 4.80 లక్షలు సబ్సిడీ మొత్తం, 6 లక్షలు తక్కువ వడ్డీకి బ్యాంకు ఇచ్చు సొమ్ముకు ఆశపడి అర్హులయిన రైతులు కాదని గ్రామాలలో తిరిగే నాయకులు, వ్యాపారస్తులు ఏ రోజూ పొలం వెళ్ళు దాఖలు లేని 10 మంది అనర్హులతో 2 గ్రూపు గా ఏర్పడి లబ్దిపొందడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆరోపించారు.. ఒకటవ గ్రూపు సంతోష్ బాబు క్లస్టర్ హైరింగ్ సెంటర్ పేరుతో, కన్వీనర్ గా కొణతాల శ్రీనివాసరావు (ఇతడు కొబ్బరి కాయల వ్యాపారం నిమిత్తం అనకాపల్లి నుంచి వలస వచ్చిన వ్యక్తి, వైసీపీ పార్టీ అధ్యక్షుడు) ఇతని బంధువు భీమరశెట్టి అప్పారావు కో కన్వీనర్ గాను, బంధువులు భీమరశెట్టి నాగేశ్వరరావు, కర్రి సూర్యకాంతం, ఏ.సాయి మురళి  గ్రూప్ గా ఏర్పడి ప్రతిపాదించారు.          రెండవ గ్రూప్ నూకాంబికా క్లస్టర్ హైరింగ్ సెంటర్ కన్వీనర్ గా దుబాసి గోవిందరావు (ఇతనుపై ఆసీలు పాట పాడి ఇప్పటికి పంచాయితీకి బకాయిలు చెల్లించని వ్యక్తి, నూకాంబికా దేవాలయం ఆదాయంకు లెక్కలు తెలపని వ్యక్తి, ట్రాక్టర్లు కలిగి ఇసుక, మట్టి అక్రమ రవాణా సొంత ట్రాక్టర్లతో చేయు వ్యక్తి, ఇప్పటికే 2 క్రిమినల్ కేసులు నమోదయిన వ్యక్తి) కో కన్వీనర్ గా దుబాసి కన్నయ్య పంచాయితీ కార్యాలయం లో విద్యుత్ కాంట్రాక్టర్ గా దశాబ్దాలుగా పని చేస్తున్న వ్యక్తి, ఏ రోజు పొలంకు వెళ్ళని వ్యక్తి, ఇప్పటికే 2 క్రిమినల్ కేసులున్న వ్యక్తి, ఇటీవల గ్రామ పంచాయితీ ఆశీల పాటను అక్రమంగా పొంది ఇప్పటికే 3 క్రిమనల్ కేసులు నమోదయిన వ్యక్తి అయిన ఇతని కుమారుడు దుబాసి దేవేంద్ర తో వసూలు చేయిస్తున్న వ్యక్తి), సభ్యులుగా మడగల సూర్యనారాయణ (సొంత ట్రాక్టర్, ప్రాక్లేన్లులు కలిగి ఇసుక ఆక్రమ  నిల్వదారునిగా అందరుకు తెలిసిన వ్యక్తి ఇతని కుమారుడు మడగల త్రిమూర్తులు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి, గత ఏడాది గ్రామ పంచాయితీ ఆశీల పాట వాటాదారుడు ఇప్పటికి పంచాయితీకి బకాయిలు చెల్లించని వ్యక్తి)  ఇతను బంధువు మడగల బాబురావు, దుబాసి కన్నయ్య బంధువు గృహిణి దుబాసి నాగమణి పేరున ప్రతిపాదనలు సిద్దం చేశారన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు లోతుగా విచారణ చేపడితే వాస్తవాలు బయటకు రావడంతోపాట, అర్హులైన రైతులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఆ విషయాన్ని ఫిర్యాదు రూపంలో అధికారులకు తెలియజేసి, ఇపుడు మీడియా ముందుకి వచ్చినట్టు సోమిరెడ్డిరాజు తెలియజేశారు.  

s.rayavaram

2020-11-18 11:18:48

వికెసాగరం చెరువుని ఎస్.రాయవరం సెక్షన్ లో కలపాలి..

విశాఖజిల్లాలోని వికెసాగరం చెరువుని యలమంచిలి నీటిపారుదల శాఖ నుంచి వేరు చేసి ఎస్.రాయవరం నీటిపారుదల శాఖ సెక్షన్ క మార్పు చేయాలని కోరుతూ ఎస్.రాయవరం వాసులు జిల్లా  జిల్లా కలెక్టర్ తోపాటు, నీటిపారుదలశాఖ అధికారులకు స్పందనలో మొరపెట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం స్పందనలో అర్జీని సమర్పించారు. ఈ సందర్భంగా నీటి సంఘం అధ్యక్షుడు కర్రిసత్యారావు మీడియాతో మాట్లాడుతూ, యస్.రాయవరం మండలంలోని, జె.వి.పాలెం మా గ్రామంలో ఉన్న వి.కె.సాగరం చెరువు ఉండగా నీటిపారుదలశాఖ సెక్షన్ యలమంచిలిలో ఉన్నందున అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. యస్.రాయవరం మండలంలోని జంగుళూరు వెలంపాలెం(జె.వి.పాలెం) రెవెన్యూ గ్రామంలోని వెంకమ్మ కృష్ణ సాగరం చెరువు(వి.కె.సాగరం చెరువు) సర్వే నెంబర్ 256 లో ఎకరాలు 99.34 సెంట్లుతో 906 ఎకరాలు ఆయకట్ట ఉందని అయితే  చెరువు సైతారుపేట నుండి యలమంచిలి పోవు తారురోడ్డును, మా గ్రామాన్ని ఆనుకొని ఉన్నదని చెప్పారు.. యస్.రాయవరంలో నీటిపారుదలశాఖ సెక్షన్ ఉన్నప్పటికీ మండలంలో 19 చెరువులు ఉండగా 18 చెరువులు యస్.రాయవరం సెక్షన్ పరిధిలో వుండి  ఒక్క మా వి.కె.సాగరం చెరువు మాత్రం యలమంచిలి సెక్షన్ పరిధిలో ఉన్నకారణంగా... గ్రామానికి ఉన్న ఈ ఒక్క చెరువు మాత్రం యలమంచిలి సెక్షన్ కార్యాలయం పరిధిలో ఉండడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. గతంలో యస్.రాయవరం  మండలంలో ఎలమంచిలి నియోజకవర్గంలో ఉండేదని..అయితే నియోజకవర్గాల పునర్ వ్యవస్తీకరణలో యస్.రాయవరం మండలం పాయకరావుపేట నియోజకవర్గంలోనికి మార్పు చేశారన్నారు. దీనితో మా గ్రామం యస్.రాయవరం మండలం, పాయకరావుపేట నియోజకవర్గంలో ఉండగా మా ఒక్క వి.కె.సాగరం చెరువు యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న, యలమంచిలి నీటిపారుదలశాఖ సెక్షన్ పరిధిలో ఉన్నది. దీని వల్ల ఆయకట్టు దారులమైన మేము అనేక ఇబ్బందులకు గురువుతున్నాము ఆయకట్టు దారులు వివరించారు. రైతుల ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకొని తక్షణమే ఆ చెరువును మార్పుచేయాలని వారు కోరారు.

s.rayavaram

2020-11-16 20:06:34

గురజాడ శిలఫలంతో రాజకీయాలొద్దు..గొల్ల

గురజాడ అప్పారావుని జాతి జీవితాంతం గుర్తుంచుకుంటుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అన్నారు. ఆదివారం యస్.రాయవరం మండల కేంద్రంలో పునర్ నిర్మించిన గురజాడ కళాక్షేత్రంను ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఇదే సమయంలో సమాచారహక్కు కార్యకర్త సోమిరెడ్డి రాజు ఆధ్వర్యంలో యువకులు ఎమ్మెల్యే బాబూరావుని కలిసి గతంలో గురజాడ కళాక్షేత్రం పునర్ నిర్మాణ పనులను(23.12.18) అప్పటి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ పప్పల చలపతి రావు ప్రారంభించారని ఎమ్మెల్యేకి వివరించారు. అయితే మాజీ ఎంపిటిసి బొలిశెట్టి గోవిందరావు తన అనుచరులు ఎల్లపు నాగు, కర్రి నాగు లతో చట్ట వ్యతిరేకంగా శిలాఫలకం (28.04.2020) తొలగించగా మాజీ ఎమ్మెల్యే అనిత, స్థానికులు పోలీసులకు ఫిర్యాదుచేశామని ఎమ్మెల్యీకి వివరించారు. అప్పట్లో టివి ఛానెల్స్, పత్రికల్లో ప్రముఖంగా రావడంతో శిలాఫలకం వెంటనే తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పినా.. నేటికీ దానిని ఏర్పాటు చేయలేదన్నారు.  దానినే మీరు ప్రారంభించారని రాజు ఎమ్మెల్యేకి తెలియజేశారు. అయితే పనులు శంకుస్థాపన చేసిన శిలాపలకం తిరిగి ఏర్పాటు చేయకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రారంభోత్సవం చేయడం స్థానిక అధికారులకు నాయకులకే చెల్లిందని, దీని వలన గ్రామంలో అనవసర రాద్దాంతాలకు, ప్రజల మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయని ఎమ్మెల్యేకి సోమిరెడ్డి రాజు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బాబూరావు  గురజాడ కళాక్షేత్రంలోని శిలాఫలకంతో రాజకీయాలొద్దని అన్నారు. ఇలాంటి విషయాలపై ఫిర్యాదు చేయాలని, ఇటువంటి వాటిపై ఎలాంటి కార్యక్రమం చేపట్టినా నేను తప్పుగా బావించనని ఎమ్మెల్యే గొల్ల చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ఎంపిడివో చంద్రశేఖర్, పంచాయితీ కార్యదర్శి ఏ.వి.వి.ఎస్.ప్రసాద్ ని అడగగా ఏర్పాటు చేయకపోవడం నిజమేనని సాయంత్రం లోపు శిలాఫలకం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో స్థానిక టిడిపి కార్యకర్తలు గాలి సత్యనారాయణ , తాడేల సంతోష్, దుబాసి రమేష్, భీమరశెట్టి శ్రీనివాస్, మద్దాల శ్రీనివాస్, అంగుళూరు శివ తదితరులు ఉన్నారు.

Payakaraopeta

2020-11-15 14:40:11

కరోనా నుంచి కోలున్న 60 మంది డిశ్చార్జి..

అనంతపురం జిల్లాలో  కరోనా నుంచి కోలుకోవడంతో 60 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు శనివారం 60 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేశామన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇప్పటి వరకూ అందించిన సహకారమే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యమైన సానిటైజర్లు వినియోగించాలనీ, సానిటైజర్లు లేనివారు ఏ సబ్బుతోనైనా తరచుగా 20 సెకెండ్లపాటు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. పౌష్టికాహరం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానం వున్నా, కరనా లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.

2020-11-14 17:36:58