1 ENS Live Breaking News

టిడ్కో ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

కర్నూలు నగర పాలక పరిధిలోని "అందరికీ ఇళ్ల పథకం" కింద ఈ నెల 25న అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ డికెబాలజీ అన్నారు. మంగళవారం కర్నూలు మండలం రుద్రవరం గ్రామ శివారులో ఇప్పటికే గుర్తించిన లేఅవుట్ స్థలాలను ఆయన అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, ఆ సంస్ధ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర టౌన్ షిప్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కొర్పొరేషన్(ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం సేల్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుందన్నారు.  లబ్ధిదారులకు మంజూరుకు చేయడానికి నగర పాలక పరిధిలోని మూడు నియోజకవర్గాల వారీగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు చేసే రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానం, యూనిట్ల మంజూరుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు గృహ సముదాయాల వద్ద పండగ వాతావరణంలో జరిగే ఇళ్ల మంజూరు కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ బాలాజీ ఆదేశించారు. మూడు కేటగిరీల వారీగా లబ్ధిదారులకు జి+3 నమూనాలో నిర్మించిన ఈ గృహాల్లో ఇప్పటికే మునిసిపల్ కార్మికులు శుభ్రత చర్యలు చేపడుతున్నారు. టిడ్కో డిఈ రవిగుప్త, సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పెంచలయ్య, ఎం.ఐ.ఎస్  స్పెషలిస్ట్ మధు, శివశంకర్, ఎస్.పి.సి.ఎల్...ఏజీఎం రవిచంద్ర తదితరులు ఉన్నారు.

Rudravaram

2020-12-22 18:46:01

మహిళా, శిశు సంరక్షణపై ద్రుష్టి సారించాలి..

మహిళా, శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండలంలోని అమ్మవారిపేట గ్రామంలో మంగళవారం ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ  శిశువులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సూచించారు..ఆర్డిటి సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ భవనాన్ని నిర్మించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం గర్భవతులకు శ్రీమంతం నిర్వహించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, ఆర్డిటి సంస్థ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఆర్డిటి రిసోర్స్ పర్సన్ సాగర్ మూర్తి, రీజనల్ డైరెక్టర్ నారాయణరెడ్డి, తహశీల్దార్ మహబూబ్ భాషా, ఎంపీడీవో తేజోష్ణ, డిసిపిఓ సుబ్రహ్మణ్యం, సిడిపిఓ ఉమా శంకరమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Bukkarayasamudram

2020-12-22 16:03:05

బయటకి వెళితే మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరి..

సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే మూమెంట్ రిజిస్టర్లో తప్పకుండా తమ పేర్లను నమోదు చేయాలని, మూమెంట్ రిజిస్టర్లో పేర్లు నమోదు చేయకపోతే అలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరించారు. మంగళవారం నార్పల మండలంలోని నాయనపల్లి గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో రిజిస్టర్ లను తప్పనిసరిగా నిర్వహించాలని, ఉద్యోగుల వివరాలను తూచా తప్పకుండా ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు తమ విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను, పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.  ఈ సందర్భంగా మూమెంట్ రిజిస్టర్లో పేర్లు నమోదు చేయకుండా బయటికి వెళ్ళిన సచివాలయ ఉద్యోగులకు మెమో జారీ చేయాలని పంచాయతీ సెక్రటరీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మరోసారి ఉద్యోగులు పేరు నమోదు చేయకుండా ఎవరు బయటికి వెళ్లకుండా చూడాలని, ఎవరైనా పేరు నమోదు చేయకుండా బయటకు వెళితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయంలో రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సుబ్బరాయుడు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Narpala

2020-12-22 16:01:30

పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 25వ తేదీన చేపట్టిన "ఇంటి పట్టాల పంపిణీ" కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం  కర్నూలు నగర పాలక పరిధిలోని ప్రజలకు కర్నూలు మండల పరిధిలోని రుద్రవరం గ్రామ శివారులో ఇస్తున్న 21,488 మందికి ఇంటి స్థలాల కోసం ఇస్తున్న పట్టాల లేఅవుట్ ను పరిశీలించారు. ముఖ్యంగా సర్వేయర్లు  త్వరత్వరగా గతంలో బ్లాక్ల వారిగా విభజించిన లేఅవుట్ స్థలాలకు సరిహద్దు గీతలకు సున్నం వేయించి, సరిహద్దు రాళ్ళు పాతించాలి అలాగే వాటికి పెయింటింగ్ వేయించాలని సూచించారు. అలాగే రేపటి నుంచి విధులకు వచ్చే వార్డు ప్లానింగ్ కార్యదర్శుల సేవలు కూడా వినియోగించుకోవాలని ఎంఈ రమణమూర్తి గారికి తెలిపారు. నిర్ధేశించిన కొలతల వారీగా వారి చేత పాతిన సరిహద్దు రాళ్లపై సర్వే నంబరింగ్ ను మార్కింగ్ వేయించాలన్నారు. అనంతరం స్థలాల చదును ప్రక్రియను  వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పారు

Kurnool

2020-12-21 22:50:02

పాఠశాల భవనాలు సత్వరం పూర్తిచేయాలి..

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పార్వతీపురం ఐటిడిఏ పీఓ కూర్మనాధ్ అధికారులను ఆదేశించారు. సోమవారం  మక్కువ మండలం అనసభద్ర లో 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి ముందుగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల నుండి ఆరా తీశారు, అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ   రానున్న జనవరి2021 నాటికి బేస్మెంట్ లెవెల్ కి పనులు పూర్తి కావాలని, అలాగే భవన నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయ డానికి  ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.  అలాగే పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.      ఈ పర్యటనలో.  ట్రైబల్ వెల్ఫేర్  ఇఇ శాంతిస్వరరావు,  నాయుడు, ఎ.ఇ ఆర్.నరసింహమూర్తి,   ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Makkuva

2020-12-21 22:24:11

గ్రామసచివాలయ వ్యవస్థ మరింత బలోపేతం..

సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాల‌ను ల‌బ్ధిదారుల గ‌డ‌ప వ‌ద్ద‌కు చేర్చే ప్ర‌తిష్టాత్మ‌క గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ప్ర‌జా స‌హ‌కారంతో  మ‌రింత బ‌లోపేత‌మ‌వుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం యు.కొత్త‌ప‌ల్లి మండ‌లంలో రూ.40 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన యండ‌ప‌ల్లి గ్రామ స‌చివాల‌యం-1 నూత‌న భ‌వ‌నాన్ని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబుతో క‌లిసి క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ 2021, మార్చి 31 నాటికి జిల్లాలో అన్ని స‌చివాల‌యాల‌కు శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. భ‌వ‌న నిర్మాణాల‌పై ఇటీవ‌ల నియోజ‌క వ‌ర్గాల వారీగా స‌మీక్షా స‌మావేశాలు కూడా నిర్వ‌హించామ‌న్నారు. గ‌తంలో గ్రామ స్థాయిలో ఏదైనా కార్య‌క్ర‌మం లేదా స‌మావేశం నిర్వ‌హించాలంటే మౌలిక వ‌స‌తులు ఉండేవి కావ‌ని, ఇప్పుడు అన్ని సౌక‌ర్యాల‌తో స‌చివాల‌యాల నిర్మాణం జ‌రుగుతోంద‌ని తెలిపారు. త‌హ‌సీల్దారు, ఎంపీడీవో కార్యాల‌యాల‌కు మించి స‌చివాల‌యాలు రూపుదిద్దుకుంటున్నాయ‌న్నారు. స‌చివాల‌య ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుడు ఆధ్వ‌ర్యంలోనే నాణ్య‌త‌తో నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఎలాగూ రావ‌నే ఉద్దేశంతో గ‌తంలో రైస్‌కార్డు, పెన్ష‌న్‌, ఇంటిప‌ట్టాలు వంటి వాటికి ద‌ర‌ఖాస్తు కూడా చేసుకునేవారు కార‌ని, ప్ర‌స్తుతం స‌చివాల‌య‌, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా ప‌రిస్థితిలో పూర్తిగా మార్పు వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. పెన్ష‌న్ కోసం అవ్వాతాత‌లు ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చేద‌ని, ఇప్పుడు ఒక‌టో తేదీనే తెల‌వార‌క‌ముందే వ‌లంటీర్లు పెన్ష‌న్ మొత్తాన్ని అందిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న సంక్షేమ ప‌థ‌కాలు, వాటిని పొందేందుకు అర్హ‌త‌ల వివ‌రాల‌ను వ‌లంటీర్లు వారి ప‌రిధిలోని ఇళ్ల‌కు వెళ్లి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నార‌న్నారు. ఎవ‌రూ అడగాల్సిన అవ‌స‌రం లేకుండానే సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ‌చేస్తున్న వ్య‌వ‌స్థ‌లుగా స‌చివాల‌యాలు, వ‌లంటీర్లు గుర్తింపు సాధించార‌ని పేర్కొన్నారు. న‌వ‌ర‌త్నాలు, పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 25న గౌరవ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తూర్పుగోదావ‌రి జిల్లా నుంచే ప్రారంభించ‌డం ఎంతో సంతోష‌క‌రమ‌ని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 3.80 ల‌క్ష‌ల ఇంటి ప‌ట్టాల పంపిణీ జ‌ర‌గ‌నుంద‌న్నారు. గ్రామాల్లో రైతుభ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల‌కు కూడా శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాలు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమూల్ ప్రాజెక్టు ద్వారా పాడి రైతుల‌కు ఎంతో మేలు జ‌ర‌గ‌నుంద‌ని, ప్రైవేటు సంస్థ‌ల కంటే ఎక్కువ మొత్తాలు నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ‌వుతాయ‌ని వివ‌రించారు. యండ‌ప‌ల్లిలో గ్రామ స‌చివాల‌యం అద్భుతంగా ఉంద‌ని, ఇదే స్ఫూర్తితో మిగిలిన స‌చివాల‌యాల నిర్మాణాలు జ‌ర‌గాల‌ని క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఏ గ్రామంలోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని అదే గ్రామంలో ప‌రిష్క‌రించే అద్భుత వ్య‌వ‌స్థ స‌చివాల‌య వ్య‌వ‌స్థ అని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు పేర్కొన్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో సామాన్యుల‌కు సైతం కార్పొరేట్ వైద్యం అందింద‌ని, ఆయ‌న ఆశ‌యాల స్ఫూర్తిగా గౌర‌వ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పేద‌ల అభ్యున్న‌తి కోసం ప‌నిచేస్తున్నార‌న్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామ స‌చివాల‌యాన్ని అద్భుతంగా నిర్మించిన కాంట్రాక్ట‌ర్‌ను క‌లెక్ట‌ర్‌, ఎమ్మెల్యేలు స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ, ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Kothapalli

2020-12-21 21:02:31

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు..

రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు శుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం మంత్రి ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి లో వేంచేసి యున్న శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందించని సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్ మాత్రమే అందిస్తున్నారని అన్నారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతోను,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా మహ్మమ్మారి కూడా పూర్తిగా అంతం చేయాలని స్వామిని కోరుకున్నట్టు మంత్రి చెప్పారు. 

ఉప్పలగుప్తం

2020-12-20 18:30:24

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు..

రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు శుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం మంత్రి ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి లో వేంచేసి యున్న శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందించని సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్ మాత్రమే అందిస్తున్నారని అన్నారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతోను,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా మహ్మమ్మారి కూడా పూర్తిగా అంతం చేయాలని స్వామిని కోరుకున్నట్టు మంత్రి చెప్పారు. 

ఉప్పలగుప్తం

2020-12-20 18:30:11

ఆ మేన్ హోల్ కనిపించలేదా సారూ..

అక్కడ ఎలాంటి పైకప్పులేని మేన్ హోల్స్ పాదచారులను, వాహనచోదకులను భయపెడుతున్నాయి...సచివాలయ సిబ్బందికి ఈ విషయం తెలిసినా తమకేంటిలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంతో మంది ఈ మ్యాన్ హోల్స్ భారిన పడి గాయాల పాలవుతున్నారు. విశాఖ జిల్లా, ఎస్.రాయవరం మండలకేంద్రంలోని బజారు సెంటర్ మెయిన్ రోడ్డు నుంచి వెంకన్నపేట గౌరీపరమేశ్వర దేవాలయంకు పోవు రోడ్డులో గురజాడ కాంప్లెక్స్, ఆంజనేయస్వామి గుడికి మధ్య  ఉన్న డ్రైనేజీ పై ఉన్న రెండు మ్యాన్ హోల్స్ పై ఏర్పాటు చేసిన ఇనుప కవర్లు పాడైపోయాయి. ఒకటి తుప్పపట్టి పోయింది. మరొకటి పూర్తిగా లేకుండా పోయింది. దీనితో ఈ ప్రాంతానికి వచ్చినవారు ఒక్కోసారి మ్యాన్ హోల్స్ వద్ద  గాయాల పాలవుతున్నారు. చాలా మందికి ఈ పాడైన మేన్ హోల్స్ వలన గాయాలయ్యాయని మండలానికి చెందిన సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు చెబుతున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మండల కేంద్రానికి మెయిన్ సెంటర్ లో  ఈ ప్రాంతంలో మేన్ హోల్స్ పాడైపోతే వాటిని బాగుచేయించాల్సిన సచివాలయ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పద్దతిగా లేదన్నారు. ముఖ్యంగా తుప్పుపట్టిన మేన్ హోల్ రేకుల కారణంగా ఎంతో మంది రైతులు, మార్కెట్ కి వచ్చేవారు గాయాల పాలవుతున్నారని అన్నారు.  అదే విధంగా ప్రాధమిక పాఠశాల-5 ఎదురుగా ఉన్న రోడ్డును ఆనుకొని ఉన్న డ్రైనేజికి ఉన్న ఇటువంటి సమస్యే ఉందని రాజు చెబుతున్నారు. దీనిపై కూడా పిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత సచివాలయ స్పందించి మేన్ హోల్స్ ను సరిచేసి ప్రజలు గాయాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

s.rayavaram

2020-12-20 16:07:25

ఆ ఆదాయం ప్రభుత్వానికి కట్టాల్సిందే..

విశాఖ జిల్లా, మండల కంద్రమైన ఎస్.రాయవరం గ్రామ పరిధిలోని అనంతసాగరం చెరువుపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వానికి వివిధ శాఖలకు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీచేసింది. అనంతసాగరం చెరుులో సర్ప్లస్ వియర్ ను తమ స్వార్థం కోసం ధ్వంశం చేసారని, నిబంధనలకు విరుద్ధంగా రెవిన్యూ అధికారులు చెరువు గర్భంను పట్టాలు ఇచ్చారని, చెరువులో చేపల పెంపకానికి ఇస్తూ ఆ సొమ్మును గ్రామపంచాయతీకి గాని, నీటిసంఘంకు గాని చెల్లించకుండా స్వాహా చేస్తున్నట్లు సమాచార హక్కు చట్ట కార్యకర్త సోమిరెడ్డి రాజు రాష్ట్ర జస్టిస్ లోకాయుక్త కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు ఈ చెరువుపై  విచారణ చేశారు. దీంతో వాస్తవాలు వెలుగుచూశాయి. అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన  నివేదిక, ఆపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. అధికారులు ఇచ్చిన తీర్మానం ప్రకారం అనంతసాగరం  చెరువును గ్రామ పంచాయతీకి గుత్త హక్కులు ఇస్తూ, చేపల పెంపకంకు మత్యశాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట ద్వారా కేటాయించాలి. అలా కేటాయింపు ద్వారా  వచ్చిన ఆదాయంలో 30 శాతం గ్రామసచివాలయానికి, 50 శాతం నీటిసంఘానికి, 20 శాతం మత్యశాఖకు చెందుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి ఆ చెరువుపై వచ్చిన ఆదాయాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్లు తమ సొంతానికి వాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా చెరువుపై వచ్చిన ఆదాయం నిర్ధేశించిన ప్రభుత్వశాలకు అందించాలి. అలా అందించకుండా స్వార్ధానికి వినియోగిస్తే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ప్రభుత్వం అనంతసారం చెరువుపై ఈ విధమైన ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా గుత్తదారులు, మధ్యవర్తులు ఆదాయాన్ని దోచేయకుండా సమాచారహక్కుచట్టం కార్యకర్త రాజు లోకాయుక్తాకి ఫిర్యాదు చేయడం ద్వారా నియంత్రించగలిగారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇప్పటి వరకూ అప్పనంగా చెరువువై ఆదాయాన్ని తమ సొంత అవసరాలు వినియోగించుకున్న వారి గొంతులో పచ్చి వెలక్కాయ్ పడినట్టు అయ్యింది..

s.rayavaram

2020-12-20 15:59:25

వైఎస్ జగనన్న తోడుకి సహకరించండి..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు పథకం అమలు కు బ్యాంకులు ముందుకు రావాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.  శనివారం తన పర్యటనలో భాగంగా జీయ్యమ్మవలస ఆంధ్రా బ్యాంక్, గ్రామీణ విశాఖ బ్యాంక్ ,  కురుపాం లో గ్రామీణ విశాఖ బ్యాంక్ లను సందర్శించారు. ఈ సంద్భంగా ప్రాజెక్ట్ అధికారి జగన్ తోడు ఋణాల మంజూరుకు సంబంధిత వివరాల పై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ పార్వతీపురం ఐ.టి.డి.ఎ పరిధిలో గల 8 సబ్ ప్లాన్ మండలాల్లోని 4 వేల మంది లబ్ధిదారులకు ఎంపిక చేసి ఋణాలు మంజూరు చేయాలన్నారు, ఆర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి బ్యాంక్ ఋణాలు త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. మంజూరులో ఆలసత్వం  వద్దని సూచించారు. ఈ పర్యటనలో ఎ.పి.డి, ఎ.పి. ఓ, ఎం.పి.డి.ఓ, రెవెన్యూ,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kurupam

2020-12-19 22:00:48

ఈ-సేవలపై తక్షణమే స్పందించాలి..

 సచివాలయాల సిబ్బంది ఈ-సేవలపై దృష్టిపెట్టి తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడాలని సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు  ఆదేశించారు.  శనివారం పూసపాటిరేగ మండలం కొప్పెర్ల,  విజయనగరం మండలం నారాయణపురం గ్రామ సచివాలయాన్ని,  బాబామెట్ట చిక్కాలవీధిలో ఉన్న  వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసారు. రికార్డులన్నింటిని పరిశీలించి పెండింగు వున్నఈ-సేవలపై ఆరా తీసారు.  ప్రభుత్వ పధకాలకు లబ్దిదారుల ఎంపికలో సచివాలయ సిబ్బంది కీలకపాత్ర వహించాలన్నారు. ప్రభుత్వ పధాల వివరాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు సచివాలయానికి దగ్గరలోనే నివాసం వుంటూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో వుండాలన్నారు.  సచివాలయ పరిసరాలను పరిశుభ్రగా వుంచుకోవాలని, ఆవరణలో ఖాళీ స్థలంలో మొక్కులు నాటాలని తెలిపారు.  కోవిడ్  2వ దశ విస్తరించకుండా వుండేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.  మాస్కు తప్పనిసరిగా వాడడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తదితర అంశాలపై అవగాహన కలిగించాలన్నారు. 

Pusapatirega

2020-12-19 21:56:33

మా జీతాలు ఇప్పించండి మహాప్రభో..

తమకు రావాల్సిన 23 నెలల జీతాలు ఇప్పించి తమను ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం మండలం, సైతారుపేట గ్రామ సచివాలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్న చింతాడ పెంటయ్య, చిన్న పెంటయ్యలు అధికారులను వేడుకుంటున్నారు.  శనివారం ఈమేరకు తమకు జరిగిన అన్యాయంపై వారు స్థానిక మీడియాతో మాట్లాడారు. గ్రామసచివాలయ అధికారులు తమకు  రావలసిన జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు. కోవిడ్ కాలంలో కూడా గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యం పణంగా పెట్టి పనిచేసినా జీతాలు సక్రమంగా రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. గత 23 నెలలకు తనకు కేవలం రూ15,000 మాత్రమే ముట్టిందని పెంటయ్య, తనకురూ16,000 ముట్టిందని చిన పెంటయ్య మీడియాకి వివరించారు. రోజుకు ఒక్కొక్కరికి 200 చొప్పున నెలకు 6,000 ఇస్తామని అధికారులు తెలిపారన్నారు. సచివాలయ సెక్రెటరీని ఎప్పుడు అడిగినా నా చేతి సొమ్ము ఇస్తున్నానని, బిల్లులు రాలేదని తెలుపు తున్నారని చెబుతున్నారు. సుమారు రెండేళ్లుగా పనిచేయించుకొని తమకు రావాల్సిన జీతాలు ఇవ్వకపోతే తాము ఎలా బతుకుతామని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై గ్రామ సయవాలయ ప్రత్యేక అధికారి ఎం.పి.డి.ఓ చంద్రశేఖర్ ను అడుగగా పరిశీలించి సమస్యను పరిష్కస్తామని హమీ ఇచ్చారని వారు తెలియజేశారు. 

s.rayavaram

2020-12-19 21:31:08

అరకు ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి..

అరకు పర్యాటక ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడి రహదారులు,స్థానిక అభివృద్ధికే వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, అరకు పార్లమెంట్ డిస్టిక్ ఇన్చార్జి  పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శనివారం ఆమె ఘాట్ రోడ్డులో మీడియాతో మాట్లాడుతూ, అరకు వేలి మండలం సుంకర మెట్టు పంచాయతీ గిరిజన ప్రాంతాల్లోని మన్యం అందాలను  తిలకించడానికి  వచ్చిన పర్యాటకులు చాల ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే  అరచేతిలో ప్రాణం పెట్టుకొని వెళ్లాల్సివస్తోందన్నారు. రోడ్డు మార్గం ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద గోతులుతో, రోడ్డు వెడల్పు సరిగా  లేక పోవడం వల్ల రాకపోకలు నిలిచి ప్రయాణికులకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో  వాహనాలు విపరీతంగా రావడం వల్ల చాలా ట్రాఫిక్ ఏర్పడుతోందన్నారు. ఎక్కువగా యాక్సిడెంట్లు కూడా జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేసారు. నిత్యం అనేకమంది ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ రహదారిపై  ప్రయాణిస్తున్న రహదారి బాగుకోసం  దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు. టురిజం వల్ల వచ్చే కోన్ని వేల కోట్లు  ఆదాయంతో  అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అందరికీ ఉపయోగ పడుతుందన్నారు.  టూరిజం నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఏమిచేస్తోందని ఘాటుగా ప్రశ్నించారు. అరకు మన్యంలోని ఏజెన్సీ గిరిజన 11 మండలాల ప్రాంతం  పల్లె గ్రామాల రోడ్డు మార్గాలు పరిస్థితులు కుడా అద్వాన్నంగా ఉన్నాయని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి  ఏజెన్సీ 11 మండలాల ఆదివాసిలకు,టురిస్టులకు,ప్రయాణికులకు రహదారుల నిర్మాణాలు చేపట్టి  రక్షణ కల్పించాలని శాంతకుమారి డిమాండ్ చేసారు.

Araku Valley

2020-12-19 19:21:44

అర్హులమైనా మాకు కాపు నేస్తం అమలు కాలేదు..

విశాఖపట్నం జిల్లా,  ఎస్.రాయవరం మండలం, సైతారుపేట కు చెందిన మహిళలు కాపు నేస్తం తమకు వర్తింపజేయాలని కోరుతూ ఎంపీడీఓకి స్పందనలో ఫిర్యాదు చేశారు. ఆ పథకానికి  అన్నివిధాలా తాము అర్హులమైనా ఈ పథకం తమకు మంజూరు కాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కాపునేస్తం పథకానికి మోటూరు గోవిందమ్మ, నాగమణి, గొన్నాబత్తుల పద్మ, వరలక్ష్మి, కామేశ్వరి,మంగతల్లి సమ్మంగి పద్మ, రావి నాగమణిలు దరఖాస్తు చేసినా ఆ పథకం తమకు వర్తించేయలేదున్నారు.  గ్రామంలో 7 ఎకరాలు భూమి ఉన్న మహిళకు మంజూరు చేసిన అధికారులు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించారు. 29.07.2020 ఈ విషయం పై ఎం.పి.డి.ఓ కు పిర్యాదు చేసినా ఇప్పటి వరకూ తమకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో అందరికీ పథకం వర్తింపజేశారని తమను మాత్రం వదిలేశారని చెప్పారు. అంతేకాకుండా గ్రామ సచివాలయ కార్యదర్శిని ఎన్నిసార్లు అడిగినా మీకూ పథకం వస్తుందని చెబుతున్నారని కానీ అందరికీ వచ్చిన పథకం తమకు మాత్రం రాలేదని మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు అధికారులు, సచివాలయ సిబ్బంది చేసిన అన్యాయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి అర్హులమైన తమకు కూడా పథకం వర్తింపచేయాలని బాధితులు కోరుతున్నారు. 

s.rayavaram

2020-12-18 21:28:53