నగిరి నియోజకవర్గంలోని ఆటోకార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తనవంతు సహకారం అందిస్తానని ఏపీఐఐసి చైర్ పర్శన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. బుధవారం పుత్తూరు ఆటో కార్మికుల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పుత్తూరు మునిసిపాలిటి పరిధిలో పార్కింగ్ సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ తో చర్చిస్తామని చెప్పారు. ఆటో కార్మికులకు పార్కింగ్ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతీ కార్మికుడికి ప్రభుత్వం అండగా వుంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆటోకార్మికులు ఎమ్మేల్యే రోజాను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్. సి.పి నాయకులు జి.బాబు, మురుగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒక్కొక్కటీ సుమారు రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన గజపతినగరం-1, పురుటిపెంట-2 గ్రామ సచివాలయ భవనాలను ఆయన బుధవారం ప్రారంభించారు. గజపతినగరం-1 సచివాలయ సిబ్బందితో మంత్రి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బీమా సొమ్మును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతీ రైతుకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ మాట్లాడుతూ జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా పథకాల అమలును సమీక్షించారు. చేయూతలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉందని, తోడు, బీమా పథకాల్లో రెండో స్థానంలో ఉందని అన్నారు. ఈ నెల 25 లోగా ఈ రెండింటిలో కూడా ప్రధమ స్థానంలోకి రావాలని కోరారు. దీనికోసం సచివాలయ సిబ్బంది మరింతగా కష్టపడి, శతశాతం లక్ష్యాలను సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్సీ పి.సురేష్బాబు, ఎంఎల్ఏ బొత్స అప్పలనరసయ్య, జెడ్పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, తాశీల్దార్ ఎం.అరుణకుమారి, ఎంపిడిఓ కె.కిశోర్కుమార్, ఎంఇఓ పి.అప్పలనాయుడు, ఇతర అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
విశాఖ మన్యంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో జరుగుతున్న దమనకాండ కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలో ఇద్దరి గిరిజనులను మావోయిస్టులు హతమార్చారు. పెదబయలు మండలం, వనగరాయి వద్ద చిక్కుడు సతీష్ అనే గిరిజనుడిని మావోయిస్టులు కిరాతకంగా నరికి చంపడం ఏజెన్సీ వాసులను భయపెడుతోంది. గుత్తికోయల దళం ఈ గిరిజనుడిని చంపినట్టు తెలుస్తోంది. మావోయిస్టుపార్టీలో ప్రజాకోర్టులో విధించే శిక్షలు ఆ విభాగమే చేపడుతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జిల్లా పోలీసులకు చిక్కి మావోయిస్టులు, వారి సమాచారం సతీష్ ఇచ్చాడనే కారణంతోనే మావోయిస్టులు హతమార్చినట్టుగా మన్యంలో ప్రచారం జరుగుతోంది. అయితే గిరిజనులను పోలీసుల ఇన్ఫార్మర్ నెపంతో హతమారుస్తున్న తీరును పోలీసులు జిల్లా పోలీసులు కూడా సవాల్ గానే తీసుకున్నారు. మ్రుతుడికి సంబంధించిన వివరాలు, మావోయిస్టుల సమాచారంపై పోలీసు బ్రుందాలు కూడా గట్టిగానే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది..
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పర్యటనకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి చెప్పారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులతో కలిసి కలెక్టర్.. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 25వ తేదీన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని భారీ లేఅవుట్ ప్రాంతంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. దీనికోసం ప్రత్యేక పోలీసు బృందాలకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. హెలీప్యాడ్ నుంచి మోడల్ హౌస్, పైలాన్ ప్రాంతం మీదుగా సభావేదిక వద్దకు ముఖ్యమంత్రి చేరే మార్గాన్నిపరిశీలించారు. పారిశుద్ధ్య చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం తదితరాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ట్రెయినీ కలెక్టర్ అపరాజితాసింగ్, జెడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, ఆర్డీవోలు, ప్రాజెక్టు డైరెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం గ్రామ పంచాయతీ శివారు అగ్రహారం గ్రామంలో తాగునీరుకు ఉపయోగించే చేతిబోరు కలుషితం కావడంతో త్రాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బోరు నుంచి వచ్చే నీరు, త్రాగునీటికి పనిచేయడం లేదని గ్రామస్తులు తెలియజేయడంతో ఆ విషయాన్ని సమాచార హక్కు చట్ట కార్యకర్త సోమిరెడ్డి రాజు సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై గ్రామ సచివాలయ కార్యదర్శి ఎ.వి.యస్.యస్.ప్రసాద్ ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో వెళ్లి నీటిని పరిశీలించారు. నీరు కలుషితం అయిన విషయాన్ని గుర్తించారు. ఈ బోరులోని నీటిని పరీక్షలకు పంపింస్తామని ఫిర్యాదు దారుకు తెలియజేశారు. లేబ్ అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా బోరుకు మరమ్మతులు చేయించే ఏర్పాట్లు చేస్తామని సచివాలయ కార్యదర్శి గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ చిన్ని కృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది తక్షణమే త్రాగునీటి సమస్యపై స్పందించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, సాధ్యమైనంత త్వరగా బోరునీరు అందుబాటులోకి తీసుకోవాలని కోరారు.
డుంబ్రిగూడ మండలం కించుమండ వారాంతపు సంతను రెవెన్యూ డివిజనల్ అధికారిణి కె.లక్ష్మీ శివ జ్యోతి బుధవారం సందర్శించారు. రైతు విక్రయాలకు సంబంధించి ప్రభుత్వ మద్ధతు ధరల పట్టిక అక్కడ లేదని ఆమె గమనించి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ,పంచాయతి కార్యదర్శి పై ఆగ్రహించి వెంటనే ధరల పట్టిక బోర్డలను పెట్టంచమని ఆదేశించారు. రైతులు పండించిన పంటలను రైతు భరోసా కేంద్రాల లో అమ్మాలని దళారులవద్ద అమ్మి మోసపోవద్దని ఈవిషయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆమె చెప్పారు. అనంతరం అరకు విలేజి (డుంబ్రిగూడ మండలం) 32 ఇళ్ల స్థలాల లే అవుట్ ను పరిశీలించారు. అనంతరం అరకు గ్రామ సచివాలయం (డుంబ్రిగూడ మండలం) తనిఖీచేసారు.ఈ సందర్భంగా ఆమె పంచాయతీ కార్యదర్శి జీవన్ బాబు కు పనితనాన్ని పెంచుకోవాలని పుస్తక (రిజిస్టర్ల) నిర్వహణ సక్రమంగా చేయాలని పెండింగ్ పనులన్ని త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
విజయనగరం జిల్లాలో ఈనెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు పిలుపు ఇచ్చారు. బుధవారం మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా ఈనెల 30న ముఖ్యమంత్రి గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్లు, ఇళ్లస్థలాలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. గతంలో డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో 24 లక్షల ఇళ్లను ఇందిరమ్మ పథకంలో నిర్మించామని, ఆ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ నేతృత్వంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై పరిశీలన నిమిత్తం మంత్రి బొత్స సత్యనారాయణ రూరల్ మండలం గుంకలాంలో సి.ఎం. కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలసి బుధవారం పర్యటించారు. జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వారికి ముఖ్యమంత్రి పర్యటనకు చేస్తున్న ఏర్పాట్లపై వివరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో 1,07,181 మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి పొసెషన్ పత్రాలు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో 71,237 మందికి కొత్తగా పట్టాలు ఇస్తున్నామని, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న 24,237 మందికి పొసెషన్ సర్టిఫికెట్లు అందించనున్నామని, టిడ్కో ఇళ్లను కూడా అందజేయనున్నట్టు తెలిపారు. ఒక్క గుంకలాంలోనే 10 వేల మందికి ఇళ్లపట్టాలు మంజూరు చేస్తూ కొత్తగా అక్కడ ఒక టౌన్ షిప్నే నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా దాదాపు 1830 ఎకరాల్లో రూపొందించిన 1164 లే అవుట్లలో 71,237 మందికి పట్టాలు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. 1140 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు వ్యక్తుల నుండి సేకరించిన 690.82 ఎకరాలను కలుపుకొని లే అవుట్లు రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రయివేటు భూముల కొనుగోలు కోసం రూ.228 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిసెంబరు 25న మధ్యాహ్నం 2-00 గంటల తర్వాత ఇళ్లపట్టాల పంపిణీని చేపట్టాలని, 30న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మధ్యాహ్నం తర్వాత మాత్రమే పంపిణీ చేపట్టాలన్నారు. వచ్చే జనవరి 7వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలికాప్టర్లో చేరుకోనున్నారని, దాదాపు రెండు గంటల పాటు ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే లబ్దిదారులకు గాని, పార్టీ కార్యకర్తలకు గానీ ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత అధికారులపై వుందన్నారు. ముఖ్యంగా పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. జాతీయ రహదారి నుండి సభాస్థలికి చేరుకొనేందుకు వుండే అన్ని మార్గాలను వాహనాల రాకపోకలకు వీలుగా మరమ్మత్తులు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ను మంత్రి ఆదేశించారు. పట్టణంలోని ఇళ్లస్థలాల లబ్దిదారులు సభాస్థలికి చేరుకొనేందుకు వీలుగా అవసరమైన బస్సులను ఆర్టీసీ నుండి సమకూర్చాలని ప్రాంతీయ మేనేజర్ను మంత్రి ఆదేశించారు. తాను ఈనెల 30వ తేదీ వరకు జిల్లాలో అందుబాటులో వుంటానని ఏర్పాట్ల విషయంలో ఏమైనా సందేహాలుంటే తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పర్యటన ఏర్పాట్లపై వివరిస్తూ గుంకలాంలో 12,301 మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. విజయనగరం పట్టణ పరిధిలోని ఇళ్లులేని నిరుపేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 75 వేల మందికి ఇళ్లస్థలాలు, 8 వేల మందికి టిడ్కో ఇళ్లను పంపిణీ చేయనున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం కోసం సభా ప్రాంగణంలో మూడు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రముఖుల వాహనాలకోసం, ఇళ్లస్థలాల లబ్దిదారులను తీసుకువచ్చే వాహనాలకోసం వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. లబ్దిదారులు వాహనం దిగిన తర్వాత ఎక్కువ దూరం నడవకుండా సభా ప్రాంగణానికి సమీపం వరకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ సి.ఎం. కార్యక్రమం ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయనున్నారని, పైలాన్, మోడల్ ఇళ్ల నిర్మాణం బాధ్యతలను జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్. మహేష్ కుమార్ పర్యవేక్షిస్తారని, సభాస్థలి వద్ద ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు పర్యవేక్షిస్తారని తెలిపారు. వేదిక ఏర్పాట్లను డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కె.సుబ్బారావు, సభకు హాజరైన వారికి సంబంధించిన ఏర్పాట్లను సాంఘిక సంక్షేమశాఖ డి.డి. సునీల్ రాజ్కుమార్ పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎం.ఎల్.సి. పెనుమత్స సురేష్బాబు, శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య, వైఎస్ఆర్సిపి జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్కుమార్, జె.వెంకటరావు, సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, డి.ఆర్.ఓ. ఎం.గణపతిరావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, ఏ.ఎస్.పి. శ్రీదేవి రావు, డి.ఎస్.పి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు గుంకలాం సభాస్థలి వద్ద ఏర్పాట్లను మంత్రి బొత్స సత్యనారాయణ, సి.ఎం. కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు అధికారులతో కలసి పరిశీలించారు. హెలిపాడ్, పైలాన్, మోడల్ హౌస్ నిర్మాణాలు జరిగే ప్రాంతం, సభావేదిక తదితర మూడు చోట్ల సి.ఎం. కార్యక్రమాలు వుంటాయని కలెక్టర్ వివరించారు. పైలాన్ నిర్మాణాన్ని మంత్రి బొత్స తదితరులు పరిశీలించారు. సభావేదిక నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో హెలిపాడ్ వుంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వైయస్ఆర్-జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పధకంతో భూమి యజమానులకు సమగ్ర రీ సర్వే ద్వారా శాశ్వత భూ హక్క కల్పించడమే కాకుండా దానిని సంరక్షేంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని జిల్లా ఇన్ చార్జి మంత్రి మరియు రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామంలో బాదం వారి సత్రానికి సంబంధించిన భూమి సర్వే నెంబరు 46లో సరిహద్దు రాయిని నాటి సమగ్ర రీ సర్వే ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వచ్చిన వినతుల్లో 60 శాతం పైగా భూ వివాదాల పైనే రావడంతో ఆనాడే ముఖ్యమంత్రి సమగ్ర రీసర్వేకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సమగ్ర రీ సర్వేను సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో
ఎంతో పటిష్టంగా నిర్వహిస్తోందని మంత్రి చెబుతూ భూ యజమానులు రైతులు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని మంత్రి సూచించారు. ఈ సమగ్ర రీ సర్వే మరియు 25వ తేదీన జరిగే భూ పట్టాల పంపిణీ కార్యక్రమం రెండూ కూడా చారిత్రాత్మక ఖట్టాలని మంత్రి అభివర్ణిస్తూ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వెయ్యి కోట్ల రూపాయలతో ఈ సమగ్ర రీసర్వే కార్యక్రామాన్ని చేపట్టారని మంత్రి తెలిపారు . ఈ రీ సర్వేలో పొరపాట్లకు తావేలేదని, శాటిలైట్ ద్వారా వచ్చిన మేప్ ల ప్రకారం సర్వే బృందాలు హద్దు లు వేయడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. తండ్రి ఆశయాన్ని నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో 3648 కి.మీ. పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సమర్ధవంతమైన , పారదర్శకమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారని మంత్రి తెలియజేశారు. ఒక్కరూపాయి అవినీతికి కూడా తావులేకుండా నాలుగు లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం ఇచ్చిందని, మంత్రులకు పూర్తి శ్వేఛ్ఛనిచ్చి సమర్ధవంతమైన పాలనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ముఖ్యమంత్రి కల్పించారని మంత్రి తెలియజేశారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలలో నూతన పోకడలను తీసుకురావడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను వరదలై పారిస్తున్నారని మంత్రి తెలియజేశారు.
కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలకు 30 లక్షలు నివాసయోగ్యమైన ఇళ్ళ పట్టాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటి అపురూపమైన ఘట్టమని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల పట్టాలైతే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 3 లక్షల 80 వేల పట్టాలు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని , ఈ విషయంలో కష్టించి పని చేసిన రెవెన్యూ అధికారులకు ఎంపి అభినందించారు.
జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ భూ యజమానులకు రీ సర్వే ద్వారా హక్కు కల్పించడం ఒక ఎత్తైతే, దానిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం రైతులకు సంతోషదాయకమైన విషయమన్నారు. రాబోయే రోజుల్లో సచివాలయాల వద్దనే రిజిస్ట్రేషన్లు జరిపి, రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రభుత్వం సరళతరం చేయనున్నదని కలక్టర్ తెలియజేశారు. వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అర్హుల మందుకు తీసుకువెళ్ళడం ద్వారా లబ్దిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను ప్రభుత్వం తొలగించిందని కలక్టర్ తెలియజేశారు.
పిఠాపురం శాసన సభ్యులు పెండెం దొరబాబు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలను నిరుపేదలకు నిరంతరం అమలు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి రైతులకు, భూ యజమానులకు విస్తృత ప్రయోజనం చేకూరే విధంగా సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, గ్రామాల్లో రైతులు, భూ యజమానులు సర్వే బృందాలకు సహకరించాలని సూచించారు. గ్రామాలలో రోడ్ల పైనే ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నారని, దీని వలన రోడ్ల పై ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందని, దీని పై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్ కు , జాయింట్ కలక్టర్ కు శాసన సభ్యులు విజ్ఞప్తి చేశారు.
జిల్లా జాయింట్ కలక్టర్ జి.లక్ష్మి శ మాట్లాడుతూ సమగ్ర రీసర్వే అనంతరం ప్రతి భూ యజమానికి శాశ్వత హక్కు పత్రాన్ని ప్రభుత్వం ఇస్తుందని , దళారీ వ్యవస్ధను నిర్మూలించి, అవినీతిని రూపమాపడానికి ప్రభుత్వం ఈ సమగ్ర రీసర్వేను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ రీ సర్వేలో భూ యజమానులు, రైతులు వారి సరిహద్దులను సర్వే బృందాలకు చూపిస్తే సరిపోతుందని జేసి అన్నారు. సర్వే లో వచ్చిన భూ వివాదాలను మొబైల్ కోర్టు ద్వారా పరిష్కరించడం జరుగుతుందని, ఇందు కోసం ప్రతి మండలంలోను మోబైల్ కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జాయింట్ కలక్టర్ తెలియజేసారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన కాకినాడ ఆర్.డి.ఓ. చిన్ని కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో మొదటిగా సమగ్ర రీసర్వే చేపట్టిన నవఖండ్రవాడ గ్రామంలో 306 ఎకరాల ఒక సెంటు విస్తీర్ణం ఉందని, మొత్తం సర్వే నెంబర్లు 103 కాగా, రైతులు 244 మంది ఉన్నారని తెలియజేశారు. ముందుగా ఇన్ చార్జి మంత్రి సమగ్ర రీసర్వేలో వినియోగించే సాప్రదాయ రీసర్వే పరికరాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి ఎవిఆర్ఎస్ఎస్వి గొపాలకృష్ణ, ఫారెస్ట్ సెటిల్ మెంట్ ఆఫీసర్ శ్రీరామచంద్రమూర్తి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, సచివాలయంలో ప్రతి ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సింగనమల గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం చుట్టుపక్కల పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. సచివాలయంకు వచ్చే సర్వీసులకు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలన్నారు. సచివాలయం కు సంబంధించి ప్రహరిగోడ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు. సచివాలయం పనితీరుపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగనమల తహశీల్దార్ విశ్వనాథ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆ పీఓ బాబు వలనే ఈరోజు కాస్త మంచినీరు తాగుతున్నాం..ఆ పీఓ బాబు వలనే మా పిల్లలకు చదువుకోవడానికి బడి వస్తుంది...ఆయన వలనే మా గిరిజన గూడేలా దీర్ఘకాలిక సమస్యలు తీరుతున్నాయి.. రోడ్లు, వైద్యం, ఆరోగ్యం అన్నీ ఆ పీఓబాబు వలనే ఆ బాబు మా ఊరు వస్తే ఏదోఒకటి మంజూరు చేస్తారు..ఈ మాటలన్నీ అంటున్నది ఎవరికోసమో కాదు పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల కోసమే.. అవునండీ మీరు చదువుతున్నది నిజమే. గిరిజనుల సమస్యలు ఒక్కొక్కటిగా తీరుతుండటంతో ఇక్కడి పీఓని గిరిజనులంతా దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన తమ గిరిజన తండాలకు వస్తే దండలు వేసి హారతులు పడుతున్నారు.. ఇవన్నీ మంగళవారం పాడేరు మండలంలోని డొంకిన వలస గిరిజన తండాలో మీడియాకి ఎదురైన మంచి అనుభవాలు.. అవన్నీ ఈ వార్త రూపంలో మీకోసం..! ఆంధ్రప్రదేశ్ లోని విశాఖజిల్లా, పాడేరు ఐటిడిఏ అంటే ఒక మంచి పేరు..ఇక్కడ పనిచేసే అధికారులకు మరింత పేరు హోదా..కాని ఇక్కడ పనిచేసిన అతి కొద్ది మంది ఐఏఎస్ అధికారులు మాత్రమే గిరిజనుల మనసుల్లో నిలిపోతారు..అలాంటి అధికారుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న ప్రాజెక్టు అధికారి మాత్రం డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల అని చెప్పక తప్పదు... మీరు ఈ వార్తలో విషయాలు తెలుసుకుంటున్నది నిజమే. గిరిజనుల అభివ్రుద్ధే ద్యేయంగా పనిచేయడంలో ఈయనకు ఈయనే సరిసాటి. ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజనులకు ఐటిడిఏ ద్వారా ఎంత వరకూ అభివ్రుద్ధికి అవకాశం వుందో అంతా చేయడంలో ఈయన వ్యవహారిక విధానమే చాలా స్పష్టంగా వుంటుంది. దీనితో విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లోని గిరిజనుల మనసుల్లో నిలిచిపోయారు ఈ ఐఏఎస్ అధికారి. ఏ గ్రామానికి వెళ్లినా నిండైన ప్రేమ, అభిమానంతో గిరిజనులకు ఈ అధికారికి స్వాగతం పలుకుతారు. నేరుగా గిరిజనులతో మాట్లాడి వారి కష్టాలను తీర్చడంలో చాలా వేగంగా పనిచేసేయడంతో గిరిజనులకు ఈ ప్రాజెక్టు అధికారిని దేవుడిలా కొలుస్తున్నారు. అదే సమయంలో గిరిజను విషయంలోనూ,విధి నిర్వహణ లో అలసత్వం వహించి అధికారుల విషయంలోనూ అదే స్థాయిలో చర్యలు తీసుకోవడంలోనూ ఈ ఐఏఎస్ అధికారి చాలా ఘాటుగా వ్యవహరించడం కూడా చర్చనీయాంశం అవుతుంది. గిరిజనుల అభివ్రుద్ధి కోసమే ఏర్పడిన ఐటిడిఏలో వారికోసం పనిచేయకపోతే ప్రాజెక్టు అధికారి అనే మాటకు అర్ధంలేదు...ఈ ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ...జీతాలు తీసుకుంటూ అలసత్వం వహిస్తే అంతకంటే దారుణం మరొకటి ఉండదు అంటూ తడుముకోకుండా చెబుతారాయన. తానుు పనిచేస్తున్నట్టుగానే...మిగిలిన అధికారులను, సిబ్బందిని కూడా పనిచేయించేలా చేయడంలోనూ ఈయన తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీనితో ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు..మంత్రులు, ఎంపీలు గిరిజనుల కోసం ఏ పనిచేసినా ఈ ప్రాజెక్టు అధికారితో కలిసే పనిచేయడం, సహాయం తీసుకోవడం కూడా శుభపరిణామంగా చెబుతున్నారు. చాలా సంవత్సరాల తరువాత అంటే గతంలో ఐటిడిఏలో పనిచేసిన పీఓలు వినయ్ చంద్, డికెబాలజీ లాంటి ఉన్నత స్వభావం కలిగిన అధికారులను చూసిన ఆయన వారి స్పూర్తితో మరింతగా గిరిజనులకు సేవలందిస్తున్నారు. ఐఏఎస్ లు అంతా ఈ విధమైన సేవలు చేయగలిగితే రాష్ట్రాభివ్రుద్ధి దేశంలో ఆంధ్రప్రదేశ్ ని ఒకటవ స్థానంలో నిలబెడుతుంది అని విశ్లేషకులు భావించేలా ఈయన సేలు గిరిజనుల విషయంలో ఉంటున్నాయంటే ఇంకో మాట చెప్పే పనికూడా లేదని సమాధానం వస్తుంది...ఏదైనా ఒక ఉన్నతాధికారి పనిచేసిన తీరే ఆయన అంటే గౌరవాన్ని ఏర్పడేలా చేస్తుందనడానికి పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల ఒక నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తున్నారు..!
పాడేరు మండలంలోని గన్నేరుపుట్టు పంచాయతీ మారుమూల గిరిజన గ్రామం డొంకినవలస గ్రామంలో ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల మంగళవారం పర్యటించారు. ఐటిడిఏ వెలుగు టిపి ఎం యు ఆధ్వర్యంలో రూ.3.5లక్షల వ్యయంతో నిర్మించిన గ్రావిటీ పధకాన్ని పరిశీలించారు. నాలుగు నెలల క్రితం సుడిపల్లి వెంకటరావు డయేరియాతో మృతి చెందారని తెలుసుకుని గ్రామానికి తాగునీటి పధకాన్ని మంజూరు చేసారు. కొండపై నిర్మించిన గ్రావిటీ పధకాన్ని కాలినడకన వెళ్లి నీటి నాణ్యతలను,ట్యాంకులను పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును పరిశీలించి మంచినీటిని తాగి సంతృప్తి వ్యక్తం చేసారు. గ్రామంలో 10 కుళాయిలు ఏర్పాటు చేసామని నిర్వహకులు వివరించారు. నాలుగున్నర కిలోమీటర్ల దూరం నుంచి పైపులైన్లు వేసి డొంకినవలసకు గ్రావిటీ పధకం నిర్మించామన్నారు. గ్రామస్తులు పూలదండలు వేసి , బియ్యపుబొట్టులు పెట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన తాగునీటి పధకాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలని సూచించారు. చిన్న చిన్న మరమ్మతులు వస్తే పరిష్కరించుకోవాలని పెద్ద సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామన్నారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవన నిర్మాణం మధ్యలో నిలిచిపోయిందని పూర్తి చేయించాలని గ్రామస్తులు కోరగా పి ఓ సానుకూలంగా స్పందించారు. గ్రావిటీకి సమీపంలో ఉన్న మచ్చల మామిడి, చట్టూరు గ్రామాలకు గ్రావిటీ పధకం మంజూరు చేయాలని డొంకిన వలస గ్రామస్తులు కోరగా ప్రాజెక్టు అధికారి సానుకూలంగా స్పందించి అంచనాలు రూపొందించాలని వెలుగు అధికారులను ఆదేశించారు. రాగులు, ధాన్యం ఓల్డా రైతు భరోసా కేంద్రానికి తీసుకుని వెళ్లి విక్రయించాలని రైతులకు సూచించారు. రాగులు, రాజ్మాకు ప్రభుత్వం అత్యధిక ధర చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బంది, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు నగర పాలక పరిధిలోని "అందరికీ ఇళ్ల పథకం" కింద ఈ నెల 25న అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ డికెబాలజీ అన్నారు. మంగళవారం కర్నూలు మండలం రుద్రవరం గ్రామ శివారులో ఇప్పటికే గుర్తించిన లేఅవుట్ స్థలాలను ఆయన అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, ఆ సంస్ధ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర టౌన్ షిప్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కొర్పొరేషన్(ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం సేల్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుందన్నారు. లబ్ధిదారులకు మంజూరుకు చేయడానికి నగర పాలక పరిధిలోని మూడు నియోజకవర్గాల వారీగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు చేసే రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానం, యూనిట్ల మంజూరుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు గృహ సముదాయాల వద్ద పండగ వాతావరణంలో జరిగే ఇళ్ల మంజూరు కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ బాలాజీ ఆదేశించారు. మూడు కేటగిరీల వారీగా లబ్ధిదారులకు జి+3 నమూనాలో నిర్మించిన ఈ గృహాల్లో ఇప్పటికే మునిసిపల్ కార్మికులు శుభ్రత చర్యలు చేపడుతున్నారు. టిడ్కో డిఈ రవిగుప్త, సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పెంచలయ్య, ఎం.ఐ.ఎస్ స్పెషలిస్ట్ మధు, శివశంకర్, ఎస్.పి.సి.ఎల్...ఏజీఎం రవిచంద్ర తదితరులు ఉన్నారు.
మహిళా, శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండలంలోని అమ్మవారిపేట గ్రామంలో మంగళవారం ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ శిశువులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సూచించారు..ఆర్డిటి సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ భవనాన్ని నిర్మించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం గర్భవతులకు శ్రీమంతం నిర్వహించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, ఆర్డిటి సంస్థ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఆర్డిటి రిసోర్స్ పర్సన్ సాగర్ మూర్తి, రీజనల్ డైరెక్టర్ నారాయణరెడ్డి, తహశీల్దార్ మహబూబ్ భాషా, ఎంపీడీవో తేజోష్ణ, డిసిపిఓ సుబ్రహ్మణ్యం, సిడిపిఓ ఉమా శంకరమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే మూమెంట్ రిజిస్టర్లో తప్పకుండా తమ పేర్లను నమోదు చేయాలని, మూమెంట్ రిజిస్టర్లో పేర్లు నమోదు చేయకపోతే అలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరించారు. మంగళవారం నార్పల మండలంలోని నాయనపల్లి గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో రిజిస్టర్ లను తప్పనిసరిగా నిర్వహించాలని, ఉద్యోగుల వివరాలను తూచా తప్పకుండా ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు తమ విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను, పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.
ఈ సందర్భంగా మూమెంట్ రిజిస్టర్లో పేర్లు నమోదు చేయకుండా బయటికి వెళ్ళిన సచివాలయ ఉద్యోగులకు మెమో జారీ చేయాలని పంచాయతీ సెక్రటరీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మరోసారి ఉద్యోగులు పేరు నమోదు చేయకుండా ఎవరు బయటికి వెళ్లకుండా చూడాలని, ఎవరైనా పేరు నమోదు చేయకుండా బయటకు వెళితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయంలో రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సుబ్బరాయుడు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 25వ తేదీన చేపట్టిన "ఇంటి పట్టాల పంపిణీ" కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు నగర పాలక పరిధిలోని ప్రజలకు కర్నూలు మండల పరిధిలోని రుద్రవరం గ్రామ శివారులో ఇస్తున్న 21,488 మందికి ఇంటి స్థలాల కోసం ఇస్తున్న పట్టాల లేఅవుట్ ను పరిశీలించారు. ముఖ్యంగా సర్వేయర్లు త్వరత్వరగా గతంలో బ్లాక్ల వారిగా విభజించిన లేఅవుట్ స్థలాలకు సరిహద్దు గీతలకు సున్నం వేయించి, సరిహద్దు రాళ్ళు పాతించాలి అలాగే వాటికి పెయింటింగ్ వేయించాలని సూచించారు. అలాగే రేపటి నుంచి విధులకు వచ్చే వార్డు ప్లానింగ్ కార్యదర్శుల సేవలు కూడా వినియోగించుకోవాలని ఎంఈ రమణమూర్తి గారికి తెలిపారు. నిర్ధేశించిన కొలతల వారీగా వారి చేత పాతిన సరిహద్దు రాళ్లపై సర్వే నంబరింగ్ ను మార్కింగ్ వేయించాలన్నారు. అనంతరం స్థలాల చదును ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పారు