1 ENS Live Breaking News

వరాహానది గట్లు పటిష్టానికి శాశ్వత పరిస్కారం..

విశాఖజిల్లాలో కోతకు గురవుతున్న వరాహానది గట్లు పటిష్టానికి శాశ్వత  చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ తెలియజేసారు.   జిల్లాలో  గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎస్.రాయవరం మండలం సోముదేవుపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తో కలిసి  పర్యటించారు.  కోతకు గురైన వరహనది గట్లను,రోడ్లను  పరిశీలించారు.  వరహానది మ్యాప్ ను పరిశీలించిన అనంతరం ఈ గట్లు కోతకు గురవడానికి గల కారణాలను  అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రోయిన్ నిర్మాణం జరిగిన చోట ఈ సమస్య తలెత్తడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వరహానది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ గట్లు పటిష్ఠ పరిచేందుకు తీసుకున్న చర్యలు గూర్చి ఇరిగేషన్ డి.ఇ సుజాత ను అడిగి తెలుసుకున్నారు. .ఈ సమస్య పరిస్కారం కు ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేశామని డి.ఇ చెప్పడంతో త్వరితగతిన పనులు జరిగేలా చూడాలన్నారు. అనంతరం పాయకరావుపేట అతిథి గృహం వద్ద నియోజకవర్గ పరిధి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తుపాను కారణంగా నష్టపోయిన వరద బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు.  అలాగే పంట నష్టం అంచనా వేసి పూర్తి సమాచారం తో ,నష్టపోయిన రైతుల వివరాల తో కూడిన నివేదికను జిల్లా కార్యాలయంకు పంపించాలని ఆదేశించారు. ఈ వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఎటువంటి వరద వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలాగా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు గట్లు డిజైన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.  అలాగే ఈ విషయం పై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ తో పాటు జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో గ్రోయిన్ డిజైన్ లో మార్పు కారణంగా గట్లు కోతకు గురయ్యాయని స్థానికులు తెలియజేసారని,  దీనిపై పూర్తి సమాచారం కొరకు  ఎస్.ఈ నుంచి నివేదిక కోరానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం సుమారు ఆరు వేల హెక్టార్లలో రూ.70 కోట్లుగా  ప్రాథమిక అంచనా వేస్తున్నా మని కలెక్టర్  తెలిపారు. పూర్తి స్థాయి సమాచారంతో  సోమవారం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, యితర అధికారులు పాల్గొన్నారు.  

s.rayavaram

2020-10-17 18:40:14

2 రోజుల్లో రొయ్యల చెరువు సమస్య పరిష్కరిస్తా..

రేవుపోలవరంలో రొయ్యల చెరువుల ద్వారా వచ్చే ఇబ్బందులపై త్వరలోనే చర్యలు తీసుకొని సమస్య పరిష్కరిస్తామని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు రేపుపోలవరం, బంగారమ్మపాలెం, చిన ఉప్పలం గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఈ గ్రామాల్లో వరదల తాకిడికి నష్టపోయిన ప్రాంతాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేద్రుష్టికి తెచ్చారు స్థానికులు. ఈ ప్రాంతంలో పంట నష్టాలను రెండు రోజుల్లో తయారు చేసి సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొబ్బతోటలు, ప్రత్తిచేలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులను జరిగిన నష్టం ఎక్కడా ఎలాంటి తేడాలు లేకుండా జరపాలని అధికారులను ఆదేశించారు. వరదనీరు గ్రామాల్లోకి వెళ్లకుండా కాలువల ద్వారా మళ్లించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నీరు చేరిన చోట వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చల్లించాలని సచివాలయ అధికారులను రంగంలోకి దించాలని అధికారులకు సూచించారు.

Bangarammapalem

2020-10-16 15:13:13

నష్టపోయిర ప్రతీరైతును ఆదుకుంటాం..

విశాఖజిల్లాలో వరదలతో నష్టపోయిర రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అన్నారు. శుక్రవారం ఎస్.రాయవరం మండలంలోని రేవు పోలవరం, కొత్త రేవుపోలవరం గ్రామాలను నీటమునిగిన పంటపొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ప్రకృతి వైపరీత్యం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నారు.  పంట నష్టపోయిన రైతాంగానికి సకాలంలో నష్టపరిహారం అందేలా అధికార యంత్రాంగం చురుకుగా పని చేస్తుందని తెలిపారు. వరద ముంపునకు గురైన గ్రామాలలో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిన ఎమ్మెల్యే.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో పాటు, అధికార పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట వైస్సార్సీపీ నాయకులు చేకూరి శ్రీ రామచంద్ర రాజు,  పోలిశెట్టి పెద్ద ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Revupolavaram

2020-10-16 14:37:02

2020-10-16 13:11:46

2020-10-16 13:11:09

వరదనీటికి కొట్టుకుపోయిన కాజ్ వే

చోడవరం మండలం గవరవరం గ్రామం వద్ద శారదా నదిపై తాత్కాలికంగా నిర్మించిన కాజువే గురువారం కొట్టుకుపోవడంతో చుట్టు ప్రక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు శారదా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కాజువే కొట్టుకుపోయింది. ఇక్కడ శారదా నదిపై వంతెన నిర్మాణం కోసం తాత్కాలికంగా కాజువేను నిర్మించారు. వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో పలు గ్రామాల ప్రజలు కాజువేపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇపుడు దానిపై నుంచి వరద నీరు ఉద్రుతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల పై వరదనీరు పారుతున్నది. అధికారులు ఇక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ కు నివేదించారు. వర్షాలు తగ్గితే తప్పా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదు.

Chodavaram

2020-10-15 12:20:04

వరదలతో పెద్దేరు ఉగ్రరూపం..

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు  చోడవరం మండలంలోని పెద్దేరు, బొడ్డేరు నదులు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి.  ప్రవాహం  అతి తీవ్రంగా ఉండడంతో జన్నవరం వద్ద వంతెనను ఆనుకుని వరదనీరు పారుతున్నది. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మండలంలోని పి ఎస్ పేట వద్ద బలిరెడ్డి సత్యారావు కళ్లాల వద్ద నదికి గండి పడింది. దీంతో వందలాది ఎకరాల వరి, చెరకు తోటలను వరద నీరు ముంచెత్తింది. వరదనీటి తీవ్రతకు పిఎస్ పేట వద్ద వేసిన బొప్పాయి తోటలు పూర్తిగా కొట్టుకుపోయాయి. పెద్దేరు ఉత్పత్తికి మండలంలోని కన్నంపాలెం, చాకిపల్లి, రామజోగిపాలెం, జన్నవరం, బెన్నవోలు గ్రామాలకు చెందిన వందలాది ఎకరాలు చెరుకు తోటలు, వరి పొలాలు ఇంకా నీటి ముంపులోనే ఉండి పోయాయి. ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల పై వరదనీరు పారుతున్నది. కొన్ని చోట్ల వరద ఉద్రుతి తగ్గినా చాలోచోట్ల రోడ్డుప్రక్కన ఉన్న కాలువలు సైతం పొంంగి ప్రవహిస్తున్నాయి...

పెద్దేరు రిజర్వాయర్

2020-10-15 11:02:26

గిరిజనుల సమస్యలు ప్రభుత్వం ద్రుష్టికి..

గిరిజన సమస్యలను ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ పేర్కొన్నారు. ఆయన ఏజెన్సీ పర్యటన లో భాగంగా బుధవారం చింతపల్లి మండలం లంబసింగి గ్రామ సచివాలయంలో కాఫీ రైతులు, గ్రామస్థులు తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు సాగుచేస్తున్న పంటలు మార్కెట్ సదుపాయాలు ఆడిగితెలుసుకున్నారు. కాఫీకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. పర్యాటకుల వలన ఎదురౌవుతున్న సమస్యలు గ్రామస్థులు వివరించారు. లంబసింగి గ్రామం నుంచి చేరువులవేనం గ్రామానికి రోడ్ నిర్మించాలని గ్రామస్తులు చైర్మన్ దృష్టి కి తేగా వెంటనే ఐటీడీఏ పి.ఓ గారితో ఫోన్ లో మాట్లాడి రోడ్ నిర్మించాలని కోరగా పిఓ సానుకూలంగా స్పందించారు. దుస్టుబిన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. పర్యాటక రంగంలో గిరిజన యువతకు శిక్షణ ఇప్పించాలని స్వయం ఉపాధి కల్పించాలని గిరిజన యువకులు కోరారు. సి ఎం దృష్టి కి తీసుకుని వెళతాను అన్నారు. గిరిజన యువత జర్నలిజం రంగంలోకి రావాలని చైర్మన్ పిలుపునిచ్చారు. దానికి అవసరమైన ఏర్పాట్లు, ఫీజుల అకాడమీ చెల్లిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో వెలుగు ఎపిడి ఎం.నాగేశ్వరరావు ,తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపిడివో ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు

చింతపల్లి

2020-10-14 20:27:06

150 ఎకరాల్లో వరిపంట నీట మునక..

తూర్పుగోదావరి జిల్లా, శంఖవరం మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 150 ఎకరాల్లో వరి పంట నీట మునగిపోయిందని వ్యవసాయాధికారి చంద్రశేఖర్ తెలియజేశారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాలను ప్రాధమికంగా అంచనా వేసినట్టు చెప్పారు. ఇందులో 90 ఎకరాల్లో వరి నేలకొరిగిందన్నారు. అదే విధంగా 110 ఎకరాల్లో పత్తి నీటమునిగందని వివరించారు. వర్షాలకు నీట మునిగిన పంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై నేరుగా పంటపొలాల వద్దే రైతులకు వివరిస్తున్నట్టు చెప్పారు. వరి, పత్తి పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సేకరించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే నివేదించామన్నారు. అనంతరం వరదలు తగ్గిన తరువాత పంట పరిస్థితిని నేరుగా పరిశీలించనున్నట్టు వ్యవసాయాధికారి మీడియా వివరించారు.

Sankhavaram

2020-10-14 15:43:38

పారదర్శకంగా నరేగా పనులు..

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉండాలని రాష్ట్ర నరేగా డైరెక్టర్ చినతాతయ్య అన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రాయలసీమ జిల్లాలతోపాటు  నెల్లూరు జిల్లాల విజిలెన్స్ అధికారులతో , హెచ్ ఆర్ లతో డైరెక్టర్, నరేగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ విశ్వనాథ్  కలిసి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నరేగా డైరెక్టర్ చినతాతయ్య  వివరిస్తూ  శాఖ సంబంధించి సిబ్బంది విషయంలో కొరత లేదని, నరేగా నిధులు ప్రక్క దారి పట్టకుండా అధికారులు దృష్టి పెట్టాలని అందులో పేదలకు కల్పించే పని దినాలు, రైతుల కోసం నిర్వహించే ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలని అన్నారు. జాబ్ కార్డుల మంజూరు, తరచూ అధికారుల సమావేశాలు, పనులు కల్పన, హాజరు పట్టికలకు సంబంధించిన వాటిలో ఖచ్చితత్వం, పారదర్శకత  ఉండాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా నరేగా నిధుల నిర్వహణ  చేయడానికి ప్రగతి నివేదికలను రూపొందించి అధికారులకు అందుబాటులోకి తీసుకొని రావాలని ప్రధాన కార్యాలయ విజిలెన్స్ అధికారి మల్లిఖార్జున కు సూచించారు. శాఖలలో పనిచేసి సిబ్బంది తమ వంతు భాద్యతగా తమ పనిని చేయగలగాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో నిర్వహించే సోషల్ ఆడిట్ విధానంలో మార్పు రావాలని, రైతు నీళ్ళు లేకనో,  ఇతర పంటల కోసమో ఎండిపోయి ,   కోల్పోయిన ఉద్యాన  పంటలుపై  పాడైన  3 సంవత్సరాల తరువాత సోషల్ ఆడిట్ చేసి  రైతు నుండి రికవరీ మంచిది కాదని సూచించారు.  మనం వారికి మూడు సంవత్సరాల కాలం ఉద్యాన పామతల మొక్కల  కాపాడటానికి మాత్రమే  ఖర్చులు  ఇస్తున్నామని, ఆతరువాత వర్షాభావ పరిస్థితులు, ఇతర కారాణాలు వల్ల ఎండిపోతే  మనం  వారిని   ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు.  ఆలోచన చేసి సకాలంలో సోషల్ ఆడిట్ నిర్వహించ గలిగితే వాస్తవాలు ప్రజలకు/ రైతులకు/ అధికారులకు తెలుస్తాయని అన్నారు. నరేగాలో వేతన జీవుల సంక్షేమం ప్రధానం కావాలని అన్నారు. శాఖలోని ప్రతి అధికారికి జాబ్ చార్టు ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమీక్షకు ముందు విజిలెన్స్ కమీషనర్ మల్లి ఖార్జున జిల్లా విజిలెన్స్ అధికారుల పనితీరును పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.  పెండింగ్ రికవరీలు, పెండింగ్ కేసులు పరిష్కారంపై దృష్టి  పెట్టాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు.  ఈ సమీక్షలో పిడి డ్వామా చంద్రశేఖర్ , జిల్లా విజిలెన్స్ అధికారులు కడప  రమణారెడ్డి, చిత్తూరు శివయ్య, నెల్లూరు వేంకటేశ్వరరావు, కర్నూలు అన్వర్ బేగం , హెచ్ ఆర్ లు పుష్ప, రవి కుమార్, ఆనంద కుమార్, విజయ కుమార్, శోబా రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

తిరుపతి

2020-10-14 15:31:32

గిరిపుత్రుల అభివ్రుద్ధి సీఎం వైఎస్ జగన్ లక్ష్యం..

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత గిరిజనులకు  సాగు హక్కు కల్పించిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని డిసిసిబి చైర్మన్ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మిలు స్పష్టం చేశారు. బుధవారం అడ్డతీగల మండలంలో 12 పంచాయతీల గిరిజనులకు మంజూరైన పట్టాలను గిరిజనులకు అందేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఎన్ని ప్రభుత్వాలు పాలించినా ఐటిడిఏల అభివ్రుద్ధి, ఆ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలటీ ఆసుపత్రులను నిర్మాణానికి పూనుకున్నది ఒక్క సీఎం వైఎస్ జగన్మోహరెడ్డి మాత్రమేనన్నారు. రంపచోడవరం లో 50 కోట్ల రూపాయలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వం మంజూరు చేసిందని ఇది పూర్తయితే ఈ ప్రాంత గిరిజనుల ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎపడమిక్ సీజన్ లో గిరిజనులు వింత వ్యాధులు, జ్వరాలతో మ్రుతిచెందేవారని అలాంటి ఘటనలు ఇక పునరావ్రుతం కాకుండా ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గిరిపుత్రు ఆరోగ్యాన్ని కాపాడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Addateegala

2020-10-14 14:06:39

ఏటిగట్టు డొల్లు...ప్రజల గుండె జల్లు..

ఎస్.రాయవరం గ్రామంలో పొలాల్లో కట్టిన ఇంటి కోసం(బొలిశెట్టి ముఖ్య అనుచరుడు, ఎల్లపు నాగు) వరహానది ఏటిగట్టుని పది అడుగుల మేర తవ్వేసిన ప్రబ్రుతులు దానిని అలాగే వదిలేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరహానది పొంగి ప్రవహించడంతో గట్టు పూర్తిగా నానిపోయి బలహీనంగా మారింది. ఆ గట్టు ఏ మాత్రం డొల్ల పడినా వరహానది వరద నీరు మొత్తం ఎస్.రాయవరం గ్రామంతోపాటు చుట్టుప్రక్కలర మూడు గ్రామాలను ముంచేస్తుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేత్తోపట్టుకొని జీవివిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ కు చెందిన ప్రభుత్వ భూమిని అప్పనంగా తవ్వేసినా, అధికారు చూసి అలానే వదిలేశారు తప్పితే రానున్న ప్రమాదాన్ని పసిగట్టి కనీసం గట్టు పూడ్పించలేదంటూ గ్రామానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు ఇరిగేషన్ ఉన్నతాధికారులకు, మండల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం అధికారుల ద్వారా తెలుసుకున్న ఆక్రమణ దారులు వరహానది ఏటిగట్టు అవతల బాగాన్ని నీరు పోవడానికి తవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గట్టు ఇవతల తవ్విగే గ్రామాలకు ప్రమాదం, గట్టు అవతల తవ్వితే పంట పొలాల మునక ఎటు చూసినా అధికారులు చేసిన తప్పు ఇప్పుడు ఎస్.రాయవరం గ్రామప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరహానది నీరు గట్టుకి ఆనుకొని వున్న పొలాల్లోకి రావడతోపాటు అక్కడే వున్న ఒక ఇల్లూ పూర్తిగా నీటిలో మునిగి పోయింది. అసలే వరహానది ఏటి ప్రవాహం అధికంగా వుండటంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అంతా హడలిపోతున్నా, ఇరిగేషన్ అధికారులు, ఏటిగట్టును తవ్వినవారు ఏమీ పట్టనట్టు వ్యహరిస్తున్నారని సోమిరెడ్డి రాజు మీడియాకి వివరించారు. ఏటి గట్టు వాస్తవ పరిస్థితిని ఫోటోలు, వీడియోలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు..ఏటిగట్టు పూర్తిగా వరదనీటితో నానిపోయి డొల్లుగా మారడంతో ఎప్పుడు నది గట్టు నాని వరద ఊరిలోకి వచ్చేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎస్.రాయవరం

2020-10-13 20:20:07

సచివాలయాలపై ప్రజలకు నమ్మకం పెరగాలి..

సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, సచివాలయాన్ని, పరిసరాలను ఎలాంటి చెత్తాచెదారం లేకుండా నిత్యం పరిశు భ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో రిజిస్టర్ లను, ప్రభుత్వ పథకాల పోస్టర్లను, ఉద్యోగుల హాజరు పట్టికను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పెండింగ్ లేకుండా సచివాలయానికి వచ్చే సర్వీసులకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని, వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించి వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో రిజిస్టర్ లను సక్రమంగా మెయింటైన్ చేయాలని, ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళినా రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే అర్జీదారులతో బాధ్యతగా వ్యవహరించి వారికి అవసరమైన సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మునివేలు, డిజిటల్ అసిస్టెంట్ షమీర్, వెల్ఫేర్ అసిస్టెంట్ దుర్గ, మహిళా పోలీసు శిరీషా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Uravakonda

2020-10-13 15:22:55