1 ENS Live Breaking News

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

విశాఖ ఉక్కు కర్మకారాన్ని విక్రయించేందుకు కేంద్రం పావులు కడుపుతోందని, కర్మాగారాన్ని కాపాడుకోవాల్సి న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ అన్నారు. ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పోరాట కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ నేతృత్వంలో ని కమిటీ సభ్యులు మంగళవారం మిందిలోని మంత్రి గుడివాడ అమర్నాథ్ క్యాంపు కార్యాలయంలో కలుసుకొ ని వినతి పత్రాన్ని సమర్పించారు. ఉక్కు కర్మాగారం సాధనకు 32 మంది ప్రాణత్యాగం చేశారని, 52 మంది శాసనసభ్యులు ఏడుగురు పార్లమెంటు సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేసి పోరాటంలో పాల్గొన్నా రని ఆదినారాయణ మంత్రికి గుర్తుచేశారు. మంత్రిని కలిసిన వారిలో వై.టీ. దాసు, వై. మస్తానప్ప ఎన్.రామచం ద్రరావు, రామకృష్ణ  వి.రామ్మోహన్రావు, బి.పైడిరాజు, డి.నాయుడు, మంగ వెంకట్రావు, ఎం.పరదేశి, పిట్టారె డ్డి తదితరులు పాల్గొన్నారు.

gajuwaka

2023-01-03 13:56:45

కోనసీమ జిల్లాలో 8,298 మందికి కొత్త పెన్షన్లు

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లాలో అర్హత ఉన్న వివిధ  కేటగిరీల వారికి కొత్తగా 8,298 పెన్షన్లు మంజూరు చేసినట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మంగళవారం అవ్వ తాతలకు జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న వైస్సార్ పెన్షన్ కానుకను రాష్ట్రవ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం నుండి ప్రారంభించిన నేపథ్యంలో అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమకు పెన్షన్ మంజూరు చేయాలని పలు ధఫాలుగా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పెన్షన్ పొందని వారు ప్రభుత్వం కల్పించిన మార్గదర్శకాలతో పెన్షన్ పొందడం వారిలో సంతృప్తి కలుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వి.శివశంకర్, అడిషనల్ డైరెక్టర్ జిలాని, అమలాపురం మున్సిపల్ కమిషనర్ వివిపి నాయుడు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Amalapuram

2023-01-03 11:54:11

దిగివస్తున్న పసిడి ధరలు క్యారెట్ పై రూ.150 తగ్గుదల

కొత్త ఏడాదిలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. మొన్నటి వరకూ పరుగులు పెట్టిన పసిడి కాస్త నెమ్మదించింది. బంగారం ధరలు కొద్ది మేర తగ్గింపు నమోదు చేసుకుంటున్నాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,040 గా ఉంది. 22 క్యారెట్ల 
తులం బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 మేర ధర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.71,300 కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,040 గా ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.74,500 పలుకుతోంది.

2023-01-03 02:04:34

గ్రామసభల ద్వారా భూ సర్వే హక్కుపత్రాలు

భూ సర్వే జరిగిన గ్రామాల్లో మంగళవారం భూహక్కు పత్రాలు గ్రామ సభలు ఏర్పాటుచేసి అందించనున్నట్టు  తహసిల్దార్ పీవీ.రత్నం తెలియజేశారు. మంగళవారం మాడుగుల తహశీల్దార్ కార్యాలయంలో ఆయన సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఏఏ గ్రామాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. మండలంలోని వీరవల్లి, లక్ష్మీపురం భాగవతుల అగ్రహారం, జి అగ్రహారం, జంపెన, గాదిరాయి, విజె.పురం గ్రామాల్లో  సభలు నిర్వహించి భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఆయా గ్రామాల్లో అనుకున్న సమయంలో రైతులు, ప్రజా ప్రతినిధులు  హాజరయ్యేట ట్టు వీఆర్వోలు, వీఆర్ఏలు ఏర్పాట్లు చేయడంతోపాటుగా గ్రామ వాలంటీర్లు డివైస్లతో విధిగా సమావేశానికి  హాజరయ్యేటట్టు చూడాలని ఆదేశించారు.

Madugula

2023-01-02 16:46:11

కంటెంట్ ట్యాబ్ లతో విద్యార్ధులకు ఎంతోమేలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బైజూస్ కంటెంట్ తో ఇచ్చిన ట్యాబులు విద్యార్ధుల విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎంపీపీ పర్వత రాజబాబు పేర్కొన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని కస్తూరీబా గాంధీ విద్యాలయంలో విద్యా్ర్ధినిలకు ఎంఈఓ ఎస్వీరమణ, ఇతర వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యను కార్పోరేట్ స్థాయికి తీసుకెళ్లిందన్నారు. ప్రిన్సిపాల్ బాలామణి కుమారి, మండల ఇన్చార్జి లచ్చబాబు, ఉపసర్పంచ్ సిహెచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-02 13:21:52

కొత్త పించన్లు పంపిణీ చేసిన కార్పోరేటర్

జీవీఎంసీ 22వ వార్డులో అర్హులైన వారందకి పించన్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తున్నట్టు కార్పోరేటర్ మూర్తియాదవ్ తెలిపారు. సోమవారం వార్డులో  కొత్తగా మంజూరైన 62 మంది లబ్ధిదారులకు ఆయన ఫించన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో  మానసిక వికలాంగ, వృద్ధ, వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా ఈ పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ వెల్ఫేర్ కార్యదర్సులు శశి కళ, రెహమాన్, సంపత్, అడ్మిన్ కార్యదర్సులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-02 08:04:11

ఉప్మాక గ్రామంలో పర్యటించిన సీబీఐ మాజీ జేడీ

నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సోమవారం పర్యటించారు. అనంతరం ఉప్మాక వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి వచ్చిన ఆయనకు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ నాయకులు  ఘన స్వాగతం పలికారు. ఉప్మాక ఆలయాన్ని దర్శించుకున్న ఆయన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు. అర్చకులు ఆయనకు శేష వస్త్రం స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. ఇందులో పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Nakkapalli

2023-01-02 07:51:01

కొమరాడ ప్రాంతంలో మళ్లీ గజరాజుల మకాం

పార్వతీపురం మన్యంజిల్లా లోని కొమరాడ మండల ప్రజలకు గజరాజుల బాధలు మళ్లీ మొదలయ్యాయి. గత రెండు వారాలుగా అర్థం రిజర్వు ఫారెస్టును ఆనుకొని ఉన్న కుమ్మరిగుంట రహదారిపై గజరాజులు తిష్ట వేశాయి.  దీనితో కుమ్మరిగుంట, రాజ్యలక్ష్మీపురం ప్రజలు రాత్రి పూట బిక్కు బిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇక్కడి ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో టమాట, జామ, బొప్పాయి వంటి వాణిజ్య పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను అడవిలోకి తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Komarada

2023-01-02 03:02:53

రంగనాధునిగా ఉపమాక వేంకటేశ్వరుని దివ్య దర్శనం

అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నక్కపల్లి ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో  వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రంగనాదుడిగా వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే శేష పాన్పుపై స్వామివారి పవలిస్తున్నట్లుగా ఆయన పాదాల చెంతనే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఉన్నట్లుగా ఇక్కడ అలంకరణ చేస్తారు. సోమవారం ఉదయం నుంచి ఆలయంలో స్వామివారు రంగనాథుడిగా దర్శనమిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అన్ని ఏర్పాట్లూ చేసింది.

Nakkapalli

2023-01-02 02:55:25

వసతి గృహాల విద్యార్థినులతో జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. ఆది వారం భీమవరం పురపాలక సంఘం పరిధి రైతు బజారు సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహం, వెనుకబడిన తరగతుల బాలిక వసతి గృహంలో నూత న సంవత్సర వేడుకలను విద్యార్థినిలతో కలసి జిల్లా కలెక్టరు జరుపుకున్నారు. కేకును కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. పుస్తకాలు, పెన్నులను , స్వీట్స్ ను  విద్యార్థినిలకు అందజే శారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ గతంలో చదువుకోవాలంటే ఎన్నో ఇబ్బం దులు ఉండేవని, ఇప్పుడు చదువుకోటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. అవకాశాలను అందుపుచ్చుకొని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అనంతరం వసతి గృహాల్లో ఆహారం మంచినీరు శానిటేషన్ , వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు ఏలా ఉన్నాయని విద్యార్థులను స్వయంగా జిల్లా కలెక్టరు  ప్రశాంతి అడిగి తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి కె.శోభా రాణి , హెచ్ డబ్లు వో లు సి హెచ్  భానుమణి,కుసుమ ,వసతి గృహాల సిబ్బంది పాల్గొన్నారు.

Bhimavaram

2023-01-01 13:17:34

మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాలి

విద్యార్థుల కు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంపిపి.రుత్తల సత్యనారాయణ అన్నారు. ఏ.పి.టి.ఎఫ్.రూపొందించిన నూతన సంవత్సార క్యాలెండర్ ను ఆయన ఆదివారం మాకవరపాలెంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత నిచ్చి పాఠశాలల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తుందని ,దానికనుగుణంగా ఉపాధ్యాయులు శ్రమించాలన్నారు. ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలో ను మౌలిక వసతులైన తరగతి గదులు,తాగునీరు,క్రీడల కోసం ప్రత్యేక ఆట స్థలాలను కేటాయించి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్, రాష్ట్ర,జిల్లా నేతలు వరహాలదొర,సత్యరావు, చక్రవర్తి, రాజు,అదినారాయణ,శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.

Makavarapalem

2023-01-01 12:39:45

శంఖవరంలో కొత్త పించన్లు పింపిణీ చేసిన ఎమ్మెల్యే

శంఖవరం మండలంలో కొత్తగా మంజూరైన 236 పించన్లను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ పంపిణీ చేశారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్దిదారులకు కొత్త పించన్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వతరాజబాబు, ఎంపీడీఓ జె.రాంబాబు, గ్రామ సచివాలయాల కార్యదర్శిలు  రామచం ద్రమూర్తి, శంకరాచార్యులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, జూనియర్ సహాయకులు రమణమూర్తి, ఇతర పంచాయతీ సిబ్బంది, వైఎస్సా్ర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-01 05:22:07

సమాజ దిక్సూచి మీడియా.. భీమిలి సీఐ లక్ష్మణమూర్తి

సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించడంలో మీడియా పాత్ర కీలకమని భీమిలి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణమూర్తి అన్నారు. శనివారం భీమిలోని గంటా శ్రీనివాసరావు ఫంక్షన్ హాల్లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భీమిలి యూనిట్ సభ్యులకు డైరీలు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమతూకంగా తమ కథనాలతో సమాజాన్ని మేల్కొలపడంలో బాధ్యత వహించాల్సి ఉందన్నారు. నిరంతరం వార్తా సేకరణలో ఉంటూ సమాజానికి దిక్సూచిగా ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకొంటూ తమ కుటుంబ సంక్షేమం పట్ల కూడా  శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా తమ  సంక్షేమంతో పాటుగా హక్కులను సాదించుకోవడం అభినందనీయమని అన్నారు. అనంతరం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి,బీమిలి డివిజన్ టీడీపీ అధ్యక్షులు గంటా నూకరాజు మాట్లాడుతూ, ప్రజలకూ ప్రభుత్వానికి వారధిగా సమాజంలో జర్నలిస్టులు అత్యంత కీలకమైన భూమికను  పోషిస్తున్నారని అన్నారు. బంగారు అశోక్ కుమార్ అధ్యక్షులుగా ఉన్న స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటి సంఘాలు జర్నలిస్టులకు అండదండగా నిలవడం అభినందనీయమన్నారు.

ఎస్సిఆర్డబ్ల్యూఏ  అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అన్నారు..జర్నలిస్టులకు అండగా అసోసియేషన్ ఉంటుందన్నారు. సంస్థ ఆవిర్భావం, సభ్యుల సంక్షేమం కోసం సంస్థ తరపున చేస్తున్న కార్యకలాపాలను వివరించారు. ప్రతి జర్నలిస్ట్ ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలనేది అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. సభ్యుల సహాయ సహకారాలతో అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయడానికి అలాగే అసోసియేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.అనంతరం సీనియర్ పాత్రికేయులు రంగదాం జర్నలిస్టుల సమస్యలపై ప్రసంగించారు. 

భీమిలి యూనిట్  సభ్యులకు సిఐ లక్ష్మణమూర్తి, టీడీపీ నాయకులు గంటా నూకరాజు  డైరీలు, మిఠాయిలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్(కిరణ్),జాయింట్ సెక్రెటరీ ఎంపిఏ రాజు ఇతర సీనియర్ పాత్రికేయులు  పాల్గొన్నారు.

భీమిలీ

2022-12-31 09:03:56

ఐక్యత తోనే జర్నలిస్టుల హక్కులు సాధించుకోవాలి

ఐక్యత తోనే జర్నలిస్టులు హక్కులు సాధించుకోవడానికి ఆస్కారం వుంటుందని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎస్సిఆర్డబ్ల్యూఏ( కంచరపాలెం టూ పెందుర్తి యూనిట్ ) సభ్యుల డైరీ,స్వీట్స్ పంపిణీ  కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులందరూ ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధించవచ్చని సూచించారు. జర్నలిస్టులకు అండగా ఎల్లప్పుడూ అసోసియేషన్ ఉంటుందన్నారు. నిరంతరం పాత్రికేయుల సంక్షేమం కోసం పరితపించే సంఘంగా వారి యోగ క్షేమాలు, కష్ట నష్టాల్లోనూ పాలుపంచుకుంటూ ఎప్పుడూ వెన్నంటే పాత్రికేయలతోనే ఉంటున్నామన్నారు. ప్రతి జర్నలిస్ట్ ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలనేది అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి సుమారు  6 ఏళ్ళు అవుతొందన్నారు. ఈ ఆరేళ్లలో అసోసియేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

 సభ్యుల సహాయ సహకారాలతో అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయడానికి అలాగే అసోసియేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జర్నలిస్టులు తమ తమ కుటుంబ సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాలని అన్నారు.
 సీనియర్ పాత్రికేయులు మహేష్,  నాయుడు, సతీష్ తదితరులు జర్నలిస్టుల సమస్యలపై ప్రసంగించారు. అనంతరం సభ్యులకు డైరీలు,మిఠాయిలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్(కిరణ్),ఉపాధ్యక్షులు పద్మజ,జాయింట్ సెక్రెటరీ వినోద్ ఇతర సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.

Pendurthi

2022-12-30 11:58:59