1 ENS Live Breaking News

ఈ-క్రాప్ నమోదు పక్కగా నిర్వహించాలి

రైతు పండించిన పంటకు ఇ- క్రాప్ నమోదు పక్కగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాచిపెంట సమీపంలోని పత్తి పంట ఇ క్రాప్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. రైతు పండించిన పంట, ఏ సమయంలో వేసింది , ఇ క్రాప్ నమోదు యాప్ లోని వివరాలను, గ్రామ వ్యవసాయ సహయకురాలు అశ్వినీ లావణ్యను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఇ క్రాప్ నమోదు ఎంతమేర జరిగిందని కలెక్టర్ ప్రశ్నించగా పాచిపెంట సచివాలయం పరిధిలోని 205 ఎకరాల వరకు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎరువులు, యూరియా సక్రమంగా అందుతున్నది లేనిది, పంట చేతికి అందాక ఏ విధంగా మార్కెట్ చేస్తున్నదీ అనే విషయాలను రైతు గండి గుప్తేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాల్లో సరఫరా చేసిన ఎరువులను, యూరియాను వినియోగించుకున్నట్లు రైతు చెప్పారు. అర్హత మేరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వర్తించేందుకు ప్రతీ రైతు పంటను ఇ క్రాప్ లో నమోదు అయ్యేలా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

Pachipenta

2022-08-24 13:20:01

పశువులకు బొబ్బర వ్యాధి నిరోధక టీకాలు

పశువులకు  బొబ్బర వ్యాధి (lumpy skin) నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఆరిక ఈశ్వర రావు కోరారు. బొబ్బర వ్యాధి రాజస్థాన్,బీహార్, పంజాబ్, ఒడిస్సా రాష్ట్రాలలో తీవ్రంగా వ్యాపించి చాలా పశువులు మృత్యువాత పడ్డాయని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో తీవ్రంగా వున్నందున మన జిల్లా సరిహద్దు 6 మండలాలలో 64  గ్రామాలలో ఐదు కిలో మీటర్ల పరిధిలో  సుమారు 10 వేల పశువులకు టీకాలు వేయించే కార్యక్రమం జరుగుతుందని వివరించారు. జిల్లాకు 33 వేల డోసుల వాక్సిన్ సిద్దంగా వుందని, సరిహద్దు గ్రామాల్లో వేసిన తర్వాత మిగతా పశువులకు కూడా వేయడం జరుగుతోందని చెప్పారు.  బొబ్బర వ్యాధి ముఖ్యంగా తెల్ల జాతి పశువులకు (ఆవులు, యెద్దులు)  సోకుతుందని ఆయన పేర్కొన్నారు. శరీరం అంతా కడతలు లాగా బొబ్బర్లు వస్తాయని, అవి కురుపులుగా మారి చీము పడుతుందని, జ్వరం వుంటుందని ఆయన అన్నారు. పాలు ఇచ్చే పశువులకు  పాల దిగుబడి తగ్గుతుందని, మేత మేయవని, పశువులు నీరసంగా వుంటాయని వ్యాధి లక్షణాలను వివరించారు. రైతులు ఆర్ధికంగా నష్టపోయే అవాశముందని, రైతులు ముందుగానే మేల్కొని వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని కోరారు.

పార్వతీపురం

2022-08-24 13:18:12

సచివాలయాలతో గ్రామాభివ్రుద్ధి..

వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో  40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్సీ  పాలవలస విక్రాంత్,  శాసనసభ్యులు  విశ్వాసరాయి కళావతి ప్రారంభించారు. ఈ  సందర్భంగా    మాట్లాడుతూ  ఎక్కడ అవినీతి కి అవకాశం లేకుండా  నేరుగా ప్రజలకు  అందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని  తెలిపారు.  పాలనను  ప్రజల ముంగిటకు  తీసుకొచ్చిన సచివాలయం, వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ లు రాష్ట్రానికి  మంచి పేరు తెచ్చి పెట్టాయని అన్నారు.    శాసనసభ్యులు  విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు  గ్రామాల  అభివృద్ధికి సోపానాలు అని తెలిపారు.  సచివాలయం  ఏర్పాటు   ద్వారా గ్రామం లోనే  ప్రజలకు  కావలసిన అన్నిసేవలు అందిస్తున్నారని,  రైతులకు కూడా  గ్రామం లోనే   రైతుభరోసా  కేంద్రాలు  ఏర్పాటుచేసి  విత్తనం నుండి  పంట కొనుగోలు వరకు  సమస్త సేవలు అందజేస్తున్నారని తెలిపారు.     పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి మాటను  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని  పేర్కొన్నారు.

Veeraghattam

2022-08-24 13:15:10

సాంకేతిక పరిజ్ఞానం మరింత పెంచుకోవాలి

వర్కింగ్ జర్నలిస్టులు విషయ, సాంకేతిక పరిజ్ఞానం మరింత పెంపొందించుకోవాలని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు. బుధవారం విశాఖలోని శిల్పారామం(జాతర) లో ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ మధురవాడ యూనిట్ సభ్యులకు అసోసియేషన్ నూతన గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే  ఎస్సిఆర్డబ్ల్యూఏ నిజమైన సభ్యులను గుర్తించడానికి రెండు బార్ కోడ్ లతో కూడిన ఐడీ కార్డులను తయారు చేయించామన్నారు. సభ్యుల సంక్షేమమే ద్యేయంగా కొత్త ప్రణాళికలను రూపొందించి కార్యక్రమాలను సిద్ధం చేశామని చెప్పారు. ముఖ్యంగా  సభ్యులకు వృత్తి నైపుణ్యత పెంపొందించడానికి ఈ నెల 28న పునఃశ్చరణ తరగతులను  ఏర్పాట్లు చేస్తున్నామన్నారు..ప్రతీ ఒక్కరూ  పునఃశ్చరణ తరగతులను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవలన్నారు. అసోసియేషన్ కార్యక్రమాలు  దిగ్విజయంగా జరగడానికి  సహకరిస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు.  ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్ (కిరణ్),ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్లాజీరావు,ముఖ్య సలహాదారులు కర్రి సత్యనారాయణ(సత్య),సహాయ కార్యదర్సులు అబ్బిరెడ్డి చంద్రశేఖర్, బాలుపాత్రో తదితరులు పాల్గొన్నారు.

Madhurawada

2022-08-24 08:52:50

సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి

 గ్రామ సచివాలయం ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు సమన్మయంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టర్ దగ్గులూరు గ్రామంలోని సచివాలయంను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  శాఖల వారీగా సచివాలయం ఉద్యోగులను వర్క్ ప్లాన్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించే స్థాయిలో ఉండాలని ఏ చిన్న పిర్యాదు లేకుండా చక్కగా విధులు నిర్వర్తించాలని ఆమె అన్నారు. జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండరు తదితర సమాచారం ప్రజలకు తెలిసేలా ఖచ్చితంగా సచివాలయ బయట డిస్ ప్లే  చెయ్యాలని ఆమె అధికారులను ఆదేశించారు. వార్డు సచివాలయాలు సిబ్బంది చురుకుగా పనిచేయాలని ఏది అడిగినా చక్కగా సమాధానం చెప్పాలని ఆమె తెలిపారు. సచివాలయం బయట డిస్ ప్లే చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల జాబితాలని పరిశీలించి, అధికారులకు జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ .వెంకట రమణ, తహ శీల్దారు జి .మమ్మీ ,యంపిడివో  యస్. వెంకటేశ్వర రావు, ఇ వో పి ఆర్ డి  షరీఫ్ ,సచివాలయం సిబ్బంది, తది తరులు పాల్గొన్నారు.

Palakollu

2022-08-24 08:41:08

మనబడి నాడు-నేడు పక్కగా నిర్వహించాలి

మనబడి నాడు-నేడు కార్యక్రమం పనులు సంతృప్తికర స్థాయిలో నిర్మాణాలు జరిపి ,విద్యా బోధనకు  అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టరు  పి.ప్రశాంతి అన్నారు. బుధవారం పాలకొల్లు మండలం లంకలకొడేరు జిల్లా పరిషత్ హై స్కూలు, దగ్గులూరు యం పి ఎలిమెంటరీ స్కూలు  నాడు - నేడు కార్యక్రమం భాగంగా చేపట్టిన పనులను జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీలు చేశారు. మనబడి - నాడు-నేడు రెండవ విడత  కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరు అయిన పనులు వివరాలను కలెక్టరు అడిగి తెలుసుకున్నారు.  పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి వేగవంతంగా పూర్తి చేసి, విద్యా బోధనకు ఏ ఇబ్బందులు లేకుండా చెయ్యాలని ఆమె అన్నారు. పనులకు సంబంధించి ఇసుక, సిమెంటు తదితర సామగ్రి అందుబాటులో పెట్టుకుని భద్ర పరచు కోవాలని ఆమె సూచించారు. పరిసరాలను ,మరుగుదొడ్లును పరిశుభ్రంగా ఉంచాలని,విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడవలసిన  బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు.

తరగతి గదులకు వెళ్లి  విద్యార్థిని, విద్యార్థులతో కొంత సేపు జిల్లా కలెక్టరు గడిపి వారిని కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. చదువు వలన కలిగే ప్రయోజనాలను విద్యార్ధులకు వివరించి , ఉన్నత స్థాయిలో ఉన్న వారిని, దేశ నాయకులను స్ఫూర్తిని తీసుకుని చక్కని క్రమ శిక్షణతో కూడిన జ్ఞానాన్ని సంపాదించుకుని రేపటి తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆమె అన్నారు. పాటశాలల్లో ఏమైనా సమస్యలు వున్నాయా అని విద్యార్థులను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ .వెంకట రమణ, తహ శీల్దారు  జి . మమ్మీ ,యం పి డి వో  యస్. వెంకటేశ్వర రావు, ఇ వో పి ఆర్ డి  షరీఫ్ ,సచివాలయం సిబ్బంది, తది తరులు పాల్గొన్నారు.

Palakollu

2022-08-24 08:37:40

వేళకు తెరుచుకోని గ్రామసచివాలయం

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థకు గొలుగొండ మండలంలోని జోగుంపేటలో సచివాలయ  ఉద్యోగస్తులు మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక(ఆర్టీఐ) గొలుగొండ మండల అధ్యక్షులు దుల్ల వీరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు.  ప్రజల వద్దకే పాలన అందించాలని ఉద్దేశంతో  గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి అన్ని సేవలు అందించేలా ఉద్యోగులను నియమించారని ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను మానస పుత్రికగా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.  అటువంటి వ్యవస్థను  జోగుంపేట సచివాలయ ఉద్యోగస్తులు సమయపాలన పాటించకుండా విధులు పట్ల నిర్లక్ష్యం చేస్తూ అందుబాటులో ఉండకుండా గైర్హాజరవుతున్నారని ఆరోపించారు. ఉద్యోగస్తులపై మండల స్థాయిలో అనేకసార్లు  ఫిర్యాదులు అందాయని అయినప్పటికీ అటు అధికారులు, ఇటు సచివాలయ ఉద్యోగుల్లోనూ మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న మంగళవారం నాడు 10:30 సమయం దాటిపోతున్నా ఉద్యోగస్తులు హాజరు కాకపోవడంతో కార్యాలయం తెరవకపోవడంతో స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారని ఇంత జరుగుతున్నప్పటికీ మండల స్థాయి అధికారులు ఏం చేస్తున్నారని ఆయన మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ ద్రుష్టికి ఈ విషయాన్ని తీసుకెళతామని హెచ్చరించారు.

Golugonda

2022-08-24 06:12:45

భారీ ఎత్తున నాగాపురం మరిడమ్మ జాతర

గొలుగొండ మండలం నాగాపురం ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆ గ్రామ సర్పంచ్ యలమంచిలి రఘురాం చంద్రరావు తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో వేడుకలను ఘనంగా చేపడతామన్నారు. 24న రాత్రి ప్రేమ్ కుమార్ ఆర్ట్స్ వారి డాన్స్, 25న అనంతపురం వారి బుర్ర కథ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. దానితోపాటు మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశా. గ్రామంలోనూ, అమ్మవారి ఆలయం వద్ద  విద్యుద్దీపాలంకరణ చేపట్టినట్టు వివరించారు. పండుగ ఆఖరి రోజు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. చుట్టు పక్కల గ్రామస్తులంతా తరలివచ్చి జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు.

Golugonda

2022-08-23 08:48:13

భీమిలీలో SCRWA గుర్తింపు కార్డుల పంపిణీ

స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, గుర్తింపు కోసం అహర్నిసలు క్రుషిచేస్తుందని అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు. సోమవారం భీమిలీలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ సరికొత్తగా రూపొందించిన నూతన గుర్తింపు కార్డులను సభ్యులకు అందజేసారు. ఈ సందర్బంగా అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే  ఎస్సిఆర్డబ్ల్యూఏ నిజమైన సభ్యులను గుర్తించడానికి రెండు బార్ కోడ్ లతో కూడిన ఐడీ కార్డులను తయారు చేయించిందన్నారు. సభ్యుల సంక్షేమమే ద్యేయంగా కొత్త ప్రణాళికలను రూపొందించి కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా  సభ్యులకు వృత్తి నైపుణ్యత పెంపొందించడానికి ఈ నెల 28న పునఃశ్చరణ తరగతులను  ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ప్రతీ ఒక్క జర్నలిస్టు అసోసియేషన్ అందిస్తున్న పునఃశ్చరణ తరగతులను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.  అనంతరం అసోసియేషన్ కార్యక్రమాలు  దిగ్విజయంగా జరగడానికి  సహకరిస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు.  ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్ (కిరణ్),ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్లాజీరావు,భీమిలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమణ ప్రసాద్ , కార్యదర్శి కిషోర్, కోశాధికారి జి. శ్రీనివాసరావు, సభ్యులు మోహన్ రావు, కుమార్, శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Bheemili

2022-08-22 13:43:33

సాంకేతిక రంగానికి ఆధ్యుడు రాజీవ్ గాంధీ

సైన్స్ ,టెక్నాలజీ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన గొప్ప ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ అని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ  జయంతి ఘనంగా జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 లో ఇందిరాగాంధీ మరణానంతరం దేశానికి ఆరవ ప్రధానిగా సేవలు అందించారని అన్నారు. ఆర్థిక సంస్కరణలకు  పునాది వేశారని అన్నారు. కంప్యూటర్లు, ఎయిర్ లైన్స్, రక్షణ రంగం, టెలి కమ్యూనికేషన్ లలో ఎంతో ప్రగతిని సాధించారని అన్నారు. ఆయన దేశానికి చేసిన కృషి, త్యాగాలను పునః స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-20 08:01:40

అపరిశుభ్రతతో దోమల వ్యాప్తి చెందుతాయ్

దోమ చిన్నదే అయినా అది కుడితే మనిషి ప్రాణాలకే ప్రమాదం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దోమ కాటు వలన మలేరియా ,డెంగ్యూ, ఫైలేరియా, మెదడువాపు, చికెన్ గున్యా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందన్నారు. మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమలు త్వరగా వృద్ధి చెందుతాయి అని అన్నారు. దీనిని అధిగమించడం కోసం పరిసరాలలో చెత్త  వెయ్యరాదని అన్నారు. మలమూత్ర విసర్జన బయట చేయరాదని అన్నారు. మురికి నీరు నిల్వ ఉంచకుండా  చూడాలని, దోమతెరలను వినియోగించాలని అన్నారు. గంబూషియా  చేపలను బావులు, పెద్ద పెద్ద నీటి గుంటలలో పెంచడం వలన దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-20 07:59:49

ఏజెన్సీలో కొత్తగా 17 ఆధార్ కేంద్రాలు

ఏజెన్సీలోని కొత్తగా 17 ఆధార్ కేంద్రాలు, ఐదు మొబైల్ ఆధార్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న ట్టు రంపచోడవరం ఐటీడీఏ పీఓ సూరజ్ గోనోరే పేర్కొన్నారు. శుక్రవారం ఐటిడిఏలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అధికారులు, ఐటీ కన్సల్టెంట్ అధికారిలతో ఆధార్ కేంద్రాలు ఏర్పాటుకై ప్రాజెక్ట్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి  సూరజ్ గనోరే  మాట్లాడుతూ,  ఏజెన్సీలోని చాలామంది ఆధార్ కార్డులలో తప్పులు, ఆధార్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించి కొత్తగా ఆధార్ కార్డుకేంద్రాలు ఏర్పాటు  ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఏజెన్సీలో ప్రస్తుతము  దుర్చార్తి, ఇందుకూరుపేట, లక్కుండా, సున్నంపాడు, ఫోక్స్ పేట, బొడ్డగండి, పి, ఎర్రగొండ, జడ్డంగి, దుసారపాము, మొత్తం తొమ్మిది ఆధార్ కేంద్రాలు సంబంధిత గ్రామ సచివాలయాల ద్వారా ఆధార్ కార్డు సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా మరో 17 ఆధార్ కేంద్రాలు  డి, భీమవరం, రాయిపల్లి, కోనలోవ, అడ్డతీగల గ్రామ సచివాలయం టూ లో ఒకటి, ఇందుకూరు, గంగవరం, నెల్లిపూడి, మొల్లేరు, జడేరు, రాజవొమ్మంగి గ్రామ సచివాలయం వన్ లోఒకటి, వేములకొండ, పెద్ద గెద్దాడ, మడిచర్ల, బోలగొండ, బి, వెలమలకోట, కె. ఎర్రగొండ, గ్రామ సచివాలయాలలోని డిజిటల్ అసిస్టెంట్ లు ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల ఆపరేటర్లుగా బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు, అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు ఆధార్ కార్డు లేని వారికి, ఆధార్ కార్డులు తప్పులు సరి చేయుట కొరకు 5 మొబైల్ ఆధార్ యూనిట్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి నెల మొదటి వారం ఆధార్ కేంద్రాలు ఏ విధంగా పనిచేయుచున్నవి అనే అంశంపై పర్యవేక్షించడం జరుగుతుందని ప్రాజెక్టు అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మానిటరింగ్, యూనిట్ అధికారులు, రామ్ గోపాల్, హర్షిత, ఐటీ కన్సల్టెంట్, తదితరులు పాల్గొన్నారు.

Rampachodavaram

2022-08-19 12:40:38

చేనేత కార్మికులకు వైఎస్సార్సీపీ చేయూత

వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేతలకు అన్నివిదాల న్యాయం చేస్తామని  రాష్ట్ర సమాచార, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం, ఆర్యవటం గ్రామంలో "గడప గడపకు-మన ప్రభుత్వం" కార్యక్రమం మంత్రి పాల్గొన్నారు. ఆర్యవటం గ్రామంలో ఉన్న చేనేత కార్మికులను మంత్రి కలుసుకున్నారు. నేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ది చేకూరుతుందా? అని ప్రతి నేతన్నను గడప గడపకు వెళ్లి తెలుసుకున్నారు. అంతే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాలలో ఏయే పధకాల  లబ్ది జరిగిందో ప్రజలకు వివరించారు. చేనేత కుటుంబాలను పరిశీలించిన మంత్రి వేణు స్వయంగా మగ్గాన్ని నేచారు. నేతన్నలకు ఈ ప్రభుత్వం బాసటగా ఉంటుందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమాన్ని గడప గడపకు అందిస్తామని మంత్రి వేణు తెలియజేశారు.

Ramachandrapuram

2022-08-19 12:04:29

రైతులు ఈకేవైసీ తప్పక చేయించుకోవాలి

ప్రతీ రైతు ఈ పంటలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్.బుల్లి బాబు రైతులకు సూచించారు.శుక్రవారం మండలంలోని కత్తి పూడి,ఆరెంపూడి,శంఖవరం ,రాజారం,మండపం, జి.కొత్తపల్లి గ్రామాల్లో వ్యవసాయ సిబ్బంది చేస్తున్న ఈ పంట నమోదు ప్రక్రియను వ్యవసాయ అధికారి పి గాంధీతో కలిసి క్షేత్రస్థాయిలో  పర్యవేక్షించి పలు సూచనలు ఇచ్చారు. వరి, పత్తి,ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు,కౌలు రైతులు వారి ఆధారాలతో రైతు భరోసా కేంద్ర సిబ్బందితో ఈ పంట నమోదు చేసుకోవాలని కోరారు. జి. కొత్త పల్లిలో ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో సాగు చేస్తున్న మిశ్రమ పంటలు,గులి రాగి నారుమడిని పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చారు. పి.ఎం కిసాన్ వచ్చే విడత సొమ్ము కొరకు అర్హులైన రైతులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని వివరించారు .సిబ్బంది ప్రభాస్, రజాక్,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,  రైతులు,మహిళలు పాల్గొన్నారు.

శంఖరం

2022-08-19 11:12:00

శంఖవరంలో గోపాలుడికి వెండి పిల్లనగ్రోవి..

 శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని శంఖవరం గొల్లవీధిలోని శ్రీ గోపాలడుకి గ్రామానికి చెందిన కొల్లుబోయిన సూరిబాబు, కుమారి దంపతులు 8తులాల వెండి పిల్లనగ్రోవిని బహూకరించారు. శ్రీక్రిష్ణ జన్మాష్టమి సందర్భంగా దానిని ఆలయంలోని సామివారి చేతికి అలంకరించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, ఎప్పటినుంచో స్వామివారికి వెండి పిల్లన గ్రోవి చేయించాలనుకున్న కోరిక స్వామివారి పుట్టిన రోజున నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. పలువురు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

Sankhavaram

2022-08-19 07:54:14