1 ENS Live Breaking News

మన్యంలో వేక్సినేషన్ పరిశీలించిన పీఓ..

విశాఖఏజెన్సీ లోని 11మండలాలలో 36 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఈరోజు నుంచి కోవిడ్ వేక్సినేషన్ అందరికీ వేయించాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ రోణంకి తెలిపారు. ఆదివారం పాడేరు మండలం వంట్ల మామిడి మరియు మినుములూరు  సబ్ సెంటర్లలలో , మరియు మినుములూరు గ్రామ సచివాలయంలోవాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల వున్న గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులందరికీ వాక్సిన్ వేయించాలని ఈరోజు నుంచి వాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రతీ ఒక్కరికీ వాక్సిన్ అందేలా చూడాలని పిఓ తెలిపారు. గిరిజన గ్రామాల్లో పిహెచ్ సి పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు,ఎఎన్ఎమ్ లు మరియు మెడికల్ సిబ్బందిని  గ్రామాలకు పంపించి వాక్సిన్ గురించి వివరించి ప్రజలకు తెలపాలని ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులను ఆదేశించారు. 11మండలాలో ప్రతీరోజు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఎంతమంది కి వాక్సిన్ వేసారో వివరాలను గంటగంటకు తమకు రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు. 

Paderu

2021-09-12 12:33:58

అన్నవరంలో ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు సస్పెండ్..

అన్నవరం రత్నగిరి క్షేత్రంపై పనిచేస్తున్న ప్రధాన అర్చకుడు ఎస్.హరిగోపాల్, ఉప ప్రధాన అర్చకులు కె.సుబ్రహ్మణ్యంలను ఈఓ వేండ్ర త్రినాధరావు సస్పెండ్ చేశారు. ఈమేరకు ఆదివారం అన్నవరంలో దేవస్థానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన అర్చకు, ఉప ప్రధాన అర్చకుడు  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో  ఫిర్యాదు అందుకొని వారిపై నిఘాపెట్టామన్నారు.  విచారణలో వాస్తవాలు గుర్తించడంతో ఇద్దరు అర్చకులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు ఈఓ మీడియాకి తెలియజేశారు. అయితే ఈ విషయం సాయంత్రం వరకూ బయటకు రాలేదు. దేవస్థానంలోని అధికారులుగా ప్రచారం జరిగినా, సిబ్బంది కాదని అర్చకులనే సస్పెండ్ చేసినట్టు ఈఓ వివరించారు. అర్చకులను సస్పెండ్ చేయడం అన్నవరం కొండపై కలకలం స్రుష్టించింది. గతంలో పలు మార్లు హెచ్చరించినా వినకపోవడం, ఫిర్యాదులు, నిర్లక్ష్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకునే ఈ చర్యలకు ఉపక్రమించినట్టు ఈఓ తెలియజేశారు.

Annavaram

2021-09-12 12:33:02

సత్యదేవునికి రూ.100116 విరాళం..

ఒడిసాలోని భువనేశ్వర్ కు చెందిన టి.సాయితేజ దంపతులు ఆదివారం శ్రీశ్రీశ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి అన్నదానం ట్రస్టుకి రూ.100116 విరాళంగా సమర్పించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుకి అందజేశారు. అంతకు ముందు దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారికి తమ కుటుంబం పేరున అన్నదానం చేయాలని కోరారు. దాతలకు అర్చక స్వాములు ఆశీర్వాదాలు అందించగా, ఈఓ వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-09-12 07:09:25

దాహార్తి తీరాలంటే వాగు దాటాల్సిందే..

విశాఖ ఏజెన్సీలో గిరిజనులు దాహార్తిని తీర్చుకోవడానికి ఉద్రుతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటాల్సి వస్తుంది. గిరిజనాభివ్రుద్ధికి కోసం ఐటిడిఏలు ఉన్నప్పటికీ వారి గొంతు తడి తీర్చేందుకు మంచినీటి బోర్లు వేసే నాధుడు కనిపించడం లేదు. ఫలితంగా దాహం తీర్చుకోవడానికి, మంచీనీరు తెచ్చకోవడానికి వాగులు దాటుతున్నారు తాజంగి శివారు గ్రామాలైన సప్పిడి మెట్ట గ్రామస్తులు. ఈ ప్రాంతంలో మంచినీటి బోర్లు, చలమలు కాని లేకపోవడంతో లంబసింగి సమీప ప్రాంతాలకు రావాల్సి వస్తుంది వీరంతా. ఇక్కడి గిరిజనులంతా పాడేరు ఐటీడీఏ పరిధిలోకి వచ్చినా ఏ ఒక్క అధికారి ఈ గ్రామాలను దర్శించిన పాపాన పోలేదు. ఎండాకాలంలో అయితే పర్లేదుకానీ, ఏ మాత్రం వర్షం పడినా అదిగో పైన చిత్రంలోని విధంగా అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, నెత్తిన నీటి బిందెలు పట్టుకొ చెరువులు దాటాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామ ప్రజలకు మాత్రం దాహార్తి తీర్చుకోవడానికి మంచినీటి బోరుకి నోచుకోలేకపోతున్నామని ఈ గ్రామంలోని గిరిజనులు బావురు మంటున్నారు. తమ కష్టాలు స్వయంగా చూస్తేనైనా ప్రభుత్వం మనస్సు కరుగుతుందో లేదో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఒక్క మంచినీటి బోరు వేస్తే మా గొంతులు తడిసి, ప్రాణాలతో చలగాటమాడే వాగులు, వంకలు దాటే దుస్తితి తప్పుతుందని వేడుకుంటున్నారు సప్పడిమెట్ట గ్రామస్తులు..

Narsipatnam

2021-09-11 10:28:23

ఈనెల15 న పెదవలసలో మెగా వైద్య శిబిరం..

గూడెం కొత్తవీధి మండలం, పెదవలసలో ఈ నెల 15నమెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నామని  ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలక్రిష్ణ  శని వారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ఆరోగ్య శ్రీ , ఐటీడీఏ సంయుక్తంగా  నిర్వహిస్తున్న వైద్య  శిబిరాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. వైద్య శిబిరంలో  నాణ్యమైన వైద్యం అందించి ఉచితంగా మందులు సరఫరా చేస్తారని చెప్పారు.  మండలంలోని ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీఓ ఆ ప్రకటనలో కోరారు.

Paderu

2021-09-11 06:03:34

ప్చ్.. ఏపీలో ఉంటే కష్టం..సెంట్రల్ కి వెళ్లిపోతే..

ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఖచ్చితంగా కోర్టుల్లో శిక్షలు పడటం ఖాయం.. ఎవరో చేసిన నిర్ణయాలకు మనం బలికావాల్సి వస్తుంది.. ప్రభుత్వం కోర్టుల్లో వేసే కేసులన్నీ వీగిపోతున్నాయి.. బలమైన డిఫెన్స్ కనీసం ఐఏఎస్ లకు కూడా దొరకడం లేదు.. హైకోర్టుల్లో దోషుల్లా గంటల తరబడి నిలబడటం ఏం బాలేదు.. సీనియర్ ఐఏఎస్ లగా ఉండి మనకిదేం ఖర్మ..  ఏదోఒక నిర్ణయం తీసుకోవాలి.. లేదంటే ఖచ్చితంగా కోర్టు శిక్షలు పడిన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ లుగా పేరుపడిపోతాం.. అందులోనూ ప్రభుత్వానికి మీడియా మొత్తం వ్యతిరేకం అయిపోయింది.. ఏ చిన్న తప్పు జరిగిన బూతద్ధంలో పెట్టి చూపిస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాలనుకుంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే.. ఇవీ గత కొద్ది రోజుల నుంచి ఏ ఐదుగులు ఐఏఎస్ లు కనిపించినా చర్చించుకునే మాటలు, తీవ్రంగా ఆలోచనలు చేస్తున్న తీరు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. అంతేకాదు కొందరు ఐఏఎస్ లు అనుకూల మీడియా వద్ద కూడా ఇదే ప్రస్తావన చేస్తున్నారట. వాస్తవమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్ ల పరిస్థితి అలానే వుంది. ప్రస్తుతం సుమారు పది మంది ఐఏఎస్ లు వివిధ జిఓల, ప్రభుత్వ శాఖల విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ లను ప్రాధమిక శిక్షవేసి కోర్టులోనే గంటల తరబడి నిలబెట్టాయి కూడా. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ద్వారా వాదించే లాయర్(జిపి) కాస్త గట్టిగా వాదించి డిఫెన్సు చేయాల్సి వుంది. వారంతా శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కోర్టుల్లో మాత్రం ప్రభుత్వం తరపున వేసే కేసులన్నీ వీగిపోతున్నాయి. ముఖ్యంగా హైకోర్టు ప్రభుత్వంలోని ఐఏఎస్ లను కోర్టుదిక్కారం పదే పదే చేస్తారా అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే ప్రభుత్వంలోని కొందరు సీనియర్ ఐఏఎస్ లు, ప్రభుత్వ శాఖలు, వ్యవహారాలు, జీఓలపై అవగాహన లేని కొందరు సలహాదారులు చేస్తున్న సూచనలు కూడా ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ లను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి.

దానికి ప్రధాన ఉదాహరణలు జీఓనెంబరు-2, జీఓనెంబరు 149. ఇందులో జీఓనెంబరు 2 విషయంలో అయితే పంచాయతీలు ఉండగా, ఎందుకు గ్రామసచివాలయాలను ప్రత్యేకంగా  ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే పదాన్ని కూడా వాడిందంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. దానికితోడు, ప్రభుత్వంలోని ఐఏఎస్ లపై సలహాదారుల ఒత్తిడి అధికం కావడం,  రూల్ పొజిషన్ కు వ్యతిరేకంగా పనచేయించడం, ఏక పక్ష నిర్ణయాలు ఇలా చాలానే సీనియర్ ఐఏఎస్ లను అడకత్తెరకు బలిచేస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఐఏఎస్ లు  చేస్తున్న తాత్సరమే వీరికి కోర్టుల్లో శిక్షలు పడేలా చేస్తున్నాయి. గతంలో ఐఏఎస్ లకు కోర్టు కేసుల విషయంలో కాస్త వెసులుబాటు వచ్చేది. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రభుత్వంలో ఎంతటి వారికైనా మినహాయింపులు ఇవ్వడం లేదు. ఒక వేళ దిక్కరిస్తే.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. ప్రాధమిక శిక్షలు వేసేస్తున్నాయి.. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ జిపిలు కాస్త గట్టివారైతే కోర్టుల్లో కేసులను ఎదుర్కోవడానికి ఆస్కారం వుంటుంది. కానీ విచిత్రంగా ఎంత పోరాడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉండటంతో సీనియర్ ఐఏఎస్ లు ఆంధ్రప్రదేశ్ లోని సర్వీసులను విడిచిపెట్టి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవాలని చూస్తున్నట్టు విశేషంగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వంలో గత ఏడాదిన్నరలో జరిగిన పరిణామాలు చూసుకున్నా.. దానికి బలం చేకూరుతుంది. గతంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ ను తీసుకొచ్చ హడావిడి చేసిన ప్రభుత్వం ఇపుడు ఆయనను పక్కన పెట్టింది. ఇలానే అజయ్ కల్లాం, పీవీరమేష్ ఇలా చాలాం మంది సీనియర్ ఐఏఎస్ ల సర్వీసు పూర్తియినా వారి తెచ్చి అధికారం అప్పగించి అతి కొద్ది నెలల్లోనే వారిని పక్కన పట్టింది. 

వాళ్ల సమయంలో వచ్చి జీఓలన్నీ ప్రస్తుతం కోర్టులో వాదన దశలో ఉన్నాయి.  నాలుగు పదులు సంఖ్యలో ఉన్న ప్రభుత్వ సలహాదారులు వలన కూడా ఐఏఎస్ లకు తలపోటు మరీ అధికం అవుతుంది. అందులో చాలా మందికి కేబినెట్ ర్యాంకు ఉండటం, వారి ఆదేశాలు ఐఏఎస్ లు శిరసా వహించాల్సి రావడం కూడా ఇందుకు మరోప్రధానక కారణమవుతుంది. ఇదే సమయంలో ఐఏఎస్ లు చేస్తున్న నాన్చుడు దోరణి కూడా కోర్టులకు ఆగ్రహం తెప్పిస్తుంది. కోర్టులను గౌరవించాల్సిన సమయంలో కోర్టు ఆదేశాలను దిక్కరించి.. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుగా ఐఏఎస్ లు పరిగణించ బటం వీరికి తీవ్ర స్థాయిలో తలఒంపులు తెస్తున్నది. ఐఏఎస్ లో నే కోర్టు శిక్షలు పడిన వారంతా మిగిలిన ఐఏఎస్ ల ముందు కూడా దోషులుగా మిగిలిపోతున్నారు. సీనియర్ ఐఏఎస్ లకు హైకోర్టులు వివిధ ప్రభుత్వశాఖల్లో తీసుకున్న నిర్ణయాల కారణంగా వేస్తున్న శిక్షలతో విసుగు చెందిన వీరంతా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతే కూల్ కూల్ గా సర్వీసులు పూర్తిచేసుకోవచ్చుననే ఆలోచనలో పడ్డారట. వచ్చే ఆరునెలల్లో సుమారు పది మంది వరకూ ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులకు వెళ్లాని భావిస్తున్నట్టుగా గట్టిగా ప్రచారం జరుగుతోంది. చూడాలి జరుగుతున్న ప్రచారంలో నిజమెంత, ఎంతమంది కేంద్రానికి బిచానా సర్దేస్తారు.. ఆపై ఏం జరుగుతుందనేది.!

Tadepalle

2021-09-11 03:19:24

ఉచితంగా వినాయక ప్రతిమలు పంపిణీ..

పర్యావరణనాన్ని కాపాడటం కోసం ప్రతీ ఒక్కరూ వినాయకచవితి పండుగలో మట్టి ప్రతిమలనే వినియోగించాలని సామాజిక కార్యకర్త విజినిగిరి బాలభానుమూర్తి పిలుపునిచ్చారు. గురువారం సింహాచ‌లం గిరిజన కాలనీలో గిరిజనులకు ఆయన మట్టి వినాయక ప్రతిమలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితిని అందరూ ఇళ్లల్లోనే జరుపుకోవాలని సూచించారు.  కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావడానికి బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లేటపుడు తప్పని సరిగా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు.   ఈ కార్యక్రమంలో కె.వి.సంతోష్  తదిరులు ఫాల్గొన్నారు.

Simhachalam

2021-09-09 11:50:04

శంఖవరంలో హోమియో వైద్య శిబిరం..

డెంగ్యూ, మలేరియా జ్వరాలు అధికంగా ప్రభలుతున్న తరుణంలో ఆయుష్ శాఖ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం శంఖవరంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే రోగులకు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎపడమిక్ సీజన్ లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా హోమిపతి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా హోమియో వైద్య విధానం కూడా ప్రజలకు అలవాటు అవుతుందన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారికి హోమియోపతి మందులు, వైద్యసేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగదీశ్వరరావు, డాక్టర్, చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత రాజబాబు, సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, ఉదయభాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-09 09:17:20

ప్రచారంతో జ్వరాలపై అవగాహన పెంచాలి..

డెంగ్యూ, మలేరియా జ్వరాలపై ప్రచారంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎంపీడీఓ జె.రాంబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం శంఖవరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రచార రధాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు అధికంగా ఉన్నందున ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మైకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ వర్షాకాలం మొత్తం ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఎవరికి ఎలాంటి జ్వర లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీకి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, వారంలో రెండు రోజులు డ్రైడే పాటించాలన్నారు. చుట్టుప్రక్కల కొబ్బరిబొండాలు, టైర్లు, ఇతర వస్తువులు కుప్పలుగా లేకుండా ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిలు, సిబ్బంది పాల్గొన్నారు.

శంఖవరం

2021-09-08 13:45:14

108లోనే ప్రసవం.. తల్లీ కవలపిల్లలు క్షేమం..

ఆ పండంటి కవల పిల్లలకు 108 అంబులెన్సే ఆసుపత్రి అయ్యింది.. మార్గమధ్యలోనే ఆ తల్లి సిబ్బంది సహకారంతో పురుడు పోసుకుంది. బుధవారం శంఖవరానికి చెందిన శివకోటి కోటి అనంతలక్ష్మి పురిటి నొప్పులతో 108 అంబులెన్సులో రౌతులపూడి సీహెచ్సీకి పురిటికోసం వెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి తక్షణమే  కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీనితో అక్కడి నుంచి 108 అంబులెన్సు కాకినాడ బయలు దేరింది ఈ  క్రమంలో తిమ్మాపురం చేరుకునే సరికి  ఆ తల్లికి నొప్పులు అధికం కావడంతో 108 ప్రసవం అయ్యింది. అంబులెన్సులో ఉన్న ఏఎన్ఎం వెంకటలక్ష్మి, ఆశ జక్కల సూర్యకాంతం ఆమెకు సురక్షితంగా పురుడుపోశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని అంబులెన్సు సిబ్బంది తెలియజేశారు. వారికి కాకినాడ జిజిహెచ్ లో చికిత్స అందిస్తున్నట్టు ఆరోగ్య సిబ్బంది వివరించారు. తల్లీ బిడ్లను కాపాడిందును పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ ఆరోగ్య సిబ్బందిని అభినందించారు.

Sankhavaram

2021-09-08 07:09:07

నాడు-నేడు సెకెండ్ ఫేజ్ కి సిద్దమవ్వాలి..

నాడు-నేడు సెకెండ్ ఫేజ్ కి గ్రామసచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిద్దం కావాలని ఎంపీడీఓ ఎస్వీనాయుడు పేర్కొన్నారు. బుధవారం రౌతులపూడి ఎంపీడీఓ కార్యక్రమంలో నాడు-నేడు సెసెకెండ్ ఫేజ్ పై జరిగే కార్యక్రమాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ మురళితోపాటు ఎంపీడీఓ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫస్ట్ ఫేజ్ లో పూర్తియిన పనులను, నాణ్యత మాదిరిగానే..సెకెండ్ ఫేజ్ లో కూడా మంచి నాణ్యతతో నిర్మాణాలు చేపట్టాలని ఏఈ కోరారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో మండలాన్ని జిల్లాలోనే ముందు వరుసలో నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Rowthulapudi

2021-09-08 06:52:56

శంఖవరం పీహెచ్సీలో చిన్నపిల్లల వైద్యసేవలు..

శంఖవరం పీహెచ్సీలో చిన్నపిల్లలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని వైద్యాధికారి డా.ఆర్వీవిసత్యన్నారాయణ తెలియజేశారు. బుధవారం ఈ మేరకు ఆయన పీహెచ్సీలో మీడీయాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవలే చిన్నపిల్లల వైద్యనిపుణులు డా.గోదాదేవిని పీహెచ్సీలో నియమించిందని అన్నారు. ప్రసూతి కేసులు, చిన్నపిల్లలకు సంబంధించిన ప్రత్యేక ఓపీ ఇపుడు పీహెచ్సీలో జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సదుపాయాన్ని చిన్నపిల్లల తల్లులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ గోదాదేవి అందరికీ అందుబాటులోనే ఉంటారన్నారు. వాటితోపాటు, అన్ని రకాల రక్తపరీక్షలు చేయడానికి ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లతోపాటు, పూర్తిస్థాయి పారామెడికల సిబ్బంది కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చారని ఆయన వివరించారు.

Sankhavaram

2021-09-08 06:40:58

సారూ మా ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలి..

ఎస్.రాయవరం మండలంలోని కొరుప్రోలు 33/11కేవి సబ్ స్టేషన్ పరిధిలో సిబ్బంది లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మదరాసు ఫ్రావిన్సి సమయంలో ఏర్పాటైన తొలి సబ్ స్టేషన్ గా ప్రాచుర్యం పొందిన ఈ సబ్ స్టేషన్ 19495 మంది వినియోగదారులను.. 22 కిలోమీటర్ల 33 కేవి లైను, 143 కిలోమీటర్ల 11 కేవి లైన్లు కలిగి వున్నది. ఇంతటి సుధీర్ఝమైన లైన్లు కలిగిన సబ్ స్టేషన్ లో ఒక లైన్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు లైన్ మేన్ అసిస్టెంట్ లు, లైన్ మేన్ లు నాలుగు జూనియర్ లైన్ మేన్, ఒకరు వాచ్మెన్, స్వీపరు పోస్టులు ఖాళీగా వుండడంతో వున్న వారిపైనే పనిభారం ఎక్కువవుతున్నది. ఇటీవల జరిగిన జనరల్ బదిలీలలో కొంతమంది ఇక్కడనుండి వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్ళిపోయారు. వారి స్థానంలో కొత్తవారిని భర్తీ చేయకపోవడం మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. కొరుప్రోలు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నివాసమున్నప్పటికీ ఇక్కడ జే ఎల్ ఎమ్ గాని, ఏ ఎల్ ఎమ్ గాని లేకపోవడం శోచనీయం. ఈ విషయమై స్థానిక నాయకులు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ద్వారా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు తెలిపి పోస్టులు భర్తీకి విన్నవించినా ప్రయోజనం శూన్యం. ఇప్పటికైన అధికారులు కొరుప్రోలు సబ్ స్టేషన్ పరిధిలో పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

S Rayavaram

2021-09-08 06:22:43

పౌష్టికాహారంపై అవగాహన చాలా అవసరం..

పౌష్టికాహారంపై ప్రతీఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని 104 వైద్యులు ఎస్ఎస్.రాజీవ్ కుమార్ అన్నారు. మంగళవారం అన్నవరం- కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా తల్లులకు, పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన పౌష్టికాహారాన్ని సర్పంచ్ కుమార్ రాజాతో కలిసి పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు ఈవారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కార్యదర్శి రాంబాబు, జూనియర్ అసిస్టెంట్ రమణమూర్తి, డిఈఓ సూర్యదుర్గ, పైలట్ ఈశ్వర్రావు, ఏఎన్ఎం వరలక్ష్మి, ఆశ భద్రలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-09-07 10:53:14

స్వరూపనందేంద్ర సరస్వతీ స్వామిని కలిసిన ఈఓ..

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, వేండ్ర త్రినాధ రావు  రుషికేశ్ లో శ్రీశ్రీశ్రీ స్వరూపనంద సరస్వతీ స్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ మేరకు దేవస్థాన వర్గాలు మంగళవారం ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశాయి. విశ్వశాంతి కోసం శ్రీశ్రీశ్రీ స్వరూపనంద సరస్వతీ స్వామి చేస్తున్న యాగాల ఫలితాలు రావాలని, కరోనా పూర్తిగా సమసి పోయేలా కోరుతున్నట్టు ఆ ప్రకటలో తెలియజేశారు.  పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత స్వామివారి ఆలయాన్ని సందర్శించాల్సిందిగా కోరిటనట్టు పేర్కొన్నారు.

Annavaram

2021-09-07 03:20:13