1 ENS Live Breaking News

పౌష్టికాహార స్వీకారంతోనే మెరుగైన ఆరోగ్యం..

గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు కడుపులో పెరిగే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుందని ౌ ఐసిడిఎస్ విశాఖ అర్బన్-2 సిడిపీఓ శ్రీలత అన్నారు. విశాఖలోని క్రాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లల తల్లులంతా పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే బలవర్ధక ఆహారం తీసుకోవడంతోపాటు, నిత్యం, పాలు, ఆకుకూరలు, పప్పు, గ్రుడ్లు అధికంగా తీసుకోవాలన్నారు. ఏఏ ఆహారాల్లో పోషక విలువలు ఉంటాయో అంగన్వాడీ కేంద్రాల్లోని కార్యకర్తల ద్వారా తెలుసుకొని పాటించడం ద్వారా తల్లుల ఆరోగ్యంతోపాటు, పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే బాలమ్రుతం పెట్టడం ద్వారా పిల్లలు ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రంలో  విశాఖ అర్బన్-2 సూపర్ వైజర్ సుసీల, అంగన్వాడీ కార్యకర్త దాక్షాయని, అధిక సంఖ్యలో పిల్లల తల్లిదండ్రలు పాల్గొన్నారు.

విశాఖసిటీ

2021-09-02 04:41:48

ఉపాధ్యాయులంతా వేక్సిన్లు వేయించుకోవాలి..

థర్ఢ్ వేవ్ కరోనాను ద్రుష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు కరోనా వేక్సిన్ వేయించుకోవాలని ఎంఈఓ ఎస్వీరమణ సూచించారు. బుధవారం శంఖవరంలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మండలంలోని 46 ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆదేశాలు జారీచేశామన్నారు. కొందరు మొదటి డోసు వేసుకుని, రెండ డోసుకి సిద్ధంగా ఉన్నవారిని కూడా వేక్సిన్లు వేయించుకోవాలని సూచించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీపాఠశాలలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్టు చెప్పిన ఎంఈఓ అత్యవసర సమయంలో పాఠశాలల్లో బ్లీచింగ్ చల్లించే ఏర్పాటు కూడా చేస్తున్నామన్నారు. పిల్లలను కూడా దూరం దూరంగానే కూర్చోబెట్టాలనే నిబంధనను కూడా అమలు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

Sankhavaram

2021-09-02 04:02:41

ఈవీఎంలను పరిశీలించిన ఎంపీడీఓ..

రౌతులపూడి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించినట్టు ఎంపీడీఓ ఎస్వీనాయుడు తెలియజేశారు. బుధవారం ఈ మేరకు సామల్ కోట లోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి అక్కడ గదులకు సీళ్లు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ లను పరిశీంచి భద్రతను తనిఖీ చేసినట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో నిత్యం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలిస్తున్నప్పటికీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేస్తున్నామన్నారు.

Rowthulapudi

2021-09-02 03:51:57

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి..

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మధురవాడలో నాడు-నేడులో భాగంగా 69 లక్షలతో అభివృద్ధి చేసిన ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవనాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈసంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మధురవాడ ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని.. ఇక్కడి స్థానికులకు  మెరుగైన వైద్యం అందించేందుకు పీహెచ్ సీ అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ పీహెచ్ సీని అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గా అప్ గ్రేడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు మంత్రి సూచించారు. ఆసుపత్రిలో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఓపీ వార్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఆసుపత్రికి ఒక డాక్టర్, నైట్ సెక్యూరిటీ, ఇద్దరు వాచ్ మెన్లను నియమించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో సుందరీకరణ చేపట్టాలని, రోగుల బంధువులు వేచి ఉండేందుకు ఒక షెడ్డు నిర్మించాలని కూడా మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వసతులు, ప్రజలకు వైద్యం అందాలని మంత్రి అన్నారు. పీహెచ్ సీని రాబోయే రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. గతంలో ప్రభుత్వాసుపత్రులకు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే సామాన్యులు ఆలోచించేవారని.. ఇప్పుడు నాడు-నేడులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రులను, పాఠశాలలను అభివృద్ధి చేసి వారికి చేరువ చేసారని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి కోరారు. కరోనా టెస్టుల్లో, వ్యాక్సినేషన్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని అన్నారు. మధురవాడకు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చేందుకు కృషి చెస్తానని మంత్రి అన్నారు.

జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాడు-నేడు ద్వారా ప్రభుత్వం ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోందని అన్నారు. జిల్లాలో  77 ఆసుపత్రులు 53కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మరో 9 ఆసుపత్రులు నిర్మిస్తామని అన్నారు. ప్రస్తుతం పనుల దశల్లో ఉన్న ఆసుపత్రులను 15-20 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో సెక్యూరిటీ ఉంచాలని.. రాత్రిళ్ళు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. థర్డ్ వేవ్ వార్తల నేపథ్యంలో అందరూ వాక్సినేషన్ వేయించుకోవాలని అన్నారు.

మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ.. నాడు-నేడులో భాగంగా ఆసుపత్రులను అభివృద్ధి చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందని అన్నారు. ప్రజలకు  ప్రభుత్వాస్పత్రుల్లో మంచి వైద్యం లభించడం సంతోషించే విషయమని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము, జీవీఎంసీ చీఫ్ విప్, ఆరో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, నగరాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పిల్లా సుజాత, కార్పొరేటర్లు,, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Madhurawada

2021-09-01 15:58:20

తూ.గో.లో 141 హార్టికల్చర్ అసిస్టెంట్లు ఖాళీ..

తూర్పుగోదావరి జిల్లాలో141 హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నట్టు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.రామ్మోహన్ తెలియజేశారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండాల్లోని గ్రామ సచివాలయాల్లో ఇప్పటి వరకూ 300 మంది హార్టికల్చర్ అసిస్టెంట్లను భర్తీచేశామన్నారు. జిల్లాకి 441 పోస్టులను ప్రభుత్వం కేటాయించినట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను ఇటీవలే ప్రభుత్వానికి నివేదించినట్టు చెప్పారు.  ఇంకా మిగిలిన పోయిన ఖాళీలను ప్రభుత్వం మరోసారి చేపట్టే నియామకాల్లో భర్తీచేసే అవకాశాలున్నాయన్నారు.

కాకినాడ

2021-09-01 15:05:25

కర్మాగార కార్మికులకూ కోవిడ్ వేక్సిన్..

థర్డ్ వేవ్ కోవిడ్ నుంచి తప్పించుకోవాలంటే అన్ని వర్గాల ప్రజలు కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలని ఎస్సీకార్పోరేషన్ ఈడి తూతిక విశ్వనాధ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని జరుగుమిలి గ్రామపంచాయతీలోని మున్నంగి సీ ఫుడ్స్ కర్మాగారంలో 140 దినసరి కూలీలకు ఆయన దగ్గరుండి కోవిడ్ వేక్సిన్ వేయించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అన్ని వర్గాల వారికి, ముఖ్యం సంచార కూలీలకు కోవిడ్ టీకాలు వేయించాలని ప్రత్యేకంగా సూచించిందని, అలాంటి వారిని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా కోవిడ్ వేక్సినేషన్ క్యాంపులు పెట్టి టీకాలు వేస్తున్నట్టు ఆయన చెప్పారు. స్థానిక పీహెచ్సీ డా.శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో కార్మికులందరికీ కోవిడ్ టీకా వేసినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్నంగి సీఫుడ్ డైరెక్టర్ జివిరామారావు తదితరులు పాల్గొన్నారు.

Jarugumalli

2021-09-01 11:04:10

18నిండిన అందరికీ కోవిడ్ వేక్సిన్ వేయించాలి..

కత్తిపూడిలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ కోవిడ్ వేక్సిన్ తప్పక అందించాలని, అదేవిధంగా మొదటి డోసు తీసుకొని 85 రోజులు పూర్తయిన వారికి రెండవ డోసు వెంటనే వేయాలని ఎంపీడీఓ జె.రాంబాబు వైద్యసిబ్బందిని ఆదేశించారు. బుధవారం కత్తిపూడిలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్డ్ వేవ్ ని ద్రుష్టిలో ఉంచుకొని వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది, గ్రామసచివాలయాల సిబ్బంది సంయుక్తంగా వారి పరిధిలోని అందరికీ కోవిడ్ వేక్సిన్ అందించాలన్నారు. అదేవిధంగా కోవిడ్ కేంద్రం వద్ద ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. ప్రతీకే కోవిడ్ వేక్సిన్ కేంద్రం వద్ద పంచాయతీ సిబ్బంది పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయించడంతోపాటు, చుట్టూ బ్లీచింగ్ చల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం లు పాల్గొన్నారు.

Kathipudi

2021-09-01 10:41:14

తూ.గో.జి.లో 2.11లక్షల హెక్టార్లలో వరినాట్లు..

తూర్పుగోదావవరి జిల్లాలో 2లక్షల 11వేల 282 హెక్టార్లలో వరినాట్లు పూర్తి అయ్యాయని వ్యవసాయశాఖ జాయింట్ డెక్టర్ ఎన్.విజయకుమార్ తెలియజేశారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు తూర్పుగోదావరి జిల్లాలో 2లక్షల 29వేల 950 హెక్టార్లలో ఖరీఫ్ సీజన్ కు వరినాట్లు పడాల్సి వుండగా 90శాతం పూర్తిఅయినట్టు ఆయన వివరించారు. ఈ సంవత్సరం వర్షాలు కూడా అధికంగా కురుస్తున్నందున రైతులకు మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నందను రైతులకు గ్రామస్థాయిలోనే ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా అన్ని సహాయ సహకారాలు, సూచనలు, సస్యరక్షణ చర్యలుపై అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన వివరించారు. రైతులు కూడా వ్యవసాయశాఖ సేవలను వినియోగించుకోవాలన్నారు.

Kakinada

2021-09-01 06:39:13

సెప్టెంబరు 1 నుంచి పౌష్టికాహార మాసోత్సవాలు..

సెప్టెంబరు 1 నుంచి నెల రోజుల పాటు పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఐసిడిఎస్ సూపర్ వైజర్ అరుణశ్రీ తెలియజేశారు. మంగళవారం ఆమె శంఖవరం ఐసిడిఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చిన్నారులు, గర్భిణీ స్త్రీల సౌకర్యార్ధం ఐసిడిఎస్ ద్వారా ఎంతో విలువైన పౌష్టికాహారం అందిస్తుందని, అంతేకాకుండా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు వస్తాయి..ఏఏ ఆహారాలలో పోషకాలు ఉంటాయనే విషయాన్ని ఈ పౌష్టికాహార మాసోత్సవాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని చేపడుతున్న ఈ కార్యక్రమం శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. అన్ని కేంద్రాల్లో ఉత్సవాలు జరుగుతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, కళాంజలి తదితరులు పాల్గొన్నారు.

శంఖవరం

2021-08-31 14:34:33

అన్నవరంలో రెండ్రోజులు 104 మెకిల్ క్యాంపులు..

అన్నవరంలో సెప్టెంబరు 1నుంచి 2వరకూ 104 మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు డాక్టర్ ఎస్ఎస్.రాజీవ్ కుమార్ తెలియజేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడారు. 1వ తేదిన అన్నవరం గ్రామసచివాలయం-2, 2న గ్రామసచివాలయం-3లోనూ ఈ మెడికల్ క్యాంపులు జరుగుతాయన్నారు. ఈ సమాచారాన్ని ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్ల  ద్వారా వారి పరిధిలోని  ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు.  ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసే ఈ మెడికల్ క్యాంపుల ద్వారా వైద్యసహాయంతోపాటు, మందులు కూడా ఉచితంగానే స్వీకరించవచ్చునన్నారు. ఈ మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కోరుతున్నారు.

Annavaram

2021-08-31 10:07:17

శంఖవరం పీహెచ్సీలో 78ఆర్టీపీసీఆర్ టెస్టులు..

శంఖవరం పీహెచ్సీ పరిధిలో నిత్యం కరోనా టెస్టులు చేస్తున్నట్టు వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం శంఖవరం పీహెచ్సీలో మీడియాతో మాట్లాడారు. గత మూడు రోజుల నుంచి 78 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నందున ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే పీహెచ్సీకి వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. గ్రామసచివాలయాల పరిధిలో ఏఎన్ఎంలను కూడా ఈ పరీక్షల విషయంలో సమాచారం కోసం సంప్రదించవచ్చునని డాక్టర్ వివరించారు. ప్రభుత్వం అందించే ఈ ఉచిత సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Sankhavaram

2021-08-31 07:53:10

రౌతులపూడిలో1242 హెక్టార్లలో వరినాట్లు..

రౌతులపూడి మండలంలో 1242 హెక్టార్లలో ఇప్పటి వరకూ వరినాట్లు జరిగినట్టు వ్యవసా యాధికారి పడాల గాంధీ తెలియజేశారు. మంగళవారం రౌతులపూడి వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2021-2022 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో వరి పంట నాట్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు. మండలంలోని 26 పంచాయతీలు, గ్రామ సచివాలయాల పరిధిలో వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల నమోదు కూడా జరుగుతుందన్నారు. అదే సమయంలో నాట్టు పూర్తయిన తరువాత వారి ద్వారా సస్యరక్షణ చర్యలకు సంబంధించి సూచనలు, సలహాలు కూడా రైతులకు అందిస్తామని ఆయన వివరించారు. వ్యవసాయ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా, గ్రామసచివాలయాల పరిధిలోని రైతుభరోసా కేంద్రాల్లోని తమ సిబ్బందిని సంప్రదించవచ్చునని వ్యవసాయాధికారి చెప్పారు.

Rowthulapudi

2021-08-31 07:43:31

గోదారోళ్లు ఏంచేసినా యరైటీగానే ఉంటది..

గోదారోళ్లు ఏం చేసినా కాస్త యరైటీగానే ఉంటుందనడానికి ఇదొక చిన్న నిదర్శనం. ఎప్పుడూ అందరిలో తాము కాస్త ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు..సరిగ్గా శ్రీక్రిష్ణాష్టమి రోజున కూడా ఆ విధంగా వ్యవహరించారు. సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా, శంఖవరం మండల కేంద్రంలోని జన్మాష్టమి సందర్భంగా ఉట్టికొట్టిన వారికి కాజా బహుమతిగా ఇచ్చారు. అదేదో సాదారణంగా ఉందనుకుంటన్నారా..ఏకంగా ఐదుకేజీలు ఉంది..దానిని జాగ్రత్త పట్టుకోవాలంటే రెండు చేతులతోనూ మోయాల్సిందే.. శంఖవరం గ్రామంలో శ్రీక్రిష్ణ యాదవ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉట్టిపండుగ ఘనంగా నిర్వహించారు. అందులో గెలుపొందిన వ్యక్తి మొదటి బహుమతి కింద 5కేజీల కాజా.. రెండవ బహుమతి కింద 3 కేజీల కాజాను బహుమతిగా ఇచ్చారు. ఈ కాజాలను గ్రామానికే చెందిన మిఠాయిల తయారీ దారుడు ఎల్.వెంకటరమణ తన వంతు బహుమతిగా వీటిని అందజేశారు.  ప్రస్తుతం ఈ కాజాల సైజులు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే హల్ చల్ చేస్తున్నాయి..

Sankhavaram

2021-08-31 02:02:56

మాగ్రామంలో ప్రభుత్వ బ్రాందిషాప్ పెట్టొద్దు..

ఎస్.రాయవరం మండలం, సైతారుపేట గ్రామంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వ బ్రాంది షాప్ తమ గ్రామం లో ఏర్పాటు చేయవద్దంటూ  సర్పంచ్ రావి రమణబాబు ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. యలమంచిలి నుంచి యస్.రాయవరం వెళ్లే తయారు రోడ్డును లో ఉన్న తమ గ్రామ సెంటర్ లో బ్రాందిషాపు ఏర్పాటుకు అధికారులు ప్రయటించడం అన్యాయమన్నారు. ఈమేరకు సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ సెంటర్ లోనే ఆంజనేయ స్వామి, వినాయకుడి గుడి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నందున నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. అటు యలమంచిలి వైపు గాని, ఎస్.రాయవరం వైపు గాని ప్రయాణం చేయడానికి బస్, ఆటో, ఇతర వాహనాల కోసం మహిళలు,  ఇతరులు వేచి ఉండే సెంటర్ లో ప్రజల సొమ్ము, ప్రాణాలను గుల్ల చేసే బ్రాంది షాపు ప్రారంభించం తగదన్నారు. దశల వారిగా మద్యం నిషేధం దిశగా అడుగులు వేస్తామని తెలిపిన ప్రస్తుత ప్రభుత్వమే బ్రాంది షాపులు పెంచి అమ్మకాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం చిగ్గు చేటని మహిళలు నినాదాలు చేశారు. గ్రామం మొత్తం తీర్మాణం చేసి ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కి పోస్టుద్వారా పంపినట్టు వారు మీడియాకి వరించారు. కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలు, స్థానిక యువత పాల్గొన్నారు. 

S Rayavaram

2021-08-30 13:13:22

ఉపాది హామీ లక్ష్యాలను అదిగమించాలి..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలోని ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని ఎంపీడీఓ ఎస్వీనాయుడు ఏపీలతోపాటు సిసిలను ఆదేశించారు. సోమవారం సోమవారం రౌతులపూడి మండల కేంద్రంలో నరేగా సిబ్బంది, కార్యదర్శలతో సమీక్ష నిర్వహించారు. ఉపాది కార్డులు పంచాతీలు, గ్రామస చివాలయాల ద్వారా అడిగిన వెంటనే మంజూరు చేయాలన్నారు. బాగా ఉపయోగం ఉండే ప్రాంతాల్లో పనులు చేపట్టాలన్నారు. గతంలో తవ్వంచిన చెరువల వలన నేడు వర్షపునీరు చేరుచేరుతుందని, తద్వారా భూగర్భ జలాలు అభివ్రుద్ధి చెందుతున్నాయన్నారు. ఈవిధంగా గ్రామాల్లో పనికి వచ్చేచోట ఉపాది పనులు చేయిండంతోపాటు, చెల్లింపులు కూడా సకాంలో చేపట్టాన్నారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.

Rowthulapudi

2021-08-30 11:03:58