యస్.రాయవరం మండలం, గుడివాడ గ్రామ తాజా మాజీ సర్పంచ్ నల్లపురాజు వెంకట్రాజు, అతని తండ్రి బంగార్రాజు, అధ్యక్షుడు నీటి సంఘం, అప్పటి తహశీల్దార్ కోరాడ వేణుగోపాల్, డిప్యూటీ తహశీల్దార్ ఎమ్.వీరభద్రాచారి,మండల సర్వేయర్ టి.రామారావు, లపై యు.ఎఫ్.ఆర్.టి.ఐ కన్వీనర్ లోకాయుక్త కు పిర్యాదు చేశారు. వాటిని శనివారం మీడియాకి విడుదల చేశారు. ఒక్క సెంటు భూమి కూడా కొనుగోలు చేయకుండా, తన తాత ల నుండి వారసత్వం గా ఒక్క సెంటు భూమి రాకుండా, గుడివాడ, పెదఉప్పలం, చినఉప్పలం 3 గ్రామాల లో 4 గురు పేరున ఎకరాలు 47.71 సెంట్లు గతం లో రెవెన్యూ రికార్డు లలో "అనాదీనం" భూమి (ప్రభుత్వ భూమి) గా ఉన్న ఈ భూములు మొత్తం తమ 4గురు కుటుంబ సభ్యుల పేరున రెవెన్యూ రికార్డు లలో అక్రమంగా నమోదు చేయించుకున్నారు. ఆక్రమించు కొన్నందున ఈ భూముల పై అనేక అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. రికార్డులు తారు మారు చేసినట్టుగా తెలుస్తుందని దీనిపై విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెదఉప్పలం రెవెన్యూ చినఉప్పలం గ్రామము లోని సర్వే నెం. 51-1 లో ఎకరాలు 33.69 సెంట్లు, సర్వే నెం. 115-1 లో ఎకరాలు 23.10 సెంట్లు మరియు సర్వే నెం. 115-3 లో 21.65 సెంట్లు వెరశి మొత్తం ఎకరాలు 98.44 సెంట్లు నల్లా రెడ్డి నాయుడు పేరున తేదీ 09.05-37 న ప్రభుత్వ భూమి అక్రమణ దారుగా నోటీసు, 10-1 ప్రకారం నల్లా మల్లయ్య అప్పారావు పేరున 51-1 లో ఎకరాలు 33.69 సెంట్లు, సర్వే నెం. 115 లో ఎకరాలు 22.90 సెంట్లు, సర్వే నెం.117 లో ఎకరాలు 17.80 సెంట్లు, వెరిశి మొత్తం ఎకరాలు 74.39 సెంట్లు భూమి ఉండగా, తేదీ 31.12.2008న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపుసామాజిక వర్గానికి చెందిన వారు 8 మంది వ్యక్తుల పేరున పాస్ బుక్స్ కలిగి ఉన్న మొత్తం ఎకరాలు 74.39 సెంట్లు, ఆంధ్ర ప్రదేశ్ గజిట్ 2018 (22A) ప్రకారం సర్వే నెం. 115 లో ఎకరాలు 22.90 సెంట్లు, సర్వే నెం.117 లో ఎకరాలు 17.80 సెంట్లు వెరశి మొత్తం ఎకరాలు 40.70 సెంట్లు ప్రభుత్వ భూమిగా ఉండగా, ఈ భూమి తో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిబంధనలకు విరుద్దంగా రొయ్యల చెరువులు త్రవ్వి అనుభవిస్తుండం తదితర అన్ని అవినీతి, అక్రమాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామం లో జాతీయ రహదారి పై నుంచి యలమంచిలి గ్రామము లోనికి వెళ్ళు తారు రోడ్డు కు కుడి వైపున గతంలో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు పెట్రోల్ బంక్ ను ఆనుకుని కొండకు ఉత్తర దిక్కున ఉన్న అట్లాంట్ రాక్ గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భూములను, దక్షిణం వైపు కొండలను ఆనుకొని ఖాతా నెం. 116 లో ఎకరాలు 8.015 సెంట్లు భూముల పైన విచారించి చట్ట ప్రకారం వీరిపైకూడా చర్యలు తీసుకొవాలంటూ పిర్యాదు లో పేర్కొన్నారు. ఈ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తేదీ 25.01.2021 న
స్పందన కార్యక్రమం లో తహసీల్దార్, యస్.రాయవరం కు పిర్యాదు చేసినట్టు వివరించారు. తేది 24.03.2021న తహసీల్దార్ కు ఇచ్చిన పిర్యాదు కుఎండార్స్మెంట్ ఇచ్చారని, తేది 31.07.2021, 10.08.2021 న జిల్లాకలెక్టర్, విశాఖపట్నం తో పాటు పలు శాఖల అధికారులకు పిర్యాదు చేసినట్లు కూడా ఆయన వివరించారు. తక్షణమే అధికారులు విచారణ చేపట్టి భూములు స్వాధీనం చేసుకోకపోతే మరిన్ని ప్రభుత్వ భూములు ఆక్రమించే అవకాశం వుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.