1 ENS Live Breaking News

టీకావేసుకోని వారినిగుర్తించి వేక్సిన్ వేయాలి..

కోవిడ్ టీకాలు ఇప్పటి వరకూ వేయించుకోని వారిని గుర్తించి అలాంటి వారికి వేక్సిన్ వేయాలని ఎంపీడీఓ జె.రాంబాబు ఆరోగ్యసిబ్బందికి సూచించారు. సోమవారం శంఖవరం మండలంలోని సీతాయంపేట సచివాలయం పరిధిలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రస్తుతం కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు రకాలు టీకాలు అందిస్తున్నందున. వాటిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందించేందుకు కాస్త శ్రమించాలన్నారు. అన్నికోవిడ్ వేక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించి మాత్రమే కేంద్రాని రావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యసిబ్బంది, ఆశ కార్యకర్తలుపాల్గొన్నారు.

Sankhavaram

2021-09-06 14:13:21

రౌతులపూడి మండలంలో 684 మందికి వేక్సిన్..

రౌతులపూడి మండలంలో 684 మందికి కోవిడ్ వేక్సిన్ వేసినట్టుఎంపీడీఓ ఎస్వీనాయుడు ఒక ప్రకటనలో  తెలిజేశారు. సోమవారం రౌతులపూడి మంలంలోని మీడియాకి ఈ మేరకు వివరాలను విడుదల చేశారు. మండంలోని అన్ని గ్రామ, సచివాలయాలు, సబ్ సెంటర్ల పరిధిలో ఈ కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. సాయంత్రం ఐదు గంటలకే పూర్తిస్థాయిలో వేక్సిన్ల టార్గెట్ పూర్తిచేసినట్టు వివరించారు. అన్ని కేంద్రాల్లోనూ ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ నిబంధనలను అమలు చేసి కార్యక్రమాన్ని పూర్తిచేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Rowthulapudi

2021-09-06 13:59:30

మత్స్యకారుల అభివ్రుద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది..

మత్స్యకారుల అభివ్రుద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేత్రుత్వంలో ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. సోమవారం కురుపాం నియోజకవర్గంలోని గుజ్జువాయి రిజర్వాయర్ లో “ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన” పధకంలో భాగంగా 90వేల చేప పిల్లలను మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారితో కలిసి విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా మత్స్యకారుల అభివ్రుద్ధికోసం జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారి మాట్లాడుతూ, సుస్థిరమైన, భాద్యతాయుతమైన మత్స్య అబివృద్ధి కోసం 2020-21నుంచి  2024-25వరకు 5ఏళ్లలో అమలు పరిచేవిధంగా  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.  రూ. 96,300/- విలువ కలిగిన 90వేల చేప పిల్లలను 60శాతం సబ్సిడీతో    రూ. 57, 780/- కేవలం రూ. 38,520/-లతో సరఫరా చేసామని డిడి మంత్రికి వివరించారు. ఆక్వా రైతులుకు అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాగర మత్స్యకారులకు వేట నిషేద భ్రుతిని రూ. 4,000/-లు నుండి రూ. 10,000/-లు పెంచడంతో పాటు..  50 సంవత్సారాలు దాటిన మత్స్యకారులందరికి మత్స్యకార ఫించను   అందజేయడం, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులు ఎక్ష్ గ్రేషియాను రూ. 5.00 లక్షలు నుంచి రూ. 10.00లక్షలుకు పెంచడం, ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అందజేస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి, నాణ్యమైన సీడ్, ఫీడ్ మరియు ఆక్వా కల్చర్ అనుమతులు సరళంగా, త్వరితగతిన పొందడం కోసం ఏర్పాటు చేసిన 3చట్టాలును (ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020,  ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్)(సవరణ) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ది సంస్థ చట్టం 2020) లను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జిల్లాలో స్థానిక మత్స్య ఉత్పత్తులపై వాడకం పెరగటం కోసం మత్స్యశాఖ చేస్తున్న కృషి వలన ఆక్వా రైతులకు మధ్యవర్తుల బెడద లేకుండా మంచి గిట్టుబాటు ధర దొరకడం అభినందనీయమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కమిటి ఎ.ఇందిర కుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటి, కురుపాం  చైర్మన్ నిమ్మల వెంకట రావు, మత్స్య శాఖ సహాయ  సంచాలకులు  పి. కిరణ్ కుమార్, జిల్లా మత్స్యకార సహకార సంఘం వైస్ ప్రెసిడెంట్ దాసరి లక్ష్మణ రావు, గుజ్జువాయి గ్రామ సర్పంచ్ హెచ్. నాగేశ్వరరావు, గిరిజన మత్స్యకార సహకార సంఘం ప్రెసిడెంట్ చిన్నా రావు,  వైఎస్సార్సీపీ కురుపాం మండల కన్వీనర్ గౌరీ శంకర రావు  తదితరులు పాల్గొన్నారు.

Kurupam

2021-09-06 13:35:00

రౌతులపూడి ఎంఈఓకి ఘన సన్మానం..

తుని గాయత్రీ కాలేజీలో గురుపూజోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి ఎంఈఓ ఎస్వీనాయుడు పాల్గొని గురువుయొక్క విశిష్టతను తెలియజేశారు. ప్రపచంలో గురువు స్థానం ఎవరికీ లేదని, అలాంటి గురు స్థానంలో ఉన్నవారంతా దివంగత సర్వేపల్లి రాధాక్రిష్ణను స్పూర్తిగా తీసుకొని దేశ సేవకై పనిచేయాలన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మూర్తి, ఇతర సిబ్బంది ఎంఈఓను ఘనంగా సర్మానించారు. ఈ కార్యక్రంలో కాలేజి అద్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


Tuni

2021-09-05 15:36:11

జగత్తులో గురువుని మించిన దైవంలేదు..

ఈ జగత్తులో గురువుని మించిన దైవం లేదని రౌతులపూడి ఎంఈఓ ఎస్వీనాయుడు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం గురుపూజోత్సవం సందర్భంగా తుని కుమ్మరిలోవ తపోవనం స్వామీజీ నుంచి ఆశ్వీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి గురువులే వెన్నుముఖ అని, ఎందరో బావి విద్యార్ధులను తీర్చిదిద్దే అవకాశం ఈ ప్రపంచంలో ఒక్క గురువుకి మాత్రమే దక్కుతుందన్నారు. గురుపూజోత్సవం రోజున స్వామీజీని కలుసుకొని ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tuni

2021-09-05 13:01:36

పీహెచ్సీ వైద్యాధికారి సేవలు మరువలేనివి..

ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డా.ఏవి.రమణ సేవలు మరువలేనివని ఎంపీడీఓ గోవింద్ కొనియాడారు. ఆదివారం ఏలేశ్వరం పీహెచ్సీలో వైద్యాధికారి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ,  డాక్టర్ ఏవి రమణ వైద్యులతోపాటు, ప్రభుత్వ సిబ్బందికి ఎంతో మంచి వైద్యసేవలు అందించేవారన్నారు. అలాంటి వ్యక్తి ఉద్యోగ విరమణ చేసి దూరమవుతున్నా సేవలు అందించాలని కోరారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రంలో ఆసుపత్రి సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

2021-09-05 11:04:43

రౌతులపూడి మండాలనికి 310 కోవిడ్ డోసులు..

రౌతులపూడి  పరిధిలోని మూడు గ్రామసచివాలయాల్లోనూ సోమవారం కోవిడ్ వేక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ ఎస్వీనాయుడు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం రౌతులపూడిలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 14 ఆరోగ్య కార్తల ద్వారా ఈ కోవిడ్ వేక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 18ఏళ్లు నిండిన వారికి, మొదటిడోసు పూర్తయి84 రోజులు దాటిన వారికి 2వ వడోసు కూడా వేస్తారని ఎంపీడీఓ  పేర్కొన్నారు. కాగా  ఇందులో 310 కోవీషీల్డ్ డోసులు, 110 కోవాగ్జిన్ డోసులు జిల్లానుంచి కేటాయింపు జరిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Rowthulapudi

2021-09-05 10:33:37

శంఖవరానికి 240 కోవిడ్ డోసులు..

శంఖవరం పరిధిలోని మూడు గ్రామసచివాలయాల్లోనూ సోమవారం కోవిడ్ వేక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవిసత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పీహెచ్సీ పరిధిలోని 7 ఆరోగ్య కార్తలు ఈ కోవిడ్ వేక్సినేషన్ క్యాంపులో పాల్గొంటారని, వారితోపాటు పీహెచ్సీలోనూ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో 150 కోవీషీల్డ్ డోసులు, 90 కోవాగ్జిన్ డోసులు జిల్లానుంచి కేటాయింపు జరిందన్నారు. 18ఏళ్లు నిండిన వారికి, మొదటిడోసు పూర్తయి84 రోజులు దాటిన వారికి 2వ వడోసు కూడా వేస్తారని డాక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

Sankhavaram

2021-09-05 10:31:36

2021-09-05 06:33:18

ఈఎన్ఎస్ లైవ్ వార్తకు స్పందన.. డీజీపీ మోమోతో పిక్చర్ వెరీ క్లియర్..

ఏపీ పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా మహిళా పోలీసులను ఏ ఇతర విధులకు ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శిలు వినియోగించడానికి వీల్లేదంటూ పోలీస్ బాస్, డీజీపీ గౌతం సవాంగ్ మెమో( Rc.No.7113/C3/2021, Dated: 03-09-2021) జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా తెలియజేశారు. ఈ విషయంలో రాష్ట్రంలో చాలా మంది ఎంపీడీఓలు, వివిధశాఖల అధికారులు తమ అనుమతి లేకుండా విధులు కేటాయించడం సరికాదని ఆ మెమోలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముందుగానే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.netప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేక వార్త కధనాలుగా తీసుకెళ్లడంతో డిజీపీ అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిల కంటే అత్యంత వేగంగా స్పందించారు. తమ సిబ్బందిని తమశాఖ పనుల తరువాత ఖాళీ ఉంటే.. అదీ ముందస్తు అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే వినియోగించాలని ఆ మెమోలో పేర్కొన్నారు. జిఓనెంబరు 59 ద్వారా మహిళా పోలీసులంతా హోంశాఖకు చెందిన ఉద్యోగులని గుర్తించాలని.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి విధులన్నీ పోలీస్ శాఖకు చెందినవే నని పేర్కొన్నారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గ్రామవార్డు సచివాలయశాఖ ముఖ్య కార్యదర్శికి, పోలీస్ శాఖ ముఖ్యకార్యదర్శికి, అన్ని జిల్లా పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలకు ఆ మెమో లేఖనులేక పంపారు. దీని ద్వారా గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను ఇకపై ఏ పనులకు పడితే ఆ పనులకు, గ్రామసచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీలు కార్యాలయ పనులకు, ఇతర ప్రభుత్వశాఖల విధులకు వినియోగించడానికి వీలుండదు. గతంలో వీరు పోలీస్ శాఖకు చెందినవారైనప్పటికీ మండల స్థాయిలో ఎంపీడీఓ బాసులుగా పెత్తనం చెలాయించేవారు.

ఆ సమయంలో ఇటు స్టేషన్ ఎస్ఐలకు చెప్పలేక, ఇటు అధికారులు చెప్పిన పనులను చేయలేక మహిళా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొన్ని సందర్భాల్లో పంచాయతీ కార్యదర్శిల దగ్గర నుంచి మా పనైతే చేయడానికి ముందుకు రావడం లేదనే మాటలు కూడా పడేవారు. ఈ విషయాలన్నీ నిఘా వర్గాలు, మీడియా కధనాల ద్వారా డిజీపీకి చేరకడంతో ఉన్నఫళంగా ఈ అత్యవసర మెమో జారీచేశారు. అయితే ఈ విషయంలో ముందునుంచీ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్ఐలు మహిళా పోలీసులను ఇతర ప్రభుత్వశాఖల విధులు చేయవద్దని చెబుతున్నప్పటికీ లిఖిత పూర్వక ఆదేశాలు లేకపోవడంతో వీరు ఇబ్బందులు పడుతూ, ఇతరశాఖల పనులు, కార్యాలయంలోని అన్నిరకాల పనులు చేయాల్సి వచ్చేది. ఆ సమయంలోనే గ్రామసచివాలయాల్లో ఉద్యోగులు ఇతర ప్రభుత్వ శాఖల పనులు చేస్తున్న తీరుపై ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో కొందరు పోలీసు సిబ్బంది కూడా మహిళా పోలీసుల విషయంలో చేస్తున్న వ్యంగ్యమైన కామెంట్లును కూడీ డీజీపి కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. వాస్తవానికి పోలీస్ శాఖ ద్వారా అపాయింట్ మెంట్లు ఇచ్చిన తరువాత కూడా చాలా స్టేషన్ లో హోంగార్డు నుంచి ఎస్ఐ వరకూ వివిధ రకాలుగా మీరు మాలా పోలీసులు కాదని, ప్రభుత్వం గుర్తించినంత మాత్రన మేము గుర్తించాలా అనే భారీ పదాలను కూడా వినియోగించేవారు. అయితే ఈ మాటలన్నీ ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లవనుకున్నారు. క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు పడుతున్న ఇబ్బందులు, రెండుమూడు శాఖలకు సంబంధించి చేస్తున్న విధులను  ప్రజలు, ప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేకంగా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యప్ ద్వారా ప్రత్యేక కధనాలు ప్రచురించడంతోపాటు,  డిజిపి కూడా చాలా త్వరాగా మహిళా పోలీసులు పడుతున్న ఇబ్బందులు, అవమానాలను గుర్తించారు.

ఈ విధానానికి ఎలాగైనా అడ్డుకట్టవేయాలని నిర్ణయించుకొని మెమో జారీచేశారు. ఆ మెమోతో ఇప్పటి వరకూ మండలంలో తామే బాసులమని ఫీలపైపోయిన ఎంపీడీఓలు, సచివాలయాల్లో మా మాట వినకపోతే జీలాలు ఆపేస్తాం.. పకి రాసేస్తాం అంటూ బీరాలు పోయిన పంచాయతీ సెక్రటరీల గొంతులో పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. అటు ప్రభుత్వం కూడా డీజీపి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం ఈమెమో విషయంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిని రాష్ట్రంలో ఎన్నిజిల్లాల్లో ఎంతమంది ఎంపీడీఓలు, ఎన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీలు ఏస్థాయిలో పాటిస్తారోననేది మాత్రం ప్రశ్నార్ధకమే. ఏ ప్రభుత్వ శాఖలో అయినా జిఓలుగానీ, మెమోలుగా అమలుకాకపోతే ఆశాఖల ముఖ్యకార్యదర్శిలు పట్టించుకోని దాఖాలాలే ఇప్పటి వరకూ గ్రామసచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ ఉన్నాయి. కానీ మొదటి సారిగా డీజీపీ నేరుగా ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు మహిళా పోలీసులకు అప్పగిస్తున్న అదనపు విధుల విషయంలో మాత్రం ముక్కుసూటిగా వ్యవహరించడంతో వారందరికీ ఒక రకంగా లక్ష్మణరేఖ అడ్డుపడినట్టు అయ్యింది. ఏది ఏమైనా పోలీస్ బాస్ మెమో మాత్రం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపి క్ గా మారింది. అటు తమ సమస్యను పరిష్కరించడంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చేసిన సహాయాన్ని గుర్తిస్తూ మహిళా పోలీసులంతా ఈఎన్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఫోన్లు చేసి తమ హర్షాన్ని, అనందాన్ని వ్యక్తం చేశారు. మీ మేలు మరిచిపోలేమంటూ ధన్యవాదములు తెలియజేశారు. అదేవిధంగా డిజీపీ గౌతం సవాంగ్ సర్ తేంక్యూ.. అంటూ మెసేజులు తమ తమ సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున మెసేజులు పెడుతున్నారు..!

తాడేపల్లి

2021-09-05 03:30:50

మా ప్రొబేషన్ పరీక్షకు గడువు పెంచండి సారూ..

గ్రామసచివాలయాల్లో పనిచేసే విద్యా, వెల్పేర్ అసిస్టెంట్లకు ప్రొబేషన్ డిక్లరేషన్ కు నిర్వహించే పరీక్షకు గడువు పెంచాలని కోరుతూ మండల సిబ్బంది ఎంపీడీఓకి శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు శంఖవరం ఎంపీడీఓ జె.రాంబాబును కలిసి సంక్షేమ కార్యదర్శిలు తమ గోడును వెల్లదీసుకున్నారు. సర్వీసు డిక్లరేషన్ కు సర్వీసు నిబంధనలు మార్చి ఇచ్చిన పరీక్ష తక్కువ సమయంలో పెట్టడం ద్వారా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలియజేశారు. తమకు కూడా మిగిలిన శాఖల సిబ్బంది మాదిరిగా మూడు దఫాల్లో డిపార్టమెంటల్ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం కల్పించేలా జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లాలని ఆ వినతి పత్రంలో ఎంపీడీఓని కోరారు. లేదంటే అందరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని 16 గ్రామసచివాలయాల పరిధిలోని  విద్యా, వెల్పేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-04 16:19:38

సస్యరక్షణపై అవగాహన కల్పించండి..

రైతులకు సమగ్ర సస్య రక్షణ పద్దతులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారి పి.గాంధీ సిబ్బందికి సూచించారు. వైఎస్సార్ పొలం బడి శిక్షణా కార్యక్రమంలో భాగంగా రౌతులపూడిలో వరి,ప్రత్తి పంటల్లో పంటపొలం పరిశీలన చేసేసాగు పద్దతులపై భౌతిక పద్దతులు,యాంత్రిక పద్ధతులు,జీవ నియంత్రణ పద్ధతులు,రసాయన విధానాల ఉపయోగం సిబ్బందికి అవగాహన కల్పించారు. తీసుకున్న శిక్షణను వినియోగంలో పెట్టి  రైతు భరోసా కేంద్రం లో ఉన్న ఎరువులు, పురుగు మందుల వాడకం గూర్చి రైతులకు వివరించాలని తెలిపారు. అనంతరం బృంద విన్యాసం చేయించి ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో  ఏఈఓ గోపి, సిబ్బంది సతీశ్,ఉమ,లహరి,మణికంఠ,మాధురి, రామకృష్ణ,ప్రసాద్,శేఖర్,చిన్ని,కిరణ్,శ్రీను,జగదీశ్,వీరేంద్ర,సన్యాసి రావు, వీర మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Rowthulapudi

2021-09-04 11:39:53

ప్రొబేషనరీ పరీక్షకు శిక్షణ ఎంతో దోహదం..

గ్రామసచివాలయాల మహిళాపోలీసులకు సర్వీస్ రెగ్యులైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇచ్చే శిక్షణ ఆన్ లైన్ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు చెప్పారు. శనివారం ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలోని గ్రామసచివాలయ మహిళా పోలీసులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొని వివిధ నేరాలకు సంబంధించి ఏఏ సెక్షన్ లు వినియోగించాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా మహిళా పోలీసులు గ్రామ సంరక్షణలో కీలకంగా వ్యవహరించాలన్నారు. అన్ని విషయాలపైనా అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్టోబరు 2 నాటికి మహిళా పోలీసులంతా ప్రొబేషనరీకి సంబంధించిన ప్రత్యేకక ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి ఇలాంటి శిక్షణలోని అంశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సర్కిల్ లోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Prathipadu

2021-09-04 09:20:26

జగనన్న గోరుముద్ద నాణ్యతలో తేడా రాకూడదు..

ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్నాం పథకం ద్వారా అందించే భోజనం(జనగనన్న గోరుముద్ద)లో నాణ్యత తగ్గడానికి వీల్లేదని ఎంపీడీఓ ఎస్వీనాయుడు నిర్వాహకులకు సూచించారు. శనివారం రౌతులపూడి హైస్కులో భోజనాలను పరిశీలించి స్వయంగా రుచిచూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్ధుల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని పాఠశాలలోనే మధ్యాహ్నాం భోజనం అందిస్తున్నదన్నారు. దానికోసం నిర్వాహకులు మెనూ ప్రకారం సుచిగా, రుచిగా భోజనాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వాసిరెడ్డి భాస్కరబాబు తదితరులు కూడా పాల్గొని విద్యార్ధులకు పెట్టే భోజనాన్ని రుచిచూసి సంత్రుప్తి వ్యక్తం చేశారు.

Rowthulapudi

2021-09-04 08:48:48

పారిశుధ్యంపై ప్రత్యేకంగా ద్రుష్టిసారించాలి..

డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు ప్రస్తుతం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామసచివాలయ, పంచాయతీ కార్యదర్శిలు పారిశుధ్యంపై ద్రుష్టి సారించాలని ఎంపీడీఓ గోవిందు సూచించారు. ఈమేరకు శనివారం ఏలేశ్వరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఆయన కార్యదర్శిలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. సచివాలయాల్లోని వాలంటీర్ల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా జ్వరాలున్న వారి ఇళ్లదగ్గర కూడా బ్లీచింగ్ చైన్ వేయించడంతోపాటు, వారంలో రెండు రోజులు డ్రైడే పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జ్వరాలు వచ్చిన వారి వివరాలను వైద్యసిబ్బందికి తెలియజేయాలన్నారు. పీహెచ్సీకి తరలించి వైద్య పరీక్షలు, రక్తపరీక్షలు చేయించాలని ఆదేశించినట్టు ఎంపీడీఓ గోవింద్  పేర్కొన్నారు.

Yeleswaram

2021-09-04 08:18:30