1 ENS Live Breaking News

విప్లవజ్యోతి అల్లూరికి ఘనంగా నివాళులు

మన్యంలో మహోదయం సృష్టించిన ధీరుడు విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమ జాతి ఎన్నటికీ మరిచి పోదని సర్పంచి సత్యంనాయుడు, ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు అన్నారు. అల్లూరి 97వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం క్రిష్ణదేవిపేటలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం బ్రిటీషు ప్రభుత్వాన్ని ఎదరించి అల్లూరి సీతారామరాజు చేసిన మన్యం పితూరి ఒక చారిత్రక ఘట్టమన్నారు. అల్లూరి రచ్చబండ పంచాయతీలను ప్రారంభించి ప్రజలను చైతన్యం చేయడానికి వేదికైన గ్రామంగా కూడా క్రిష్ణదేవిపేట కీర్తికెక్కిందన్నారు. అల్లూరి పోరాటంలో దేశవ్యాప్తం కావడానికి కారణమైన చారిత్రక  గ్రామంగా కూడా క్రిష్ణదేవీపేట చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాంతంలో మహానుభావుడు అల్లూరి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

క్రిష్ణదేవీపేట

2021-05-07 07:23:39

అల్లూరి సీతారామరాజకి ఘనంగా నివాళి..

విప్లవజ్యోతి, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర భావి పౌరులంతా తెలుసుకోవాలని ఉప సర్పంచి సిహెచ్ కుమార్ పిలుపునిచ్చారు. అల్లూరి 97వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రమైన శంఖవరంలో అల్లూరి విగ్రహానికి ఘవంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం అల్లూరి  వీరోచిత పోరాటం చేసిన ధీరుడని కొనియాడారు. అంతేకాకుండా అప్పటి బ్రిటీష్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ కి మిరపకాయ్ టపా ద్వారా వర్తమానం పంపి తన పై దాడి చేయాలని సవాల్ విసిరిన అరుదైన ఘట్టానికి వేదికగా శంఖవరం గ్రామం కీర్తికెక్కిందన్నారు. అల్లూరి సీతారామరాజు ఒకరోజంతా గడిపిన గ్రామంగా కూడా తరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది రమణమూర్తి, కార్యదర్శి సత్య, మహిళా సంరక్షణ కార్యదర్శి జిఎన్ఎస్ శిరీష, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

శంఖవరం

2021-05-07 06:58:22

29 మందికి 2వ డోసు వేక్సినేషన్..

శంఖవరం పీహెచ్సీలో 29 మందికి రెండో డోసు కోవిడ్ వేక్సినేషన్ చేసినట్టు వైద్యాధికారి డా..ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. గురువారం ఆయన  ఆసుపత్రిలో మీడియాలో మాట్లాడుతూ, గతంలో మొదటి డోసు టీకా వేసిన 29 మందికి ఈ రోజు రెండో డోసు వేసినట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలంతా కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ పనులు చూసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. ఏ పనిచేసినా శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ కిట్లను కూడా అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.

శంఖవరం

2021-05-06 08:19:28

కరోనా కర్ఫ్యూకి ప్రజలు సహకరించాలి..

కరోనా కర్ఫ్యూకి ప్రజలు సహకరించాలని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ కోరారు. బుధవారం ఆయన కర్ఫ్యూ సందర్భంగా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా కర్ఫ్యూ నిర్వహించాలన్నారు. అదేవిధంగా అధికారులు, సిబ్బంది కూడా కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 50 ఆక్సిజెన్ బెడ్స్ తో పాటు, అదనంగా మరికొన్ని తన సొంత నిధులతో సమకూర్చినట్టు తెలియజేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ,ప్రజా ప్రతినిధులుగా మేము ఖచ్చితంగా ప్రజలకోసం పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరి బాబు , పట్టణ అధ్యక్షులు మంద పాటి జానకి రామ రాజు, 80 వార్డ్ ఇంచార్జి కొణతాల భాస్కర్ ,అనకాపల్లి RDO సీతారాం, జీవీఎంసీ కమిషనర్ శ్రీరామ్ మూర్తి , టౌన్ సిఐ భాస్కరరావు ,  అనకాపల్లి డిప్యూటీ తాసిల్దారు వెంకట్ , కశింకోట డిప్యూటీ తహసీల్దారు శేషు, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి  వైద్యఅధికారులు, జీఎంఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

2021-05-05 13:47:09

రేపటి నుంచి పర్యాటక ప్రాంతాలు బంద్..

కోవిడ్ సెకండ్ వేవ్ నేపధ్యంలో విశాఖ ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను ఈనెల 5 వతేదీ నుంచి మూసి వేస్తున్నట్లు ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అరకువ్యాలీ మండలంలోని పెదలబుడు గిరి గ్రామ దర్శిని, మండల కేంద్రంలో ఉన్న గిరిజన మ్యూజియం , పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలం చాపరాయి జలపాతం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతాల ప్రవేశాలను రద్దు చేసామని ప్రకటించారు. పర్యాటకులను అనుమించ వద్దని సంబంధిత నిర్వహకులను ఆదేశించారు. మన్యంలో ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. అవసరం లేకుండా బయటకు రాకూడదన్నారు. బయటకు వెళ్లే వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. సామాజిక బాధ్యతతో కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.

పాడేరు

2021-05-04 14:52:24

రేపటి నుంచి కోవిడ్ కేర్ సెంటర్ సేవలు..

పాడేరు  కుమ్మరిపుట్టు యూత్ శిక్షణా కేంద్రంలో రెండు వందల పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ఆర్ డి ఓ కె. లక్ష్మి శివజ్యోతి చెప్పారు. ఈనెల 5 వతేదీ నుంచి కోవిడ్ కేర్ సెంటర్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మంగళవారం యూత్ శిక్షణా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. మరుగుదొడ్లు ,స్నానపు గదులు, తనిఖీ చేసారు. కోవిడ్ పేషెంట్లకు చన్నీళ్లు, వేడినీటి సౌకర్యం కల్పించాలన్నారు. పూర్తి స్దాయిలో విద్యుత్తు, తాగునీటి సదుపాయాలు , మరుగుదొడ్లకు నిరంతరం నీటి సరఫరా అందించాలని అధికారులకు సూచించారు. ప్రతీ గదిలో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన పోషకాహారం, రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్నారు , కోవిడ్ కేర్ సెంటర్లో ముగ్గురు డాక్టర్లను, ఐదుగురు స్టాఫ్ నర్సులను,శానిటేషన్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. వారు నిరంతరం సేవలందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కెవి ఎస్ ఎన్ కుమార్, తాహశీల్దార్ ప్రకాశరావు, డి ఇ ఇ అనుదీప్, సహాయ గిరిజన సంక్షేమాధికారి ఎల్ . రజని తదితరులు పాల్గొన్నారు.

పాడేరు

2021-05-04 14:35:46

ఆక్సిజన్ స్టోరేజీ పాయింట్లు గుర్తించాలి..

ఆసుపత్రులకు అందుబాటులో ఉండే విధంగా ఆక్సిజన్ స్టోరేజి పాయింట్ ను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు ను ఆదేశించారు.  మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ అడ్మిషన్లు, కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా, పరీక్షల పై  ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగిందని, అందుకు అనుగుణంగా జిల్లాలో కెజిహెచ్ లోని సిఎస్ఆర్ బ్లాక్ వద్ద, విమ్స్,  చెస్ట్, ఇఎన్టీ, సైకియాట్రి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, అనకాపల్లి ఆసుపత్రి, నర్సీపట్నం, అరకు, పాడేరు, గాయత్రీ, గీతం, ఎన్నారై మెడికల్ కళాశాలల వద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు త్వరితగతిన తయారు చేయాలని, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ డిఎ నాయుడుని ఆదేశించారు. సైకియాట్రి ఆసుపత్రిలో ఉన్న డ్రగ్స్ మెటీరియల్స్ ను ప్రక్కనే నిర్మాణం లో ఉన్న భవనంను త్వరితిన పూర్తి చేసి డ్రగ్స్ మెటీరియల్ ను అందులోకి మార్చితే అందులో ఆక్సిజన్ సరఫరా చేయుటకు వీలుగా కనెక్షన్లు ఉన్నాయని, అందులో కోవిడ్ పడకలు ఏర్పాటు చేయాలని ఇఇ ని ఆదేశించారు. ఒక ఆక్సిజన్ ప్లాంట్ రెండు, మూడు ఆసుపత్రులకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. నైట్రోజన్ జనరేషన్ ప్లాంట్ లు ఎన్ని ఉన్నాయో డ్రగ్ కంట్రోల్ ఎ. డి. జిఎం ఇండస్ట్రీస్ ను అడిగి తెలుసుకున్నారు. హైల్త్ సిటీ లో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ సరఫరా కు టెక్నీషియన్ తో చర్చించారు. నిరంతర ఆక్సిజన్ సరఫరా పై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ లు ఉన్నాయో లేదో, ఒక రోజులో  ఆక్సిజన్ సరఫరా, వినియోగంపై
డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు రజిత ను అడిగి తెలుసుకున్నారు. 

ఆసుపత్రుల్లో అడ్మిషన్లు : 

ప్రతీ రోజు ఉదయం ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి ఖాళీ పడకల సంఖ్య తెలుసుకొని ఆ వివరాలను 104 కాల్ సెంటర్ నోడల్ అధికారి, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు కు తప్పనిసరిగా తెలియజేయాలని డిఎం అండ్ హెచ్ఓ, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ లను ఆదేశించారు. 

కోవిడ్ - 19 మెటీరియల్ :
మెటీరియల్ ఎంత ఉన్నది, ఎంత అవసరమో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ మెటీరియల్ పరిశీలించి ఆక్సిజన్ మాస్క్ లు, గ్లౌజులు, N 95 మాస్క్ లు, పిపిపి కిట్స్, NIV మాస్క్ లు, సర్జికల్ మాస్క్ లు, తదితరమైనవి
 ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కొనుగోలుకు తగు చర్యలు తీసుకోవాలని ఎఎంసి ప్రిన్సిపాల్, డిఎంహెచ్ఓలను ఆదేశించారు. 

విమ్స్ లో వచ్చే వారం నాటికి 650 పడకలు ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలని విమ్స్ సంచాలకులు డాక్టర్ సత్య వరప్రసాద్, ఎపిఎంఎస్ఐడిసి ఇఇలను ఆదేశించారు. పెంచే పడకలకు ఆక్సిజన్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కోవిడ్ మెటీరియల్ కొనుగోలుకు టెండర్లు పిలవాలన్నారు.

         ఈ సమావేశంలో  ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు, డ్రగ్ కంట్రోల్ అధికారులు రజిత, కళ్యాణి, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు. 

2021-05-04 14:27:07

YSR సంపూర్ణ పోషణ సద్వినియోగం చేసుకోవాలి

వైఎస్సార్ సంపూర్ణ పోషణ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శి జిఎన్ఎస్ శిరీష అన్నారు. మంగళవారం శంఖవరంలోని అంగ్వాజీ-4 పరిధిలోని  బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ఎం.రాజ్యలక్ష్మి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

శంఖవరం

2021-05-04 06:59:43

కోవిడ్ కేర్ సెంటర్ లో పూర్తి సేవలు..

క్వారంటైన్ కేంద్రంలో పూర్తిస్థాయిలో సదుపాయాలు అందించాలని అని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు.  సోమవారం ఐ.టి.డి.ఎ  ప్రాజెక్ట్ అధికారి బొబ్బిలి పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో 230 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వరెంటైన్ సెంటర్ లో నిర్వహిస్తున్న పనులు పరిశీలించారు, కేంద్రాల కరోనా చికిత్స పొందుతున్న వారికి అందజేస్తున్న సేవల పై అరా తీశారు. ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ కరోనా సోకినా ఆందోళన చెందొద్దని ధైర్యంగా ఉంటే కరోనా జయించడం సాధ్యం అన్నారు.  ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరుగ కుండా  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి ఏటువంటి అసౌకర్యం కలుగ కుండా చూడాలని అన్నారు. 24 గంటలు  త్రాగునీరు, విద్యుత్ కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. కేంద్రంలో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కేంద్రం నిర్వహణకు సంబంధించి వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చికిత్స తీసుకుంటున్న వారికి సకాలంలో వైద్యం, నిర్దేశిత మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి అని ఆదేశించారు. 

     ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.అండ్.హెచ్.ఓ రవి కుమార్ రెడ్డి, బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం, మండల రెవెన్యూ ఆధికారులు, సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బొబ్బిలి

2021-05-03 15:15:56

పివిజి రాజు ఆశయాలే మాకు స్ఫూర్తి..

దివంగత మహారాజు పూసపాటి విజయరామ గజపతిరాజు ఆశయాలే తమకు స్పూర్తి అని శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయం  అనువంశిక ధర్మకర్త, ఛైర్ పర్సన్ సంచయిత అన్నారు. పీవీజీ 97వ జయంతి సందర్భంగా గోశాలలో ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్శన్  సంచయిత మాట్లాడుతూ, ఆయన సింహాచలం దేవస్థానానికి 100ఏళ్లకు పైగా దేవస్థానం చైర్మన్, ధర్మకర్తగా ఎంతోబాగా పనిచేశారని కొనియాడారు. మా తాత మహారాజ విజయరామ గజపతి ఒక గొప్పదాత, విద్యావేత్త, మానవతావది అని కొనియాడారు. ఆయన దూరదృష్టి స్ఫూర్తిని స్మరించుకుంటూ ముందుకు సాగుతామన్నారు. కరోనా కష్టకాలంలోనూ శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి పూజలకు ఎలాంటి లోటు రాకుండా, నిబంధనల మేరకు భక్తులను అనుమతిస్తున్నామని చెప్పారు. ఈఓ సూర్యకళ  పీవీజీ రాజు సేవలను కొనియాడారు. పివిజి రాజు కోరుకొండ సైనిక స్కూల్ కు  వెయ్యి ఎకరాలకుపైగా దానం చేయడంతో దేశంలోనే తొలి సైనిక స్కూల్ ఏర్పడింది. కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సింహాచలం

2021-05-01 08:26:48

జిఓ-2లో అంశాలపై స్పష్టత ఇవ్వండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఓనెంబరు 2 లో కొన్ని అంశాల్లో తమకు స్పష్టత ఇవ్వాలని కోరుతూ గ్రేడ్5 సచివాలయ కార్యదర్శిలు ఎంపీడీఓ జె.రాంబాబుని కలిసి వినతిపత్రం సమర్పించారు. శంఖవరం మండలంలోని గ్రామసచివాలయ కార్యదర్శిలు ఎంపీడీఓ  కలిసి జీఓ2 విషయంలో ఎదురవుతున్న పలు సమస్యలను ఆయన ద్రుష్టికి తీసుకెళ్లారు. వీఆర్వోలకు డిడిఓలుగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, క్లస్టర్ పరిధిలోని గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శిల విధులేంటో కూడా తెలియజేయాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు. అదేవిధంగా ఒక పంచాయతీకి ఒక సెక్రటరీని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. తమకు నిర్ధిష్ట అధికారాలు ఇవ్వడం ద్వారా ప్రజలకు సచివాలయాల పరిధిలో మరింతగా సేవలు అందించడానికి వీలుపడుతుందనే విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లాలని ఎంపీడీఓను కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శిలు కోడూరి శంకరాచార్యులు, సత్యవెంకటేష్, వీరబాబు, శివరామక్రిష్ణ, సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

శంఖవరం

2021-05-01 07:52:45

పూర్తి అవగాహనతోనే కరోనా నియంత్రణ..

కోవిడ్ 19 వైరస్ పట్ల పూర్తి అవగాహన పెంచుకొని నిబంధనలను పాటించడం ద్వారా వైరస్ ను  నియంత్రించడానికి వీలు పడుతుందని ప్రమిస్ ల్యాండ్ ట్రైబల్ వెల్పేర్ అసోసియేషన్ డైరెక్టర్ పి.రమణ అన్నారు. శనివారం  అనంతగరి మండలం బిడ్డచెట్టు కాలనీలో సమిధ సంస్థతో కలిసి ఆయన గిరిజన యువతకు  కరోనా వైరస్, నియంత్రణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనతో కూడిన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సంస్థ  డైరెక్టర్ డి.వీరభద్రరావుతో కలిసి మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునన్నారు. అనవసరంగా జన సమూహంలో తిరగకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. యువత గ్రామాల్లోని వారికి ఈ వైరస్ పట్ల అవగాహన కల్పించడం ద్వారా గ్రామాల్లోకి ఈ వైరస్ ను రానీయకుండా చేసుకోవచ్చునని తెలియజేశారు. వైరస్ వచ్చిన తరువాత జాగ్రత్తలు తీసుకునే కంటే..వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని గిరి యువతకు అవగహాన కల్పించారు. అనంతరం యువతతో కలిపి గ్రామంలో ర్యాలీ నిర్వహించి, శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నవారికి సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బుదిరాజ్, సింహాద్రి, నాగమణి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి

2021-04-25 11:58:50

గిరిజనులకు ఆధార్ సేవలు చేరువ కావాలి..

హుకుంపేట మండలం లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రం ద్వరా గిరిజనులకు మరింతగా ఆధార్ సేవలు అందించాలని పాడేరు ఆర్డీఓ కె. లక్ష్మి శివ జ్యోతి కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఆధార్ కేంద్రం ద్వారా విద్యార్ధులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తరువాత ప్రజలకు అందుబాటులో సేవలను ఉంచాలన్నారు. కేవలం రోజుకు 30 దరఖాస్తులు మాత్రమే ఉండేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం హుకుంపేట తహశీల్దార్ కార్యాలయములో హుకుంపేట మండలం ములియాపుట్, ముంచింగ్ పుట్, హుకుంపేట గ్రామస్థుల రైతుల తో జాతీయ రహదారి కి సంబంధించిన నష్ట పరిహారం కోసం ఆమోద పత్రాలను తీసుకున్నారు. ఈ కార్య క్రమం లో తాహశీల్దార్ వై .వి. కోటేశ్వరరావు ,ఎల్.ఆర్.డిటి అప్పలనాయుడు పాల్గొన్నారు.

హుకుంపేట

2021-03-19 17:21:07

రైతులకు తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తాం..

హుకుంపేట మండలం బర్మంగూడ,కుంతిలి,పాటిమామిడి జాతీయ రహదారి నిర్మాణంలో గిరి రైతులకు  నష్టపరిహారం తప్పనిసరిగా చెల్లిస్తామని ఆర్డీఓ కె.లక్ష్మీ శివజ్యోతి స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు ఆయా గ్రామాలకు చెందిన 20మంది రైతులతో  హకుంపేట తాహశీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, రైతులెవరూ నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధర అందిస్తామని ఆమె తెలిపారు. ఈ విషయం పై రైతులు సమ్మతి తెలియజేసి సానుకూలంగా స్పందించారని ఆమె అన్నారు. ఎవరికీ నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి సమ్మతిని స్వీకరిస్తున్నట్టు చెప్పారు.  ఈ సమావేశం లో తహసీల్దార్ - వై. వి కోటేశ్వరరావు, బి. అప్పల నాయుడు,సి. సహాయకులు, టి.రామ్మూర్తి, ఆర్ఐ నల్లన్న, వీఆర్వో సత్యారావు, సర్వేయర్ - కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

Hukumpeta

2021-03-18 16:14:18

బాధితులకు నష్టపరిహారం అందుతుంది..

పాడేరు ఐటిడిఏ పరిధిలోని హుకుంపేట మండలంలో  రైతులతో చర్చించి - వారు నష్ట పోయే భూములకు ప్రభుత్వం వారు నిర్ణయించిన విధముగా నష్టపరిహారం చెల్లిస్తామని  రెవిన్యూ డివిజనల్ అధికారిణి   కె.లక్ష్మి శివ జ్యోతి తెలియజేశారు. బుధవారం ఈ మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గిరిపుత్రుల నుంచి వివరాలతో పాటు ఏ స్థాయిలో భూములు కోల్పోతున్నారో వివరాలు అడిగితెలుసుకున్నారు. మండంలోని గ్రామాలు, ప్రాంతాలు, స్థల విస్తీర్ణం ఆధారంగా నష్టపరిహారం అందిస్తామని ఆర్డీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వై.బి కోటేశ్వరరావు, ఎల్. ఆర్. డి. టి. - బి.అప్పల నాయుడు,మూర్తి ఆర్. ఐ - నల్లన్న, విఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

Hukumpeta

2021-03-17 19:15:56