1 ENS Live Breaking News

మద్దూరులంకలో పర్యటించిన ప్రత్యేక అధికారి

తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామంలో శనివారం ఉదయం  పునరావాస చర్యలు ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత లు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హెచ్ అరుణ్ కుమార్ గ్రామస్థులతో మాట్లాడుతూ, 1986 నాటి వరదల పరిస్థితి, ప్రస్తుతం వస్తున్న వరదల పరిస్థితి లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. అప్పుడు గోదావరి నదికి రక్షణ గట్లు లేవని, అందువల్ల వొచ్చిన వరదనీరు విస్తరించడం వలన ఎత్తు పెరిగిన సందర్భం చూడలేదని తెలిపారు. ఇప్పుడు నదికి బండ్ల ఏర్పాటు చెయ్యడం తో వరద నీరు వొచ్చే దిశాలో మార్పు వచ్చిందని తెలిపారు. ఇందువల్ల గ్రామంలోకి వరదనీరు వొచ్చే అవకాశం ఉందని తెలుస్తోందన్నారు.  ఈ కారణాలను ద్రుష్టిలో పెట్టుకుని వరద బాధిత ప్రాంతాల ప్రజలు తప్పకుండా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ నిన్నటి రోజున మద్దూరులంక గ్రామంలో పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరినా స్పందన రావడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బోట్ ద్వారా ఇంటింటికీ వెళుతూ  మీరు పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రానికి మరో నాలుగు అడుగులు నీటి మట్టం పెరిగి మీ ఇంటిలోకి వొచ్చే అవకాశం ఉందని తెలిపారు. వరద నీటిని తక్కువ అంచనా వెయ్యవద్దని, తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వొచ్చి తగిన భద్రత పొందాలని సూచించారు. 

పునరావాస కేంద్రాలలో భోజన వసతి, దుప్పట్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పై రాష్ట్రల నుంచి, పై ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టును, అక్కడి మన ప్రాంతానికి వరద నీరు చేరడంతో నానాటికీ పరిస్థితి కొంత ఆందోళన కలిగించేలా ఉందన్నారు. ఎప్పటి కప్పుడు వరద నీరు విడుదలచేస్తున్నట్ట్టూ తెలిపారు. ప్రత్యేక అధికారి హెచ్.అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మాధవీలత బోట్ లో ప్రయాణం చేసి మద్దూరులంక గ్రామ ప్రజలు పునరావస కేంద్రాలకు తరలిరావాలని  విజ్ఞప్తి చేశారు.

మద్దూరులంక

2022-07-16 09:53:34

వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.  శనివారం ఆమె 2వ జోన్ 11వ వార్డు పరిధిలోని ఆరిలోవ బాపూజీ నగర్ లోని వైయస్సార్ పార్టీ ఆఫీస్ లో  వైయస్సార్ పార్టీ నాయకులు ఇజ్ఞాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడి కవర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్నికి నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది పేదవారు శిబిరం ద్వారా ఈ సి జి, బిపి, షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా చేసి మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఇటువంటి శిబిరాలను నగరంలో ఉన్న మురికి వాడలో ఉన్న ప్రాంతాలలో పెట్టినట్లయితే ఆ ప్రాంతంలోని పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వైయస్సార్ సిపి నాయకులు సత్యనారాయణ, మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం ని అభినందించారు.

Visakhapatnam

2022-07-16 09:52:14

మరమ్మతులను పరిశీలించి ప్రభుత్వ విప్

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో కోతకు గురౌతున్నారు పొన్నపల్లి ప్రాంతంలో మరమ్మతు పనులను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు శనివారం పరిశీలించారు. ఎగువ నుంచి దివకు నీరు ఎక్కువగా చేరుతున్నందున పట్టణంలో కోతకు గురౌతున్నారు పొన్నపల్లి ప్రాంతంలో పర్యటించారు. పట్టణం లో నీరు ఎక్కువ అవుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరివెక్షించుకోవలని, అవసరాన్ని బట్టి వెంటనే నిర్ణయాలు తీసుకొని ప్రజలను అపరమత్తం చేసి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణ , జడ్పిటిసి బోక్క రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, నరసాపురం తాసిల్దార్ ఎస్ ఎమ్ ఫాజిల్  , ఇతర శాఖల అధికారులు,  పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Narsapur

2022-07-16 09:29:28

స్కూల్ ఫీజులు నోటీసు బోర్డులో ప్రదర్శించాలి

రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలల నోటీసు బోర్డులో ప్రతీ తరగతికి సంభందించిన పూర్తి ఫీజులు వివరాలు ప్రదర్శించాల్సిందే అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రోజెక్ట్ ఆఫీసర్ అనంతలక్ష్మి, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ శ్రీలక్ష్మి,జిల్లా బాలల సంరక్షణ అధికారి రమణ,ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి శ్రీ చైతన్య,రవీంద్ర భారతి పాఠశాలల్లో ఆయన పర్యటించారు,ముందుగా పాఠశాలల్లో నోటీసు బోర్డ్ ల్లో ఫీజులు వివరాలు లేక పోవడంపై జిల్లా విద్యాశాఖాధికారిని ప్రశ్నించారు, తరగతి గదులు, మరుగు దొడ్లు,మంచినీటి సదుపాయాలు, ఆట స్థలాలు,అగ్నిమాపక నిరోధకాలు, దండనలు, ఉపాధ్యాయుల లైంగిక వేదింపులు, ఫీజులు చెల్లించడంలో ఉన్న తారతమ్యాలు,మానసిక ఒత్తిడులు పైన విద్యార్థులతో మాట్లాడి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు, అనంతరం యుద్ధ ప్రాతిపదికన ఆయా పాఠశాలల్లో నోటీసు బోర్డు ల్లో దగ్గరుండి అతికింప జేశారు,అనంతరం సీతారాం మాట్లాడుతూ క్రమం తప్పకుండా కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలల్లో సందర్శనకు వెళ్లాల్సిన భాధ్యత సంభందిత మండల విద్యాశాఖాధికారులు ఇతర సిబ్బందిపై ఉందన్న విషయం మర్చిపోవద్దని సూచించారు. 

అన్ని స్థాయిల పాఠశాలల్లో ఫీజు వివరాలు ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత,భాధ్యత ఆయా పాఠశాలల యాజమాన్యాలపై ఉందని అన్నారు, జిల్లాలోని అన్ని పాఠశాలలను తక్షణమే తనిఖీలు చేపట్టి ఫీజుల వివరాలు అతికించేలా విద్యా శాఖాధికారి చర్యలు చేపట్టాలని సూచించారు, పాఠశాలల్లో సదుపాయాలు కల్పనకు ఆయా యాజమాన్యాలు చేపడుతున్న చర్యలపై తమ కమిషన్ కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు, ప్రైవేటు,కార్పొరేటు స్కూళ్ళు,కాలేజీలపై వచ్చే అన్ని రకాల ఫిర్యాదులపై కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు సారథ్యంలో స్పందించి ఆయా జిల్లాల అధికార యంత్రాంగాల నుండి పూర్తి సమాచారం సేకరిస్తుందని అన్నారు, ఇటువంటి వాటిపై  ప్రతికూల నివేదికలు అందితే ఆయా పాఠశాలల,కళాశాలల అనుమతులు రద్దు చేయించేందుకు,బాలల హక్కుల పరిరక్షణ చట్టాలకు అనుగుణంగా వివిధ సెక్షన్ల ద్వారా కేసులు నమోదు చేసేలా సంభందిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు,అంతిమంగా బాలలు,వారి తల్లిదండ్రులే  విజయం సాధించడంలో కమిషన్ చట్టబద్ధమైన కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

జిల్లా పోలీసు ఎస్పీ జి.ఆర్.రాధికతో  బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు,చైల్డ్ మిస్సింగ్ కేసులు,బాలల అక్రమ రవాణా బాల్యవివాహాలు,పోక్సో కేసులపైన చర్చించారు,బాలల చట్టాలపై పోలీసు సిబ్బందికి తరచూ సదస్సులు సమావేశాలు నిర్వహించాలని సూచించారు,జిల్లాను శత శాతం బాలల హక్కుల పరిరక్షణ జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ సునీతతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం, జిల్లా విద్యాశాఖాధికారి జి. పగాడాలమ్మ , ఐ సి డిఎస్ పి డి అనంతలక్ష్మి,జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మెన్ యు. శ్రీలక్ష్మి,సభ్యులు రమణ మూర్తి,గన్నెప్పడు,జిల్లా బాలల సంరక్షణ అధికారి రమణ లు భేటీ అయ్యారు,జిల్లాలో బాలల ప్రత్యేక హోమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు.అలాగే జిల్లాలో విద్యార్థులు,బాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు, నూతన శకానికి ఉపాధ్యాయులు నాంది పలకాలని కమిషన్ సభ్యులు సీతారాం అన్నారు,ఇందిరానగర్ కోలనిలోని సర్వశిక్షా అభియాన్ కార్యాలయం లో జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ ఆధ్వర్యంలో 30 మండలాల విద్యాశాఖాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతారాం మాట్లాడుతూ కొత్త ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేసేటపుడు నూటికి నూరుశాతం అన్ని ధ్రువీకరణలు ఉంటేనే అనుమతులు జారీచేయాలని అన్నారు,అలాగే నిత్యం పాఠశాలలను తనిఖీ చేస్తూ ఫీజులు వివరాలు,ఇతర సదుపాయాలు కల్పించేందుకు  పర్యవేక్షణాధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Srikakulam

2022-07-15 13:25:46

ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ

విజయనగరం జిల్లా  గజపతినగరంలోని ఎరువుల దుకాణాలను సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం ఆకశ్మీకంగా తనిఖీ చేశారు.విత్తనాలు , ఎరువులు, పురుగు మందులు సక్రమంగా విక్రయిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేశారు. ఈ పోస్ ద్వారా విక్రయిస్తున్నారు లెస్స అని ఆరా తీశారు. గిడ్డంగిని కూడా తనిఖీ చేసి స్టాక్ వివరాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిర్ధేశిత రేట్లకే ఎరువులు, విత్తలను అమ్మాలని ట్రేడర్లకు సూచించారు.  జె.సి వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తారక రామారావు,  వ్యవసాయ శాఖ  ఏ.డి. ఏ.ఓ తదితరలు  పాల్గొన్నారు.

Gajapatinagaram

2022-07-15 13:20:07

అంగ‌న్‌వాడీ కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

విజయగనగరం జిల్లా గంట్యాడ మండ‌లంలోని రావివ‌ల‌స‌ అంగ‌న్‌వాడీ కేంద్రాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ కేంద్రంలో న‌మోదైన‌ పిల్ల‌ల సంఖ్య‌, హాజ‌రైన వారి వివ‌రాల‌ను ప‌రిశీలించారు. వారికి ఇస్తున్న పోష‌కాహారంపై ఆరా తీశారు. పిల్ల‌ల ఎత్తు, బ‌రువు, ఇత‌ర ఆరోగ్య ప‌రీక్ష‌లు, టీకా కార్య‌క్ర‌మం త‌దిత‌ర వివ‌రాల‌పై, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ను ప్ర‌శ్నించారు. సంబంధిత రికార్డులను ప‌రిశీలించారు. పిల్ల‌ల‌తోపాటు, గ‌ర్భిణుల‌కు, బాలింత‌ల‌కు పెడుతున్న భోజ‌నంపై ఆరా తీశారు. వాటి నాణ్య‌త‌పై త‌ల్లుల‌ను ప్ర‌శ్నించారు. ల‌బ్దిదారులంతా కేంద్రాల‌కు వ‌చ్చి భోజ‌నం చేయాల‌ని సూచించారు. ప్ర‌తీఒక్క‌రూ కేంద్రానికి వ‌చ్చేలా, వారిని చైత‌న్య ప‌ర‌చాల‌ని అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Vizianagaram

2022-07-15 12:54:52

నిర్ధేశిత ధరలకే విత్తనాలు అమ్మాలి

విత్తనాలు,ఎరువులు ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే అమ్మకాలు చేపట్టాలని శంఖవరం వ్యవసాయ అధికారి పి.గాంధీ ట్రేడర్లకు సూచించారు. శుక్రవారం కాకినాడ జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపుడి లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను సందర్శించి స్టాకును, రిజిష్టర్ లను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ, ట్రేడర్లు షాప్ ల వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని, లైసెన్సులను రెవిన్యువల్ తప్పకుండా చేయించుకోవాలన్నారు. అనంతరం విత్తన నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం నియోజకవర్గంలోని ప్రయోగశాలకు పంపించారు. అనంతరం రైతులతో వరి నారు మడులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు ప్రభాస్,చిన్నబాబు,రైతులు  తదితరులు పాల్గొన్నారు.

Kathipudi

2022-07-15 12:32:26

వరద బాధితులు నిత్యవసరాలు

పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు బియ్యం, కందిపప్పు, పామ్ఆయిల్ పంపిణీకి  రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కె.జి వంట నూనె వరద ముంపు గ్రామాల ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. వరద సహాయక చర్యల్లో భాగంగా గోదావరి వరద తాకిడికి గురైన పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాలలో  ప్రభుత్వం ప్రకటించిన విధంగా సహాయం అందనున్నది. వరద తగ్గుముఖం పట్టేవరకు బాధిత కుటుంబాలు పునరావాస శిబిరాలలో ఉండాలని,  వసతి, భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. వరద కారణంగా ఇళ్ళు  ముంపునకు గురయ్యే ప్రజలు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటె వెంటనే పునరావాస శిబిరాలకు చేరుకోవాలన్నారు.  పునరావాస శిబిరాల్లోకి రమ్మని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయనప్పటికి కొన్ని   కుటుంబాలవారు రావడంలేదన్నారు. అధికారుల సూచనల మేరకు అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కోరారు. పునరావాస శిబిరాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్య సహాయం అందిస్తున్నామని, తాగునీటి కి ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.  పునరావాస శిబిరాలలో అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకున్నామని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Achanta

2022-07-15 12:31:29

నైపుణ్యతను పెంపొందించుకోవాలి

నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందున నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విశ్రాంతి ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి. పార్థసారథి పేర్కొన్నారు. శుక్రవారం  సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా యువతలో నైపుణ్యాలను రూపొందించేందుకు ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం  జరుపుకుంటున్నామన్నారు.  15- 24 మధ్యస్థ వయస్సు కలిగిన వ్యక్తులను యువతగా పరిగణిస్తామన్నారు. యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రధానమంత్రి కౌశి  ల్ కేంద్రం పేరుతో సాంకేతిక వృత్తిపరమైన శిక్షణను ఇస్తుందన్నారు. కొత్త నైపుణ్యాలను ప్రవేశపెట్టడం, వినూత్నమైన ఆలోచనా   ధోరణిని  ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను ఈ శాఖ  ప్రోత్సహిస్తున్నందున యువత సద్వినియోపరుచుకోవాలని పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-15 09:32:05

దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ

కాకినాడ సర్పవరం జంక్షన్ లోని ఫ్రెండ్స్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో అవసరాల సుబ్బారావు -కమల దంపతుల సౌజన్యంతో దివ్యాంగునికి మూడు చక్రాల బండి పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు పివి రాజేశ్వరి మాట్లాడుతూ వైకల్యం అనేది శారీరకమైన, మానసికమైన, పరిసరాలు అవరోధాలు అనే బాహ్య కారణాల వలన వస్తుందన్నారు. కుమారపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి చంటి రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోవడంతో దాతల సౌజన్యంతో మూడు చక్రాల బండిని అందజేశామన్నారు. మంచి మనసున్న దాతల ద్వారా ఎందరో నిరుపేదలకు, అభాగ్యులకు సేవలు అందతున్నాయన్నారు. ప్రతీ ఒక్కరూ తమవంతుగా సామాజిక సేవలో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజా నీలిమ, లక్ష్మి, మహేష్, మల్లేష్, సునీల్, మానస, స్వర్ణలత, అడబాల రత్న ప్రసాద్ ,రవిశంకర్ పట్నాయక్, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-15 09:29:38

అందవరపు కుటుంబానికి కృష్ణదాస్ పరామర్శ

శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అందవరపు  కొండలరావు సతీమణి భారతి ఇటీవల మ్రుతిచెందారు. వారి కుటుంబ సభ్యులను  మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ శుక్రవారం పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. స్వర్గీయ భారతి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భారతి కుమారుడు అందవరపు జగన్ తో పాటు ఆమె ఇరువురి కుమార్తెలను ఓదార్చారు.  కృష్ణదాస్ వెంట కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, అందవరపు ప్రసాద్, సంతోష్, వివిఎన్ ప్రకాష్ కూడా ఉన్నారు.

Srikakulam

2022-07-15 07:37:38

ఇబ్బంది లేకుండా పారిశుధ్య నిర్వహణ

పారిశుధ్య కార్మికులు గత నాలుగు రోజులుగా సమ్మెలో ఉన్నా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పారిశుధ్య నిర్వహణ చేపడుడున్నట్టు కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. గురువారం నగరంలో పారిశుధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో జగన్నాధపురం లోని ఏటిమొగ, మహాలక్ష్మి నగర్, ముత్తానగర్, సినిమా రోడ్డు ప్రాంతాలలో పర్యటించి  ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు, ప్రజలతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె ను దృష్టిలో ఉంచుకొని  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుబాటులో ఉన్న పర్మినెంట్ కార్మికులతో పాటు  ప్రైవేట్ కార్మికుల సహకారంతో చెత్త సేకరణకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. 75% వరకు సమస్య లేకపోయినా కొన్ని నివాసప్రాంతాలు, కమర్షియల్ ఏరియాలలో అక్కడక్కడా ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రజలు చెత్తను రోడ్లపైన డ్రైన్ ల లోను వేయకుండా  సహకరించాలని ఏ డి సి కోరారు. ఓవైపు వర్షాలు పడుతుండడం, జ్వరాల సీజన్ కావడం వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు వహించకపోతే అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ఇళ్లలోని చెత్తను  బయట పార వేయకుండా  ఇంటికి వచ్చే హూపర్ టిప్పర్ వాహనాలకు మాత్రమే అందజేయాలని సూచించారు. కార్మికుల సమ్మె పూర్తయ్యే వరకు ప్రజలు కూడా తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు.

Kakinada

2022-07-14 10:13:17

ఎలాంటి వరద పరిస్థితులను ఎదుర్కొంటాం

పశ్చిమగోదావరి జిల్లాలో జిల్లాలో ఎటువంటి వరద పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. గోదావరి ఉధృతి, అధిక వర్షాలవల్ల వరద తాకిడికిగురయ్యే నరసాపురం మండలంలోని పొన్నపల్లి, లాక్ డౌన్, కొత్త నవరసపురం, పాతనవరసపురం గ్రామాల్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు  జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాద్ రాజు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వరద పెరిగినా ముంపుకు గురవ్వకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, వరద పెరిగితే అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. పునరాస కేంద్రంలో మంచి భోజనం అందజేయడంతో పాటు, పరిశుభ్రంగా ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.   మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి షిఫ్ట్ ల వారీగా పనిచేసేలా విధులను కేటాయించాలని వైద్యాధికారులను ఆదేశించారు. 

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వరద తాకిడికి గురయ్యే ప్రాంతాల్లో విధులను కేటాయించిన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.  నిత్యవసర వస్తువులతో పాటు అవసరమైన మందులను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ పర్యటనలో భీమవరం ఆర్డీవో దాసిరాజు, నీటిపారుదల శాఖ డ్రైనేజీ ఈ ఈ పి.నాగార్జునరావు, తహసిల్దార్ ఫాజిల్, ఎంపీడీవో ఎన్ వి ఎస్ ప్రసాద్ యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, పురపాలక సంఘ కమిషనర్ సి హెచ్ శ్రీనివాస్,  వివిధ శాఖలు అధికారులు, కౌన్సిలర్స్, సర్పంచులు, తదితరులు వున్నారు.

Narsapur

2022-07-14 10:02:28

మానవాళి మనుగడకే ఆహార నియమాలు

మానవాళి మనుగడకి ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి అని పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి దేవనాథ జీయర్ స్వామి తెలియచేసారు. విశాఖపట్నం- భీమిలి బీచ్ రోడ్ లోని మంగమారిపేటలో గల చిన్నజీయర్ స్వామి వేదపాఠశాల ప్రాంగణం (వారిజ ఆశ్రమం) లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా గురువారం  భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేసారు. స్వామి మాట్లాడుతూ సాధారణంగా చాతుర్మాస్య దీక్ష ప్రతి ఒక్కరూ నిర్వహించవచ్చని అయితే ప్రస్తుత కాలానుగుణంగా కేవలం యతీశ్వరులు సన్యాసులు పీఠాధిపతులు మాత్రం తప్పకుండా ఈ దీక్షను ఆచరిస్తున్నారన్నారు. వర్షాకాలం కారణంగా జీవచరాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సంధ్యా సమయం తర్వాత పాదయాత్ర కానీ పర్యటనలు గాని చెయ్యరాదన్నారు. ఆహార నియమాలతో పాటు గ్రంథం పఠనం జరుగుతుందన్నారు. వర్షాకాలంలో వాతావరణ  ప్రభావంతో మనిషి  సాధారణ ఆహారాన్నీ తీసుకోలేడని, తిన్న ఆహారం  జీర్ణం  కావడానికి పరిస్థితి అనుకూలించదన్నారు. ఈ సమయంలో ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు, నిర్ణీత  సమయంలోనే ఆహారం తీసుకోవడం  అలవాటు  చేసుకోవాలన్నారు.  అలవాటు మారితే ఆలోచనా విధానం కూడా మారుతుందని, తద్వారా మంచి ఆలోచన చేయగలుగుతాడన్నారు. అందుకే ఈ సమయంలో చాతుర్మాస్య   దీక్ష 
లో సైతం  ఒక్కో నెలలో ఒక్క విధమైన ఆహారాన్ని  తీసుకుంటారని పేర్కొన్నారు.  ప్రస్తుత కాలంలో యాంత్రీక  జీవనం వల్ల యువత రాత్రివేళల్లో సరైన నిద్ర లేక, ఉదయం వేళల్లో సరైన ఆహారం లేక చిన్న  వయసులోనే పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఉన్న  సమయంలోనే ఆహారపు అలవాటును సరిదిద్దుకోవాలని స్వామి సూచించారు.

Bheemili

2022-07-14 08:56:52

సీనియర్ సిటిజన్స్ కు రాయితీ ఇవ్వాలి

రైళ్లలో ప్రయాణించే 50ఏళ్లు పైబడిన మహిళలకు50% శాతం 60ఏళ్లు పైబడిన పురుషులకు 40% శాతం రాయితీని రైల్వే శాఖ యధావిధిగా కొనసాగించాలని కాకినాడ పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వాన్ని కోరారు.  ఈ మేరకు భారతీయ రైల్వేకి రాసిన లేఖను మీడియాకి విడుదల చేశారు. రైల్వేశాఖ గతరెండేళ్లుగా కరోనా కారణంతో వృద్దులకు ఇచ్చే రాయితీలు నిలిపివేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని కొనసాగించకుండా రైల్వేప్రయి వేటీకరణ అజెండా అమలుకోసం అడ్డుకట్ట వేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైల్వేజనరల్ ప్రయాణా లు జనరల్ బోగీలు నిర్వహణ లేకుండా రిజర్వేషన్ కొనసాగిం చడం వలన రైలు ప్రయాణం ధర రెట్టింపు గా మారిపోయిందని, తద్వారా సీనియర్ సిటిజన్స్ కు భారంగా పరిణమించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీనియర్ సిటిజన్స్ కు రైల్వేలో ఇచ్చే ప్రయాణ రాయితీ విషయంలో ఒత్తిడి చేయాల్సిన బాధ్యత వుందన్నారు.  సీనియర్ సిటిజన్స్ పట్ల ఔదార్యం చూపాలని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ను లేఖలో కోరినట్టు మీడియా ద్వారా వివరించారు.

Kakinada

2022-07-14 08:51:18