సచివాలయ సిబ్బంది ఉత్తమ సేవల ద్వారా గ్రామీణ ప్రజల అభిమానాన్ని పొందాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సచివాలయ సేవలపై ఎన్నో అసలు పెట్టుకుందని, ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంచి ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సబ్ కలెక్టర్ భావన శనివారం బొబ్బిలి మండలం అలజంగి 1,2 గ్రామ సచివాలయాలు సందర్శించారు, ఈ సందర్భంగా సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై ఆరా తీశారు. ఆయా గ్రామాల్లో సచివాలయాలల్లో నిర్వహిస్తున్న రికార్డులు తనిఖీ చేశారు, ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని హితవు పలికారు. గ్రామాలలో నిర్వహిస్తున్న ఈ. కెవైసి పై ఆరా తీసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ పర్యటనలో బొబ్బిలి మండలం రెవెన్యూ అధికారులు సిబ్బంది, సచివాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.