జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసింది. యుద్దప్రాతిపదికన యూనిట్లను స్థాపించేందుకు వ్యూహాత్మక కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా పథకం అమలును పర్యవేక్షించేందుకు జిల్లా అధికారులతో కూడిన మూడంచెల బృందాలను నియమించారు. నిరంతర పర్యవేక్షణకు జిల్లా కేంద్రంలో వార్రూమ్ను ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో కూడిన కోర్టీమ్ ఇక్కడినుంచి పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మండలాలకు సైతం ప్రత్యేక పర్యవేక్షణాధికారులను నియమించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మరో అధికారుల బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు.
ప్రణాళిక అమలు కోసం స్థానిక డిఆర్డిఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. నిర్లిప్తతను, నిర్లక్ష్యాన్ని విడనాడి, ఈ నెల 20 లోగా ఈ పధకాల లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక వ్యూహాత్మక కార్యక్రమాన్ని రూపొందించామని, దీనిలో భాగంగా మంగళవారం నుంచీ ప్రతీ గంటకూ దీనిపై సమీక్ష ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో మండలాలకు ఐటిడిఏ పివో, జాయింట్ కలెక్టర్(ఆసరా), సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆర్డిఓ, డివిజనల్ డెవలప్మెంట్ అధికారులను ప్రత్యేక పర్యవేక్షణాధికారులను నియమించామని, వీరు నేరుగా ఆయా బ్యాంకు అధికారులతో మాట్లాడి, యూనిట్ల గ్రౌండింగ్కు కృషి చేస్తారన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఎదురైతే, వాటిని విశ్లేషించి, పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రం నుంచి ఒక కోర్టీమ్ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలు వరకూ సిద్దంగా ఉంటుందన్నారు. వివిధ శాఖల పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, సాంకేతిక సహకారాన్ని అందించేందుకు క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో, ఆయా శాఖల సిబ్బంది సైతం కంట్రోల్ రూములో అందుబాటులో ఉంటారని చెప్పారు. వీరంతా బ్యాంకర్లతో అనుసంధానమై, యూనిట్లను స్థాపించేందుకు కృషి చేస్తారని చెప్పారు. మొత్తం కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్కుమార్ పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, డిఆర్డిఏ పిడి కె.సుబ్బారావు, మెప్మా పిడి కె.సుగుణాకరరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, డిఆర్డిఏ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(సిఎస్ఓ)గా విశ్రాంత ఏడిసిపి మహమ్మద్ ఖాన్ నియమితులయ్యారు. మంగళవారం ఉదయం ఆయన తన నియామక ఉత్తర్వులను వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి స్వీకరించారు. వర్సిటీ వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఆస్థులు పరిరక్షణ పటిష్టం చేయడం సాధ్యపడుతుందనాన్ర. విశ్వవిద్యాలయంలో పూర్తిస్తాయిలో బద్రత చర్యలు చేపట్టాలని సిఎస్ఓకు సూచించారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ నుంచి సిఎస్ఓగా ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. రూసా 2.0 పథకంలో భాగంగా వర్సిటీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం సూచించింది. దీనిలో భాగంగా విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి మహమ్మద్ ఖాన్ను నియమించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ తెలిపారు. విశ్వవిద్యాలయం ఆస్థుల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషిచేస్తానని సిఎస్ఓగా నియమితులైన మహమ్మద్ ఖాన్ తెలిపారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిభతో విద్యార్థులు అపూర్వ అవకాశాలను సొంతం చేసుకోవచ్చునని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో అమెజాన్ సంస్థకు భారీ వేతనంతో ఎంపికై 16 మంది విద్యార్థులను ఆయన అభినందించారు. ఒకే కళాశాల నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు 16 నుంచి 31.5 లక్షల వేతనాలతో అమెజాన్ సంస్థకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి భారీ వార్షికవేతనాలో ఉపాధిని సాధించిన విద్యార్థులు విశాఖ నగరానికి బ్రాండ్ అబాసిడర్లుగా నిలుస్తారన్నారు. తమ ప్రతిభను ప్రస్పుటం చేస్తూ సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల రెక్టార్ డాక్టర్ వి.మధుసూధన రావు మాట్లాడుతూ తొలి దశలో తమ విద్యా సంస్థల నుంచి 135 మంది విద్యార్థులు అమెజాన్, సిస్కో. ఇన్ఫోసిస్, టిసిఎస్ తదితర సంస్థలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఒకే కళాశల నుంచి అమెజాన్కు 16 మంది ఎంపిక కావడం విశేషమన్నారు. దేశంలో మరెక్కడా ఇంత ఎక్కువ మంది ఈ సంస్థకు ఎంపిక కాలేదన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ కళాశాల ప్రిన్సిపాల్ బి.అరుంధతి, ప్లేస్మెంట్స్ డీన్ డాక్టర్ కె.ఆర్ సత్యనారాయణ, శిక్షణ విభాగాధిపతి డాక్టర్ రోజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీమా ప్రీమియం రైతుల తరపున ప్రభుత్వం చెల్లిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వై.యస్.ఆర్ ఉచిత పంటల బీమా కార్యక్రమంను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీమా ప్రీమియం రైతుల తరపున ప్రభుత్వం చెల్లింపు చేస్తుందన్నారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మనది అని పేర్కొన్నారు. గతంలో అందరికీ బీమా పరిహారం అందే పరిస్థితి లేదని దానిని అధిగమించి అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతి రైతుకు మంచి జరగాలని చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69.80 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్ల పంటను బీమా చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాలు వలన పూర్తి పారదర్శకత వచ్చిందని ఆయన తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు వద్ద ఇ క్రాప్ వివరాలతో సహా లబ్ది పొందిన రైతుల జాబితా ప్రదర్శించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 10 వేల మంది రైతులకు రూ.3.20 కోట్లు చెల్లింపు జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, శాసన సభ్యులు కంబాల జోగులు, డిసిసిబి అధ్యక్షులు పాలవలస విక్రాంత్, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి, జిల్లా కలెక్టర్ జె నివాస్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, డిడి రాబర్ట్ పాల్, ఉద్యాన శాఖ ఎడి పి.ఎల్.ప్రసాద్, సిపిఓ ఎం.మోహన రావు, రైతులు సీపాన రామారావు, బుక్క కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు లబ్ది కలిగే పరిశోధనలు చేపట్టాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లలర్ డా.ఎ.విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నైర అగ్రికల్చర్ కాలేజీ లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు మంచి పరిశోధనలు చేసి జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర వేత్త లుగా ఎదగాలని అన్నారు. కొత్త రకాల వంగడాలను, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను మేళవించి వ్యవసాయం, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని తెలిపారు . రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో దిగుబడి తక్కువగా వస్తున్నదన్నారు. అధిక దిగుబడి కోసం పరిశోధనలు చేపట్టలన్నారు. నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో వర్క్ షాప్ నిర్వహించనున్నామని తెలిపారు. కాలేజీ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల స్ధాయిలో మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. కళాశాలను అత్యున్నత పరిశోధనా కేంద్రంగా తీర్చి దిద్దే చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సబ్జెక్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్ పెట్టడానికి యోచిస్తున్నామని, సిబ్బంది కొరతను తీర్చనున్నామని తెలిపారు. విద్యార్థులకు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు రావడం హర్షదాయకమన్నారు. జాతీయస్థాయి జర్నల్స్ లో ప్రచురణ అయ్యే పేపర్ తయారు చేయాలని తెలిపారు. కాలేజీ 35 నుండి 13వ స్థానానికి చేరుకొవడం హర్షదాయకమని తెలిపారు. అనంతరం డా.నటరాజ్ తయారు చేసిన పబ్లికేషన్ ను రిలీజ్ చేసారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, స్టూడెంట్స్ ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం వైస్ ఛాన్స్లలర్ ను ఘనంగా సన్మానించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి మంగళ వారం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం ఒబిఎస్ కూడలి వద్ద అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో అమర జీవి చిత్ర పటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ జె నివాస్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరజీవి సేవలను కొనియాడారు. అమరజీవి మనోనిబ్బరంగల వ్యక్తని, ధైర్యసాహాసాలకు మారు పేరు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుటకు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన ఘనుడు అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి, అంకితభావం, కార్యశీలత ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, లయన్స్ సభ్యులు నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాది హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. ఎంజిఎన్ఆర్ఈజిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ పనులపై కలెక్టర్ నివాస్ మండల అధికారులు, పనులు చేపడుతున్న ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ఇంజనీరింగు అసిస్టెంట్లతో మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, నియోజకవర్గాలలో వారానికి రూ.15 కోట్లు ఖర్చు చేయాలని ఆయన స్పష్టం చేసారు. కొన్ని నియోజక వర్గాలలో రూ.13 కోట్లు ఖర్చు వరకు చేసారని, లక్ష్యాలను శత శాతం పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేసారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. మండలాలలో పూర్తి స్ధాయిలో సిబ్బంది ఉన్నప్పటికి పనులు ఎందుకు పూర్తి కావడం లేదని పేర్కొంటూ సమన్వయలోపమా లేకా సమస్యలు ఉన్నాయా అని గుర్తించి అధిగమించి పనులు చేయాలని అన్నారు. వారంలో రోడ్ల పనులు ప్రారంభించాలని, సీసీ రోడ్లు వారానికి ఒక కోలో మీటరు ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ ల పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని అన్నారు. ఇసుక, సిమెంటు సరఫరాలో సైతం లోటు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, ఆర్ డబ్ల్యూ పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాసరావు, పంచాయితీ రాజ్ పర్యవేక్షక కె.భాస్కర రావు, ఆర్.డబ్ల్యూ.ఎస్ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సూర్యనారాయణ, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ఏపిడి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య పరిరక్షణకు బహిరంగ మల విసర్జన అలవాటును మానుకోవాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం జె.సి. బహిరంగ మల విసర్జన పై అవగాహన కలిగించు నిమిత్తం గార మండలంలోని రంప చోడవరం, గొంటి గ్రామాలను, శ్రీకాకుళం మండలం ఒప్పంగి గ్రామాలలో పర్యటించారు. గ్రామాలలో గ్రామ సెక్రటరీలు, వాలంటీర్లతో వీధులలో పర్యటించారు. ఆ యా గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణ సంపూర్ణ పారిశుధ్ధ్యంతోనే సాధ్యపడుతుందని వారికి తెలిపారు. బహిరంగ మల విసర్జనను చేయరాదనన్నారు. ప్రతీ ఒక్కరూ మరగుదొడ్డిని నిర్మించుకుని వాడుకోవాలని తెలిపారు. అనంతరం శ్రీకాకుళంలోని బగ్గు సరోజినీ ఆసుపత్రిని సందర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి వి.రవికుమార్, వాలంటీర్లు, తదతరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో జగనన్న తోడు పథకం అమలుకు సహకరించని బ్యాంకర్లపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. జగనన్న తోడు పథకంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించాలని పదేపదే బ్యాంకు అధికారులను కోరుతున్నప్పటికీ వారి నుండి తగినంతగా స్పందన వ్యక్తం కావడం లేదని, అందువల్లే రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తోందన్నారు. పొరుగు జిల్లాలతో పోల్చిచూస్తే మన జిల్లాలో జగనన్న తోడు పథకం కింద రుణాల మంజూరులో బ్యాంకులు ఎంతగా వెనకబడి వున్నాయో స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. బ్యాంకులు పేదల గురించి ఆలోచన చేయకుండా, సామాజిక బాధ్యత తీసుకోకుండా వుంటే సహించేది లేదని స్పష్టంచేశారు. జగనన్న తోడు పథకం అమలుపై జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ సోమవారం కలెక్టర్ ఆడిటోరియంలో ఎంపిడిఓలు, మండల ప్రత్యేకాధికారులు, బ్యాంకుల జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు.
బ్యాంకుల సహకారం లేకపోవడం వల్లే ఈ పథకం అమలులో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన వారందరికీ రుణాలు ఇవ్వాలని, రుణాల మంజూరుకు సంబంధించి డాక్యుమెంటషన్లో గ్రామ సచివాలయ సిబ్బంది నుండి పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నా వారు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యంత తక్కువగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల అధికారుల నుండి వివరణ కోరారు. రుణాల మంజూరుకు సహకరించిన ఆయా బ్యాంకుల బ్రాంచి మేనేజర్లతో కలెక్టర్ నేరుగా ఫోనులో మాట్లాడి ఏ కారణంతో రుణాలు మంజూరులో జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించారు. అదేవిధంగా ఇప్పటికే రుణాలు మంజూరు చేసిన లబ్దిదారులకు సంబంధించిన సమాచారం వెంటనే వెబ్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
బ్యాంకులు ఇదే విధంగా వుంటే జిల్లాలోని బ్యాంకులు ధనికుల కోసమే అన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందని, ఈ ధోరణి మంచిది కాదని జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పథకాలకు సహకరించని బ్యాంకు బ్రాంచిల జాబితా తమకు అందజేస్తే వారితో ప్రత్యేకంగా మాట్లాడి కారణాలు తెలుసుకుంటామన్నారు. ఏపి గ్రామీణ వికాస్ బ్యాంకు వంటి అధిక బ్రాంచిలు వున్న బ్యాంకులు తగిన సామర్ధ్యం ప్రదర్శిస్తేనే అధికంగా రుణాలు అందించగలమని కలెక్టర్ పేర్కొన్నారు. ఏపిజివిబి ద్వారా ఈ ఒక్కరోజే 500 మందికి రుణాలు అందించనున్నామని విజయనగరం ప్రాంతీయ మేనేజర్ చెప్పారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కె.సుబ్బారావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి అధికారులను నియోజక వర్గ ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అధికారులు సంబంధిత నియోజక వర్గాలలో డిసెంబరు 25వ తేది నుంచి జనవరి 7వ తేది వరకు జరగనున్న పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబందించి తహసీల్దారులు తయారు చేసే జాబితాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. అలాగే రీ సర్వే (వై ఎస్ ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు 2021 ) కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తారని తెలిపారు. పాడేరు అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రత్యేకాధికారి గా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా. ఎస్. వెంకటేశ్వర్ ను , నర్సీపట్నం నియోజక వర్గానికి సబ్ కలెక్టర్ ఎన్ మౌర్యను , అరకు నియోజక వర్గానికి రెవెన్యూ డివిజినల్ అధికారి ఎల్ . శివజ్యోతి ని , భీమునిపట్నం నియోజక వర్గానికి రెవెన్యూ డివిజినల్ అధికారి కె.పెంచల కిశోర్ ను , అనకాపల్లి నియోజక వర్గానికి రెవెన్యూ డివిజినల్ అధికారి జె.సీతారామరావు ను ,
మాడుగుల నియోజక వర్గానికి స్పెషల్ డిప్యూటి కలెక్టర్ సి.హెచ్ రంగయ్యను , చోడవరం నియోజక వర్గానికి స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఎం .వి సూర్యకళ ను , ఎలమంచిలి నియోజక వర్గానికి స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఎస్ డి అనితను , పాయకరావుపేట నియోజక వర్గానికి డి ఆర్ డి ఎ ., ప్రాజెక్టు అధికారి వి.విశ్వేశ్వరరావును , పెందుర్తి నియోజక వర్గానికి స్పెషల్ డిప్యూటి కలెక్టర్ కె.పద్మలతను , జి.వి.ఎం .సి పరిధిలోని 5 అసెంబ్లీ నియోజక వర్గాలకు ప్రత్యేక అధికారిగా జివి.ఎం సి కమిషనర్ జి. సృజనను నియమిస్తున్నట్లు తెలిపారు.ఈ అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించి పేదలందరికి ఇళ్లు , రీ సర్వే కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు.
విశాఖపట్నంజిల్లా గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛభారత్ మిషన్ పై ప్రచారం నిర్వహించేందుకు సోమవారం జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ రెండు స్వచ్ఛభారత్ మిషన్ ప్రచార రథాలను కలెక్టరు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ జెండా వూపి ప్రారంభించారు. నేటి నుండి ఈ రథాల ద్వారా బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం, వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, ప్లాస్టిక్ వాడకం నిషేదం తో పాటు కోవిడ్-19 పై అవగాహన కార్యక్రమాలను వీడియో సినిమాల ద్వారా ప్రచారం చేస్తారని, రోజుకు 3 గ్రామాల చొప్పున ప్రచార కార్యక్రమాలు 15రోజులు నిర్వహిస్తారని గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీరు రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి.అరుణ్ బాబు, జిల్లాపరిషత్ సిఈఓ నాగార్జునసాగర్ జిల్లా పంచాయితీ అధికారి కె.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో అర్హులైన వారందరికీ వైయస్ఆర్ భీమా జగనన్నతోడు పధకాలు వేగంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. సోమవారం జివియంసి, డి.ఆర్.డి.ఎ.,యు.సి.డి., బ్యాంకు అధికారుతో ఈ వియమై తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణయించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన పథకాలను అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలన్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవన్నారు. లబ్దిదారులకు ముందుగా అవగాహన కల్పించాలని, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అందరికీ భీమా సౌకర్యం వర్తించేలా చేయాలన్నారు. అదే విధంగా జగనన్నతోడు కార్యక్రమంలో చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వారి వివరాలు సేకరించి వారందరికీ జగనన్నతోడు పథకంద్వారా ప్రభుత్వం ఇస్తున్నరూ.10 వేల ఆర్ధిక సహాయం అర్హులందరికీ అందించాలన్నారు. ఈ సమావేశంలో జి.వి. యం.సి. కమిషనరు జి.సృజన, జే.సి. పి.అరుణ్ బాబు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్.వెంకటేశ్వర్, డిఆర్ డిఎ ప్రాజెక్టు డైరక్టర్ వి.విశ్వేశ్వరరావు, జిల్లా పంచాయితీ అధికారి కె.కృష్ణకృమారి, లీడ్ బ్యాంకు మేనేజరు ప్రసాద్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
తపాలా శాఖకు చెందిన వ్యక్తిగత ఫిర్యాదులు, వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు ఈ నెల 28న తపాలా అదాలత్ ను నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వై.యస్. నర్సింగ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. విశాఖపట్నం పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 28న ఉదయం 11.00గం.లకు విశాఖపట్నం యం.వి.పి.బస్ స్టేషన్ ప్రక్కన గల పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయంలో పోస్ట్ మాస్టర్ జనరల్ వారిచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పారు. ఇది 101వ తపాలా అదాలత్ అని, తపాలా సర్వీసులకు చెందిన ప్రత్యేక, వ్యక్తిగత ఫిర్యాదులు మాత్రమే ఈ అదాలత్ నందు స్వీకరించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయు వినియోగదారులు 101వ తపాలా అదాలత్ అనే శీర్షికతో పి.ఆనందరావు, అసిస్టెంట్ డైరక్టర్, పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం, విశాఖపట్నం – 530 017 చిరునామాకు డిసెంబర్ 17లోగా పంపాలని, గడువు తేదీ ముగిసిన తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
అర్హత ఉండి ప్రభుత్వ పధకాల ప్రయోజనం పొందని లబ్దిదారులను గుర్తించడంలో గ్రామ వాలంటీర్లు మరింత చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ స్పష్టం చేసారు. స్ధానిక పోరంకిలోని ప్రభునగర్ లో సోమవారం సాయంత్రం యానాదుల కులానికి చెందిన ఏడు లబ్దిదారుల కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులను కలెక్టరు అందజేసారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలు, నిరుపేదలకోసం, వెనుకబడిన వర్గాలవారికోసం ఎ న్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభునగర్ లో గిరిజన తెగలకు చెందిన 38 యానాదికుటుంబాలు నివాసం ఉంటున్నాయని అయితే నిరక్షరాస్యులైనందున వారికి ప్రభుత్వం అందించే కార్యక్రమాలపట్ల అవగాహన లేకుండా ఉందన్నారు. ప్రభుత్వం ఎ ంతో ముందుచూపుతో అర్హతగల లబ్దిదారులను గుర్తించి వారికి పధకాలను ఇంటివద్దనే అందించాలన్న నిర్ణయానికి రావడం జరిగిందన్నారు. అందులోభాగంగానే గ్రామసచివాలయ వ్యవస్ధలను ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్ధను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రభునగర్ లో 38 యానాదుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వారిలో కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే ఆధార్ కార్డు కలిగి ఉన్నా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనం పొందలేకపోతున్నారన్నారు. ఈవిషయాన్ని క్షేత్రస్ధాయి పరిశీలనలో తెలుసుకుని గ్రామవాలంటీర్లను ఆదిశగా చైతన్యం చేశామన్నారు. ఇప్పటికే అన్ని కుటుంబాల వివరాలను సేకరించి వారికి ప్రభుత్వ కార్యక్రమాల సంక్షేమం చేరేలాగా ఆధార్ నమోదును చేపడుతున్నామన్నారు. వాలంటీర్లు అందరూ తప్పనిసరిగా వాస్తవ లబ్దిదారులను అర్హత ఉండి ప్రభుత్వ ప్రయోజనాలు అందని లబ్దిదారులను గుర్తించడంలో మరింత చురుకుగా వ్యవహరించాలని కలెక్టరు ఇంతియాజ్ స్పష్టం చేసారు. ప్రభునగర్ పరిధిలో నివాస స్ధలం లేని లబ్దిదారులను గుర్తించి ఈనెల 25న చేపట్టే స్ధలాల పంపిణీ కార్యక్రమంలో లబ్దిదారులను గుర్తించి పేర్లను సిఫార్స్ చేయాలన్నారు. ఈనెల 25న చేపట్టే కార్యక్రమంలో పట్టాలను అందించాలని కలెక్టరు పేర్కొన్నారు. నూతనంగా తెల్లరేషన్ కార్డులు పొందిన ఏడులబ్దిదారుల కుటుంబాలకు కార్డుల అందజేసే కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు (ఆసరా) కె. మోహన్ కుమార్ , జిల్లా గిరిజన సంక్షేమాధికారి రుక్త్మానందయ్య, తహశీల్ధారు భద్రు, కార్యదర్శులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ పరికాలు, 3 లేదా అంతకంటే ఎక్కువ స్టార్లు గల గృహోపకరణాలు వాడటం ద్వారా 25 నుంచి 30 శాతం విద్యుత్తు పొదుపు చేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పిలుపు నిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 వ తేదీ నుంచి 20 వరకు పాటిస్తున్న సందర్భంగా ఆయన కలెక్టర్ కార్యాలయం లో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపు చేయడం వలన కరెంటు బిల్లు ఆదా అవుతుందని, ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. భావి తరాలకు కూడా ఇంధనం నిల్వ వుంటుందన్నారు. అవసరం లేని సమయంలో ఇందనపు పాటించాలనే భావం ప్రతీ ఒక్కరిలోనూ రావాలన్నారు. తద్వారా అందరిలోనూ చైతన్యం కలిగి అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి వీలుపడుతుందని సూచించారు. ఇంధన పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇపిడిసిఎల్ ఎస్.ఇ. సూర్య ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.