విశాఖలోని ఆదర్శనగర్ శ్రీ శ్రీ శ్రీ సిద్ధి శ్రీకృష్ణ దత్తాత్రేయ సుబ్రహ్మణ్యేశ్వర పంచముఖ ఆంజనేయస్వామి సహిత షిరిడి సాయినాధుల ఆశీస్సులతో కరోనా పూర్తిస్థాయిలో రూపుమాసిపోవాలని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షలు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆలయ 19 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, అందరు దేవుళ్ల ఒకే చోటఉండి ఈ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారని అన్నారు. ఆలయ వార్షికోత్సవర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందన్న వంశీ కరోనా సమసిపోతే జనజీవనాకి పనులు దొరికి జీవితాలు కూడు, గూడు దొరుకుతాయన్నారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయకమిటీ ప్రత్యేక జ్ఞాపకను అందజేశారు. కార్యక్రమంలో శ్రీ సిద్ధి ,శ్రీకృష్ణ సేవాసమితి కమిటీ వారు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా 4 ఫిషింగ్ హార్బర్లు , 25 ఆక్వా హబ్ ల నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్దికి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించ నున్నదని తెలిపారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా నుంచి ఆర్.టి. సి. కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ కియోస్క్ యూనిట్ దగ్గర నుంచి వీడియో కాన్పరెన్స్ లో జిల్లా ఇన్ చార్జి మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ యం.వేణుగోపాల్ రెడ్డి , ఆర్.డి.ఒ. పి.కిషోర్ , మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఫణిప్రకాశ్, ఉప సంచాలకులు లక్ష్మణరావు, లబ్దిదారులు చెన్నా ధనలక్ష్మి, సురాడ అపర్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్.టి.సి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ కియోస్క్ ను జిల్లా ఇన్ చార్జి మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ , శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి, మైనారిటి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సరుకు రవాణా వాహనాలను సబ్సిడిపై మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఇందుకు ఈ నెల 27వ తేదీ నాటికి దరఖాస్తులు సమర్పించాలని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతకు సరుకు రవాణా వాహనాల మంజూరుపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మునిసిపల్ కమీషనర్లతో శని వారం వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. పేద కుటుంబములకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా ఇళ్ళ వద్దకే నేరుగా పంపిణీ చేస్తున్న సంగతి విదితమేనని అన్నారు. సరుకు రవాణా వాహనాలను ప్రజాపంపిణీ వ్యవస్ధతో అనుసంధానం చేసి ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి, మైనారిటి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్సిడీపై వాహనాలు అందించుటకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో లబ్దిదారుని వాటా – 10 శాతం రూ.58,119., బ్యాంకు ఋణము - 30 శాతంగా రూ.1,74,357 కాగా సబ్సిడిగా 60 శాతం రూ.3,48,714/- ఉంటుందని వివరించారు. అర్హత గల ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి, మైనారిటి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత స్థానిక గ్రామ/వార్డు సచివాలయములో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు. నిర్ధేశిత దరఖాస్తును సంక్షేమ సహాయకుల నుండి ఉచితంగా పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ వరకు సంక్షేమ సహాయకులకు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్దులకు డిశంబరు 4వ తేదీన సంబధిత మండల, మునిసిపాలిటి, మునిసిపల్ కార్పోరేషన్ లలో ఎంపిక కమిటి ఆధ్వర్యంలో ఎంపిక జరపాలని ఆయన స్ఫష్టం చేసారు. దరఖాస్తు చేసిన అభ్యర్ధులు ఎంపిక కమిటి ముందు విధిగా హాజరు కావాలని ఆయన స్పష్టం చేసారు. వీటిపై మండల స్ధాయిలో నిరుద్యోగ యువతకు తగిన సమాచారం అందించాలని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల సరఫరాలోను, స్వీకరణలోనూ ఎటువంటి ఆరోపణలకు తావు ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల సర్వేలో భాగంగా మండలాల్లో ఉన్న నమోదు అయిన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమలను కూడా సర్వే చేయాలని సూచించారు. ఏ ఒక్క పరిశ్రమను విడిచి పెట్టరాదని, స్పష్టమైన, వాస్తవమైన డేటా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, డిప్యూటి ట్రాన్సుపోర్టు కమీషనర్ వడ్డి సుందర్, జిల్లా సరఫరా అధికారి డి.వెంకట రమణ, ఎస్.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులు వారి మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకోవడానికి రాష్ట్రం లోనే తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసిన మార్కెటింగ్ సొసైటీ పత్రాలను మత్స్యకార సంఘాలకు జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ అందజేసారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నాలుగు ఫిషింగ్ హార్బర్ లకు, 25 ఆక్వా హబ్ లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమం లో విజయనగరం నుండి జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, సంయక్త కలెక్టర్లు జి.సి కిషోర్ కుమార్, జే, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆక్వా బజార్ కు సంబంధించిన మత్స్యకార మార్కెటింగ్ సొసైటీ రిజిస్ట్రేషన్ పత్రం తో పాటు బైలా ను సంఘ సభ్యులకు అందజేసారు. ప్రతి జిల్లాకు ఒక ఆక్వా మార్కెటింగ్ సొసైటీ ని ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు మార్కెటింగ్ సౌకర్యం , గిట్టుబాటు ధరలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున, రాష్ట్రం లోనే విజయనగరం తొలి సొసైటీ గా ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు.. అనంతరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో గల స్వదేశి మత్స్యకారులకు, ఆక్వా రైతులకు, చేపల వ్యాపారం చేసుకునే వారికీ, మహిళా సహకార సంఘాల సభ్యులకు పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీ తో రుణం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 62 మంది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేసారు. . వీరికి బ్యాంకుల ద్వారా మంజూరు జేసిన 13.5 లక్షల రూపాయల ఋణం కు సంబంధించిన పాస్ పుస్తకాలను అందజేసారు. జిల్లాలో ఇప్పటి వరకు 128 మందికి 19.95 లక్షల రూపాయలను కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలక్రింద మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు శాసన మండలి సభ్యులు,శాసన సభ్యులు, మత్స్య శాఖ ఉప సంచాలకులు నిర్మలా కుమారి, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షులు బర్రి చిన్న అప్పన్న, మక్కువ ఆక్వా రైతుల మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు వై. గోపాల కృష్ణ, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ మైలపల్లి నరసింహులు ను ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. శనివారం విజయనగరం జిల్లా కలెక్టర్ డా.జవహర్ లాల్ తో పాటు శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు,శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, మత్స్య శాఖ ఉప సంచాలకులు నిర్మలా కుమారి, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షులు బర్రి చిన్న అప్పన్న, మక్కువ ఆక్వా రైతుల మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు వై. గోపాల కృష్ణ, మహిళా సంఘాల ప్రతినిధులు పుష్ప గుచ్చాలతో, శాలువాలతో సన్మానించారు. మత్స్యకారులకు మేలు జరిగేలా కష్టపడి పని చేయాలని శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాడు డైరెక్టర్ ను కోరారు.
శ్రీకాకుళంలోని దళితవాడకి త్రాగునీరు ఇప్పించాలని కోరుతూ తైక్వాండో శ్రీను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ను కలిసి వినతిపత్రం అందజేసారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తోటపాలెంలోని ఎస్.సి కాలనీకి చెందిన ప్రజలు,మహిళలు,యువతతో కలిసి డిప్యూటీ సి.ఎం వద్ద దళితుల సమస్యలను వివరించారు. వినతిని స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సానుకూలంగా స్పందించారు.ఎస్.సి కాలనీకి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని మహిళలు,యువతకి హామినిచ్చారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నివాస్ తో మాట్లాడి తోటపాలెంలోగల ఎస్.సి కాలనీకి మంచినీరు అందేలా చూస్తానని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఎఐమ్ సైనిక్ ప్రధాన కార్యదర్శి పెయ్యిల చంటితో పాటు ,డివిజన్ కార్యదర్శి ఆనంద్ కుమార్ తో పాటు తోటపాలెం ఎఐమ్ కమిటి సభ్యులు మోహన్, రామారావు, రమణ, శివ, నాయుడు, రాజు, రాధ, రమణమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి శనివారం ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి వర్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..తీర్థ ప్రసాదాల స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, త్వరలోనే పంచ గ్రామాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఇప్పటికే కమిటీలు కూడా వేసినట్టు వివరించారు. కరోరా సెకెండ్ వేవ్ ప్రారంభం అయినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. స్వామిని కరోనా వైరస్ పూర్తిగా తగ్గించి ప్రజలు సాధారణ జీవితం గడిపేలా చూడమని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని కోరినట్టు మంత్రి తెలియజేశారు. మంత్రి వెంట స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
విజయవాడలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ & హెడ్ చింతా శేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)సౌజన్యంతో 6 నెలల వ్యవధితో కూడిన మెషిన్ ఆపరేటర్ – ప్లాస్టిక్స్ ప్రాసెస్సింగ్ (Machine Operator – Plastics Processing) అనే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం ద్వారా 90 మంది ఎస్సీ నిరుద్యోగ యువతకు అందిస్తున్నామన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలను, Apron, Safety Shoes, Training Kit లను CIPET అందిస్తున్నదని, 6 నెలల శిక్షణకు గాను నెలకు రూ.500/- చొప్పున మొత్తం రూ. 3,000/- ప్రోత్సాహక స్టయిపెండ్ అందిస్తామని తెలిపారు. 18 – 30 సం.లు. మధ్య వయస్సు కలిగి, 10 వ తరగతి/ I.T.I. / Diploma పాస్ (లేక) ఫెయిల్ విద్యార్హత గల నిరుద్యోగ SC యువత ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిర్ణీత శిక్షణ అనంతరం అభ్యర్ధులకు CIPET సర్టిఫికేట్ తో పాటుగా ప్లాస్టిక్స్ మరియు అనుబంధ సంస్థలలో ఉద్యోగ అవకాశం అందిస్తామని చెప్పారు. అర్హులైన మరియు ఆసక్తి గల అభ్యర్ధులు తమ ఒరిజినల్ విద్యార్హత, కుల, ఆదాయ ధృవపత్రాలు, ఆధార్, వైట్ రేషన్ కార్డ్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీలు మరియు 4 పాస్పోర్టు సైజు ఫొటోలతో తేది. 23.11.2020, సోమవారం నుంచి CIPET విజయవాడ కార్యాలయంలో సంప్రదిన్చాలన్నారు. మరిన్ని వివరాలకు CIPET ప్రతినిధులను 9849263296, 9985941979 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
అనంతపురం జిల్లాలో కోటి రూపాయలతో ఆక్వా హబ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భముగా శనివారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించేందుకు రాష్ట్రంలో 25 ఆక్వా హుబ్బుల ఏర్పాటుకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతపురము నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా ఆక్వా హబ్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాద వశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో ఉప మత్స్య సంచాలకులు శాంతి, రాష్ట్ర బి.సి.కార్పొరేషన్ డైరెక్టర్లు అశ్వర్ధ్ నారాయణ , లక్ష్మి నారాయణ, రమణ, జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు పోతన్న, బెస్త ఉపాధ్యక్షుడు కుళ్ళాయప్ప తదితరులు పాల్గొన్నారు.
ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న శాఖాపరమైన మొదటి రోజు ఉదయం సెక్షన్ పరీక్షకు 92 శాతం మంది హాజరైనట్టు కో - ఆర్డినేటింగ్ అధికారి, డి.ఆర్.వో. ఎం.గణపతిరావు చెప్పారు. ఉదయం సెక్షన్ పరీక్షకు 791 మంది రావాల్సి ఉండగా.. 727 మంది హాజరైనట్టు వివరించారు. పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి 29 వరకు జరగనున్నాయని దానికి తగ్గ ఏర్పాట్లు అన్ని పకడ్బందీగా చేశామని పేర్కొన్నారు. మొదటి రోజు పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించేందుకు గాజులరేగ లో ఉన్న సీతం ఇంజినీరింగ్ కళాశాలను ఆయన శనివారం సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. అభ్యర్థులెవరూ మాస్ కాపీయింగ్ కి పాల్పడకుండా జాగ్రత్త వహించాలని లైజెనింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట లైజెనింగ్ అధికారులు, ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఉన్నారు.
విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించాలని విశాఖ జిల్లా అల్లూరి యువజన సంఘం అధ్యక్షులు రాజాసాగి సత్యన్నారాయరాజు(కుర్రుపల్లిబాబు) అన్నారు.శనివారం విశాఖలోని ఏవిఎన్ కాలేజీలో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి విశాఖలోని ఏవిఎన్ కాలేజీలో చదుకున్న గుర్తుగా తమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాలవీరభద్రరావు, ఒబ్బలరెడ్డి సుబ్రమణ్యం, ఇ.శ్రీకాంత్, అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు ఆధ్వర్యంలో గత ఏడాది విగ్రహం ఆవిష్కరించామని చెప్పారు. ఇపుడు ఆయన విగ్రహానికి తొలి వార్షికోత్సవం చేపట్టినట్టు వివరించారు. అల్లూరి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు అయిన రోజుకే ఆయనకు తెలుగు జాతి నిజమైన గౌరవం ఇచ్చినట్టు అని అన్నారు. సంఘం కార్యదర్శి కల్లేపల్లి సంతోష్ కుమార్ వర్మ మాట్లాడుతూ, ఏవిఎన్ కాలేజిలోని స్కూలు పిల్లలకు అల్లూరి విరోచిత చరిత్రను వివరించారు. స్కూలు హెచ్ ఎం క్రిష్ణవేణి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ప్రపంచ వీరుడని, తెల్లవాడిని తరిమికొట్టిని మహా ధీరుడని కొనియాడారు. అనంతరం విద్యార్ధినీ, విద్యార్ధులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మిమిక్రీరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద అంధవరపు వరహా నరసింహం ( వరం ) కాంస్య విగ్రహావిష్కరణ ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఇంటాక్ కన్వీనర్ మరియు సభ్యులు కె.వి.జె.రాధాప్రసాద్ వెల్లడించారు. స్థానిక వరం రెసిడెన్షిలో వరం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంపై ఇంటాక్ కన్వీనర్ శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ శ్రీకాకుళం పురపాలక సంఘ సంస్కర్త, పట్టణ అభివృద్ధి ప్రణాళికల ఆవిష్కర్త, అనితర సాధ్యమైన చరిత్ర సృష్టికర్త అయిన కీ.శే.అంధవరపు వరహా నరసింహం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నవంబర్ 22న సాయంత్రం 04.00గం.లకు ఏడురోడ్ల కూడలిలో ఇంటాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంప్రదాయానికి మారుపేరు వరం అని, పదవి, రాజకీయాలతో నిమిత్తం లేకుండా నగర, వాణిజ్య, వ్యాపార రంగాల అభివృద్ధితో సిక్కోలును అభివృద్ధి బాట పట్టించిన మహోన్నత వ్యక్తి వరం అని కొనియాడారు. ప్రజాభిమానంతో 1981 నుండి 1992 వరకు మునిసిపల్ ఛైర్మన్ గా ఆ పదవికే వన్నెతెచ్చారని అన్నారు. ఆయన ఛైర్మన్ గా కొనసాగిన కాలంలో మునిసిపల్ సిబ్బంది కంటే ముందుగానే విధులకు హాజరుకావడం ఆయన పదవికి ఇచ్చిన గౌరవంగా చెప్పవచ్చని గుర్తుచేసారు. వరం పవర్ ప్రోజెక్టు రూపకర్త, శ్రీసత్యసాయి మందిరం నిర్మాణ కమిటీకీ శాస్వత అధ్యక్షులుగా, కళింగ కోమటి సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా, శ్రీకాకుళం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జిల్లా అధ్యక్షులుగా అన్ని రంగాలకు వన్నెతెచ్చిన వ్యక్తి వరం అని కొనియాడారు. అటువంటి గొప్పవ్యక్తి కాంస్య విగ్రహం ఏర్పాటుచేసేందుకు ఇంటాక్ ఆలోచన చేసిందని, విగ్రహా విష్కరణ కొరకు జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని, తద్వారా ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. కీ.శే. అంధవరపు వరహా నరసింహం ( వరం ) కాంస్య విగ్రహాన్ని దేశంలోనే పేరొందిన ప్రముఖ శిల్పి డి.రాజకుమార్ వుడయార్ ( తూ.గో.జిల్లా, కొత్తపేట ) తయారుచేసారని, నగరంలో ఇప్పటివరకు సిమెంట్ విగ్రహాలే ఉన్నాయని తొలి కాంస్య విగ్రహం ఇదే కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మరో ముఖ్యఅతిథిగా, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, ఇంటాక్ ముఖ్యపోషకులు మరియు జిల్లా కలెక్టర్ జె.నివాస్ విశిష్ఠ అతిథులుగా హాజరుకానున్నారని చెప్పారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కళింగ కోమటి కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సూరిబాబు గౌరవ అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. వరం రెసిడెన్షి అధినేత అంధవరపు సంతోష్ మాట్లాడుతూ నగరంలో తన తండ్రి కాంస్య విగ్రహావిష్కరణతో తమ కళ సాకారమవుతుందని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కేవలం రెండు మాసాల్లో పూర్తిచేయడం సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన ఇంటాక్ కన్వీనర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, శ్రేయోభిలాషులు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేసారు. కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ పాత్రికేయుల సమావేశంలో ఇంటాక్ సహ కన్వీనర్ సురంగి మోహనరావు, నూక సన్యాసిరావు, ట్రెజరర్ నటుకుల మోహన్, అంధవరపు కుమార్, అంధవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సర్కారు బడులు కొత్తరూపు సంతరించుకున్నాయి. కార్పొరేట్ పాఠశాలలను తలదన్ని, ఆధునిక హంగులతో అలరారుతున్నాయి. చక్కని రంగులు, సరికొత్త వసతులు, అన్ని మౌలిక సదుపాయాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన నాడూ-నేడు కార్యక్రమం విద్యావ్యవస్థలో చరిత్రలో ఒక కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. విద్య, వైద్యం ప్రాధాన్యతాంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దానిలో ఒకటి మనబడి నాడూ-నేడు. ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ మార్పులను తీసుకువచ్చి, ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులను కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం క్రింద జిల్లా వ్యాప్తంగా 2,763 పాఠశాలలు రిజిష్టర్ కాగా, దీనిలో మొదటి దశ క్రింద 1060 పాఠశాలలను ఎంపిక చేసి, రూపురేఖలను మార్చివేసే అభివృద్ది పనులను ప్రారంభించారు. దీనిలో 1040 పాఠశాలలను రాష్ట్రప్రభుత్వ నిధులతో, 20 పాఠశాలలను నాబార్డు నిధులతో అభివృద్ది చేస్తున్నారు. జిల్లాలో నాడూ-నేడు తొలిదశ పనులకు ప్రభుత్వం ఏకంగా రూ.236.82కోట్లను కేటాయించింది. ఈ నిధులతో మొత్తం 8,077 పనులను మంజూరు చేశారు. వీటిలో 3968 పనులు మొదలు కాగా, 754 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటవరకు దాదాపు రూ.120 కోట్లను ఖర్చు చేయడం ద్వారా విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సంపాదించింది. చాలా పాఠశాలల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా, మరికొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 ప్రభుత్వ శాఖలు ఈ పనులను నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యతనిస్తోంది. కేవలం విద్యార్థులకోసమే అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యాకానుక తదితర ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. మరోవైపు సర్కారు బడుల్లో ఆంగ్లభాషాబోధను ప్రవేశపెట్టడానికి సిద్దమవ్వడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడూ-నేడు కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సంపూర్ణంగా మారిపోతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, వాటికి నిరంతర నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు, త్రాగునీటి సదుపాయం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన బల్లలు, కుర్చీలు, గోడలకు, తరగతి గదులకు రంగులు, సున్నం, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీషు లేబ్స్ ఏర్పాటు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం, ఇతర అన్నిరకాల మరమ్మతు పనులు చేపట్టారు. ఎపిఇబ్ల్యూఐడిసి, సమగ్ర శిక్ష, గిరిజన సంక్షేమశాఖ, పంచాయితీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ పబ్లిక్హెల్త్ మొదలగు ఆరు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో తల్లితండ్రుల కమిటీల పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. డిసెంబరు 31 నాటికి ఈ పనులన్నిటినీ పూర్తిచేయాలన్న కృతనిశ్చయంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ జిల్లా అంతటా విస్తృతంగా పర్యటిస్తూ, నాడూ-నేడు పనులను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో జరుగుతున్న నాడు-నేడు పనుల వివరాలు ః -
తొలిదశకు ఎంపికైన పాఠశాలలు ః 1040
మంజూరు చేసిన పనులు ః 8077
అంచనా విలువ ః రూ.236.82 కోట్లు
విడుదల చేసిన రివాల్వింగ్ ఫండ్ ః రూ.126.65 కోట్లు
ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం ః రూ. 119.38 కోట్లు
వివిధ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతున్న పనులు ః -
ఎపిఇబ్ల్యూఐడిసి ః 234
సమగ్ర శిక్ష ః 300
గిరిజన సంక్షేమశాఖ ః 236
పంచాయితీరాజ్ ః 168
ఆర్డబ్ల్యూఎస్ ః 56
మున్సిపల్,పబ్లిక్హెల్త్ ః 46
మొత్తం ః 1040 పాఠశాలలు
శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన తరగతులు (బి.సి), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఇబిసి), ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్ధులకు రవాణా వాహనాలను సబ్సిడిపై అందించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పౌరసరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ శుక్రవారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిసి, ఇబిసి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ అభ్యర్ధులకు స్వయం ఉపాధి కల్పన నిమిత్తం రవాణా వాహనాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెల పేద కుటుంబములకు పంపిణీ చేస్తున్న బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులు ఇళ్ళ వద్దకే నేరుగా చేరవేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంతో అనుసంధానం చేసి లబ్దిదారులకు రవాణా వాహనాలను సబ్సిడీపై సరఫరా చేయడం జరుగుతుందని వివరించారు. లబ్దిదారుని వాటా 10 శాతం, రాయితీ 60 శాతం, మిగిలిన 30 శాతం మొత్తాన్ని బ్యాంకు ఋణము ద్వారా మంజూరు చేసి స్వయం ఉపాధికి బాటలు వేయుటకు ఉద్దేశించడం జరిందని పేర్కొన్నారు. రవాణా వాహనాలు మంజూరుకు అర్హత గల అభ్యర్థులు స్థానిక గ్రామ/వార్డు సచివాలయములో దరఖాస్తు చేయాలని వారు సూచించారు. నిర్ధేశిత దరఖాస్తును సంక్షేమ సహాయకుల నుండి ఉచితంగా పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు సంక్షేమ సహాయకులకు సమర్పించాలని తెలిపారు. వాహనం యూనిట్ విలువ రూ.5,81,190/- కాగా 60 శాతం రాయితీగా రూ.3,48,714/- పోనూ, లబ్ధిదారుని వాటా 10 శాతం రూ.58,119/-, బ్యాంకు ఋణము - 30 శాతం రూ.1,74,357/-గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్దులకు డిశంబరు 4వ తేదీన సంబధిత మండల, మునిసిపాలిటి, మునిసిపల్ కార్పోరేషన్ లలో ఎంపిక కమిటి ఆధ్వర్యంలో స్క్రీనింగ్- మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని వారు చెప్పారు. దరఖాస్తు చేసిన అభ్యర్ధులు స్క్రీనింగుకు విధిగా హాజరు కావాలని స్పష్టం చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, డిఎఫ్ఓ సందీప్ కృపాకర్, ఎస్.సి కార్పొరేషన్ ఇడి కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం ఈ నెల 25న నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. నవంబర్ 25 ఉదయం 10.30గం.లకు సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో 2020-21 సం.నకు నూతన పుస్తకాల కొనుగోలు, శాఖా గ్రంధాలయాలకు ఫర్నిచర్ కొనుగోలు, జిల్లా కేంద్ర గ్రంధాలయం, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయాలకు కంప్యూటర్లు, ఎయిర్ కండీషనర్లు కొనుగోలు, జిల్లా కేంద్ర గ్రంధాలయం అదనపు భవన నిర్మాణం, జిల్లా కేంద్ర గ్రంధాలయం కాంపౌండ్ వాల్ మరియు ఆమదాలవలస శాఖా గ్రంధాలయం మరామ్మతులు తదితర అంశాలపై చర్చించి ప్రతిపాదనలు పంపుటకు సభ్యుల ఆమోదం తెలియజేయుట జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.