1 ENS Live Breaking News

మినీ ట్రక్కుల కోసం దరఖాస్తులు ఆహ్వానం..

శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగులైన యస్.సి ( షెడ్యూల్డు కులాలు ) యువతకు మినీ ట్రక్కుల పంపిణీకోసం దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్ర షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ జిల్లాకు 69 మినీ ట్రక్కులు ( నిత్యావసర వస్తువులు రవాణా నిమిత్తం ) పంపిణీచేయుటకు నిర్ధేశించిందని చెప్పారు. స్వయం ఉపాధి పథకం క్రింద శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులై 7వ తరగతి పాసై నిరుద్యోగులైన షెడ్యూల్డు కులాలకు చెందిన యువత ( వయస్సు 21 నుండి 45 ఏళ్లలోపు ఉండాలి )కు మినీ ట్రక్కులను పంపిణీచేయడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు దరఖాస్తుదారుని తెలుపు రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, విద్యార్హతలు, మీ-సేవా కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా నెంబరుతో పాటు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత గ్రామ,వార్డు సచివాలయాలకు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, పింఛను పొందుతున్న విశ్రాంత ఉద్యోగస్తులు,  నాలుగు చక్రాల వాహనాలు కలిగినవారు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, గత ఐదేళ్లలోపు ప్రభుత్వం నుండి లబ్ధిపొందిన వారు, ప్రభుత్వ రుణములు చెల్లించుటలో మొండి బకాయిదారులు, డిఫాల్డర్లు ఈ పథకానికి అనర్హులని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.

Srikakulam

2020-11-20 21:10:34

డిపార్టమెంటల్ టెస్టులు పక్కాగా నిర్వహించాలి..

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి నిర్వహించే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ డిపార్ట్ మెంటల్ టెస్టులకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. డిపార్ట్ మెంటల్ టెస్టుల నిర్వహణపై జిల్లా రెవిన్యూ అధికారి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం ఆయన ఛాంబరులో నిర్వహించారు. నవంబర్ 21 నుండి 29 వరకు జిల్లాలో జరగనున్న ఈ పరీక్షలు ( 27వ తేదీ మినహా ) ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు అలాగే మధ్యాహ్నం 03.00గం.ల నుండి సాయంత్రం 05.00గం.ల వరకు రెండు సెషన్లలో జరుగుతాయని తెలిపారు. రాజాంలోని జి.యం.ఆర్, టెక్కలిలోని ఐతమ్, ఎచ్చెర్లలోని శ్రీశివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు సంయుక్త కలెక్టర్, జిల్లా రెవిన్యూ అధికారి సమన్వయ అధికారులుగా, తహశీల్ధారు, ఉపతహశీల్ధారులు లైజన్ అధికారులుగా ఉంటారని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా ప్రతీ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లుచేయడం జరిగిందని, ప్రతీ కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డి.ఆర్.ఓ స్పష్టం చేసారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కోరారు.  ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అసోసియేట్ సెక్రటరీ బి.సిహెచ్.ఎన్.కుమార్ రాజు, సెక్షన్ అధికారి డి.నాగభూషణం, ఉపతహశీల్ధారు సతీష్, కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.   

Srikakulam

2020-11-20 21:08:19

ఆయకట్టుకు పూర్తిగా నీరందించాలి..

శ్రీకాకుళం జిల్లాలో జలవనరుల ప్రాజెక్టుల క్రింద భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. రెవిన్యూ, భూసేకరణ యూనిట్ల అధికారులతో శుక్ర వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నివాస్ సమీక్షించారు. తోటపల్లి, మడ్డువలసతో సహా ఇతర ప్రాజెక్టుల క్రింద తక్కువ మొత్తంలో భూ సేకరణ పెండింగులో ఉన్నాయని వాటిపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో అంతే వేగంగా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో పనిచేయాలని ఉద్బోదించారు. వివిధ ప్రాజెక్టుల క్రింద కాలువ పనులు పూర్తి కావడం వలన వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందని, తద్వారా రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందని, జిల్లా ఆర్ధిక స్ధితిగతులకు బాటలు వేయవచ్చని చెప్పారు. వ్యవసాయక జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు జలయజ్ఞం పనులు పూర్తి చేసి లక్ష్యంగా ఉన్న ఆయకట్టుకు సాగు నీరు అందించడం వలన చిరస్ధాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు అధికారుల సమీక్షలో భాగంగా అటవీ, రెవిన్యూ శాఖలు భూములను స్పష్టంగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. అటవీ భూములు ఉంటే అందుకు ప్రతిఫలంగా ఇతర ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు పరిశీలిస్తామని ఆయన చెప్పారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, డివిజనల్ అటవీ అధికారి సందీప్ కృపాకర్ గుండాల, రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, డిప్యూటి కలెక్టర్లు బి.శాంతి, కాశీవిశ్వనాథ్, ఉద్యానవన సహాయ సంచాలకులు పి.ఎల్.ప్రసాద్, తోటపల్లి కార్యనిర్వాహక ఇంజనీరు రామచంద్రరావు, సర్వే సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, అటవీ శాఖ రేంజ్ అధికారి గోపాల నాయుడు, అణు విద్యుత్ ప్రాజెక్టు అదనపు సి.ఇ బంగారయ్య శెట్టి, డిప్యూటి మేనేజర్ చంద్రశేఖర్, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-20 20:25:35

జిల్లా అసుపత్రికి అదనపు వసతులు..

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రాసుప‌త్రి, ఘోషా ఆసుప‌త్రిలో అద‌న‌పు వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు ఆసుప‌త్రి అభివృద్ది సంఘం ఆమోదించింది. సంఘ‌ ఛైర్మ‌న్ మ‌రియు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హర్‌లాల్ అధ్యక్ష‌త‌న క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో అభివృద్ది సంఘ స‌మావేశం శుక్ర‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో 29 అంశాల‌తో కూడిన అజెండాను సంఘం క‌న్వీన‌ర్‌, జిల్లా కేంద్రాసుప‌త్రి సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ కె.సీతారామ‌రాజు స‌భ్యులకు వివ‌రించ‌గా, స‌భ్యులు ఆయా అంశాల‌పై చ‌ర్చించి ఆమోదించారు.   ఘోషా ఆసుప‌త్రిలో అసంపూర్తిగా ఉన్న కేంటీన్ ప‌నుల‌ను పూర్తిచేసి, రోగుల‌కు అందుబాటులో తేవాల‌ని నిర్ణ‌యించారు. ఘోషాలో ఆరు వార్మ‌ర్లు, ఆప‌రేష‌న్ టేబుల్‌, వివిధ విభాగాల‌ను 5 ఏసిల‌ను, వివిధ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను సమ‌కూర్చ‌డానికి, ఓటి కాంప్లెక్స్ మ‌ర‌మ్మ‌తుల‌కు అంగీక‌రించారు. జిల్లా కేంద్రాసుప‌త్రిలో డిఎన్‌బి, ఓటి విభాగాల‌ను అభివృద్ది చేసేందుకు, ఇక్క‌డినుంచి ఆయుష్ విభాగాన్ని కొత్త భ‌వ‌నంలోకి పూర్తిగా త‌ర‌లించేందుకు, కాంపౌండ్ వాల్ మ‌ర‌మ్మ‌తుకు,  కేజువాలిటీ ఫ్లోర్ మ‌ర‌మ్మతుకు, ఆసుప‌త్రిలో కుర్చీలు, బ‌ల్ల‌లు, మంచాలకు రంగులు వేసేందుకు, కిచెన్‌షెడ్ మ‌ర‌మ్మ‌తుకు, వివిధ విభాగాల్లో 4 ఏసిల ఏర్పాటుకు, ఫెన్సింగ్ ఏర్పాటుకు, స్టేష‌న‌రీ కొనుగోలుకు ఆమోదం తెలిపారు. జిల్లా ఆసుప‌త్రికి, ఘోషాసుప‌త్రికి కొత్త‌గా 5 ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిష‌న్లు కావాల‌ని క‌మిష‌న‌ర్‌ను కోర‌డానికి అంగీక‌రించారు. అలాగే ఆసుప‌త్రికి కావాల్సిన మందులు, ల్యాబ్ ప‌రిక‌రాలు, స‌ర్జిక‌ల్స్ స‌ర‌ఫ‌రాకు కొత్త‌గా టెండ‌ర్లు పిలిచేందుకు సైతం సంఘ స‌భ్యులు ఆమోదం తెలిపారు. జిల్లా ఆసుప‌త్రికి ఒక అంబులెన్సును మంజూరు చేయాల‌ని ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌ను క‌లెక్ట‌ర్ కోరారు.  ఈ స‌మావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, కార్పొరేష‌న్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, రామారావు త‌దిత‌ర సంఘ స‌భ్యులు, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-20 16:36:03

డ్రైవింగ్ శిక్షణతో ఉపాధి అవకాశాలు..

డ్రైవింగ్ శిక్షణతో  ఉపాధి అవకాశాలు  మెండుగా పొందవచ్చుసని డిప్యూటీ సి.టి.ఎం. వడ్డి సుందర్  తెలిపారు.  శుక్రవారం  ఆర్.టి.సి. డిపో  ఆవరణలో  ప్రజా రవాణాశాఖ ద్వారా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్ధులకు సర్టిఫికేట్లు మంజూరు చేసారు.  కార్యక్రమానికి డిప్యూటీ సి.టి.ఎం. వడ్డి సుధాకర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  యువతకు మంచి ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రజా రవాణా శాఖ హెవీ వెహికల్  డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు.  ప్రజా రావాణా శాఖలో  మంచి నిపుణులైన డ్రైవర్ల ద్వారా డ్రైవింగ్ పై శిక్షణ నివ్వడం జరిగిందన్నారు.  డ్రైవింగ్ లో మెళుకువలు నేర్చుకోవడం ద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నారు. ప్రస్తుతం  డ్రైవర్లకు ఎక్కువ డిమాండ్ వుందన్నారు.  పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలో మంచి అవకాశాలున్నాయని అన్నారు.  జలుమూరు మండలం, చల్లవాని పేట నుండి చల్లా ఆశ అనే మహిళ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందడం చాలా సంతోషదాయకమన్నారు. ఆమెను పుష్పగుఛ్ఛంతో అభినందించారు.  ఇదే స్ఫూర్తితో   మహిళలు ముందుకు రావాలన్నారు.  అనంతరం శిక్షణ పొందిన 16 మంది అభ్యర్ధులకు సర్టిఫికేటులు అందచేసారు.  అనంతరం రెండవ బ్యాచ్ ను ప్రారంభించారు. శిక్షణలో మంచి మెలుకవలు చెప్పిన వర్మకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  డివిజనల్ మేనేజరు జి.వరలక్ష్మి, 1,2 వ డిపో మేనేజర్లు వి.ప్రవీణ, టి.కవిత, మొటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివరాం గోపాల్   శిక్షణ పొందిన అభ్యర్ధులు,  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-20 16:34:47

పరిశ్రమల్లో గిరియువతకు ఉద్యోగాలు..

పారిశ్రామికరంగాల అవసరాలకు అనుగుణంగా శిక్షణతో నియమాకాలు జరుగుతున్నాయని ఐటిడిఎ పి.ఓ ప్రవీణ్‌ ఆదిత్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆందప్రదేశ్‌ ‌రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా శిక్షణలు ఇచ్చి నియమాకాలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో అపోలో ఆసుపత్రి , టెలీహెల్స్ ‌సర్వీసునందు పారామెడికల్‌ ఆప్తామాలిక్‌ ‌సహాయకులుగా 120 ఉద్యోగాలు జెబిఎం గ్రూపునందుకు ట్రైనీలుగా 60 ఖాళీలు, కలాం టెక్స్‌టైల్‌నందు మిషన్‌ ఆపరేటర్లు క్వాలీటీ ఇన్‌వెస్గుగేటర్సు ఆన్‌లూమ్‌ ‌చేకర్పు క్వాలీటీ ఇచాటేటీస్‌ ‌డయింగ్‌ ‌మిషన్‌ ఆపరేటర్సు రోల్‌ ‌దొపర్పుగా 200 ఉద్యోగాలకు భార్గవ ఆటోమోబైల్‌ ‌ప్రవేట్‌ ‌లిమిటెడ్‌, ‌తిరుపతి నందు సర్వీసు ఎండ్వంచర్సు సేల్స్‌విభాగం, మెకానిక్‌ , ఎక్కౌంటెంట్‌ ‌వర్కు మేనేజరు ట్రైనింగు డెవలప్‌మెంట్‌ ‌మేనేజరుగా 58 ఉద్యోగాలకు ఒలాం ఆగ్రో ఇండియా ప్రవేట్‌ ‌లిమిటెడ్‌విజయనగరం నందు టేక్‌ ‌మిసాయన్స్ ఆపరేటర్సుగా 30 ఉద్యోగాలకు టాల్‌ప్లస్‌ ఇం‌డియా వ్రవేట్‌ ‌లిబిటెడ్‌ ‌నందు బ్యాంకు అసోసియేట్‌గా150 ఉద్యోగాలకు నేడు అర్హులైన గిరిజన నిరుద్యోగ యువత ఆక్రింది వెబ్‌సైట్‌ ‌లింక్‌ ‌నందు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియపరుచుచున్నామన్నారు. హెచ్‌టిటి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎపిఎస్‌ఎస్‌డిసి. ఇన్‌ ‌నందు లాగన్‌ ‌కావాల్సివుంటుందన్నారు. 

Rampachodavaram

2020-11-20 16:22:44

పరిశ్రమల సర్వే పక్కాగా నిర్వహించాలి..

శ్రీకాకుళం  జిల్లాలో పరిశ్రమల సర్వే పక్కాగా జరగాలని జిల్లా కలక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి (డిఐపిసి) సమావేశం శుక్ర వారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నివాస్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిశ్రమల సర్వే సమగ్రంగా జరగాలని అందుకు పక్కాగా కార్యాచరణ ప్రణాళికలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. వివరాలలో ఎటువంటి తప్పులు ఉండరాదని ఆయన స్ఫష్టం చేసారు. నమోదు అయిన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమల వివరాలు సైతం సర్వేలో ఉండాలని ఆయన అన్నారు. మండల స్ధాయిలో ఎం.పి.డి.ఓ నేతృత్వంలో ఇంజనీరింగు సహాయకులతో సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలలో యువతకు శిక్షణకు గల అవకాశాలు పూర్తి స్ధాయిలో పరిశీలించాలని కలెక్టర్ అన్నారు. శిక్షణకు చేరే అభ్యర్ధులకు భోజన, వసతి సౌకర్యాలు, స్టైపెండు వంటి అవకాశాలు పరిశీలించాలని అన్నారు. గ్రానైట్ సంఘాలతో సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. జిల్లాలో 60 గ్రానైట్ కటింగు, పాలిషింగు యూనిట్లు ఉన్నందున అవకాశాలు పరిశీలించాలని చెప్పారు.            జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాల కృష్ణ మాట్లాడుతూ మైక్రో, స్మాల్ అండ్ మీడియం (ఎం.ఎస్.ఎం.ఇ) పరిశ్రమల పరిధిని కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చేసిందన్నారు. కోటి రూపాయల వరకు పెట్టుబడి దాటకుండా, రూ.5 కోట్ల టర్నోవర్ దాటని పరిశ్రమలను మైక్రో ఎంటర్ప్రైజెస్ గాను, 10 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి దాటకుండా, రూ.50 కోట్ల టర్నోవర్ దాటని పరిశ్రమలను స్మాల్ ఎంటర్ప్రైజెస్ గాను, 50 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి దాటకుండా, రూ.250 కోట్ల టర్నోవర్ దాటని పరిశ్రమలను మీడియం ఎంటర్ప్రైజెస్ గాను గుర్తించడం జరుగుతుందని వివరించారు. ఎం.ఎస్.ఎం.ఇ పరిశ్రమలు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుటకు, విపత్తు సమయంలో సహాయం పొందుటకు విధిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ లో నమోదు కావాలని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్  ప్యాకేజీ క్రింద 2020 ఫిబ్రవరి 29 నాటికి ఎం.ఎస్.ఎం.ఇ యూనిట్లకు రుణాలుగా ఉన్న మొత్తానికి 20 శాతం మేర అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించుటకు, 12 నెలల పాటు మారటోరియం విధింపుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ ప్యాకేజీ క్రింద 5333 ఖాతాలు ఉండగా 4925 ఖాతాలకు రూ.75.71 కోట్లను జూరు చేసారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించుటకు జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేసిందని, తద్వారా జిల్లాలో జీడిపప్పు, గ్రానైట్ ను ఎగుమతులకు అవకాశాలు ఉన్నట్లు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు. కమిటి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుందని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం (పి.ఎం.ఇ.జి.పి) క్రింద జిల్లా పరిశ్రమల కేంద్రానికి 68 యూనిట్లను లక్ష్యంగా నిర్ధేశించగా 16 యూనిట్లను మంజూరు చేసి, ప్రారంభించడం జరిగిందని తెలిపారు.            పరిశ్రమల స్ధాపనకు 277 దరఖాస్తులు అందగా నిబంధనలకు అనుగుణంగా ఉన్న 244 దరఖాస్తులను డిఐపిసి ఆమోదించింది. ఎం.ఎస్.ఎం.ఇ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తున్న ఆర్ధిక సహాయానికి జిల్లాలో 721 క్లైమ్ లు రాగా అర్హత మేరకు 592 క్లైమ్ లకు అనుమతులు మంజూరు చేసారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలో యువతకు ఉపాధి కల్పించుటకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్ధ ద్వారా శిక్షణ కల్పించుటకు ప్రతిపాదించింది. 158 ఎం.ఎస్.ఎం.ఇలకు ప్రోత్సాహకాలుగా రూ. 6.53 కోట్లను ఆమోదించడం జరిగింది. ఇందులో పెట్టుబడి రాయితీగా 11 ఎం.ఎస్.ఎం.ఇలకు రూ.2.82 కోట్లు, వడ్డీ రీఇంబర్సుమెంటుగా 84 ఎం.ఎస్.ఎం.ఇలకు రూ.2.09 కోట్లు, విద్యుత్ ఛార్జీల రీఇంబర్సుమెంటుగా 60 యూనిట్లకు రూ.1.60 కోట్లు ఉన్నాయి.  ఈ సమావేశంలో ఆసరా, సంక్షేమ జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీరు ఎస్.శంకర్ నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, కర్మాగారాల డిప్యూటి ఛీప్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కార్మిక శాఖ సహాయ కమీషనర్ సి.హెచ్.పురుషోత్తం, నైపుణ్య అభివృద్ధి సంస్ధ జిల్లా మేనేజర్ డా.గోవింద రావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, మార్కెటింగు శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాస రావు, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు వీర శేఖర్, ఎన్.ఏ.సి.ఎల్ ఉపాధ్యక్షులు సి.వి.రాజులు, పి.వి.ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు పి.వి.రామ్మోహన్, ఇతర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-20 16:21:20

వేగ నియంత్రణతోనే సురక్షిత ప్రయాణం..

సురక్షిత ప్రయాణానికి వేగ నియంత్రణ ఒక్కటే మార్గమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో  స్పీడ్ డ్రైవింగ్, ఈవిటీజింగ్ కి వ్యతిరేకంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో  జర్నలిస్టుల ప్రతినిధిగా శ్రీనుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో యువతకి వేగ నింయత్రణ, ట్రాఫిక్ రూల్స్, ఈవిటీజింగ్ పై అవగాహన కల్పించడానికి హర్ష ఫౌండేషన్ చక్కటి కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినంద నీయమన్నారు. మంత్రులు, ముత్తంశెట్టి శ్రీనివాస్, కన్నబాబులు పాల్గొని యువతకు మంచి సందేశం ఇవ్వడం శుభపరిణామం అన్నారు.  ప్రస్తుతం జరుగుతున్న బైక్ ప్రమాదాలు, ఈవిటీజింగ్ వలన యువత పెడత్రోవ, ఆత్మహత్యలు చేసుకోకుండా  ఈ అవగాహన ర్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బైక్ నడిపేవారు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా డ్రైవింగ్ లైసెన్సు వచ్చేంత వరకూ వారి పిల్లలకు బైక్ లు ఇవ్వకూడదన్నారు. ఈవిటీజింగ్ విషయంలో యువతను ముందు హెచ్చరించాల్సింది కూడా తల్లిదండ్రులేనని చెప్పిరు. అదే సమయంలో జర్నలిస్టులు కూడా వాహన వేగంలో నియంత్రణ పాటించాలని శ్రీనుబాబు కోరారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీసత్యన్నారాయణ, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, వాసుపల్లి గణేష్ కుమార్, ప్రభుత్వ విప్ బి.ముత్యాలనాయుడు తదితారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-11-20 15:54:31

యువత వేగ నియంత్రణ అలవరుచకోవాలి..

యువత బైకు ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధారణన చేయడంతోపాటు, ఖచ్చితంగా వేగ నియంత్రణ అలవాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడొచ్చునని వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు బి.కాంతారావు అన్నారు. శుక్రవారం విశాఖలోని ఆర్కేబీచ్ కాళీ మాత టెంపుల్ నుంచి స్పీడ్ డ్రైవింగ్, ఈవిటీజింగ్ కి వ్యతిరేకంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని  రుషికొండ వరకూ పాల్గొన్నామని చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మీడియాత మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న బైక్ ప్రమాదాలు, ఈవిటీజింగ్ వలన యువత పెడత్రోవ, ఆత్మహత్యలు చేసుకోకుండా  ఈ అవగాహన ర్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బైక్ నడిపేవారు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా డ్రైవింగ్ లైసెన్సు వచ్చేంత వరకూ వారి పిల్లలకు బైక్ లు ఇవ్వకూడదన్నారు. ఈవిటీజింగ్ విషయంలో యువతను ముందు హెచ్చరించాల్సింది కూడా తల్లిదండ్రులేనని చెప్పిరు. ఈ  ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం ఆంధ్ర యూనివర్సిటీ ప్రెసిడెంట్ బి మోహన్, రాష్ట్ర కార్యదర్శులు బి జోగారావు, అర్ ప్రభాకర్ నాయుడు, ఎం సురేష్, విద్యార్థి నాయకులు సీహెచ్.క్రాంతికిరణ్, నమ్మి లక్ష్మణ్, రంజిత్,భరత్, కె ప్రసాద్,నవీన్  చైతన్య, నిషేక్,సురేష్,పాల్గొన్నారు.

ఆర్కేబీచ్

2020-11-20 15:24:51

21 నుంచి ఏపీపీఎస్సీ డిపార్ట్ మెంటల్ పరీక్షలు..

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్థుల  డెపార్ట్మెంటల్ పరీక్షలు  ఈనెల 21 నుండి 29 వరకు (మే ,2020 నోటిఫికేషన్ ) జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో జరగనున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి మురళి  అన్నారు.  శుక్రవారం తిరుపతిల ఆర్డీఓ కార్యాలయంలో డెపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వాహణపై ఎ. పి. ఎస్. ఎస్. సి. అసిస్టెంట్ సెక్రెటరీతో కలసి డిఆర్ఓ  పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు  , లైజన్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. డి.ఆర్.ఓ. మురళి మాట్లాడుతూ ఎ. పి. పి. ఎస్. సి. డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల తేది 21 నుండి 29 వరకు 27 వ తేదీ మినహా జిల్లాలో 14 కేంద్రాలలో  జరగనున్నాయని సూచించారు. పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహణకు ముందు తరువాత కూడా సానిటేషన్ ప్రక్రియ జరిగేలా చూడాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరి మాస్కు దరించాల్సి ఉంటుందని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని సూచించారు. ఆన్ లైన్  ఎగ్జామ్  అయినందున విద్యుత్ కు అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ చూడాలని సూచించారు.  ఎ. పి. ఎస్. ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి అన్ని పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. రెవెన్యూ పోలీస్ శాఖలు పరీక్షా   కేంద్రాలవద్ద  144 సెక్షన్ అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు.  వైద్య శాఖ సిబ్బంది అభ్యర్థులను ధర్మల్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు.  ఎ. పి. ఎస్. ఎస్. సి. అసిస్టెంట్ సెక్రెటరీ  మురళీమోహన్ మాట్లాడుతూ ప్రశాంత వాతారణంలో నిర్వహించేలా చూడాలని , అభ్యర్థులు  అర్థగంట మునుపే పరీక్షా కేంద్రాలు  చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ హాల్  టికెట్ నందు ఇచ్చిన నియమాలను పూర్తిగా చదువుకొని అర్థం చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వాహణ పూర్తిగా  సి.సి. కెమరాల నిఘాలో జరుగుతుందని తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు సెంటర్లలో ప్రత్యేక గది ఏర్పాటు చేయనున్నామని సూచించారు.  తిరుపతి  ఆర్ డి ఓ    కనకనరసా రెడ్డి  పర్యవేక్షణలో ఈ  పరీక్షల నిర్వహణ  వుంటుందని తెలిపా రు.  ఈ సమీక్షలో  సి. సూపరింటెండెంట్  వాసుదేవన్,  డి. ఏ .ఓ. తిరుపతి  సురేష్ బాబు, ఎ పి పి ఎస్ సి   సెక్షన్ ఆఫీసర్  శ్రీనివాస రావు,  డి. టి. లు లోకనాథం , లక్ష్మీనారాయణ,  పరీక్షా  కేంద్రాల   చీఫ్ సూపరింటెండెంట్లు , లైజన్ అధికారులు పాల్గొన్నారు.  

తిరుపతి

2020-11-20 13:15:32

గిరిజనుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం..

గిరిజనులను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడానికే దోమతెరలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 2.76 లక్షల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని వెల్లడించారు. గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అధికారులు అవగాహన పెంచి చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. జియ్యమ్మవలస మండలం చిన్నమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో డిప్యుటీ సిఎం శుక్రవారం గిరిజన కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, గాలిలో తేమ అధికంగా ఉండే వానాకాలం, శీతాకాలాల్లో పెరిగే దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి ప్రాణాంతకమైన సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధుల బారినపడి అనేక మంది గిరిజనులు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంటుందన్నారు. ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి దోమతెరలు ఉపయోగపడతాయని చెప్పారు. దోమతెరలను ఉపయోగించడం వల్ల దోమల కాటు నుంచి కాపాడుకోచ్చునని, దాంతో వ్యాధుల బారినపడే అవకాశం కూడా తగ్గిపోతుందని వివరించారు. అయితే ప్రతి ఏటా గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేస్తున్నా కొంత మందికి వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో వాడకుండా బీరువాల్లో మూసిపెట్టుకుంటున్నారని, ఈ కారణంగానే అనేక కుటుంబాలు వ్యాధుల బారిన పడటం గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల జరుగుతోందని తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న 2  లక్షల 70 వేల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని చెప్పారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న4 సబ్ ప్లాన్ మండలాల పరిధిలో ఉన్న గిరిజన కుటుంబాలకు 1 లక్ష దోమతెరలను పంపిణీ చేస్తున్నామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అవగాహన లేకపోవడంతో పాటుగా దోమల మందు    విషయంలోనూ అపోహలు ఉన్నాయని, ఈ కారణంగా కొన్ని చోట్ల దోమల నివారణకు ఉపయోగించే మందులను  స్ప్రే చేయడాన్ని కూడా అడ్డుకుంటున్నారని వాపోయారు. ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దోమతెరల     వినియోగం, దోమల మందు పిచికారీ విషయంలో గిరిజనుల్లో అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకొచ్చే  విధంగా వినూత్నమైన రీతిలో కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గిరిజన కుటుంబాలు తమకు అందించిన     దోమతెరలను బీరువాలో దాచిపెట్టకుండా, సద్వినియోగం చేసుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధుల బారి నుంచి తమను తాము కాపాడుకోవాలని పుష్ప శ్రీవాణి హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తులసి, డిప్యుటీ డీఎం అండ్ హెచ్ఓ రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-20 12:37:26

శ్వేతలో 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు..

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినాన్ని  పురస్కరించుకొని వారం రోజుల పాటు సహకార ఉత్సవాలు జరుపుతున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతి శ్వేత భవనంలోని 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు , సహకార శిక్షణ కార్యక్రమం ఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్టాలు సహకార రంగంలో ముందు ఉన్నట్లు తెలిపారు. టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు అభివృద్ధికి  తన వంతు సహకారం అందిస్తామన్నారు.     అంతకుముందు టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు అధ్యక్షులు ముని వెంకట రెడ్డి బ్యాంకు కార్యకలాపాల గురించి తెలియజేశారు.  అనంతరం ఉప అధ్యక్షులు  శివ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సహకార రంగాల గురించి వివరించారు.  ఈ  కార్యక్రమంలో ఎంప్లాయిస్ బ్యాంకు కోశాధికారి వాసు, డైరెక్టర్లు వెంకటేష్,  కిరణ్,  హేమలత, గుణ శేఖర్, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tirupati

2020-11-19 20:22:17

మధ్యతరగతి ఉద్యోగిణిలకు ఐసిడిఎస్ వసతి..

 శ్రీకాకుళం పట్టణం కలెక్టరేట్ సమీపంలో గల జిల్లా మహిళా శిశు అభివృధ్ధి సంస్థ  ఆధ్వర్యంలో నడుపబడుచున్న ఉద్యోగినుల వసతి గృహం నందు పేద, మధ్య తరగతికి చెందిన ఉద్యోగినులకు వసతి కల్పిస్తున్నట్టు ఐసిడిఎస్ పిడి జి.జయదేవి గురువారం  తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చాలా మంది మహిళలు వారి స్వస్థలం నుండి పార్ట్ టైం లేదా ఉదయం  పది గం.ల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పని చేయు సందర్భంలో ఆలస్యము కావడం, లేదా కోవిడ్ -19 కారణంగా ఆర్.టి.సి. లేదా ప్రైవేటు వాహనాలు లేకపోవటం కారణంగా రాత్రి పూట వుండడానికి భద్రత లేక పోయిన కారణంగా బాధపడుతున్నందున వారికి వెసులు బాటు కల్పించడం జరుగుతుందని తెలిపారు.  ఐసిడిఎస్.ఆధ్వర్యంలో నిరివహిస్తున్న వర్కింగ్ వుమెన్ హాస్టల్ లో వారికి వసతి పొందే అవకాశం కలిగించనున్నట్లు ఆమె తెలిపారు. వసతి అవసరమైన ఉద్యోగినులు వసతి కోసం దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆమె కోరారు..

Srikakulam

2020-11-19 19:43:31

నారాయణపురం ఆనకట్ట పూర్తిచేయాలి..

శ్రీకాకుళం జిల్లాలోని నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులు, కాలువల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంబంధిత అధికారులను కోరారు. నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులపై టెక్నికల్ ఎక్స్ పర్ట్ కమిటీతో శాసనసభ్యులు గురువారం చర్చించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపురం ఆనకట్ట, కాలువల ఆయకట్టు అభివృద్ధి పనుల కోసం జైకా నిధులు విడుదలైన సంగతిని గుర్తుచేసారు. ఆనకట్ట ఆధునీకరణ పనులపై  టెక్నికల్ ఎక్స్ పర్ట్ కమిటీతో చర్చించిన అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గం కాలువ లైనింగ్ మరియు రెగ్యులేటర్ పున:నిర్మాణపు పనులను వీలైనంత త్వరగా చేపట్టి పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో టెక్నికల్ అడ్వైజర్ రౌతు సత్యనారాయణ, సి.డి.ఓ సి.ఇ కె.శ్రీనివాసరావు, నార్త్ కోస్ట్ సి.ఇ సిహెచ్.శివరాంప్రసాద్, జైకా అడ్వైజర్, విశ్రాంత కార్యనిర్వాహక ఇంజినీర్ షాజాన్,పర్యవేక్షక ఇంజినీర్లు డోల తిరుమలరావు, యస్.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-19 19:31:41

బాలల హక్కులను పరిరక్షించాలి..

బాలల హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత ప్రతీ  ఒక్కరిపైన వుందని ఐసిడిఎస్ పి.డి. జి.జయదేవి పేర్కొన్నారు.  గురువారం స్ధానిక పొట్టి శ్రీరాములు కూడలి నుండి ఏడు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ, దత్తత మాసోత్సవాలు, బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. పిల్లల దత్తత ప్రక్రియ మరియు బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించడానికే ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.   బాలల హక్కులను, వారి స్థితిగతులను ప్రజలు తెలుసుకోవాలన్నారు.  బాలల హక్కులపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను రూపొందించాయని తెలిపారు. విద్యా హక్కు, బాలకార్మిక చట్టం, బాల్య వివాహాలపై ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు.   14 సం.ల లోపు బాల బాలికలంతా బడులలోనే వుండాలని బాలలంతా చదువుకోవాలన్నారు.   బాలకార్మిక నిరోధ చట్టం ద్వారా బాలలను పనులలో పెట్టుకోరాదని తెలిపారు.  బాల్య వివాహాలు చేసుకోరాదని తెలిపారు. తమకు అవసరం లేని పసి కందులను చాలా మంది చెత్తబుట్టలలోను, మురికి కాలువలలోను పారివేస్తుంటారని అటువంటి పనులు చేయరాదని తెలిపారు.  తమ కార్యాలయానికి  పిల్లలను అప్పగించాలని, తాము  ఆ పిల్లలను సంరక్షించడం జరగుతుందని  తెలిపారు.   పిల్లలు లేని దంపతులకు వారిని దత్తత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  అడిషనల్ ఎస్.పి. సోమశేఖర్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, మన దేశంలో 18 కోట్ల మంది బాలలు వున్నారని తెలిపారు.  బాలల సంరక్షణకై అనేక చట్టాలను రూపొందించడం జరిగిందన్నారు.  మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో దిశ చట్టం, పోస్కో చట్టం ద్వారా  పిల్లలను, మహిళలను  సంరక్షించడం జరుగుతున్నదన్నారు.                 ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.చంద్రనాయక్, అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.జగన్నాధం, డి.ఎస్.పి. మహేంద్ర, అదనపు పథక సంచాలకులు పి.రాధాకృష్ణ, అసిస్టెంట్ లేబరా కమీషనరు పురుషోత్తం, బాలల హక్కుల సంక్షేమ సమితి సభ్యులు బి.సురేశ్, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, చైల్డ్ లైన్ సిబ్బంది, స్వఛ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-19 18:33:11